Monday, June 28, 2010

ఆడవాళ్లకు బట్టతల రాదేం? , Bald-head not seen in women-Why?





ప్రశ్న: పురుషులలో బట్టతల వస్తుంది కానీ, స్త్రీలలో రాదు. ఎందుకని?

జవాబు: అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు (genes), వంశపారంపర్యత (hereditory charecteristics) కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. పురుషులలో యాండ్రోజన్‌ హార్మోను ఎక్కువగా ఉండడం వల్ల వయసును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి. హార్మోన్ల మోతాదులో తేడాల వల్లనే స్త్రీలకు బట్టతల సాధారణంగా ఏర్పడదు.

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మోల్‌ అంటే ఏమిటి? , Mol in science meaning?





ప్రశ్న: భౌతిక, రసాయన శాస్త్రాల్లో 'మోల్‌' అనే పదాన్ని వాడుతుంటారు. దాని అర్థం ఏమిటి?

జవాబు: ఆంగ్లభాషలో మోల్‌ అంటే పుట్టుమచ్చ కావచ్చు కానీ, శాస్త్రీయ పరిభాషలో ఇది ఒక సంఖ్యను సూచిస్తుంది. పండ్లు, పెన్సిళ్లలాంటి వస్తువులను లెక్కించడానికి జత అనీ, డజను అనీ వాడుతుంటాం కదా? అలాగే శాస్త్ర అధ్యయనంలో అతికొద్ది ప్రదేశాన్ని అత్యంత పెద్ద సంఖ్యలో ఆక్రమించే అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ఫోటాన్ల లాంటి అతి సూక్ష్మకణాలను మోల్స్‌లో కొలుస్తాం. మోల్‌ అంటే 6.023X10 (6023 తర్వాత 20 సున్నాలు) అనే అతి పెద్ద సంఖ్య. ఆ విధంగా మోల్‌ పదార్థరాశికి ప్రమాణం.

ఈ ప్రమాణానికి ఒక నిర్వచనం కల్పించడానికి శాస్త్రజ్ఞులు 12 గ్రాముల స్వచ్ఛమైన కార్బన్‌ మూలకాన్ని తీసుకుని, దానిలో ఉండే పరమాణువుల సంఖ్యను మోల్‌గా నిర్ణయించారు. కార్బన్‌ను ప్రమాణంగా తీసుకోడానికి కారణం విశ్వంలో జీవం ఉన్న, జీవం లేని పదార్థాలలో కార్బన్‌ పాలు ఎక్కువ. 12 గ్రాముల కార్బనే ఎందుకంటే కార్బన్‌ పరమాణు సంఖ్య 12. మొత్తానికి మోల్‌ అనేది సూక్ష్మకణాల గణనకు పరిమితమైన ప్రమాణం.


  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

బ్యాండ్ ఎయిడ్ ఎలా వచ్చిందో ? , Band-Aid origion ?




Q : Who discovered the Band-aid?,బ్యాండ్ ఎయిడ్‌ను కనిపెట్టిందెవరు?

A : బ్యాండ్ ఎయిడ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం-మనకు ఏ కాస్త దెబ్బ తగిలినా, బ్లేడుకోసుకున్నా, రక్తం వచ్చినా వెంటనే బ్యాండ్ ఎయిడ్ చుట్టుకుంటుంటాం.

బ్యాండ్ ఎయిడ్‌ను సృష్టించిన వ్యక్తి పేరు 'ఎర్లే డిక్సన్' ఈయన 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ ( అమెరికా) లో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈయన భార్య ఇంట్లో వంట చేసేటప్పుడు తరచుగా చేయి కోసుకోవడం, కాల్చుకోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేది. అప్పట్లో తెగిన, కాలిన గాయాలకు దూదితో కట్టు కట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఇది చాలా టైము పట్టే తతంగం. డిక్సన్ తన భార్యకు పదే పదే కట్టు కట్టలేక సులభంగా ఉండే 'బ్యాండ్ ఎయిడ్' ను 1920 లో కనిపెట్టాడు. నడిమధ్యలో దూది ఉండి, సులభంగా అంటుకుపోయే ఈ టేప్‌ను తయారు చేశాక డిక్సన్‌కు ఇంట్లో కష్టాలు తీరాయి. ఈ సంగతి 'జాన్సన్ అండ్ జాన్సన్' వాళ్ళతో డిక్సన్ చర్చించాడు. ఇతని ఆలోచనను మెచ్చిన ఆ సంస్థ 'బ్యాండ్ ఎయిడ్' తయారు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బ్యాండ్ ఎయిడ్ ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. చూశారా! ఒక చిన్న ఆలోచన డిక్సన్‌తో పాటు అందరికీ ఎంత మేలు చేసిందో...

  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సంప్రదాయేతర ఇంధన వనరులు అంటే ఏమిటి?, Non-Conventional Source of Energy






దేశ ఆర్ధికాభిఫృద్ధి లో ఇంధన వనరులు కీలకపాత్ర వహిస్తాయి . ఇందనవనరులు ప్రధానముగా 2 రకాలు --
  • సంప్రదాయ ఇంధన వనరులు (Conventional source of energy),
  • సంప్రదాయేతర ఇంధన వనరులు (Non-conventional source of energy)
సంప్రదాయ ఇంధన వనరులు అంటే : సుధీర్ఘ కాలంగా వినియోగం లో ఉన్న వనరులని అర్ధము . అవి ....
  1. బొగ్గు ,
  2. చమురు ,
  3. సహజ వాయువు ,
  4. జలవిధ్యుత్ శక్తి ,
  5. అణుశక్తి ,
వీటిలో జలవిద్యుత్ శక్తి తప్ప మిగిలినవన్నీతరిగిపోయే(Exhaustible) ఇందన వనరులని గమనించాలి . ఒక్కసారి మాత్రమే వినియోగించుకోగలిగినవని (once used they are lost for ever)అర్ధము . వీటిని పున:స్థాపితం చే్యడానికి (Renewable) వీలుకాదు .

సంప్రదాయేతర ఇంధన వనరులు : వీటినే NRSE (new & renewable sources of energy) అంటే నూతన పున:స్థాపిత ఇంధన వనరులు అని కూడా పేరు ... భూగ్రహము ఉన్నంత వరకు ప్రతినిత్యము వినియోగిచుకునా ఇవి తరిగిపోవు . ఈ రకానికి చెందినవి -->
  1. సౌరశక్తి (Solar energy) ,
  2. పవన శక్తి (Wind energy) ,
  3. బయోగ్యాస్ (Bio-gas energy) ,
  4. బయోమాస్ (Bio-mas energy) ,
  5. భూతాపశక్తి (Geo-thermal energy) ,
  6. సముద్ర తరంగ శక్తి (Ocen tidal energy) ,
  7. చిన్న తరహా జలవిద్యుత్ కేంద్రాలు (Small hydal projects)
  8. హైడ్రోజన్ శక్తి (Hydrogen energy) ,
  9. జీవ ఇందన వనరులు (Bio energy) .

ఈ పున:స్థాపిత ఇంధన వనరులు కాలుష్య -రహితమైనవి కాబట్టి వీటిని ' పర్యావరణ మిత్ర-ఇంధన వనరులు అనీ ... వీటిని ఎక్కడ అవసరమైతే అక్కడ ఉత్పత్తి చేసుకోవచ్చు కాబట్టి " వికేంద్రీకరణ ఇంధన వనరులు " అని ... సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయము గా అభివృద్ధి చేయడము తో " ప్రత్యామ్నాయ ఇంధన వనరులు " అనీ అంటారు .

ఇం'ధనానికి' రెక్కలు!
పెట్రో ధరలపై నియంత్రణ పగ్గాలను కేంద్రం వదిలేసింది. తద్వారా వీటి ధరలకు రెక్కలు తొడిగింది. సామాన్యుడ్ని ఇది కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పరంపర మున్ముందు కొనసాగేలా ఉంది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకే అవకాశం కనపడుతోంది. భవిష్యత్‌లో వీటి ధరలు ఏ స్థాయికి పెరుగుతాయోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.
పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. సూటిగా చెప్పాలంటే అమెరికా, భారత్‌ సహా అనేక దేశాలు చమురు అనే వ్యసనానికి బానిసలయ్యాయి. భారత్‌లో ఉన్న ముడిచమురు నిల్వలు అత్యంత స్వల్పం. ప్రపంచ శిలాజ ఇంధన నిల్వల్లో మన వాటా 1 శాతం కన్నా తక్కువే. జనాభా వాటా మాత్రం 16 శాతంగా ఉంది. దేశంలో ఏటా లక్షల సంఖ్యలో కొత్త వాహనాలు వచ్చిపడుతున్నాయి. మరోపక్క కాలం చెల్లిన వాహనాలూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇవి పెట్రోలు, డీజిల్‌ను తెగ తాగేస్తున్నాయి. ఫలితంగా దేశంలో చమురు వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. భారత్‌లో వినియోగమవుతున్న చమురులో 79 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. సొమ్ము పోయి శనిపట్టే అన్న చందంగా వీటి వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది.

ఏర్పడేదిలా..
జీవం ఆవిర్భవించిన తొలినాళ్లలో మొక్కలు, జంతువులు చనిపోయాక కుళ్లిపోయాయి. వీటిలో ఎక్కువగా ఫైటోప్లాంక్టన్‌, జూప్లాంక్టన్‌లు ఉన్నాయి. ఇవి సముద్రాల్లో నివసించేవి. ఈ జీవులు చనిపోయాక.. వీటి శిలాజాలు సముద్ర అడుగుభాగంలోకి చేరేవి. ఆ తరువాతికాలంలో పీడనం, ఉష్ణం కారణంగా ఇవి చమురు, వాయువు, బొగ్గుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కలు, జంతువుల శిలాజాల నుంచి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలుగా పేర్కొంటున్నారు. చమురు క్షేత్రాలు అంటార్కిటికా ఖండంలో తప్ప ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా దొరుకుతాయి. వీటిలో ఎక్కువగా హైడ్రోకార్బన్‌లు ఉంటాయి. శక్తి నిల్వ ఉంటుంది. అందుకే ఇవి మనకు ప్రాణాధారమయ్యాయి. ఈ శక్తి పరమాణు బంధాల్లో ఉంటుంది. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా మనం శక్తిని విడుదల చేస్తున్నాం. 20వ శతాబ్దం మొత్తాన్ని ఈ ఇంధనాలే శాసించాయి.

విచ్చలవిడితో వినాశనం
* ఈ శిలాజ ఇంధనాలు రాత్రికి రాత్రే ఏర్పడలేదు. లక్షల సంవత్సరాలు సమయం పట్టింది. ఈ స్పృహ లేకుండా మనం విచ్చలవిడిగా వీటని వాడేస్తున్నాం. ఫలితంగా ఇవి అడుగంటిపోయే పరిస్థితి వస్తోంది.

* భూమి మీద ఇంకా 1.05 ట్రిలియన్‌ పీపాల ముడి చమురు ఉందనేది అంచనా. ప్రపంచవ్యాప్తంగా వార్షిక వినియోగం 24 బిలియన్‌ పీపాల మేర ఉంది. వినియోగం ఈ స్థాయిలోనే ఉంటే 2053 నాటికి భూమి మీద ముడి చమురు ఉండదనేది అంచనా. ఒకవేళ వినియోగం ఎక్కువైతే మరింత త్వరగా చమురు బావులు ఖాళీ అవుతాయి.

* ఒక కారు ఏటా సరాసరిన 600 పీపాల చమురును తాగుతుందని అంచనా. ఈ లెక్కన ఇది 12వేల పౌండ్ల కార్బన్‌ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఈ విషవాయువును గ్రహించడానికి 240 చెట్లు అవసరం. దేశంలో ఉన్న కార్లు వదిలే వాయువును పీల్చుకోవడానికి ఎన్ని చెట్లు కావాలో అర్థంచేసుకోండి.

* పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా వృక్షాలు పెరగకపోగా.. వేగంగా తరిగిపోతున్నాయి. భారత్‌లో ఐదింట మూడొంతుల బొగ్గు గనులు అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ లెక్కన బొగ్గును తవ్వడానికి ఎంత అటవీ భూమిని నాశనం చేశారో అర్థంచేసుకోవచ్చు.
అమెరికాలో దారుణం
అమెరికాలో శిలాజ ఇంధనాల వినియోగం మరీ ఎక్కువగా ఉంది. ఏటా 152.4 బిలియన్‌ గ్యాలన్ల చమురు అక్కడ వాడేస్తున్నారు. ప్రపంచ జనాభాలో ఆ దేశ వాటా 5 శాతం మాత్రమే. చమురును మాత్రం 26 శాతం మేర వాడేస్తున్నారు.

* ఈ సమస్యను గుర్తించిన అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం అక్కడ 12 బిలియన్‌ గ్యాలన్ల బయోఇంధనాలు ఉత్పత్తవుతున్నాయి. 2022 నాటికి వీటిని 36 బిలియన్‌ గ్యాలన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల పెట్రో వినియోగం ఏటా 328 మిలియన్‌ బ్యారళ్ల మేర తగ్గుతుంది.
పన్ను మంత్రం ఫలించదు
భారత్‌లోనూ వినియోగం అధికంగానే ఉంది. ఇక్కడ రోజుకు దాదాపు 26.7 లక్షల పీపాల చమురు ఖర్చవుతోంది. ఈ వినియోగాన్ని తగ్గించేందుకు దీనిపై కార్బన్‌ పన్ను విధించాలని పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు పెద్దలు ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి పన్నుల వల్ల స్వల్పకాలంలో వినియోగం తగ్గితే తగ్గొచ్చేమోగాని దీర్ఘకాలంలో మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ చర్య ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రత్యామ్నాయాలే మేలు
అనేక ప్రతికూలతల నేపథ్యంలో శిలాజ ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. వీటి ఉత్పత్తి తగ్గేకొద్దీ ధర పెరిగిపోతూ వస్తుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిసారించాయి. సౌర, పవన, బయో
ఇంధనాలు, అలల శక్తి, హైడ్రోజన్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

* పునర్‌వినియోగ ఇంధనాల్లో నిస్సందేహంగా అగ్రస్థానం సౌరశక్తిదే. ఉష్ణమండల దేశమైన భారత్‌కు ఈ రంగంలో అనేక అవకాశాలు
ఉన్నాయి. భారత్‌.. ఏటా సుమారు 5వేల ట్రిలియన్‌ కిలోవాట్‌ అవర్లకు సమానమైన సౌరశక్తిని అందుకుంటోంది. ఇది దేశ మొత్తం ఇంధన వినియోగం కన్నా చాలా ఎక్కువ. ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌ ద్వారా దీన్ని ఒడిసిపట్టి విద్యుత్‌గా మార్చుకోవచ్చు. 2050 నాటికి ప్రపంచ ఇంధన వినియోగంలో సౌర విద్యుత్‌ వాటా 25 శాతంగా అవకాశం ఉందని 'గ్రీన్‌పీస్‌' సంస్థ ఇటీవల తెలిపింది.

* సౌర కుక్కర్ల ద్వారా వంట గ్యాస్‌ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. సౌర వాటర్‌హీటర్లు, ఏసీలు, మోటార్లు, వీధి దీపాలు, నీటి శుద్ధి యంత్రాలు, సౌర కార్లు, ఫ్రిజ్‌లనూ విరివిగా అందుబాటులోకొస్తే ప్రయోజనం ఉంటుంది.

* 2022 నాటికి 20వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకొంది. అయితే భారీస్థాయిలో సౌరఫలకాలు ఏర్పాటు చేయడానికి నిధుల లభ్యత ప్రతిబంధకంగా మారుతోంది. ప్రస్తుతమున్న పరిజ్ఞానంతో ఇంధన సామర్థ్యం తక్కువగా ఉంటోంది. వీటిని అధిగమించడానికి విస్తృతంగా పరిశోధనలు జరగాలి.

మొక్కజొన్న వంటి పంటల నుంచి ఇథనాల్‌ వంటి బయోఇంధనాలను అభివృద్ధి చేయవచ్చు.పెట్రోలు, డీజిల్‌ కన్నా ఇది చాలా చౌక. హానికారక వాయువులను చాలా తక్కువ స్థాయిలో విడుదల చేస్తుంది.

విద్యుదుత్పత్తి, రవాణా రంగాల్లో పర్యావరణ అనుకూల ఇంధనంగా హైడ్రోజన్‌ అక్కరకొస్తుంది. ఈ వాహనాల నుంచి పొగ వెలువడదు. నీరు మాత్రమే విడుదలవుతుంది.

విద్యుత్‌ వాహనాలను వాడడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. భారత్‌లో ప్రస్తుతం రెవా అనే ఎలక్ట్రిక్‌ కారు వాడుకలో ఉంది.

సంపీడిత వాయువును కూడా వాహనాల్లో ఇంధనంగా వాడుకోవచ్చు. ఇలాంటి కారు తయారీకి టాటా మోటార్స్‌ ఇప్పటికే ఫ్రెంచ్‌ సంస్థ ఎండీఐతో చేతులు కలిపింది.

  • source : Eenadu daily
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, June 26, 2010

వేళ్లు విరిస్తే శబ్దమేల? , Bending finger joints gives sound Why?





  •  
  •  
  •  

ప్రశ్న: మనం వేళ్లు విరిచినపుడు శబ్దం ఎందుకు వస్తుంది?

జవాబు: చేతి వేళ్లలో ఎన్నో కీళ్ల (joints)తో కూడిన ఎముకలుంటాయి. జీవనిర్మాణ శాస్త్రం (anatomy) ప్రకారం వీటిని జారుడు కీళ్లు(gliding joints) అంటాము.నిజానికి ఐదువేళ్ల ఎముకలు ఈ కీళ్ల సాయంతో విడివిడి గొలుసుల లాగా ఉంటాయి. వేళ్లు కదిలేటప్పుడు కీళ్ల దగ్గరే ఎముకలు అటూ ఇటూ కదులుతాయి. కదిలే యంత్ర భాగాల వద్ద ఘర్షణను నివారించడానికి ఎలాగైతే కందెనలు (lubricants) వాడతామో, అలాగే మన వేళ్ల ఎముకులు కదిలే కీళ్ల దగ్గర ఒక రకమైన చిక్కని ద్రవం (మ్యూకస్‌) ఉంటుంది. కదలికల కారణంగా జీవన ప్రక్రియల్లో భాగంగా ఇందులో అప్పుడప్పుడు అతి చిన్న పరిమాణంలో గాలి బుడగలు ఏర్పడతాయి. మనం వేళ్లను మిటకరించినప్పుడు ఈ గాలి బుడగలు పగిలి ఆ ద్రవంలో చెదిరిపోతాయి. అప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, June 25, 2010

క్వాజర్స్‌ అంటే ఏమిటి? , Quasars .. what are they?





ప్రశ్న: అంతరిక్షానికి సంబంధించి క్వాజర్లు అనే పదం విన్నాను. వేటినిలా పిలుస్తారు?

జవాబు: విశ్వంలోని ఖగోళ వస్తువుల్లో క్వాజర్లు (Quasers) అత్యంత ప్రకాశవంతమైనవి. ఇవి వెలువరించే కాంతి విశ్వంలోని మొత్తం నక్షత్రమండలాలు (గెలాక్సీలు) వెలువరించే కాంతి కన్నా ఎక్కువగా ఉంటుంది. అనేక సంవత్సరాల పరిశోధనలు, ప్రయోగాల ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని గెలాక్సీల అంతరాల్లో క్వాజర్లు ఉంటాయని కనిపెట్టగలిగారు. అవి తమలో ఉండే అత్యంత శక్తిని మన సూర్యుని కన్నా కోట్లాది రెట్ల ద్రవ్యరాశిగల అనేక కృష్ణబిలాల (బ్లాక్‌హోల్స్‌) నుండి సంగ్రహిస్తాయి. అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండే ఈ క్వాజర్లు వాటి పరిసరాల్లో ఉండే ద్రవ్యాన్ని పీల్చుకునే క్రమంలో అనూహ్యమైన పరిమాణంలో శక్తి విడుదల అవుతుంది. క్వాజర్లను కాస్మిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ అని కూడా అంటారు.
  • =======================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

కోకో కోలా కనిపెట్టిందెవరు ?, Coco-cola discovered by whome?




మంచి నీళ్ళు కూడా తాగడం మానేసి కోకోలా తాగుతున్నాం మనం. అంత పిచ్చి పట్టుకుంది మనకు కోకో కోలా మీద. ఈ కూల్ డ్రింక్ లో రసాయన ఎరువులు ఉన్నాయనీ అందువల్ల ఇది తాగితే ప్రమాదమని గతంలో పెద్దస్థాయిలో వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజాలున్నప్పటికీ మనం దీనిని తాగడం మానలేదు. ప్రపంచం మొత్తాన్ని ఇంత తీవ్రంగా బానిసలుగా చేసుకున్న ఈ శీతలపానియాన్ని డాక్టర్ జాన్ స్టిత్ పెంబర్‌టన్ (1830-1888) అనే ఆయన కనిపెట్టాడు. ఈయనది అమెరికాలోని అట్లాంటాలో ఉన్న జార్జియా టౌను. ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తుండిన పెంబర్‌టన్ రకరకాల పానియాలను తయారు చేస్తుండేవాడు. కోకా ఆకులను ఉపయోగించి అతడు తయారు చేసిన ఫ్రెంచ్ వైన్ ఆ రోజుల్లో చాలా ఆదరణ పొందింది. అయితే 1885లో అట్లాంటాలో ఫ్రెంచ్ వైన్ వంటి మత్తుపానియాలను నిషేధించారు. దాంతో పెంబర్‌టన్ రాబడిపోయింది. అప్పుడతడు మత్తు స్వభావం లేని కొత్త పానియాన్ని కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత అతడు కోకా ఆకులకు, కోల నట్‌ను కలిపి, దానికి చక్కెర, సిట్రిక్ ఆసిడ్ మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జత చేసి మే 8, 1886 న కోకో కోలా ను తయారు చేసి అమ్మడం మొదలెట్టాడు. ఎంతో ప్రసిద్ది పొందిన ఈ పానియాన్ని అతడు ఫ్రాంక్ రాబిన్ సన్, డేవిడ్‌రో అనే మిత్రులతో తయారు చేసి అమ్మడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆ మిత్రులతో గొడవ రావడంతో కోకా కోలా ఫార్ములాను వాళ్ళకు అమ్మేశాడు. ఇప్పుడు మనం తాగుతున్న కోకో కోలాకు, పెంబర్‌టన్ ఒరిజినల్ కోకో కోలాకు రుచిలో ఎంతో మార్పు వచ్చింది. కాలానుగుణంగా కోకో కోలా రుచి మార్చుకున్నా దాని 'ఫార్ములా' ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంది.
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

బంగారం ఏర్పడేదెలా?, Gold preparation- how?





ప్రశ్న: బంగారపు గనులు ఎలా ఏర్పడతాయి? మన రాష్ట్రంలో బంగారపు గనులు ఎక్కడున్నాయి?

జవాబు: విశ్వం ఆవిర్భావంలో భాగంగా కొన్ని చిన్న పరమాణువులు కలవడం ద్వారా పెద్ద పరమాణువులు ఏర్పడ్డాయి. చిన్న పరమాణువులు అంటే తక్కువ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉన్నవన్నమాట. బంగారం (Au) పరమాణువుల్లో 79 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ పరమాణువులు పరస్పరం లోహబంధాన్ని(metallic bond) ఏర్పరుచుకుంటాయి. అందువల్ల బంగారం చాలా స్థిరమైన లోహం. అంటే అది ప్రకృతిలో మూలకం రూపంలోనే లభ్యమవుతుంది. అయితే పెద్ద పరమాణువులు కాబట్టి తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇలాంటి పెద్ద పరమాణువులు ఏర్పడాలంటే అధిక పీడనం కావాలి. ఆ పరిస్థితి భూమి లోపలి పొరల్లో మాత్రమే ఉండడం వల్ల బంగారం లోతైన గనుల్లో మాత్రమే లభ్యమవుతుంది. అరుదుగా ఉండడం, వెలికి తీయడం కష్టం కావడంతో బంగారానికి విలువ ఎక్కువ. మన దేశంలో కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ ప్రాంతంలో కొన్ని బంగారపు గనులున్నాయి. ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా, రష్యాల్లో బాగా ఉన్నాయి. మన రాష్ట్రంలో బంగారపు గనులు లేవు

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఫౌంటెన్ పెన్ పుట్టిందెలా? , Pen Originated - How?






మనకు ఏది వ్రాయాలన్న మనం ఉపయోగించేది మొదట పెన్ను. కాని మనకు ఆ పెన్ను గురించి వివరాలు ఏమి తెలయవు కనుక ఇప్పుడు ఆ పెన్ను ఎలా పుట్టినదో అసలు ఎవరు కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవ్వాళ మనం క్లాస్‌రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ ఇలా పెన్నును ఈ షేప్‌లో చూడడం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్ళీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది. ఈ తలనొప్పిని పరిహరించిన వ్యక్తి పేరు 'లూయిస్ ఇ.వాటర్‌మెన్'. ఈయన అమెరికన్. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేసేవాడు. ఒకసారి పాలసీ తీసుకోవడానికి వచ్చిన పెద్దమనిషి సంతకం చేయడానికి కలంను సిరాలో ముంచగా అది కాస్తా ఒలికి పేపర్లు పాడయ్యాయి. ఇది అపశకునం గా భావించిన ఆ పెద్ద మనిషి పాలసీ చేయకుండానే వెళ్ళి పోయాడు. దాంతో కోపం తెచ్చుకున్న వాటర్‌మెన్ అసలు సిరాలో ముంచే అవసరం లేకుండా నిబ్ వెనుక ఇంకు రిజర్వాయర్ ఉండేలా పెన్ను తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి 'ఫౌంటెన్ పెన్' ను 1884 లో తయారు చేశాడు. ఇతడిలాగే మరికొందరు కూడా పెన్నులు తయారు చేసినా ప్రపంచానికి ఫౌంటెన్ పెన్ సృష్టికర్తగా పరిచయమైంది వాటర్‌మెన్ మాత్రమే. పెన్నును జేబులో పెట్టుకునే వీలుగా క్లిప్‌ను తయారు చేసింది కూడా ఇతడే.
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, June 24, 2010

కొండల్లో రీసౌండ్‌ వస్తుందేం? , Mountains give re-sound - why?






ప్రశ్న: కొండ ప్రాంతంలో అరిస్తే కాసేపటికి మళ్లీ మనకే వినిపిస్తుందేం?

జవాబు: ధ్వనితరంగాలు గాలిలో సుమారు సెకనుకు 332 మీటర్లు వేగముతో ప్రయానిస్తాయి.  కొండల ముందు గట్టిగా అరిస్తే కొన్ని సెకన్ల తర్వాత ఆ అరుపులే మనకి వినిపిస్తాయి. దీన్నే ప్రతిధ్వని (echo)అంటారు. ధ్వని తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. శబ్దస్థానం నుంచి ధ్వని తరంగాలు అన్ని దిశలకు వ్యాపిస్తాయి. వీటికి ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ శబ్ద తరంగాలలో కొన్ని పరావర్తనం చెందుతాయి. అలా తిరిగి వెనక్కి వచ్చే శబ్ద తరంగాలనే మనం వింటాం. నిజానికి ప్రతి శబ్దం ఏదో ఒక అడ్డంకిని తాకి తిరిగి వెనక్కి వచ్చినప్పటికీ అన్నింటినీ మనం వినలేం. ఒక సెకనులో పదో వంతు లోపల తిరిగి వచ్చే ప్రతిధ్వనులను వినలేం. అంటే ప్రతిధ్వని మనకి వినబడాలంటే మన నుంచి బయల్దేరిన శబ్దతరంగాలు 1/10 సెకన్లకు మించిన వ్యవధితో తిరిగి రావాలి. ఆ విధంగా లెక్క కట్టినప్పుడు శబ్దతరంగాలను పరావర్తనం చేసే అడ్డంకి మనకు కనీసం 17 మీటర్ల దూరంలో ఉండాలని తేలుతుంది. పైగా మధ్యలో ఎలాంటి ఇతర అడ్డంకులు ఉండకూడదు. ఈ పరిస్థితులు కొండ ప్రాంతాలు, పెద్ద పెద్ద దేవాలయాలు, ఖాళీ గదులు, లోతైన బావుల దగ్గర ఉంటుంది కాబట్టి, ఆయా ప్రాంతాల్లో మన అరుపులు తిరిగి ప్రతిధ్వనులుగా మనకే వినిపిస్తాయి. మనం ప్రతిధ్వనిని వినే వ్యవధి మనకు, అడ్డంకికి మధ్య ఉండే దూరాన్ని బట్టి ఉంటుంది.
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పాప్‌కార్న్ఎలా తయారవుతాయి ? , PopCorns prepared - How?





మనం బస్‌స్టేషన్‌లో, సినిమా హాల్స్‌లో, రైల్వే స్టేషన్‌లలోకి వెళ్ళినప్పుడు మనకి మొదట కనిపించేది, వినిపించేది పాప్‌కార్న్ పేరు. పాప్‌కార్న్ ఎలా తయారవుతుంది, పాప్‌కార్న్ ఎప్పుడు తయారుచేశారు, ఎక్కడ కనిపెట్టారు అనేది మనం తెలుసుకుందాం.

అందరికీ ఇష్టమైన మొక్కజొన్న పుట్టింది మెక్సికోలో అని అందరు అంటారు. క్రీ.పూ. 2500లోనే అక్కడ నివసించిన కాచైజ్ ఇండియన్లు మొక్కజొన్నను పండించి ఆహారంగా తీసుకొనే వారని తెలుస్తుంది. 'పెరూ' దేశంలో తూర్పు తీరంలో దాదాపు వెయ్యేళ్ళ క్రితం నాటి మొక్కజొన్న గింజలు దొరికాయి. అన్నేళ్ళ తరువాత కూడా అవి వేయించి తినే స్థాయిలో ఉండటం విశేషం. మెక్సికో నుంచి బ్రిటన్‌కు చేరిన మొక్కజొన్నకు పంచదార జోడించి బ్రేక్‌ఫాస్ట్‌గా తినడాన్ని ఇంగ్లీషువారు మొదలుపెట్టారు. మొదట్లో మంట మీద కాల్చి నేరుగా కంకుల్ని తినేవారు. అయితే 18వ శతాబ్దం తరువాతనే ఇప్పుడు మనం తింటున్న పేలాలు లేదా పాప్‌కార్న్ వాడుకలోకి వచ్చాయి.

గింజల నుంచి పాప్‌కార్న్ ఎలా వస్తుందంటే ప్రతి మొక్కజొన్న గింజలోనూ చిన్న నీటి బిందువు ఉంటుంది. ఇది గింజలో ఉన్న మెత్తటి పిండిపదార్థంలో నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైతే గింజల్ని వేడి చేస్తామో అప్పుడు ఆ నీరు వ్యాకోచిస్తుంది. దాంతో పీడనం పెరిగి గింజ టప్‌మని పేలి పొరలుగా విచ్చుకుంటుంది. పూర్వం ఈ ప్రక్రియను చూసి అమెరికన్ తెగలు చాలా భయపడేవి. గింజలో ఆత్మ ఉంటుందనీ దానిని వేడి చేస్తే బయటకు వచ్చి చిటపటమని గోల చేస్తుందని నమ్మేవారు. తిండిలోనే కాకుండా పూజావ్యవహారాలలో కూడా అమెరికన్ తెగలు పాప్‌కార్న్‌కు విశేష ప్రాధాన్యం ఇచ్చేవి. స్త్రీలు మొక్కజొన్న కంకుల్ని తలలపై ధరించేవారు. గింజలను మాలగా గుచ్చి మెడలో ధరించే వారు. ఇప్పుడు పాప్‌కార్న్ లేనిదే మనం సినిమా చూడలేని పరిస్థితికొచ్చాం. వేడివేడి పాప్‌కార్న్ నములుతూ సినిమా చూస్తుంటే ఆ మజానే వేరు.
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ముఖాలు రకరకాలేల? , Faces are different - Why?






ప్రశ్న: వివిధ దేశాల్లో ఉండే ప్రజల ముఖాలు వివిధ రకాలుగా ఉండడమెందుకు? ఆఫ్రికా వాళ్ల ముఖాలు ఒక తీరుగా, భారతదేశంలో మరో తీరుగా, చైనావారివి మరోలా ఉంటాయెందుకు?


జవాబు: జీవజాతులు (species) పరిణామ క్రమం (evolution) ద్వారా రూపుదాల్చాయని చెప్పే డార్విన్‌ సిద్ధాంతం గురించి చదువుకుని ఉంటారు. ముఖాలు వేర్వేరుగా ఉండడం అందుకొక సాక్ష్యం. పరిసరాలకు అనుగుణంగా, ప్రకృతితో తలపడేందుకు అనుకూలంగా జీవులు రూపొందుతాయనేదే పరిణామ సిద్ధాంతం. ప్రతి జీవీ ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు, పరిస్థితులలో నెగ్గుకు వస్తూ జీవించేలా మార్పులు సంతరించుకుంటుంది. పరిసరాలు వేడిగా ఉన్న ప్రాంతాల్లో ఉండే జీవులకు దాన్ని తట్టుకునేందుకు వీలైన చర్మం, రూపం లాంటివి ఏర్పడతాయి. అందులో భాగంగానే మెలనిన్‌ వర్ణద్రవ్యం వాటి చర్మంలో పెరుగుతుంది. దీని వల్లనే ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, మధ్య అమెరికాలాంటి ఉష్ణప్రదేశాల్లో మనుషులు నల్లగా లేదా చామనఛాయగా ఉంటారు. చైనా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వేడి తక్కువ కాబట్టి మెలనిన్‌ తక్కువగా ఏర్పడి వారు తెల్లగా ఉంటారు. ఇలాగే రకరకాల భౌతిక స్థితిగతులు శరీరపు ఎత్తును, ముఖం నిర్మాణాన్ని నిర్దేశిస్తాయి.
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఎస్కలేటర్ అంటే ఏమిటి ? , Wha is Escalator




మనం రైల్వేస్టేషన్లో, విమానాశ్రయంలో, పెద్ద పెద్ద షాప్ లలో ఇంకా ఎన్నోచోట్ల మనం మెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టపడతాం. రైల్వే స్టేషన్ లో కొంతమందైతే ఆ మెట్లు ఎక్కలేక ట్రాక్ లను దాటుతూ ఉంటారు. అలా ట్రాక్ దాటుతున్నప్పుడు ఎంతోమంది తమ ప్రాణాలను వదిలేసేవారిగా ఉంటారు. కానీ ఇప్పుడు పెద్దపెద్ద రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్‌ను పెట్టి ఆ శ్రమ తగ్గించారు. దీని వలన అనేకమందికి మెట్లేక్కే శ్రమ తగ్గింది. ఎస్కలేటర్ అంటే ఏమిటి, ఎస్కలేటర్ ఎలా పని చేస్తుంది, దానిని ఎవరు కనిపెట్టారు, అది ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనం ఎక్కే అవసరం లేకుండా మెట్లే రయ్యి మంటూ పైకి వెళుతూ మనల్ను మోసుకెళ్ళే 'ఎస్కలేటర్' ను 1881 లో కనిపెట్టారు. ఆ కనిపెట్టిన వ్యక్తి పేరు 'జెస్ డబ్ల్యు రెనో'. ఇతను ఓడ కళాసి. పెద్ద పెద్ద స్తంభాలు, నిచ్చెనలు చకచకా ఎక్కి దిగే జెస్‌కు అసలు మనం కదలకుండా మెట్లే పైకి కిందకి కదులుతూంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. వెంటనే కష్టపడి, ఏళ్ళతరబడి ఆలోచించి 'ఎస్కలేటర్' ప్రాథమిక యంత్రవ్యవస్థకు అంకురార్పణ చేసారు . 'ఎస్కలేటర్' అనే మాట 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఎగ్జిబిషన్ లో వచ్చింది. ప్రపంచంలోనే 'లిఫ్టు' లు తయారు చేయడంలో ప్రసిద్ది చెందిన 'ఓటిస్' సంస్థ తొలి ఆధునిక ఎస్కలేటర్‌ను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది. ఎస్కలేటర్ పుట్టి వందేళ్ళు దాటిపోతున్నా ఇప్పుడిప్పుడే భారత దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్థ కనిపిస్తుంది. మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కినప్పుడు కలిగే ధ్రిల్లు చెప్పనలవికానిది.
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మంచు కురిసేదెలా? , Snow falls - How?





ప్రశ్న: మంచు ఎందుకు కురుస్తుంది?

జవాబు: చలికాలంలో రాత్రి వేళల్లో భూమి ఎక్కువగా ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి క్రమేణా వాతావరణం పై పొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి దుమ్ము, ధూళి వంటి అతి చిన్న కణాలను ఆవరించి గాలిలో మంచు ఏర్పడుతుంది. దీనిని పొగమంచు అంటారు. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడడంతో పొగమంచు కురుస్తున్నట్లుగా కనబడుతుంది. చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడడం వల్ల నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉండే చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డిపరకలను తాకి వాటిపై ఘనీభవిస్తుంది. అవే మెరిసే మంచు బిందువులు

  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, June 18, 2010

వర్షం వచ్చేముందు మేఘాలు నల్లగా ఉంటాయి ఎందుకు?, Clouds are Black before raining Why?





ప్ర : వర్షం వచ్చేముందు మేఘాలు నల్లగా ఉంటాయి ఎందుకు?,
జవాబు1 : వర్షం వచ్చే ముందు నల్లని మెఘాలు కమ్ముకుంటాయి . అంతకు ముందు అవి నీలం , తెలుపు రంగుల్లో ఉంతాయి .ఆ నల్లని మేఘాలను శాస్త్రపరిభాషలో " కుమ్యులో నింబస్ " మేఘాలలు అంటారు . ఆ మేఘాలలొ దట్టంగా పేరుకున్న నీటి బిందువులు , మంచు అందుకు కారణము ,. ఆ దట్టమైన పొరవలన ఆ మేఘాలలో నుండి కాంతి కి్రణాలు ప్రయాణం చేయలేవు . ఫలితంగా మనకు నల్లగా కనిపిస్తాయి . ధూళిరేణువులు , కాలుష్యకారకాల వల్ల కుడా నల్లరంగు వస్తుంది .

జవాబు 2: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక వస్తువుపై కాంతి కిరణాలు పడినపుడు ఏమవుతుందోననే విషయాన్ని చూద్దాం. ఏదైనా వస్తువుపై కాంతికిరణాలు పడినపుడు కాంతిలోని కొంతభాగం వెనుదిరిగి వస్తుంది. దీన్ని పరావర్తనం అంటారు. కాంతిలోని కొంత భాగాన్ని వస్తువు శోషిస్తుంది. కొంత భాగం వస్తువులోంచి పయనించి అవతలవైపు నుంచి బయటకు వస్తుంది. అద్దం లాంటి తళతళమెరిసే వస్తువుపై కాంతి పడినపుడు, అందులోని ఎక్కువ శాతం పరావర్తనం చెందుతుంది. నల్లగా ఉండే వస్తువుపై కాంతిపడితే ఎక్కువ కాంతిని అదిశోషిస్తుంది. గాజు లాంటి పారదర్శక పదార్థంపై కాంతి పడితే, చాలా వరకు కాంతి అందులో నుంచి బయటకు వస్తుంది.

ఇపుడు మన ప్రశ్న విషయానికి వస్తే, సూర్యరశ్మికి భూమిపై ఉండే నీరు ఆవిరి అవడం వల్ల మేఘాలు ఏర్పడతాయని మనందరికీ తెలుసు. తక్కువ స్థలంలో ఎక్కువ నీటి బిందువులు గుమికూడి ఉన్న మేఘం ఎక్కువ కాంతిని శోషించుకుంటుంది. అందుకే ఆ మేఘం నల్లగా కనిపిస్తుంది. ఎక్కువ నీటి బిందువులు ఉన్న ఆ మేఘం త్వరగా వర్షిస్తుంది. కొన్ని నీటి బిందువులు, చాలా వరకు చిన్న మంచు స్ఫటికాలు ఉండే మేఘంపై పడే కాంతి చాలా వరకు పరావర్తనం చెందడం వల్ల అది తెల్లగా కనిపిస్తుంది. ఈ మేఘాల్లోనే పారదర్శకమైన మంచు స్ఫటికాలు ఉంటే వాటి గుండా కాంతి కిరణాలు చొచ్చుకుపోయి ఆ మేఘాలు పారదర్శకంగా కనిపిస్తాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, June 13, 2010

జుట్టు మొలిచేదెలా?, How do hair grow?





ప్రశ్న:
తల వెంట్రుకలు ఎలా రూపొందుతాయి?

జవాబు:
పరిణామ క్రమంలో జంతువులు ఏర్పడ్డాక అవి పరిసరాలలోని ఉష్ణం, శీతలం, తేమ, సూక్ష్మజీవుల తాకిడి లాంటి పరిస్థితుల నుంచి రక్షణ పొందడానికి చర్మం మీద బొచ్చు ఏర్పడ్డం ప్రారంభమైంది. చర్మంలో ప్రధానంగా బయటి పొర (exodermis), లోపలి పొర (endodermis) అనే రెండు పొరలుంటాయని చదువుకుని ఉంటారు. చర్మం లోపలి పొర పలుచని కండరాలతో కూడి ఉంటుంది. ఇందులో పాదుల్లాంటి గుళికలు ఉంటాయి. వీటినే రోమస్థావరాలు (hair follicles) అంటారు. ఎలాగైతే వరి, జొన్నలాంటి మొక్కలు నేలపాదుల్లో గట్టిగా వేళ్లూనికుని పైకి ఎదుగుతాయో అలాగే ఈ కేశ స్థావరాల్లోంచి వెంట్రుకలు మొలిచి చర్మం బయటి పొర దాటి పైకి వస్తాయి. వెంట్రుకల్లో ఉండేది ఓ విధమైన ప్రొటీన్లు. వీటిని రసాయనికంగా ఆల్ఫా కెరోటీన్లు అంటారు. గంధకం కూడా ఓ అంశంగాగల సిస్టీన్‌ అనే ఆమైనో ఆమ్లం ప్రధానంగా ఉండే ప్రొటీన్లు ఇవి. ఈ ప్రొటీన్లతో పాటు మెలనిన్‌ అనే వర్ణ రేణువులు (pigments) విస్తారంగా ఉంటే ఆ వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అవి లేనివి తెల్లగా ఉంటాయి.
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

Saturday, June 12, 2010

రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు మెరుస్తాయెందుకు,Cat&Tiger eyes glow on light-why?




రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు లాంటి జంతువుల కళ్ళు మెరుస్తాయెందుకు అనే విషయం మీకు తెలుసా ! తెలియకపోతో ఇది ఓక సారి చదవండి.

పిల్లి, పులి లాంటి జంతువుల కను గుడ్డు పై భాగంలో టాపిటం ల్యూసిడం అనే ప్రత్యేకమైన సన్నని పొర ఉంటుంది ఈ పొరకు కాంతిని పరావర్తనం చేసే భౌతిక ధర్మం ఉంది. కొంతమేరకు పారదర్శకంగా ఉండే ఈ పొర కుంభాకారదర్పణం ఆకారంలో ఉంటుంది. కుంభాకార దర్పణంపై కాంతి కిరణాలు పడినప్పుడూ అవి పరావర్తనం చెంది మన కంటిని చేరుతాయి. ఆ కిరణాల వల్లనే మనకు ఆయా జంతువుల కళ్ళూ మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ పొర వలనే ఆ జంతువులు చీకట్లో కూడా పరిసరాలను చూడగలుగుతాయి.

రాత్రివేళ బస్సు లో వెళుతున్నప్పుడు ఆ బస్సు లైట్ కాంతిలో జంతువుల కళ్ళు విభిన్న రంగుల్లో మెరుస్తూ కనిపిస్తాయి .. పిల్లి కళ్ళు పచ్చగా , పశువుల కళ్ళు ఎర్రగా మెరవడం గమనించే ఉంటారు . ఇదంతా ఆయా జీవుల కంటి నిర్మాణం లో నున్న తేడాలు , కంటి లోపల కాంతిని గ్రహించే రెటీనాలో ఉండే స్పటికపు పొర కాంతిని ప్రతిఫలించే లక్షణము వలన , రెటీనాకు సరఫరా అయ్యే రక్తం ఈ స్పిటిక నిర్మాణములో వున్న తేడాలను బట్టి ఒక్కొక్క జీవి కళ్ళు ఒక్కొక్క రంగును బయటకు ప్రతిఫలిస్తాయి . . ఆ రంగులొ ఆ జీవుల కళ్ళు మెరుస్తూ కనిపిస్తాయి .

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆవలింత అంటుకుంటుందా?, Yawning is Contagious?




ప్రశ్న: ఒకరికి ఆవులింత వస్తే పక్కవారికి కూడా వస్తుంది కదా? ఇది అంటు వ్యాధా?

జవాబు: ఆవులింత అంటువ్యాధి కాదు కానీ అది అంటుకోవడం మాత్రం నిజమనే అనుకోవాలి. తల్లి గర్భంలో ఉండే శిశువు కూడా ఆవులిస్తుంది. ఎవరైనా అలిసిపోయినప్పుడో, బోరుగా ఉన్నప్పుడో ఆవులిస్తారు. ఒకోసారి దేహంలో ఉత్సాహం కలిగినప్పుడు కూడా ఇవి వస్తాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయో ఇప్పటికీ తెలియని రహస్యమే. శరీరంలో ఆక్సిజన్‌ పాలు తగ్గినప్పుడు ఆవులింత వస్తుందనే భావన నిజం కాదని తాజా ప్రయోగాలు నిరూపించాయి. ఎవరైనా ఆవులిస్తే వారి చుట్టుపక్కల వారిలో సగం మందైనా ఆ పని చేస్తారు. ఎదుటివారి పట్ల సానుభూతి చూపే స్వభావం కలవారు ఆవులింతల ప్రభావానికి సులభంగా లోనవుతారని చెబుతారు.
  •  ---------------------------------------------------------------
Yawning and relation-ఆవలింతల అనుబంధం ఎలా?

ప్రశ్న: మనం ఆవలిస్తే మనకి దగ్గరగా ఉన్నవాళ్లకి కూడా ఆవలింత వస్తుంది. ఎందుకు?

జవాబు: ప్రకృతి పట్ల స్పందించి తదనుగుణంగా ప్రవర్తనలు కలగడం జీవులకున్న ఓ ప్రధాన లక్షణం. ముఖ్యంగా నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన జీవులు, చూసే దృశ్యాలు, ఉష్ణోగ్రత వ్యత్యాసాలకు అనుకూలంగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఒకరు ఆవలించడం చూసిన వారికి కూడా అదే స్పందన కలగడం కూడా అలాంటిదే. ఇలాంటి ప్రతిస్పందనల్ని అసంకల్పిత ప్రతీకార చర్యలు (involuntary reactions) అంటారు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎదురుగా మంచి భోజన పదార్థాలను చూస్తే నోరూరడం, ఏదైనా భయానక దృశ్యం చూస్తే ఆందోళన కలగడం లాంటివి కూడా ఇలాంటివే. సామాజిక జీవనంతో ముడిపడి ఉన్న కొన్ని స్పందనలు ఎదురుగా ఉన్న దృశ్యాలకు ప్రతికూలంగానో, అనుకూలంగానో కలుగుతాయి. మనం ఆవలిస్తే ఎదుటివారు ఆవలించడాన్ని ప్రేరేపిత అసంకల్పిత ప్రతీకార చర్య (induced involutary reaction) అంటారు. అయితే ప్రతిసారీ ఇలా జరుగుతుందని అనుకోనక్కర్లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నత్తిగా కొందరు మాట్లాడతారు ఎందువల్ల?, some Stemer Why?




నత్తి

కొందరు మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడతారు ఎందువల్ల? దానికి కారణం ఏమిటి? తెలుసుకుందాం.

నత్తికి కారణం పుట్టుకతోనే ఆ వ్యక్తి మెదడు నిర్మాణంలో జరిగిన లోపం కావచ్చు. లేదా పసితనంలొ అతితీవ్రమైన ఒత్తిడికి గురి చేసిన సంఘటన కావచ్చు. ఈ అస్వస్థత చిన్నతనంలో రెండు, మూడు సంవత్సరాల వయసు మధ్య ప్రారంభమవుతుంది. ప్రస్తుత శాస్త్రీయ సిద్దాంతాల ప్రకారం నత్తికి కారణం అనేకమైన జన్యుసంబంధమైన లేక పరిసరాల ప్రభావమే. నత్తికి కారణం మాట్లాడే భాషపై నైపుణ్య, లేకపోవడమా లేక వ్యక్తిత్వం, స్వభావాల్లో మార్పు రావడమూ అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. నత్తి ఉన్నవారు కొన్ని అక్షరాలను కానీ, పదాలను కానీ గబుక్కున పలకలేక కష్టపడి ప్రయత్నం చేసి మాట్లాడతారు. వీరిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నామనే సిగ్గుతో పాటు, ఎవరైనా వెటకారం చేయడం వల్ల ఆత్మన్యూనతా భావం పెరిగి నత్తి సమస్య మరింత పెరుగుతుంది. మాట్లాడే మాటల నిర్మాణం మార్చుకునేటట్లు శిక్షణ ఇచ్చే వైద్యుల, నిపుణుల సూచనల ద్వారా, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కొంతమేరకు నత్తిని తగ్గించవచ్చు. కానీ పూర్తిగా నివారించడం ఒక శారీరక రుగ్మత మాత్రమే. అలా మాట్లాడేవారిని హేళన చేయడం అవివేకం.
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Longest RailwayBridge in India?, పొడవైన బ్రిడ్జ్ ఇండియాలో ఏది ?




350 కోట్ల రూపాయలు... నాలుగున్నర కిలోమీటర్లు... అత్యాధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ.. దేశంలోనే పెద్ద రైల్వే వంతెన... అదే కేరళ వల్లార్‌పాదం బ్రిడ్జి!

మన దేశంలో నదులమీద, చెరువుల మీద రైల్వే వంతెనలు ఎన్నో కడుతుంటారు. అన్నింటిలోకీ పొడవైనదిగా కొత్త రికార్డును ఒక వంతెన పొందబోతోంది. అదే కేరళలోని కోచి దగ్గర నిర్మించిన వల్లార్‌పాదం రైల్వే వంతెన. ఇక నుంచి ఇదే 'దేశంలోకెల్లా పొడవైన రైల్వే వంతెన' కానుంది. దీని పొడవు 4.62 కిలోమీటర్లు. మరి ఇన్నాళ్లూ ఈ రికార్డు దేనిదో తెలుసా? బీహార్‌లోని సోన్‌నదిపై ఉన్న 'నెహ్రూ సేతు' అనే వంతెనది. దీని పొడవు 3.06 కిలోమీటర్లు.

ఈ కొత్త వంతెన నిర్మాణానికి 350 కోట్ల రూపాయలు ఖర్చయింది. కోచిలోని వెంబనాడ్‌ సరస్సుపై ఇడపల్లి నుంచి వల్లార్‌పాదం దాకా దీన్ని నిర్మించారు. ఈ వంతెనపై అత్యాధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనికి మరో రికార్డు కూడా ఉంది. అదేంటో తెలుసా? అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తయిన విశేషం కూడా దీనిదే. కేవలం ఒకటిన్నరేళ్లలో దీన్ని పూర్తి చేశారు. వంతెన నిర్మాణానికి వాడిన సిమెంటు మొత్తం 36 వేల టన్నులు.

మీకు తెలుసా!
* ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన ఏది? బిన్హాయ్‌ మాస్‌ ట్రాన్సిట్‌. చైనాలోని టియాంజిన్‌ నుంచి టెడా వరకున్న దీని పొడవు 39 కిలోమీటర్లు.

* మరి ఎత్తయిన రైల్వే వంతెనో? 650 అడుగులతో ప్రపచంలోనే అతి ఎత్త్తెన వంతెనేమో సెర్బియాలో ఉన్న 'ది మాలా రిజెకా వియాడక్ట్‌'.

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, June 10, 2010

కర్పూరం గొప్పేంటి? , Camphor Important-what?




కర్పూరపు బిళ్ళలను నీళ్ళలో ఉంచి వెలిగించినా వెలుగుతాయి. ఎందువల్ల? అందులో ఏముంటాయి. మనం తెలుసుకుందామా!

కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావడం వల్ల అది నీటిపై గాలిలో ఉండడం వల్ల గాలిలోని ఆక్సిజన్ సహాయంతో ఇంధనం లాగా కర్పూరం మండగలదు. కర్పూరానికి ఉష్ణవాహకత కూడా బాగా తక్కువ కాబట్టి నీటి చల్లదనం కర్పూరపు ముద్దపైన వెలుగుతున్న జ్వాలను చల్లబరచి అది ఆరిపోయేలా చేయలేదు.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, June 09, 2010

చెట్టు నీడ చల్లనేల , Shadow of trees is cool Why?




గోడనీడ వేడిగా ఉంటుంది. కానీ చేట్టు నీడ చల్లగా ఉంటుంది. ఈ తేడా ఏమిటి. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం.....

గోడ ఓ నిర్జీవ ఘన పదార్థం. దృశ్యకాంతి ఏమాత్రం గోడలోంచి దూసుకుపోదు. కాబట్టి గోడకు ఇవతల వైపు నీడ ఏర్పడుతుంది. అయితే సూర్యకాంతిలో దృశ్యకాంతితో పాటు, అధిక శక్తిమంతమైన అతినీల లోహిత కాంతి, తక్కువ శక్తిమంతమైనదే అయినా ఉష్ణభాగం అధికంగా ఉన్న పరారుణ కాంతి కూడా ఉంటాయి. గోడ మీద పడిన కాంతిలో కొంత భాగం ఆవలి వైపున పరానవర్తనం చెందినా, మిగతా కాంతిని గోడ పదార్థం శోషించుకుంటుంది. ఇలా కాంతిశక్తి గోడలో ఉష్ణశక్తిగా మారి గోడస్ నుంచి అన్ని వైపులకు ఉష్ణవాహనం ద్వారా ప్రసరిస్తుంది. అందులో కొంత భాగం గోడకు ఇవతలివైపు కూడా వస్తుంది. దీని వల్లనే మనకు గోడ నీడలో ఉక్కపోసినట్లుగా అనిపిస్తుంది. ఇక చెట్టు ఒక జీవి. తన ఉష్ణోగ్రతను క్రమబద్దికరించుకునే యంత్రాంగం చెట్ల ఆకులకు ఉంది. ఆకుపై పడిన కాంతి కొంత పరావర్తనమైనా కొంత భాగం కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడుతుంది. మిగిలిన కాంతి ఆకు కణాల ఉష్ణోగ్రతను పెంచక ముందే ఆకు భాష్పోత్సేకం ద్వారా నీటి ఆవిరిని విడుదల చేస్తూ కాంతిశక్తిని తటస్థపరుస్తుంది. ఆ విధంగా తమ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుకునే వేలాది ఆకులను తాకి చల్లబడిన గాలి ఆ చెట్టు నీడన ఉన్న మనల్ని తాకగానే హాయిగా అనిపిస్తుంది.

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, June 07, 2010

రాష్ట్రపతి భవనం రాచఠీవి సంగతులేమిటి?, Rastrapathi Bhavan Points





340 గదులు... 275 ఎకరాలు... ప్రపంచ దేశాధ్యక్ష భవనాల్లో అతి పెద్దది... అదే మన రాష్ట్రపతి భవన్‌!

మన దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠమని తెలుసు. మరి రాష్ట్రపతి నివాసం గురించిన విశేషాలు తెలుసా? 275 ఎకరాల ప్రాంగణంలో నాలుగు అంతస్తుల భవనంగా 340 గదులతో విశాలంగా నిర్మించిన ఈ భవనానికి ఒక రికార్డుంది. అదేంటంటే ప్రపంచ దేశాధినేతలు ఉంటున్న భవనాలన్నింటిలో అతి పెద్దది ఇదే. ఇంతకీ ఈ భవనాన్ని ఎందుకు కట్టారో తెలుసా? బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ నివాసం కోసం. ఎందుకంటే 1911కి ముందు మన దేశ రాజధాని కలకత్తాలో ఉండేది. దాన్ని ఢిల్లీకి మార్చాలని కింగ్‌ జార్జి-5 నిర్ణయించినపుడు అప్పటి నిర్మాణాల్లో ప్రముఖమైనదిగా దీన్ని కట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1950లో దీన్ని రాష్ట్రపతి నివాసంగా ప్రకటించి 'రాష్ట్రపతి భవన్‌' అని పేరు పెట్టారు. అంతకు ముందు 'వైస్‌రాయ్‌ హౌస్‌' అని పిలిచేవారు.
దీని నిర్మాణం 1912లో ప్రారంభమైంది. నాలుగేళ్లలో కట్టాలనుకున్నా పూర్తవ్వడానికి 17 ఏళ్లు పట్టింది. ఈ భవన నిర్మాణానికి అప్పట్లోనే సుమారు కోటి రూపాయలైంది. సుమారు రెండు లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ముఖ్య ఆకర్షణ దర్బార్‌ హాల్‌. దీంట్లోనే ప్రధాన మంత్రితో సహా, మంత్రి మండలి ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్రపతి చేయిస్తారు. ఈ హాలుకి మధ్యలో 2 టన్నుల బరువుండే పెద్ద షాండ్లియర్‌ (దీపతోరణం) ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది.

ఇక ఈ భవనం ఉండే ప్రాంగణంలోని మొఘల్‌ గార్డెన్స్‌ గురించి వినే ఉంటారు. దాదాపు 13 ఎకరాల్లో ఉన్న ఈ తోటలో తామర పువ్వుల ఆకారంలో ఉన్న అందమైన ఆరు ఫౌంటేన్లు ఉన్నాయి. వందల రకాల రోజాపూలతో పాటు, ఎన్నో పూల మొక్కలతో కళకళలాడే మొఘల్‌ గార్డెన్‌ నిర్వహణకు 400 మందికి పైగా తోటమాలులు పనిచేస్తారు. ఈ గార్డెన్‌లోకి సందర్శకులను ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అనుమతిస్తారు. దీంతో పాటు టెన్నిస్‌కోర్టు, పోలోగ్రౌండ్‌, గోల్ఫ్‌కోర్స్‌, క్రికెట్‌ మైదానం కూడా ఉన్నాయి.


  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

భూమధ్యరేఖ వద్ద ఎక్కువ వేడి ఉంటుంది. ఎందుకు?, Hot at Earths Equator-Why?




భూమధ్యరేఖ వద్ద వేడి ఎక్కువ ... దీని కారణం ఏమిటి?

భూమికి సూర్యుడి నుండి కాంతి, ఉష్ణశక్తులు లభిస్తాయి. భూమిపై ఉష్ణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని చోట్ల తక్కువ వేడి ఉంటుంది. భూమి గోళాకారంలో ఉండి, ధ్రువాల వద్ద కొంత మేరకు బల్లపరుపుగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ కోణాలలో పడుతూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడితే, దానికి ఉత్తర దక్షిణ దిశల్లో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది.

ఈ విషయం సరిగ్గా అర్థం కావడానికి చిన్న ప్రయోగం చేయవచ్చు. ఒక పెద్ద గ్లోబు తీసుకొని దాని మధ్య మధ్య భాగంలో టార్చిలైటు వేశామనుకోండి దాని నుంచి వచ్చిన కాంతి గుండ్రంగా కేంద్రీకృతమవుతుంది. అదే టార్చిని కొద్దిగా వంచి గ్లోబుపై వేశామనుకోండి అది పల్చగా ఎక్కువ భాగం విస్తరిస్తుంది. అందుకే ఆ భాగాల్లో వేడి తక్కువగా ఉంటుందన్నమాట. కిరణాలు ఏటవాలుగా పడితే వేడి తక్కువగా ఎందుకుంటుందో చూద్దాం. భూమి పై ఏటవాలుగా పడే సూర్యకిరణాలు వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వుంటుంది. వాతావరణంలోని గాలి, దుమ్ము కణాలు, నీటి ఆవిరి తదితర పదార్థాలు కిరణాలలోని అధిక భాగం వేడిని గ్రహించడం జరుగుతుంది. అందువల్ల ఆ సూర్యకిరణాలు, ఆయా ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించవు. అదే భూమధ్య రేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి కాబట్టి వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందువల్ల అవి కోల్పోయే ఉష్ణం కూడా తక్కువగా ఉంటుంది. అందుకనే ఆ సూర్యకిరణాలు భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించగలుగుతాయి.

కేవలం సూర్యకిరణాలే కాకుండా ఆయా ప్రాంతాల్లో నీటి విస్తరణ, సముద్ర మట్టం నుంచి ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది, సముద్ర తీరానికే ఎంత దూరంలో ఉందనే అంశాలపైన కూడా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది.
  •  

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నెగిటివ్‌లో తేడాలేల?, Differences in Negative film-Why?




ప్రశ్న: కెమేరాతో ఫొటో తీసిన తర్వాత డెవలప్‌ చేసి నెగిటివ్‌ని చూస్తే ఫొటోలో నల్లని ప్రాంతాలు తెల్లగా, తెల్లనివి నల్లగా ఉంటాయెందుకు?

జవాబు: నలుపు తెలుపు ఫొటోల్లో ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. నలుపు తెలుపు ఫిల్మ్‌ మీద సిల్వర్‌ బ్రొమైడు లేదా సిల్వర్‌ అయొడైడ్‌ అనే రసాయన పూత ఉంటుంది. కెమేరాను క్లిక్‌ చేసినప్పుడు వస్తువు నుంచి వచ్చే కాంతి కెమేరా కటకం ద్వారా ఫిల్మ్‌ మీద పడుతుంది. దాని మీద ఉండే పూతకి కాంతి సమక్షంలో వియోగం (photo dissociation) చెందే లక్షణం ఉంది. అంటే కాంతి ఎక్కువగా పడిన ప్రాంతం పారదర్శకంగా మారుతుంది. ఇక డెవలప్‌ చేయడమంటే ఫిల్మ్‌లోని పూతపై జరిగిన రసాయనిక చర్యను తొలగించడమే అనుకోవచ్చు. అప్పుడు కాంతి ఎక్కువగా పడిన ప్రాంతం నల్లగా మారుతుంది. మన శరీరం లేదా వస్తువుల మీద తెల్లని భాగాలు (పళ్లు, కంటిపాప, తెల్ల దుస్తులు, గోడలు...) నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందుతుంది కాబట్టి ఆయా ప్రాంతాలు నెగెటివ్‌లో నల్లగా కనిపిస్తాయి. అలాగే శరీరం లేదా వస్తువుల మీద ఉండే నల్లని భాగాలు (తలవెంట్రుకలు, నల్లని దుస్తులు, కనుగుడ్లు, గొడుగులు...) తమ మీద పడిన కాంతిని ఎక్కువగా శోషించుకుని తక్కువ కాంతిని పరావర్తనం చేస్తాయి. అలా తక్కువ కాంతి పడిన భాగాలు నెగెటివ్‌లో తెల్లగా కనిపిస్తాయి.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, June 05, 2010

లేత ఆకుల రంగు ఎరుపు--ఎందుకు? , Tender Leaves are Red -Why?





మామిడి, వేప, గులాబి లాంటి చెట్ల చిగుళ్ళు లేత గులాబి రంగులో ఉండడం మనకు తెలుసు. క్రమేపీ అవే ఆకుపచ్చ రంగులోకి మారుతుంటాయి. దీనికి కారణమేంటో తెలుసా? ఆకుల్లో ఉండే రకరకాల పదార్థాలే!

చెట్ల ఆకుల్లోని ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఉదాహరణకు క్లోరోఫిల్ అనే పదార్థానికి ఆకుపచ్చ రంగు, కెరోటిన్‌కి పసుపుపచ్చ రంగు ఉంటాయి. ఒక ఆకులో రంగు రంగుల పదార్థాలు ఉండడంవల్ల అది ఆయా రంగుల మిశ్రమం రంగుని వెదజల్లుతుంది. ఆకుల్లో చాలా వరకు క్లోరోఫిల్, కెరోటిన్ పాళ్ళు ఎక్కువగా ఉండడంవల్ల అవి ఆకుపచ్చగా కనబడతాయి. మరి కొత్తగా ఏర్పడిన చిగురుటాకుల్లో ఏ పదార్థం ఉంటుందో తెలుసా? ఎండోసైనిన్ అనే ఎరుపురంగు గల పదార్థం. అదీ ఎక్కువగా శాతంలో ఉంటుంది. ఆ పదార్థం తక్కువ శాతంలో ఉన్న ఇతర పదార్థాలతో కలవడంతో ఆకులు లేతగా ఉన్నప్పుడు లేత ఎరుపు, లేత గులాబీ రంగులో ఉంటాయి. ఆకులు ముదిరేకొద్దీ క్లోరోఫిల్, కెరోటిన్ పదార్థాల శాతం ఎక్కువ కావడం, దాంతో అవి ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతాయి. తర్వాత రోజుల్లో ఆకులు మందంగా పెరిగి, కెరోటిన్ పదార్థం శాతం ఎక్కువ అవడంతో పసుపుపచ్చగా మారి, అంటే పండుటాకులై ఎండి చెట్ల నుండి రాలిపోతాయి.

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.