Wednesday, May 05, 2010

మిణుగురు పురుగులు మెరుస్తాయేం? , Sparkle insects emit light why?




ప్రశ్న:
మిణుగురు పురుగులు ఎందుకు మెరుస్తాయి?

జవాబు:
మిణుగురు పురుగులు ప్రపంచం నలుమూలలా ఉష్ణమండల ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఇవి లార్వా దశలో ఉన్నప్పుడే వాటి నుంచి మెరుపులు వస్తాయి. పెద్దవయ్యాక ఈ మెరుపులను అవి సంకేతాలుగా ఉపయోగించుకుంటాయి. ఇవి వెలువరించే కాంతి ఆకుపచ్చ, పసుపు పచ్చల మిశ్రమం. ఈ కాంతిని వెలువరించే శరీర భాగాలు వేరేగా ఉంటాయి. వీటిని ఫోటోఫోరస్‌ అంటారు. జీవ రసాయన పద్ధతుల్లో వెలుగులు జిమ్మే శరీర భాగాలను జీవ దీప్తి (bio-luminesence) అంటారు. మిణుగురుల దేహంలో 'ట్యాసీఫెరిన్స్‌' అనే పదార్థాలు ఆక్సీకరణం చెంది కాంతి శక్తిగా మారుతాయి. ఈ కాంతితో పాటు ఉష్ణం విడుదల కాదు కాబట్టి దీన్ని శీతల కాంతి అంటారు.

  • ==================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...