Tuesday, December 29, 2009






==============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

బారోమీటార్ లో వాతావరణ మార్పులు ఎలా తెలుస్తాయి?,Barometer and Atmosphere changes-How?





బారోమీటర్ లోని పాదరసం మట్టం ద్వారా వాతావరణం లోని మార్పులు ఎలా తెలుస్తాయి ?.

బారోమీటర్ లోని పాదరసం మట్టం వాతావరణం లో ఉండే గాలి పీడనాన్ని తెలియజేస్తుంది . పాదరసం మట్టం పైకి పోయిందంటే గాలిపీడనం ఎక్కువగా ఉన్నట్లు అర్ధం , ఆ మట్టం కిందకు పడిందంటే గాలి పీడనం తగ్గిందన్నమాట . బారోమీటర్ ని అంతరిక్షం లోకి తీసుకెళితే , ఆ శూన్య ప్రదేశం లో గాలి పీడనమనే ప్రశ్నే ఉండదు కాబట్టి ... పాదరసం మట్టం పూర్తిగా కిందికి పడిపోతుంది .

భూమి ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల ఎత్తికు వ్యాపించి ఉండే వాతావరణం లోని గాలి గురుత్వాకర్షణ వల్ల ఒత్తిడి (pressure) కలుగజేస్తుంది . భూమి పై వివిధ ప్రదేశాలలో గాలి పీడనం వేరువేరు గా ఉండడమే కాకుండా కాలం తో పాటు మారుతూ ఉంటుంది . చల్లని గాలి కన్నా వేడి గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది . అంటే వేడి గాలి , చల్ల గాలి కన్నా తేలిగా ఉంటుంది . అందువల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఎడారుల్లో గాలి పీడనం తక్కువగా ఉంటే , మంచు వలన చల్లగా ఉండే ధ్రువ ప్రాంతాల్లో గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది .

వాతావరణం లోని గాలి పీడనం హెచ్చు తగ్గులను సూచించే బారోమీటర్ రీడింగులను బట్టి వాతావరణం లో కలుగాబోయే మార్పులను ముందుగానే తెలుసుకోవచ్చు . పీడనం ఎక్కువై బారోమీటర్ లోని పాదరసం మట్టం పైకి పోయిందంటే ఆ ప్రాంతం నిర్మలం గా ఉండబోతున్నట్లు . పీడనం తగ్గి పాదరసం మట్టం తటాలున పడిపోతే ఆ ప్రాంతం మేఘాలతో కూడిన వర్షాలు రాబోతాయని అర్ధం . మట్టం మరీ పడిపోతే తుఫాన్ లాంటి బీబత్సాలకు సూచిక .



===========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆక్షిజన్ మాత్రమే రక్తం లో కలుస్తుంది-ఎందుకు? , Oxygen only disolves in blood-Why?





ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళినపుడు కేవలం ఆక్షిజన్ మాత్రమే ఎందుకు రక్తం లో కలుస్తుంది ... నైట్రోజన్ తదితర వాయువులు ఎందుకు కలవవు ?.

గాలిలో ప్రధానం గా నైట్రోజన్ , ఆక్షిజన్ వాయువులు 4:1 నిష్పత్తి లో ఉన్నాయి ... నిజానికి గాలిలో 80% ఉండేది నైట్రోజన్ వాయువే . అది మన శ్వాసక్రియలో ఉపిరితిత్తుల్లోకి ప్రవేశించినా వచ్చిన దారినే తిరిగి బయటికి వస్తుంది ... అది రక్తం లో కలవదు . ఆక్షిజన్ గాలిలో 20% మాత్రమె ఉన్నా అది రక్తం లో కలుస్తుంది .

ఉపిరితిత్తులు స్పాంజి లు గా ఉంటాయి . గాలి మూలమూలలా వ్యాపిస్తుంది . . ఆ గాలి చిట్టచివరికి శ్వాస గుళిక (Alviolous) లో చేరుకుంటుంది . ఈ శ్వాసగులిక గోళాల్లో పలుచని చర్మంగల రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది , ఈ రక్తం లో "హీమోగ్లోబిన్ " ఉంటుంది , ఈ హీమోగ్లోబిన్ కు అయస్కాంత ధర్మం ఉన్నది . . . మనం పీల్చే గాలిలోని ఆక్షిజన్ కి కుడా అయస్కాంత లక్షణం ఉన్నది . అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి . ఈ లక్షణం వల్ల ఆక్షిజన్ రక్తం లోనికి ఆకర్షితమవుతుంది . అంతే గాని వ్యాపనం (diffusion) వల్ల మాత్రమే కాదు . వ్యాపనం పాత్ర చాలా పరిమితం . వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కుడా రక్తం లో కలవాలి . జైత్రోజన్ కు అయస్కాంత ధర్మం లేదు ... అందువల్ల అది రక్తం లో కలవలేదు . అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియ లో వృధా అని తెల్చేయకూడదు . గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్ . ఆ పీడనం వల్లే గాలి మన ఉపిరితిట్టుల్లో మారుమూల ప్రాంతాలకు కుడా చేరుకుంటుంది .



===================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కరోనా లో అంత వేడేల?, Corona has very heat -Why?




సూర్యుని అంతర్భాగం నుంచి ఎంతో దూరం లో ఉండే చివరి పొర "కరోనా" ఉష్ణోగ్రత ఎందుకంత ఎక్కువగా ఉంటుంది ?.

సూర్యుని ఉపరితలం తో పాటు చుట్టూ ఉండే వాతావరణాన్ని - కాంతి మండలం (Photosphere) , వర్ణ మండలం (Chromosphere) , కాంతి వలయం (Corona) అనే మూడు భాగాలు గా విభజించ వచ్చు . సూర్యుని వాతావరణం లో అట్టడుగున ఉండే కాంతి మండలం ఉష్ణోగ్రత 5500 కేల్విన్లు ఉంటే , వర్ణ మండలం లో ఉష్ణోగ్రత ౪౫౦౦ కేల్విన్ల నుండి 10,000 కేల్విన్లు వరకు ఉంటుంది . ఈ మండలం తన కింద ఉండే కాంతి మండలం లో ఉత్పన్నమైన ఉష్ణం వల్ల వేడెక్కుతుంది .. కరోనా సూర్యుని వాతావరణం లోని చివరి ఉపరితల పొర . దీని ఉష్ణోగ్రత 2,౦౦౦,౦౦౦ .కేల్విన్ల నుండి 5,౦౦౦,౦౦౦ కేల్విన్ల వరకు ఉంటుంది . కరోనా లో ఉష్ణానికి కారణం సూర్యునిలో ఉండే "కరోనియం" అనే మూలకము.

కాంతి మండలాన్ని సలసల మరుగుతున్న నీటి ఉపరితలం తో పోల్చవచ్చు . ఇక్కడ అత్యంత ఉష్ణోగ్రతలో ఉన్న ప్రవాహి ద్రవ్యం (Fluid) పైకి , కిందికి ఎగిసి పడుతూ విపరీతమైన శబ్దం కలిగి ఉంటుంది . ఈ శబ్దతరంగాలు కరోనాలోకి చొచ్చుకొని రావడం తో అక్కడి ఆ ధ్వని శక్తి ఉష్ణ శక్తి గా మారుతుంది . కరోనా లో ఉన్న పదార్ధం కాంతి మండలం లోని పదార్ధం తో పోలిస్తే అతి సుక్ష్మమ గా పల్చగా ఉండటం తో అక్కడకు చొచ్చుకొని వచ్చిన ధ్వని శక్తి ఉత్పాదించిన ఉష్ణ శక్తి వల్ల ఆ పొర అతి త్వరగా , సులభం గా వేడెక్కుతుంది . దీనితో కరోనా లోని ఉష్ణోగ్రత సూర్యుని అంతర్భాగం లోని ఉష్ణోగ్రత కన్నా ఎన్నోమిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది . సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడినపుడు కరోనా తీవ్రత , తీక్షణ లను ప్రకాశవంతమైన తెలుపు రంగులో సునిషితం గా చూడవచ్చును . ఆ స్థితి నే " డిమాండ్" రింగ్ అంటారు .

====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కాంతి - తరంగామా ? కణమా?, Light-is a cell or a ray?




కాంతి (LightRay) - తరంగమ?కణమా ? అంటే చెప్పడము కష్టమే ! ఒక్కొక్క సారి ప్రశ్న కు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది . ఉదాహరణకి నానేనికున్నది బొమ్మా లేదా బొరుసా? అంటే ఏం చెబుతాం ?. కాంతికి కుడా నాణేనికిలాగే కణ(Corpuscular) స్వభావము , తరంగ (Wave)స్వభావము సంయుక్తం గా అవిభాజ్యం గా ఉంటాయి . ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు పక్కలు (బొమ్మ , బొరుసు) ఒకే సారి ఎలా చూడ లేమో ... ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్ని , కణ స్వభావాన్ని ఏకకాలం లో పరిశీలించాలేము .

కాంతి వక్రీభవనం(Refraction) , వివర్తనం (Disfraction) , వ్యతికరణం (Interference), ద్రువనం (Polarisation) అనే ధర్మాలను కలిగి ఉంటుంది . కాంతి కున్న తరంగ స్వభావానికి ఈ ద్రుగ్విషయాలు కారణము . కాంతి విద్యుత్ఫలితము (PhotoElectricEffect), కాంఫ్తాన్ ఫలితము , కాంతి రసాయనిక చర్యలు (PhotoChemical phinomena) , కృష్ణ వస్తు వికిరణం (BlackBodyRadiation) ఉద్గార వర్ణ పటాలు (EmissionSpectra) వంటి ప్రయోగ ఫలితాలు , పరిశీలనలు , కాంతి కున్న కనస్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకం గా రెండు లక్షణాలు ఏక సమయం లో ఉండడం వల్ల కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం (WaveParticleDuality) ఉందంటారు.









=================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఐస్ క్యూబ్ లకు తెలుపు రంగు ఎందుకు ?, Ice Cubes appear white-Why?




స్వచ్చమైన నీటికి రంగు ఉండదు కాని అదే నీటి తో తయారైన ఐస్ క్యూబ్ లు తెల్లగా ఉంటాయి ఎందుకు ?.
తెలుగుపు అనేది ఒక రంగు కాదు ... అన్ని రంగుల మేలు కలయికే తెలుపు . ఒక వస్తువుగుండా దృశ్య కాంతి లోని ఏడు రంగులు యధేచ్చగా తరిగిపోకుండా పతనమైన (incident) దిశలోనే ప్రసరిస్తే ఆ వస్తువు ను పారదర్శక వస్తువు (TransparentBody) అంటాము . అదే వస్తువు ముక్కలు ముక్కలు గా ఉన్నప్పుడు గానీ .. ఒకే విధమైన అంతర్గత నిర్మాణము లేనపుడు గానీ దాని మీదపడే కాంతి (IncidentLight) పలు దిశల్లో వక్రీభవనం (Refraction) చెంది వివిధ మార్గాల ద్వారా బయటకు వస్తుంది . ఇలా అన్ని వైపూలనుండి తెలుపు కాంతి రావడం వల్ల ఎటు నుంచి చూసినా ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది .

గాజు పలక పారదర్శకం గ కనిపించినా దాన్ని పొడిగా నూరితే సుద్ద పోడిలా తెల్లగా కనిపిస్తుంది . ఇందుకు కారణమూ శ్వేత కాంతి (WhiteLight)పలు దిశల్లో వెదజల్లు కోవడమే (ScatteredLight) . ఐస్ క్యూబ్లలో కుడా వక్రీభవన దిశలు మారి తెల్లని కాంతి పలు మార్గాల్లో బయట కు వస్తుంది . . . అందుకే తెల్లగా కనిపిస్తుంది .


ప్రశ్న: మంచు తెల్లగానే ఎందుకు ఉంటుంది?

జవాబు: తెలుపు ఓ నిర్దిష్ట వర్ణం (specific colour) కాదు. ఇది ఎన్నో వర్ణాల కలయిక. సాధారణంగా ఏదైనా పదార్థంలోని అణువులు (molecules)లేదా పరమాణువులు (atoms) దృశ్య కాంతిలో ఉన్న ఏ రంగు కాంతినీ శోషించుకోలేనట్లయితే ఆ పదార్థం తెల్లగా గానీ, పూర్తి పారదర్శకంగాగానీ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పదార్థంలో ఉన్న పరమాణువులు స్వచ్ఛమైన స్ఫటికాకృతిలో (crystal structure) ఉన్నా, అణువులు లేదా పరమాణువుల మధ్యన ఖాళీ ప్రదేశం (ద్రవాలు, అణువులలో లాగా) బాగా ఎక్కువగా ఉన్నా ఆ పదార్థాలు పారదర్శకం (transparent) గా ఉంటాయి. కానీ అదే పదార్థంలో ఉన్న అణువులు, పరమాణువులు చిందరవందరగానో, శకలాల్లాగానో (polycrystalline or defective crystalline)ఉన్నట్లయితే ఆ పదార్థాల మీద పడ్డ తెల్లని కాంతి అన్ని వైపులకు పరావర్తనం (reflection) లేదా వ్యాపనం (diffusion) లేదా పరిక్షేపణం (scattering)అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి చూసినా మనకు అంతో ఇంతో తెలుపు కాంతి కంటికి చేరడం వల్ల ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సాధారణంగా మంచుగడ్డలు నిర్దిష్ట స్ఫటికాకృతిలో కాకుండా చెల్లా చెదురుగా ఏర్పడ్డ బహుస్పటిక శకలాలు (poly crystalline segments)గా ఉంటుంది. ఇటువంటి శకలాలమీద పడ్డ కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆ మంచు ముక్కలు తెల్లగా అగుపిస్తాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ===========================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, December 28, 2009

దేసిబెల్ అంటే ఏమిటి ?, What is decibel ?




శబ్ద తీవ్రతను కొలవడానికి వాడే ప్రమాణాన్ని "డేసిబెల్(db)అంటారు . మన చెవులు శబ్దగ్రాహన విషయం లో అతి సున్నితమైనవి . మనం గోరుతో ఏదైనా వస్తువు పై గీస్తున్నప్పుడు జనించే అతి స్వల్పమైన శబ్దం నుంచి జెట్ విమానాలు చేసే తీవ్రమైన శబ్దాలన్నింటికీ మన కర్నెంద్రియం స్పందింస్తుంది .

డేసిబెల్ స్కేలులో అన్నిటికంటే అతి స్పల్ప తీవ్రత గల శబ్దం (పూర్తిగా నిశ్శబ్దం) "౦ - db" (సున్నా),దానికంటే పదింతల తీవ్రత 10db , సున్నా దేసిబెల్ కన్నా నూరు రెట్లు శబ్ద తీవ్రత 20db . వెయ్యి రెట్లు గల తీవ్రత 30db .

ఈ విలువలన్నీ శబ్ద ఉత్పత్తి స్థానం దగ్గరలో ఉంటేనే . శబ్ద ఉత్పత్తి స్థానం దూరంగా పోయేకొలదీ దీని తీవ్రత తగ్గుతుంది . 85 దేసిబెల్స్ కన్నా శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటే వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది . వినికిడి శక్తిని కోల్పోవడం అనేది ఆ ధ్వనిని మన చెవులు ఎంతసేపు వినగాలిగాయనే అంశము పై ఆధారపడి ఉంటుంది .

visit My website > Dr.Seshagirirao - MBBS.

బ్లాకు బాక్స్ అంతే ఏమిటి?, What is Black box?





హెలికాప్టర్ , విమాలన్లలో వాడే బ్లాకు బాక్స్ అంతే ఏమిటి , అది ఎలా ఉపయోగపడుతుంది ?

నీటిలో తడిచినా ఏమీ కాదు , అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది .. కాబట్టి మంటలలో కాలిన పాడు అవదు . గట్టి పదార్ధం తో తయారు చేస్తారు కనుక ఎంత ఎత్తి నించి కింద పడినా విరగదు . అదే బ్లాకు బాక్స్ . .. విమానాలు , హెలికాప్టర్ లలో తప్పనిసరిగా వీటిని అమర్చుతారు . చిత్రమేమంటే బ్లాకు బాక్స్ నల్లగా ఉండదు . నారింజ రంగులో ఉంటుంది . విమానము పేలిపోయినా , ముక్కలైపోయినా ... ఇది మాత్రము సురక్షితం గానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు . విమానము నడిపే సమయము లో పైలట్ల సంభాషణలను ఇతర శబ్దాలను కొన్ని గంటలపాటు రికార్డ్ చేసే ఏర్పాటు దీనిలో ఉంటుంది . అంతే పమాదానికి ముందు ఎవరేం మాట్లాడారో శబ్దాలు ఏమిటో లాంటి సమాచారాన్ని బ్లాకు బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చును . అందుకే దీని పాత్ర చాలా కీలకమైనది .

బ్లాకు బాక్స్ ఆంటీ ఒక వ్యవస్థ లాంటిదన్నమాట , ఫ్లైట్ డాటా రికార్డర్ (FDR) కాకపిట్ వాయిస్ రికార్డర్ (CVR) అనే రెండు శబ్దగ్రాహక యంత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి . ఇందులో fdr యంత్రం లో విమానము ఎంత ఎత్తులో వెళ్ళింది , ఏ దిశలో వెళ్ళింది , ఎంత వేగం తో గాలి వీచింది లాంటి సాంకేతిక సమాచారము నమోదవుతూ ఉంటుంది . cvr యంత్రము లో అన్ని రకాల శబ్దాలు కొన్ని గంటల పాటు నమోదై ఉంటాయి . ఈ సమాచారము మొత్తాన్ని పరిశోధించి , విశ్లేషించడం ద్వారా నిపుణులు వాయు వాహనాల ప్రమాదాలము కారణాలేంటో తెలుసుకో వచ్చును .

అందుకే ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా .. వెంటనే బ్లాకు బాక్స్ కోసమే వెతుకుతారు . నీటిలో మునిగిపోయినా సరే సునిశితమైన ఆల్త్రసోనిక్ శబ్దతరంగాలను వెలువరించే ఏర్పాటు కుడా వీటిలో ఉంటుంది . దీని ధర ఏడున్నర లక్షల రూపాయల వరకు ఉంటుంది . ఈ బ్లాకు బాక్స్ యంత్రాలతో అనుసంధానం చేసిన సెన్సార్లు విమానమంతా అమర్చి ఉంటాయి .

విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కుడా కొంత సమాచారాన్ని నమోదు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసారని చెబుతారు ... అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వాడకం విస్తరించబడింది , ఇప్పుడైతే విమానము లో బ్లాకు బాక్స్ తప్పనిసరి . మొదట్లో సమాచారము నమోదుకు మాగ్నటిక్ టేప్ లను ఉపయోగించినా ఇప్పుడు దృఢమైన మెమరీ చిప్ లను వాడుచున్నారు . మొదటిగా బ్లాకు బాక్స్ ఫ్లైట్ రికార్డర్ ఉండాలనే అల్లోచన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త " డేవిడ్ వారెన్"కి వచ్చించి . అలా 1953 కల్లా ఆస్ట్రేలియాలో దీన్ని తాయారు చేశారు .





=========================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

గిటార్ పై కన్నమెందుకు ?, Guitar has hole on it-why?




గిటార్ ముందు భాగములో ఒక రంద్రం ఉంటుంది ,.. దాని అవసరము ఏమిటి?

గిటార్ లో తంత్రులు (Strings) ఒక పొడవైన బద్దలాంటి భాగము, దానికి అనుసంధానము గా బోలుగా ఉండే పట్టేలాంటి భాగాలపై బిగించి ఉంటాయని మనకు తెలుసు . గిటారును వాయించడం అంటే బిగించి తన్యతతో (Tensoin) తో కూడిన లోహపు తీగెలను మీటడమే ... అలా మీటినపుడు ఏర్పడిన ధ్వని తరంగాలు గిటారు నుంచి బయటకు వస్తేనే ఆ శబ్దాన్ని శ్రోతలు వినగాలుగుతారు . aలా శబ్ద తరంగాలు బయటకు రావడానికే పెట్టేలాంటి భాగము లో రంద్రాన్ని ఏర్పరుస్తారు . పెట్టె బోలుగా ఉండడము వల్ల దాని లో ఉండే గాలి తీగల్లో ఉత్పన్నమయ్యే శబ్దతరంగాల కంపనాలతో పాటు బలాత్క్రుత తరంగ కంపనాలను (ForcedVibrations) ఉత్పన్నము చేస్తాయి. ఇందువల్ల గిటార్ నుంచి వలువదే ధ్వని గంభీరము గా , శ్రావ్యము గా ఉంటుంది .

అందుకనే వీణ , వయోలిన్ , గిటార్, తంబురా .. లాంటి వాయిద్యాలలో కుడా తీగలను బోలుగా రంద్రాలన్దే పెట్టెల(SoundBoxes) పై బిగిస్తారు .


==========================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, December 06, 2009

మిక్రో వోవెన్ కి పొయ్యికి తేడా ఏమిటి?, Microwoven and Stove cooking-difference




పదార్ధాలను మైక్రోవేవ్ ఓవెన్ లో వండడానికి , మామూలు పొయ్యి మీద వండడానికి తేడా ఏమిటి ?.

ఒక్క ముక్కలో చెప్పాలంటే మామూలు పొయ్యి లో ఆహారపదార్ధాలు బయటి నుంచి లోపలికి ఉడికితే , మైక్రోవేవ్ ఓవెన్ లో అవి లోపలి నుంచి బయటకి ఉడుకుతాయి . ఇది అర్ధం కావాలంటే కాంతి గురించి తెలుసుకోవాలి . కాంతి ఓ విద్యుదయస్కాంత(ElectroMagnatic) తత్త్వం గల శక్తి స్వరూపము . ఇది తరంగాలు గాను , ఫోటాన్లు అనే కనాలుగాను ప్రయాణిస్తుంది . మనం కంటి తో చూడగల కాంతితరంగాలను దృశ్య కాంతి (VisibleLight) అంటాము . మనం చూడగల ద్రుష్యకాంటి కన్నా తక్కువ శక్తిగల కాంతి తరంగాలు కొన్ని ఉన్నాయి . వాటిలో ఒకటే ' మైక్రోవేవ్ ' తరంగాలు ... ఇవి ఒక విధంగా ప్రత్యేకమైన పౌనః పుణ్యం గల రేడియో తరంగాలే . మైక్రోవేవ్ వవెన్ లో ఆహారం ను ఉదికిన్చేవి ఇవే .

మనం వంట వండుకోవడం అంతే ఏమిటో తెలుసా ? ... ఆహారపదార్ధాల లోని అను బంధాలను చేదించడమే(BondCleavage) . దీన్నే ఉడకడం అంటాము . వవెన్ లో ఆహారపదాదాలను పెట్టి ఆన్ చేస్తే మైక్రోవేవ్ తరంగాల వల్ల ఆహారపదార్దాల్లోని అణువులు ఉత్తేజం పొందుతాయి . నీటి అణువులు గిరగిరా తిరిగి అనుబంధాల్ని చేదిస్తాయి . తద్వారా ఆహారము త్వరగా ఉడుకుతుంది . ఆహారపు అణువులు , నీరు వంటి పదార్దాలే microవవె తరంగాల శక్తిని గ్రహించగలవు . పింగాణి , గాజు వంటివి ఆ తరంగాలను అడ్డుకోలేవు .. కాబట్టి ఈ తరంగాల శక్తి నేరుగా ఆహారపదార్ధాల అనుస్తాయి లో పనిచేసి వంట త్వరగా పూర్తీ అవుతుంది . మామూలు పొయ్యిమీద వంట చసేతపుడు ఆహారపదార్ధాలను ఉడికించడానికి ఉష్ణ శక్తి పనిచేస్తుంది . మంట నుండి పుట్టే ఉష్ణ శక్తి మొదట పాత్రను వేదేక్కిస్తుంది .. చుట్టుప్రక్కల గాలి కుడా వేడెక్కుతుంది .. అంతే వేడి ఆహారపదార్ధాల అణువుల వరకు చేరార్ లోపల చాలా వరకు వృధా అవుతుంది అన్నమాట. అందువల్ల చాలచేపు ఉదికిన్చితే తప్ప ఆహారము ఉదాకడు .




======================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సోలార్ బేటరీ ఎలా పనిచేస్తుంది?,How does SolarBatary work?





సూర్యని కాంతి శక్తిని విద్యుచ్చక్తి గా మార్చడమే సౌర ఘటాల (SolarBataries) పని . ఆ విద్యుత్ ను ఏ ప్రయోజనము కోసం వాడతామనే విసయాన్ని బట్టి అవి పనిచేసే విధానము కుడా మారుతుంది . కొన్ని సౌరఘటాలు ఎప్పటికప్పుడు కాంతి శక్తిని విద్యుత్ శక్తి గా మారుస్తూ పరికరాలను నడిపిస్తుంటాయి . కేవలం తక్కువ మోతాదు విద్యుత్ మాత్రమే అవ సరమయ్యే కాలిక్యులేటర్లు ,డిజిటల్ గడియారాల్లాంటివి ఈ విధానం లో పనిచేస్తాయి . చీకటిలో ఇవి పని చేయవు . ఇక ఎక్కువ విద్యుత్ కావాల్సిన బల్బులు , యంత్రాలు , టార్చిలైట్లు , వీదిలైట్లు పని చేయాలంటే తొలుత కాంతి శక్తిని చాలా గంటల పాటు విధుత్ శక్తి గా మారుస్తూ నిలువున్చుకునే విధానాని వాడతారు . సినికాన్ వంటి పదార్ధాలలోని ఎలక్ట్రాన్లు కాంతి శక్తివల్ల ఉత్తేజితమై ఒక శక్తి స్థాయి నుంచి పైశక్తి స్థాయికి మారుతూ ధన , రుణ విద్యుత్దావేశాల్ని ఏర్పరచ గలవు . ఇలాంటి ఘటాలను వందలాదిగా వరుసగా కలపడం ద్వారా కొంత మోతాదులో ''విద్యుత్ పోటన్సియాల్'' ఏర్పడుతుంది .





=====================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కుక్కలు అలా వగరుస్తాయేమి?,Dogs panting why?






వేసవి కాలములో కుక్కలు నాలుక బయటకు చాపి గసపెడుతు ఉంటాయి ... ఎందుకు ?

వేసామీ కాలములో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనా ... మనుష్యులు , జంతువులూ దేహ ఉష్ణోగ్రత మాత్రం స్థిరము గా ఉండాలి . మనుష్యుల దేహములో ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి . అందులో ముఖ్యమైనది చర్మము ... దీనిలోని స్వేదగ్రందులు ద్వారా చెమట శరీరుపరితలం పైకి వస్తుంది .ఆ చెమట ఎప్పటికప్పుడు భాస్పీకరణం (Evaporation) చెంది ఆరిపోవడానికి మనశారీరము నుండే ఉష్ణాన్ని గ్రహిస్తుంది ... అందువల్ల శరీరము చల్లబడుతుంది . కాని కుక్కలాంటి జంతువులకు స్వేదగ్రందులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాటికి చెమట అంతగా పట్టదు ..అందువల్ల వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావము వల్ల పెరుగుదలకు లోనవుతుంది . కుక్క అందుకనే తన నోరు తెరచి నాలుక బయటకు చాపి గసపెట్టడం లేదా వగర్చడం (panting) చేస్తుంది . దీనివల శరీర ఉష్ణోగ్రత స్థిరము గా ఉంటుంది .





======================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కలర్ టీవీ కి ఆ పట్టీ ఎందుకు , Black band round the color tv monitor why?





కలర్ టీవీ తెర అంచు చుట్టూ నల్లటి పట్టీ ఉంటుంది ఎందుకు ?

ఒక విధం గా చెప్పాలంటే రంగుల టీవీ తెర అంచు చుట్టూ కనిపించే నల్లని పట్టీ టీవీ లోని పిక్చర్ ట్యూబ్ కి రక్షణ కవచం లాంటిది . పిక్చర్ ట్యూబ్ లోపల ఉండేది శూన్య ప్రదేశం కాబట్టి అది టీవీ వెలుపల ఉండే వాతావరణ పీడనాన్ని తట్టుకోవాలి . పాతకాలం టీవీ లలో ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ షీల్డులు పిక్చర్ ట్యూబ్ చుట్టూ అమర్చి ఉండేవి . పిక్చర్ ట్యూబ్ కి లోపల ,వెలుపల ఉండే వాతావరణ పీడనాల తేడా వల్ల పేలుడు సంభవించకుండా ఇవి కాపాడేవి . . . కాని ఇప్పటి టీవీ లలో పేలుళ్ళ నుంచి రక్షణ కోసం ప్లాస్టిక్ షీల్దులకు బదులు " కిమ్ కోడ్ "అనే లోహపుచాత్రాన్ని పిక్చర్ ట్యూబ్ చుట్టూ తన్యతతో ఉండే పట్టీతో బిగిస్తున్నారు . మనకు తెర అంచుల చుట్టూ కనిపించే నల్లని పట్టీ ఇదే .









visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, December 05, 2009

జున్ను లో రంద్రాలు ఎలా ఏర్పడతాయి ? , Pores in cheese Why ?





జున్ను అంటే ఇష్టపడని వారుండరేమో ! ప్రపంచం లో 2000 రకాల జున్నులు లభిస్తున్నాయి . జున్ను తయారీ అనేది ఒక బ్యాక్టీరియా చర్య . పాలను జున్నుగా మార్చే బ్యాక్టీరియా విడుకలచేసే లాక్టిక్ ఆమ్లాన్ని తినే కొన్ని బ్యాక్తీరియాలు పాలలో ఉంటాయి . ఇవి లాక్టిక్ ఆమ్లాన్ని తిని కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తాయి . అలా విడుదలైన వాయువు బయటకు వచ్చేందుకు చేసే ప్రయాణం లో రంద్రాలు ఏర్పడతాయి . ఆ రంద్రాలు లోపల ఏర్పడిన కార్బ కార్బన్ దయాక్శైడ్ విడుదల మార్గాలు , జున్ను తయారుచేసిన ఉష్ణోగ్రత ను బట్టి ఈ రంద్రాలలో తేడా ఉంటుంది .





visit My website > Dr.Seshagirirao - MBBS.

ఓడ నీళ్ళమీద ఎలా తేలుతుంది ?,Ship float on sea How?




చిన్న రాయి నీళ్ళలో మునుగుతుంది . . కాని టన్నుల బరువు మోసే ఓడ మాతము నీటిమీద తేలుతుంది ... దీనికి కారణము ఆయా వస్తువులు నీటిని ఏ మేరకు పక్కకు నేడతాయి అనే సూత్రము .

వస్తువు పరిమాణం ,సాంద్రత అధిక మైనపుడు అవి ఎక్కువగా నీటిని పక్కకు నేడతాయి . నీరు ఆ వస్తువును పైకి నెట్టడం తో అది పైన తేలుతుంది . ఓడల రూపము , దాని నిర్మాణం , దాని ఉపరితలం వల్ల ఓడ నీటిపై తేలుతూ వెళ్ళుతుంది .

====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, November 28, 2009

నోరెందుకు ఊరుతుంది , More Saliva Why?





ప్రశ్న: ఆహార పదార్థాలను చూడగానే మన నోటిలో లాలాజలం ఎందుకు వస్తుంది?
(ఇష్టమైన ఆహారము చూడగానే నోరు ఊరుతుంది ఎందుకు ?)

-ఎస్‌. సాయివినయ్‌, విశాఖపట్నం


జవాబు : మనకు ఇష్టమైన పదార్ధము వాసన వచ్చినా , కనిపించినా ... నోటిలో లాలాజలం ఊరి ఆపదార్దము తినాలనిపిస్తుంది .ఇది అప్రయత్నం గా జరిగే చర్య . మనిషికి కలిగే అనుభవాలు మెదడులో నమోదవుతుంటాయి . ఒక సారి తిని బాగా ఇస్టపడిన వంటకము రుచి , వాసన , చూపు , మెదడులో నమోదు అవుతాయి . మరోసారి ఆ వాసన తగిలినా , ఆ పదార్ధము కనిపించినా గత అనుభవాన్ని మెదడు నెమరు వేసుకుంటుంది ... దీని ఫలితం గా మనకు నోరు ఊరుతుంది .

మన నాడీ వ్యవస్థలో భాగంగా స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థ (autonomous nervous system) ఒకటుంది. పంచేద్రియాల ద్వారా గ్రహించే అవగాహనకు అనుకూలంగా మన శరీరం, మనసు స్పందించే తీరుతెన్నులు ఈ నాడీవిభాగం అజమాయిషీలోనే ఉంటాయి. దీనికి సంబంధించిన ఎన్నో వివరాలను ఇవాన్‌ పెట్రోవిచ్‌ పావలోవ్‌ (1849-1936) అనే రష్యా శాస్త్రవేత్త కుక్కలపై ప్రయోగాలు చేసి నిరూపించడం విశేషం. ఆకలితో ఉన్న కుక్కకి రోజూ నిర్ణీత సమయానికి ఆహారం ఇస్తూ, అదే సమయంలో ఒక గంట శబ్దం వినిపించేలా చేసేవాడు. అలా చాలా రోజులు జరిగిన తర్వాత గంట శబ్దం వింటే చాలు కుక్క నోట్లో లాలాజలం ఊరడాన్ని గమనించాడు. అంటే ఆహారాన్ని చూడకపోయినా గంట శబ్దానికి కుక్క నోట్లో అసంకల్పితంగా లాలాజలం ఊరిందన్నమాట. ఇలా అనేక ప్రయోగాలు చేసి విశ్లేషించిన తర్వాత శరీరం, ఆలోచన, నాడీ ప్రక్రియలు ఉత్తేజితం కావడాన్ని సిద్ధాంతీకరించాడు. దాన్నే ఇప్పుడు మనం పావలోవ్‌ ప్రతీకార చర్య (pavlov's reflex), లేదా సాంప్రదాయ నియంత్రణ(classical conditioning)గా పాఠాల్లో చదువుకుంటున్నాం. ఈ పరిశోధనలకు గాను పావ్‌లోవ్‌కు వైద్యరంగంలో 1904లో నోబెల్‌ బహుమతి లభించింది. మనకు నచ్చే ఆహారాన్ని చూడగానే నోరూరడం ఈ అసంకల్పిత చర్యలో భాగమే. మనకు అలవాటు లేని కొత్త ఆహారాన్ని చూస్తే ఇలా జరగదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక





  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, October 18, 2009

నెమలి నీలిమబ్బునీడలోనే నాట్యం ఎందుకు?,Peacock dances in cloudly day Why?




నెమళ్లు ప్రపంచ వ్యాప్తం గా లేవు ... ఆసియా ఖండం లోనే వీటి సంఖ్య ఎక్కువ , ప్రధానం గా భారత ద్వీపకల్పం , శ్రీలంక , బర్మా , మధ్య ఆసియా లోని కొన్ని దేశాలు , మధ్య ఆఫ్రికాలలో మాత్రమె ఇవి కనిపిస్తాయి . పురివిప్పి నాట్యం చేసేది మగ నెమలి (Peacock), ఆడనెమలికి(peahen) పురి విప్పేటన్త తోక లేదు .

మగ నెమలి ... ఆడనెమలిని ఆకర్షించేందుకు పురివిప్పి నాట్యం చేస్తుంది . మనుషుల్లా కాకుండా చాలా జంతువులు , పక్షులు కేవలం కొన్ని రుతువులు , మాసాల్లోనే ప్రత్యుత్పత్తికి దిగుతాయి . సాదారణముగా మేఘావృతం గా ఉండే ఆకాశం లో , సాధారణ ఉష్ణోగ్రత ఉండే వర్షరుతువు లో నెమళ్ళు పరస్పర ఆకర్షణకు లోనవుతాయి . అందువల్ల మేఘావ్రుత సమయాల్లో నెమలి నాట్యాని మనం ఎక్కువగా గమనిస్తాము . అయితే మిగిలిన సమయాల్లో ఆత్మరక్షణ కోసం కుడా మగనేమలి పురివిప్పుతుంది .


visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, September 29, 2009

నీటి లో ఉపిరి పీల్చలేమెందుకు ?,Why can't we breath under water?




మానవులు నీటి లోపల శ్వాసను తీసుకోలేరు ... కారణం మన ఉపిరితిత్తులకు నీటి లోపల ఆక్షిజన్ ను విడదీయడానికి కావాల్సిన సామర్ధ్యం ... అంటే దానికి కావలసిన ఉపరిత వైశాల్యం లేదు . అంటే కాకుండా మన ఉపిరితిట్టుల్లోని గోడలకు ఉండే పొరలు గాలికేగాని నీటికి అలవాటు పది లేవు .
ఇక చేపల విషయానికి వస్తే , అవి పీల్చుకొనే ఆక్షిజన్ నీటిలో భాగమైన ఆక్షిజన్ కాదు , వాతావరణం లో ఉండి నీటిలో కరిగే ఆక్షిజన్ వాయువుని. . అలా నీటిలో కరిగిన ఆక్షిజన్ ను చేపలు తమ మొప్పల సాయం తో పీల్చుకొంతాయి . నీటినుంచి ఆక్షిజన్ ను విడదీయడం అంట సులభం కాదు . గాల్లో అదే ఘనపరిమాణం గలది నీటిలో కన్నా 20 రెట్లు అధికం గా ఆక్షిజన్ ఉంటుంది . . అంతేగాకుండా నీటి బరువు , సాంద్రత , గాలికన్నా ఎంతో ఎక్కువ . అందువల్ల నీటిలో తిరుగాడటం మనకు ఎంతో కష్టం , చేపల దేహము నీటిలో తెరగడానికి అనువుగా నిర్మితమై ఉంటుంది . నీటిలో చేపలు మొప్పలు పనిచేయడానికి కారణం అవి శీతల రక్తం (ColdBlood) గల జలచరాలు కావడమే . వాటి శ్వాశ తీసుకోవడానికి మనలాగా ఆక్షిజన్ ఎక్కువ మోతాదులో అవసరములేదు . నీటిలో తక్కువ మోతాదులో వాతావరణం నుంచి కరిగిన ఆక్షిజన్ సరిపోతుంది ... ఆ ఆక్షిజన్ పరిమాణము మనం శ్వాసించడానికి సరిపోదు .

The basic reason is that our lungs can't extract the oxygen from the water. It only extracts oxygen from the air we inhale.

One thing about chemicals is that, once they react in certain ways, they form compounds that are nothing like the original elements. For example, if you react carbon, hydrogen and oxygen together one way you get glucose (C6H12O6) . If you react them together another way you get vinegar (C2H4O2). If you react them another way you get fat . If you react them another way you get ethanol (C2H5OH). Glucose, fat, ethanol and vinegar are nothing like each other, but they are all made from the same elements.

In the case of hydrogen and oxygen gas, if you react them together one way you get liquid water (H2O). The reason we cannot breathe liquid water is because the oxygen used to make the water is bound to two hydrogen atoms, and we cannot breathe the resulting liquid. The oxygen is useless to our lungs in this form.

The oxygen that fish breathe is not the oxygen in H2O. Instead, the fish are breathing O2 (oxygen gas) that is dissolved in the water from air . Many different gases dissolve in liquids, and we see an example all the time in carbonated beverages. In these beverages, there is so much carbon dioxide gas dissolved in water that it rushes out in the form of bubbles.

Fish "breathe" the dissolved oxygen out of the water using their gills. It turns out that extracting the oxygen is not very easy -- air has something like 20 times more oxygen in it than the same volume of water. Plus water is a lot heavier and thicker than air, so it takes a lot more work to move it around. The main reason why gills work for fish is the fact that fish are cold-blooded, which reduces their oxygen demands. Warm-blooded animals like whales breath air like people do because it would be hard to extract enough oxygen using gills.

Humans cannot breathe underwater because our lungs do not have enough surface area to absorb enough oxygen from water, and the lining in our lungs is adapted to handle air rather than water. However, there have been experiments with humans breathing other liquids, like fluorocarbons. Fluorocarbons can dissolve enough oxygen and our lungs can draw the oxygen out

visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, September 27, 2009

అస్తమానము ఆడవారి ఏడుపు ఎందుకు?, Women tears frequently Why?



--------------------------------------------------------------
women weep or cry more frequently than that of men. .for every small event they tears . to compare this is more times in females than males. .. . in mem laughter is more .. there is a proverb " don't believe laughing women and weaping men" that means that they are behaving against their natural inborn human property . This is to draw others attention , sympathy and to fulfil their desires .

There are more benifits of women tearing .. as outers react instantly on seeing a weeping women to help them in pity . Tearing /weeping is a language of women-kind to get their work to be done by others. they line the male by just tears and cry .

Mediacally the hormones will be regularised by weaping mostly in child-bearing women the milk producing hormones will be minimised and improve their health and sex desires.

There are many types of Tears of women ... false (Donga) crying , intentional (mondi) crying, sympathetic crying , etc.

My quote : " women is the route of all men's evils "



visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆడ దోమలే మనుషులను కుట్టుతాయి ఎందుకు ?, Female mosquitos only bite humans Why?




only Female mosquitos can bite humans and  spread many diseases like .. Filaria , maleria , chickengunya , dengue fever , japnees encephalitis , yellow fever .. etc. because
.... female mosquitos have long beak to bite , sharp beak to piearce in to deep in the skin , where as male mosquitos have very short and blunt beak ... hence they can not prick and suck blood ... they live on dead and decaying materials and die after mating the female for reproduction . poor males ! .



ప్రశ్న: ఆడదోమలు మనిషి రక్తాన్ని, మగ దోమలు చెట్ల రసాన్ని తాగుతాయని విన్నాను. ఆహారం విషయంలో ఈ తేడాలెందుకు?

జవాబు: ఆహారం విషయంలో ఆడదోమలు, మగదోమలు రెండింటికీ పోషక విలువలను ఇచ్చేవి పళ్ల రసాలు, చెట్ల రసాలు, పుష్పాల మకరందాలే. కానీ ఆడదోమ గ్రుడ్లు ఏర్పడ్డానికి కావలసిన ప్రత్యేక ప్రొటీను, క్షీరదాల (mammals) ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. అందువల్ల సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చాక మాత్రమే ఆడదోమలకు క్షీరదాల రక్తదాహం ఏర్పడుతుంది. అంటే కేవలం ప్రత్యుత్పత్తి అవసరాలకే ఆడదోమ మనిషి రక్తాన్ని ఆశిస్తుంది. మిగిలన క్షీరదాలు అందుబాటులో లేకపోవడం, వాటి చర్మం మందంగా, రోమాలతో కూడి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి. మన చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలు, కార్బన్‌ డయాక్సైడును గుర్తిస్తూ అవి మనిషి ఉనికిని కనిపెడతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ======================
visit My website -- Dr.Seshagirirao - MBBS.

Saturday, September 26, 2009

ఊసరవెల్లి ఏకకాలం లో అన్నివైపులా ఎలా చూస్తుంది? . How can Lizard see in all directions ? .

ప్ర : ఊసరవెల్లి ఏకకాలం లో అన్నివైపులా ఎలా చూస్తుంది? .
How can Lizard  see in all directions ?  .

జ : ఎదురుగా ఆహారం కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచిఉన్న శత్రువును చూడగలదు , పసిగట్టగలదు . ఇదెలా సాధ్యము ?. దీనికి ఒళ్ళంతా కళ్లు లేవుగా . మనలాగే రెండే ఉంటాయి . కాని కనుగుడ్డు  దేనికదే అటు ఇటు తిరుగుతాయి . ఒక కన్ను పైకి చూస్తుంటే .. మరోకకి ఎదురుగా గానీ , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదేనే ఆహారము (పురుగు) దృష్టిలో పడితే రెండు కళ్లు దానిపైనే కేంద్రీకరిస్తుంది. మరో విషయం ఉసరవిల్లిది 'బైనాక్యులర్ ' విజన్ ! ఈ చూపుతో లక్ష్యాన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . . . దీని కుండే జిగురు పదారడానికి కీటకం అటుక్కుపోతుంది .. మరుక్షణం నోటిలోకి లాకొని మింగేస్తుంది .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, September 17, 2009

ఏ దిక్కుకు పాడుకోవాలి , Sleep in which direction..good?




మనము పడుకునే టపుడు ఏ దిక్కుకు తల పెట్టుకొని పడుకుంటే మంచిది ?. దక్షిణ దిశకు పడుకొంటే యముడు ఉంటాడని ... మృత్యువు భయముంటుందని , ఉత్తరకు తల పెట్టి పడుకుంటే ఈశ్వరఆజ్ఞా ఏనుగు తల నరికేయడం-వినాయకుడు .. .. జ్ఞాపకం వస్తుంది హిందువులకు . ఈ నమ్మకాలూ నిజమా?
  • నమ్మకాలలో నిజాము లేకపోయినా భూమి గురుత్వాకర్షణ శక్తి మనపై ఉంటుందని పూర్వము శాస్త్రజ్ఞులు నమ్మేవారు ... అటు దిశ గా పడుకుంటే మన శరీరం లో అయస్కాంత క్షేత్రం దుష్ప్రభావం కలిగిస్తుందని వారి వాదన . కాని మనంతూర్పు పదమ దిశల్లో పడుకున్నా మన శరీరంలోంచి ఉత్తర దక్షిణ దిశల్లో ఉన్నా ఆయస్కాతం బలరేఖలు వెళ్తున్నవిషయాన్ని గుర్తుంచు కోవాలి . తూర్పు పడమరాలు గా పడుకున్నా , ఉత్తర దక్కిన దిశలు గా పాదుకొని నిద్రించినఅయస్కాంత క్షేత్రంలో శరీరం ఒకే విదంగా ఉంటుందని అర్దము చేసుకోవాలి .
  • ఒక పొడవాటి ఇనుప కడ్డీని ఉత్తర దక్షిణ దిశల్లో ఉంచినా , తూర్పు పడమర దిశల్లో ఉంచిన ఏమీ కాదు . కేవలందండాయస్కాన్తాల్లోనే తేడా ఉంటుంది . మన శరీరము దండ ఆయస్కాతం(barMagnet) కాదు . ద్రవ స్థితిలో ఉన్నాహెమోగ్లోబిన్ వంటి చలించే రక్తపు అణువులు మనం ఎటు పడుకునా అదే ఫలితానికి లోనవుతాయి . పుట్టిన నాటినుంచి మరణించే వరకు మన శరీరం భూ అయస్కాంతానికి అలవాటుపడిపోయి ఉంటుంది .

మాత్రకి నొప్పి తగ్గేదేలా?, Tablet reduces Pain ..how?



  • మనకు దెబ్బతగిలినా , ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కలుగుతుంది ... వెంటనే నొప్పి తగ్గడానికి మాత్రలు , ఇంజెక్షన్లుతీసుకుంటాము . . మరి మాత్రలకు , మందులకు నొప్పిని తగ్గించే గుణము ఎలా వస్తుంది .
  • మన శరీరము నొప్పి కలిగిన ప్రదేశము లో 'ఫాటి యాసిడ్లు , ప్రోస్తా గ్లందిన్లు ' అనే రసాయనాలను విడుదల చేస్తాయి .. ఇవి రక్తప్రవాహం చేరి కండరాలను సంకోచింప చేయడం తో ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి జ్వరము , భాదతో కూడిన నొప్పులుఏర్పడతాయి .
  • మనము తీసుకున్న మాత్రలు రక్తం లో చేరి ప్రోస్తాగ్లాండిన్లకు ఉత్పన్నం అయ్యే "సైక్లుక్షీ జేనేస్-2(CylcloxiGenes)"అనే ప్రోటీన్లకు అంటుకుపోయి రసాయన ఉత్పత్తికి ఆటంకం కల్పించడం తో నొప్పులకుమూలమైన గ్రాహకాలు కండరలనుండి విడిపోతాయి . విదంగా ఇలాంటి మాత్రలు నొప్పులకు కారణభూతమైనరసాయనాలను నాశనం చేయలేకపోయినా ... మెదకుకు చేరే భాధకు సంభందించిన సంకేతకాలను అక్కడకుచేరకుండా అడ్డుకుంటాయి ... తద్వారా శరీరానికి నొప్పుల వల్ల కలిగే బాధ తెలియదు .

Friday, September 11, 2009

వాసన పసిగట్టేదేలా ?,How do we recognize smell?




ఏదైనా పదార్ధం వాసన తెలియాలంటే దాని నుంచి వెలువడే కొన్ని అణువులు మన ముక్కును చేరుకోవాలి . బ్రెడ్ ,ఉల్లిపాయలు , ఫేర్ఫ్యుములు ,పౌడర్లు , పండ్లు , పూలు లాంటివన్నీ వాసన్ వేదజల్లుతున్నాయంటే వాటి నుండి అతి తేలికైన అణువులు ఆవిరై .. గాలిలో ప్రయాణించి మన ముక్కును చేరుకుంటాయి. ఉక్కు ముక్క వాసన వేయడు ... కారణం దానినుంచి ఆవిరయ్యే పదార్ధం అంటూ ఏదీ ఉండదు .

ముక్కులో ఉండే నాసికారంద్రాల పైభాగం లో పోస్టల్ స్టాంపు పరిమాణము లో ఉండే మచ్చలాంటి ప్రదేశం లో కొన్ని ప్రత్యేకమైన నాడీకణాలు (neurons)ఉంటాయి .. వాటిపై 'సీలియా' (celia)అనే వెంట్రుకల లాంటి విక్షేపాలు (projections) వాసనకు సంభందించిన అణువులను బంధించి నాడీకణాలను ఉత్తెజపరుస్తాయి . మెదడు సాయము తో మనము వాసలను పోల్చుకోగాలుగుటాము .

మానవులు పదివేల రకాల వాసనలను సంబందిత న్యురాన్ల సాయం తో పసిగట్టగలరు . ఇలా ముక్కులో ఉండే ఘ్రానేంద్రియ గ్రాహకాలలో కొన్నింటికి ఒక నిర్దిష్టమైన జీన్-కోడ్ (సంకేతం ) ఉంటుంది . ఆ కోడ్ లోపించిన లేక దానికి హాని జరిగినా , ఆ వ్యక్తి ఆ నిర్నీతమైన వాసనను పసిగట్టలేదు . ఒక పండు లేక పుష్పము వాసనను పసిగడుతున్నామంటే వాటి నుంచి బాష్ప రూపములో వెలువడే ఈస్టర్లను వాసన చూస్తున్నామనే చెప్పాలి . ఈ ఈస్టర్లు కార్బన్ సంబందిత (organic) అణువులు . ఈస్టర్లను కుత్రిమము గా తాయారు చేసి ఆయా పూలు , పండ్లు నుంచి వచ్చే వాసనలను అనుభూతిలోకి తేవచ్చును . అలా తయారైనవే మనము వాడే సుగంధ ద్రవ్యాలు , అత్తర్లు .

Thursday, September 10, 2009

శూన్యం లో మంట ఎలా ప్రవర్తిస్తుంది ?, How fire behaves in the Space?





  • గురుత్వాకర్షణ శక్తి శూన్యం గా ఉన్న ప్రదేశం లో మంటలు వ్యాపించవు ... సరికదా ఆరిపోవును . మంట నుంచి కాంతి , ఉష్ణము , కార్బండై ఆక్శైడ్(carbondiaxide) ,నీటి ఆవిరి వెలువడుతాయి . ఉష్ణం వల్ల కలిగిన దహన చర్య తో కార్బండై ఆక్శైడ్ , నీటి ఆవిరి వ్యాకొచిస్తాయి . . . దాంతో వాటి సాంద్రత తగీ అవే తేలికై మంట పైభాగం నుంచి వాతావరణం లోకి చేరుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్లవనము(buoyancy), సంవహనము (convection) అనే భౌతిక చర్యలు ఉంటాయి . ఆ విధంగా మంట లోపలి భాగం లో ఖాళీ ఏర్పడటం తో ఆ ప్రదేశానికి వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడుకున్న గాలి చేరుకుంటుంది . ఆక్షిజన్ వల్ల మంట తీవ్రత మరీ ఉద్రుతమవుతుంది . . కాని సాన్ద్రతల తేడాల వల్ల తేలికైన పదార్ధాలు పైకి పోవడానికి గురుత్వశక్తి తోడ్పాటు అవసరము . కాబట్టి శూన్య గురుత్వం ఉన్నా ప్రదేశం లో ప్లవన, సంవహన చర్యలు జరుగవు ...
  • ఫలితంగా వేడెక్కి వ్యాకోచించిన కార్బండై ఆక్శైడ్ , నీటిఆవిరి మంట పైభాగం నుంచి వాతావరణం లోకి పోకుండా మంట చుట్టూ గుమికూడడం వల్ల వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడిన గాలి మంటను చేరుకోలేదు ... దాంతో దహన చర్య సరిగా జరగకపోవడం తో చివరకు మంట కాస్తా ఆరిపోవును . అతి తక్కువగా గురుత్వ శక్తి ఉండే ప్రదేశాలలో మంట ఒక చిన్న గోళాకార రూపం లోకి కుచించికొని పోవడం తో వంట వ్యాపించదు . అందువల్లే రోదసీలో పయనించే అంతరిక్ష నౌక లో అగ్ని ప్రమాదాలు సంభవించిన అవి నలుమూలలకు వ్యాపించవు .

కోమాలో బ్రతికి ఉన్నట్లేనా?, Life is there in Coma?



  • మనిషి కోమా లో ఉండడం అంటే దేమిటి? అలా అయ్యేందుకు కారణం ఏమిటి? కోమా లో ఉన్నారంటే బ్రతికి ఉన్నట్లేనా?
కోమా అంటే ఓ రకమైన దీర్ఘ నిద్ర లాంటిది . మనం నిద్రమత్తులో ఉన్నప్పుడు అప్రమత్తం (conscious) గా ఉండే పనులు చేయలేము . కేవలం స్వతంత్ర నాడీ వవ్యస్త (autonomousNervousSystem) అధీనం లో ఉండే శ్వాసక్రియ , హృదయ చలనం , రక్తప్రవాహం , జీర్ణక్రియ వంటి జీవ క్రియలు (PhysiologicalActivities) మాత్రమె జరుగురాయి . మనుషుల్ని చూసి గుర్తుపట్టడం , నడవడం , మాట్లాడడం , బాహ్యపరిస్తితులకు సనుగునం గా స్పందించడం వంటి కార్యకలాపాలను కొనసాగించలేరు .

తలపై గట్టి దెబ్బతగిలినా , కొన్ని రసాయన ద్రవ్యాల విషప్రభావం , ఆక్షిజన్ సరఫరా తగ్గడం , రక్తం లో ఉండే గ్లూకోజ్ ను కణాలకు అందించే 'ఇన్సులిన్' లోపం వల్ల కలిగే చెక్కెర వ్యాధి ముదరడం లేదా దాని వల్ల గ్లూకోజ్ స్థాయి తగ్గడం , మెదడులో ఏదైనా కణితి ఏర్పడడం , తదితర కారణాలు వల్ల మెదడు దేహాన్ని సజావుగా నడిపించలేని విపత్కర స్థితి ఏర్పడుతుంది .. కాని స్వతంత్ర నాడీ వ్యవస్థ బాగానే పనిచేయును .. అలాంటి సమయంలో మనిషి కోమాలోకి వెళ్ళును . కోమాలోకి ఎందువల్ల వేల్లారనే కారణము తెలుసుకొని చికిత్స చేస్తే వ్యక్తి మామూలు స్థితి కి వస్తాడు .
నిద్రపోవుచున్న వ్యక్తీ జీవించి ఉన్నట్లే ... కోమాలో ఉన్నా వ్యక్తీ బ్రతికి ఉన్నట్లే .

Sunday, September 06, 2009

కొరివి దెయ్యాలు ఉంటాయా?, Do Fire Devils exist?



రాత్రివేళ పొలాల్లో కొరివి దెయ్యాలను చుశామంటారు , అవి అడవిలో మరీ ఎక్కువగా కనిపిస్తాయని , మంటతో వెలుతుంతాయని అంటారు . ఆది అంతా భయమే తప్ప దెయ్యాలు ఉండవు .

అయితే మంట విషయం నిజస్ కాని అవి దెయ్యాలు మాత్రం కానే కావు . పక్షుల రెట్టలు , వృక్ష , జంతుజాల అవశేషాలలో ఉండే సోడియం , గంధకం , ఫాస్ఫరస్ వంటి తేలికగా మండే గుణం గల ధాతువులు భూమిమీద ఉష్ణోగ్రత మార్పుల వల్ల మండుతాయి . ఇలా మండటం పగలు జరుగుతుంది కాని మనం పగటి కాంతిలో వాటిని గమనించే అవకాశమూ వుండదు ... రాత్రివేళ మండినపుడు చీకటి వల్ల కనిపిస్తాయి . .. . అవే కొరివి దెయ్యాలని మనము భ్రమపడుతుంటాము .

Thursday, September 03, 2009

కొవ్వొత్తి వెలుగుతూనే ఉంటుంది ఎలా?, How is candle continuously lighting?




కొవ్వొత్తి ఆర కుండా ఎలా వెలుగుతుంది ? ... కొవ్వొత్తి వెలిగేందుకు దాంట్లోని రెండు ముఖ్యమైన భాగాలు పనిచేస్తాయి . ఒకటి ఇంధనం లా పనిచేసే కొవ్వు పదార్ధము . . . పారఫిన్ మైనము , రెండోది కరిగిన మైనాన్ని పీల్చుకొనే 'ట్వయిన్ దారము' తో తయారుచేసిన వత్తి .

కొవ్వొత్తి మండుతున్నప్పుడు కరుగుతూ ద్రవరుపం లోకి మారుతున్న మైనము , వత్తిలో ఉన్న అతి సన్నని మార్గాలగుండా పైకి ఎగబాకుతుంది . ఈ ప్రక్రియను కేశనాలికీయత (capillarity) అంటారు . పారఫిన్ వేక్స్ (మైనం) క్రూడ్ ఆయిల్ నుంచి లభించే ఒక రకమైన హైడ్రోకార్బన్ . మనం కొవ్వొత్తిలొని వత్తిని వెలిగించినపుడు ఉత్పన్నమైన ఉష్ణము వత్తిచుట్టు ఉండే కొవ్వును కరిగిస్తుంది . అలా కరిగి ద్రవ రూపం లో ఉన్న మైనాన్ని వత్తి పీల్చుకొని ఆ ద్రవాన్ని పైవైపునకు లాగుతుంది . మంటలోని ఉష్ణం పైకి వచ్చిన మైనపు ద్రవాన్ని భాష్ప రూపంలోకి మార్స్తుంది . ఆ విదంగా కొవ్వొత్తి లో మండేది భాష్ప(ఆవిరి)రూపం లో ఉండే మైనమే .

మండుతున్న కొవ్వొత్తిని తటాలున ఆర్పేస్తే , వత్తి నుంచి వెలువడే తెల్లని పొగ ఒక ప్రవాహం లాగా పైకిపోవడం గమనిస్తాం . ఈ పొగ కంటికి కనబడే విధంగా ఘనీభవించిన పారఫిన్ మైనం భాస్పమే . వత్తి వేడిగా ఉన్నంతవరకు ఈ తెల్లని పొగ పవాహ రూపము లో వస్తూనే ఉంటుంది .


నిప్పుల్లో నడకేలా సాధ్యము?, Walking on fire-How possible?




కొందరు భక్తులు ఏ బాధా లేకుండా నిప్పుల మీద నడవగాలుగుతున్నారు . ఇది ఎలా సాధ్య పడుతుంది ?.
నిప్పులపై నడవడానికి , భక్తికీ సంభందమూ లేదు ... ఎవరైనా నిప్పులపై సులభం గా నడవోచ్చును . ఇందులో మహిమలెం లేవు , నిప్పులమీద నడవ వచ్చును గాని వాటి పై నిలబదలేము . వివరణ ఈ విధంగా ఉంది ..

మన అరికాలి చర్మము దళసరిగా ఉంటుంది . మిగతా భాగాల కన్నా ఉష్ణ ప్రసరణ (ThermalConduction) తక్కువ . నిప్పుల మీద కాలు పెట్టినపుడు ఆ వేడి శరీరం లోకి వెళ్లి గాయం కలిగించే లోపే అడుగు తీసి అడుగులేస్తాము .. కాబట్టి కాలదు . అలాగే రెండో పదం విషయం లోను జరుగును . పైగా మన చర్మము పై భాగములో చెమ్మ ఉంటుంది . నిప్పుల వెదికి ఆ నీరు ఆవిరై పలుచని గాలి ఒక పొరలాగా ఏర్పడి వేడిని గ్రహించి గాల్లోకి పంపుతుంది .. .. కాలుకి తక్కువ వేడి వస్తుంది . అందుకే అగ్ని గుండం తొక్కే వాళ్లు కాళ్ళు తడుపుకొని వెళ్తుంటారు . ఇక్కడ నిప్పుల పై బూడిద తక్కువ ఉండేలా చూసుకోవాలి .

Monday, August 31, 2009

పిల్లులకు ఎందుకు మీసాలు ?, Why cats have Mustaks




పిల్లులకు పొడవుగా , బిరుసుగా , మందం గా ఉండే మీసాలు .. దాని నోటిపై మూలాలకు ముక్కు అంచులకు మధ్య ఉబ్బెత్తుగా ఉండే ప్రదేశం లో భూమికి సమాంతరం గా ఉంటాయి . ఈ మీసాల వెంట్రుకలు దాని శరీరము పై ఉండే వెంట్రుకలకు భిన్నం గా ఉంటాయి . ఈ మీసాల మూలాలు నరాలు రక్త నాళాలు ఎక్కువగా ఉండే ప్రదేశం లో లోతుగా ఉండటం తో స్పర్శ జ్ఞానం కలిగి దాని మార్గ నిర్దేశానికి (navigation) ఉపయోగ పడటమే కాకుండా , దాని మానసిక పరిస్థితిని కుడా తెలియజేస్త్యాయి .

పిల్లి మీసాలు ఎంత సున్నితము గా ఉంటాయంటే .. అవి తన చుట్టూ వీస్తున్న గాలి దిశలలో కొద్దిపాటి తేడాలను కుడా పసిగట్ట గలవు . గదిలో సామాగ్రి ఉన్నా ప్రదేశాలను బట్టి అక్కడ వీచే గాలి ప్రవాహం ఆధాపడి ఉంటుంది . పిల్లి ఒక గదిలో తిరుగు తున్నప్పుడు ముఖ్యం గా రాత్రివేళల్లో ఒక కుర్చీ లేక మంచం అడ్డం వస్తే ఆ వస్తువు చుట్టూ గాలి వీచే పరిస్థితిని తన మీసాల ద్వారా తెలుసుకొని ఆ వస్తువును ఢీ కొట్టకుండా మార్గాన్ని నిర్దేశించుకుంటుంది . అదే విధంగా ఒక ఇరుకైన సొరంగం లాంటి మార్గం లో పోవలనుకున్నప్పుడు ఆ మార్గం లో తను వెల్ల గలదా? ఒక వేళ వెళ్ళిన అందులో నుంచి సురక్షితం గా బయటకు రాగలడా? అనే విసయాన్ని మీసాలను ఆ మార్గం అంచులకు తాకించి అంచనా వేసుకుంటుంది . ఆ విధమ గా పిల్లి మీసాలు దానికి ప్రక్రుతి ప్రసాదించిన కొలబద్ద లాంటిది .పిల్లి కోపమా గానో లేక ఆత్మ రక్షణలో పడినప్పుడు మీసాలను వెనుక్కు లాక్కుంటుంది . అదే ఏదైనా ఆహారము దొరికే ముందు సంతోషం గా ఉన్నప్పుడు మీసాలను సడలించి ముదుకు ఉంచుతుంది . ఇలా పిల్లి మీసాలు దాని మానసిక పరిస్థితి ని కుడా తెలియజేస్తాయి .

Friday, August 28, 2009

అవి జారి పడవెందుకు ?, Why don't they fall down?





ఈగలు , చిన్న పురుగులు నున్నని గోడల పైన , గాజు పలకల పైన జారిపదిపోకుండా ఎలా నడవగలుగుతాయి ?
కారణము : వాటి పాదాల కింద ఉండే అసంఖ్యాకమైన , బిరుసెక్కిన అతిచిన్న , సన్నని వెంట్రుకలే . పైకి నున్నగా కనిపించే ఇంటి గోడలు , పైకప్పుల కిందిభాగాలు , గాజు తలుపులు నిజానికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మ మైన ఎగుడు దిగుడులు , బీటల మయమై ఉంటాయి . ఇవి ఈగలు , చిన్న పురుగుల పాదాలకింద ఉండే అతి సూక్ష్మమైన వెంత్రుకులకు కావలసిన పట్టు నిస్తాయి. .. అంతే కాకుండా ఆ జీవుల పదాల చివరి భాగాలలో ఉండే గొల్లలాంటి నిర్మాణము ఆయా ఉపరితలాలపై అస్తవ్యస్తం గా ఉండే అతిస్వల్పమైన ప్రదేశాలను గట్టిగా పట్టుకోవడం తో అవి జారకుండా ముందుకు పోగలుగుతాయి . కొన్ని పురుగులు నడుస్తున్నప్పుడు వాటి పదాల్లో కలిగే వత్తిడి వల్ల ఓ రకమైన జిగురులాంటి ద్రవం విడుదల అవుతుంది . వెంట్రుకల గుండా స్రవించే ఆ ద్రవం వల్ల కుడా అవి పడిపోకుండా నడవగలుగు తాయి .

Friday, August 21, 2009

ఆడియో విడియో పాటలు ఎలా నిల్వా ఉంటాయి?,Storage of audio video?

* శబ్దాన్ని వినిపించే ఆడియో క్యాసెట్ , దృశ్యాన్ని చూపించే విడియో క్యాసెట్ లలో ఒక సూత్రము ఇమిడి ఉన్న్నది . విద్యుత్ సంకేతాలు , అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన అద్భుతం ఇది .ఆడియో , విడియో క్యాసెట్ లలో సన్నని పొడవైన ప్లాస్టిక్ టేపులు ఉండి ..దానిపై ఉన్న ముదురు గోధుమ రంగు పుతపైనే శబ్దము నిక్షిప్తమై ఉంటుంది . ఇది ఎలా జరుగుతుంది ? ఈ పూత ఐరన్ ఆక్శైడ్ అయస్కాంత పూత ,
* ఆడియో , విడియో ప్లేయర్ సిస్టం లో రికార్డింగ్ హెడ్ ఉంటుంది ... ఇది ఒక గుండ్రని ఇనుప ముక్క మాత్రమే .. దాని చుట్టూ కొంచెం ఖాళీ వాడాలి ఒక సన్నని తీగ చుట్టి ఉంటుంది .గుండ్రం గా చుట్టిన ఏదైనా తీగలో సిద్యుత్ ప్రవాహం (electric current) ఏర్పడినపుడు దాని చుట్టూ అయస్కాంత క్షెత్రమ్ (MagnatiField)ఏర్పడుతుంది . క్యాసెట్ లో నిక్షిప్తం చేయల్చిన శబ్దాన్ని మైక్రోఫోన్ సయం తోను , దృశ్యాన్ని ఫోటోసెల్ సయం తోను విద్యుత్ సంకేతాలు గా మారుస్తారు . ఆ సంకేతాలను అంప్లిఫయర్ (Amplifier) ద్వారా వృద్ధి చేసి రికార్డింగ్ హెడ్ లో ప్రవహింప చేస్తారు . అప్పుడు రికార్డింగ్ హెడ్ చుట్టూ అయస్కాంత క్షెత్రమ్ ఏర్పడుతుంది . ఈవిద్యు సంకేఆల తీవ్రత (intensity) మారుతూ ఉండడం వల్ల అయస్కాంత క్షెత్రమ్ లో కుడా మార్పూ వస్తుంటుంది . ఇప్పుడు రికార్డింగ్ హెడ్ లో ఉండే చిన్న ఖాళీ ప్రదేశం ద్వార క్యాసెట్ లో ఉండే టేపును నిర్ణీత వేగంతో నడిపిస్తే , అప్పటికే ఏర్పడిన అయస్కాంత క్షెత్రమ్ వల్ల టేపు పై ఉన్న ఐరన్ ఆక్శైడ్ కణాలూ కుడా ఆయస్కాన్తీకరణము కు గురవుతాయి . ఫలితముగా టేపు పై ఉన్న కణాలూ తమ స్థానాలు సర్దుకుంటాయి ... అంటే శబ్దం , దృశ్యాలకు అనుగుణం గా టేపు పై కణాలూ ఒక క్రమపద్దతిలో ముద్ర అరెర్పరుస్తాయి. ఇదంతా రికార్డింగ్ వ్యవహారము ... మరి తెపులని తిరిగి ప్లే చేసిన ప్పుడు ఏం జరుగుతుంది ? ఆడియో లేదా విడియో ప్లేయర్ ను ఆన్ చేసినపుడు టేపు ఒక నిర్ణీత వేగం తో ప్లయింగ్ హెడ్ మీదుగా తిరుగుతుంది . అది తెపుపై నిక్శిప్తమైఉన్న అయస్కాంత క్షెత్రన్ని గుర్తిస్తుంది .. ఆ అయస్కాంత క్షెత్రమ్ ప్లింగ్ హెడ్ చుట్టూ ఉండే తీగచుట్టలో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది ... ఆ విద్యుత్ ప్రవచాన్ని ఆమ్ప్లి ఫయర్ వృద్ది చేసి స్పీకర్కు అందించడం ద్వారా శబ్దాన్ని , టీవీకి అందించడం ద్వారా దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాము .

Thursday, August 13, 2009

గ్రహణాలు ఎలా ఏర్పడతాయి?, How Eclips forming?




సూర్యుడు ,చంద్రుడు , భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినపుడే గ్రహణాలు ఏర్పడుతాయి . చంద్ర గ్రహణము పౌర్ణమి నాడు , సూర్య గ్రహణము అమావాస్య నాడు ఏర్పడతాయి . కాంతి పడిన ప్రతి వస్తువుకి నీడ ఏర్పడుతుంది . . అంతరిక్షములో సూర్యుని కాంతి భూమి ,చంద్రుల పై పడినపుడు వాటి నీడలు కుడా అలాగే ఏర్పడతాయి కాని ఆ నీడపడే చోటుకి ఏ వస్తువు (గోడలు లాంటివి ) ఉండవు కావున ఆవి కనిపించవు . . . ఈ నీడలు వల్లే గ్రహణాలు ఏర్పడుతాయి .

చంద్ర గ్రహణము :
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటే , ఆ భూమి చంద్రుడి తో సహా సూర్యుని చుట్టూ తిరుగుతోంది . ఇలా తిరిగే భూమి పై సూర్యకాంతి నిరంతరము పడుతూనే ఉంటుంది . ఆ కంటి పడే ప్రాంతాల్లో పగలని , పడని ప్రాంతాల్లో రాత్రని అనుకుంటాం ,.. సూర్య కంటి పడినపుడు భూమికి వెనక దాని నీడ ఏర్పడుతుంది . . . కాని అక్కడంతా అంతరిక్షము కాబట్టి ఏమీ కనబడదు , ఆ నీడ పడే ప్రాంతం లోకి చంద్రుడు వచ్చాడనుకోండి .. ఆ చద్రుడే ఓ గోడలా అడ్డు ఉండడము తో భూమి నీడ దానిపై పడుతుంది . ఆ నీడ పాడుచున్నప్రనటం మేర చంద్రుడు కనిపించదు ... కాబట్టి దాన్నే చంద్రగ్రహణము అనుకుంటాము .

సూర్య గ్రహణము :
భూమి పైకి సూర్య కంటి పడుతున్నపుడు ఆ కంటికి అడ్డుగా చంద్రుడు వచ్చదుకోండి ... అప్పుడు చద్రుడి నీడ ఏర్పడి అది భూమి మీద పడుతుంది . భూమి పై ఆ నీడ పరుచుకున్న ప్రాంతం లో ఉన్నవారు తలెత్తి పైకి చుస్తే సూర్యుడు కొంత భాగము కనిపించడు , అదే సూర్య గ్రహణము అంటాము . చంద్రుదు కనిపించని రోజు అమావాస్య అవుతుంది .

భూమి నుంచి చంద్రు ఉన్న దూరానికి సరిగ్గా 400 రెట్లు దూరాన సూర్యుడు ఉన్నాడు .. .అంతేకాకుండా చంద్రుడు వ్యాసానికి సరిగా 400 రెట్లు పెద్దదిగా సూర్యుడి వ్యాసము ఉన్నది . అందుకే భూమి నుంచి చంద్రుడు , సూర్యుడు ఒకే పరిమాణము లో కనిపిస్తాయి .
  •  

  • ==================================
visit my wrbsite : dr.seshagirirao.com