Monday, April 05, 2010

బంగాళా దుంప చరిత్ర ఏమిటి ?, Potato History-What?




ఈ దుంప పుట్టింది దక్షిణమెరికాలో. ప్రపంచంలో మొత్తం 4000 రకాల బంగాళాదుంపలు ఉన్నాయని తెలుసా? పైగా ఎన్ని సైజులో. బఠానీ గింజ పరిమాణం నుంచి యాపిల్‌ కాయంత వరకు ఉంటాయి. మీరు సాధారణంగా పసుపుగా ఉండే దుంపల్నే చూసుంటారు, కానీ ఇవి ఎరుపు, నీలం, నలుపు ఇలా బోలెడు రంగుల్లో ఉంటాయి .

క్రీస్తుపూర్వం 3000 కాలంలో దక్షిణమెరికాలోని పెరూ ప్రాంతంలో 'ఇంకా ఇండియన్లు' అనే జాతి ప్రజలే మొదటిసారి వీటిని పండించారని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో మొక్కజొన్న, గోధుమ, బియ్యం తరవాత ఎక్కువ మంది బంగాళాదుంపనే తింటున్నారు. ఇది 1537లో యూరోప్‌ దేశాలకు చేరింది. మొదట ఆ దేశాల్లో దీనిని విషంలా చూసేవారు. జర్మనీ రాజు ఫ్రెడెరిక్‌ విలియం ఈ దుంపలోని సుగుణాల్ని తెలుసుకుని వీటిని పండించాల్సిందిగా ఆదేశించాడు. ఆపై వీటివాడకం పెరిగింది. బంగాళా దుంపలు 1621లో ఉత్తర అమెరికాకు, 1719లో ఇంగ్లాండుకు పరిచయం అయ్యాయి.


* బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది.
* అమెరికాలో ప్రతి ఏడాది బంగాళాదుంపతో చేసిన ఫ్రెంచ్‌ఫ్రైస్‌ 40 లక్షల టన్నులు అమ్ముడవుతున్నాయి.
* ఒక అమెరికన్‌ ఏడాదికి 70 కిలోల దుంపల్ని తింటే, జర్మన్‌ 100 కిలోలు తింటాడని అంచనా.
* 1995లో కొలంబియా నౌకలో వీటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.
* ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువ పండిస్తున్నది చైనా. ఆ తరువాతి రెండు స్థానాల్లో రష్యా, ఇండియాలు ఉన్నాయి.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...