Tuesday, November 30, 2010

బూటు సంగతు లేమిటి ?,History of boot(footwear)




రోజూ బూట్లు తొడుక్కుంటారుగా? మరి 5 వేల ఏళ్లనాటి బూటు గురించి తెలుసా?ఈ మధ్యే బయటపడి బోలెడు సంగతులు చెబుతోంది.

మీరు వాడి పారేసిన బూటు మళ్లీ కనిపించదు. ఒకవేళ కనిపించినా విశేషం ఏమీ ఉండదు. కానీ ఎప్పుడో 5500 ఏళ్ల కిత్రం అప్పటి పురాతన మానవుడు తొడుక్కున్న ఒక బూటు ఇప్పుడు కనిపించి సంచలనం సృష్టించింది. ఇది క్రీస్తుపూర్వం 3500 కాలం నాటిది. అంటే ఈజిప్టు గ్రేట్‌ పిరమిడ్‌కన్నా పాతదన్నమాట. ప్రపంచంలోనే అతి పురాతన తోలు బూటు కూడా ఇదే.

యూరప్‌ ఖండంలోని ఆర్మీనీయాలో ఓ గుహలో దీన్ని ఈ మధ్యే కనుగొన్నారు. ఇన్నాళ్త్లెనా ఎందుకు పాడైపోలేదో తెలుసా? గుహలోని చల్లటి వాతారవణానికి తోడు, వేల ఏళ్లుగా గొర్రె విసర్జకం దీనిపై కప్పుకుపోయి ఉంది. తోలు బూట్లలో పాతది ఇదే అయినప్పటికీ దీని కన్నా పాత బూటు 1991లో బయటపడింది. అది ఏకంగా 5300 ఏళ్ల క్రితం జీవించిన ఐస్‌మాన్‌దిగా గుర్తించారు. అయితే అది తోలుతో తయారైంది కాదు.

మీకు తెలుసా?
* ప్రాచీన ఈజిప్షియన్లు పాపిరస్‌ అనే ఆకులనే బూట్లుగా మలచుకునేవారు.
* 19వ శతాబ్దం చివరి వరకూ ఎడమ, కుడి కాళ్ల తేడాలేకుండా బూట్ల జతను ఒకేరకంగా తయారుచేసేవారు.
* 9, 10వ శతాబ్దాల్లో యూరప్‌ రాజులు కలపతో చేసిన బూట్లను ధరించేవారు.
* కాలిఫోర్నియాకు చెందిన డార్లీన్‌ ఫ్లిన్‌ అనే మహిళ బూట్ల ఆకారంలో ఉన్న 11వేల వస్తువులను సేకరించింది.
* ప్రపంచంలోనే అతి పెద్ద బూటును 2002లో మారికీనా నగరంలో తయారుచేశారు. 5.29 మీటర్ల పొడవు, 2.37 మీటర్ల వెడల్పు, 1.83 మీటర్ల ఎత్తు ఉందిది. అంటే ఇది 125 అడుగుల ఎత్తున్న మనిషికి సరిపోతుందన్నమాట.
* హైదరాబాద్‌ నిజాం యువరాజు నిజాం సికందర్‌ జా ఎంత ఖరీదైన బూట్లను ధరించాడో తెలుసా? వజ్రాలతో పొదిగిన వీటి ధర సుమారు 6 కోట్ల రూపాయలకు కుపైమాటే.
* ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుని భార్య ఇమ్లేడా మాక్రోస్‌ ఏకంగా 3,400 బూట్లను సేకరించి 'ప్రపంచంలోనే ఎక్కువ బూట్లు సేకరించిన మహిళ'గా గిన్నిస్‌ రికార్డు సాధించింది.
* పదిగంటల్లోపు 20 జతల బూట్లను తయారు చేసి కొలంబియాకి చెందిన అలెంగ్జాండర్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు.
* 10,512 బూట్లతో 8,700 అడుగుల షూ గొలుసును 2008లో వాషింగ్టన్‌లో చేశారు. 1.65 మైళ్ల పొడవున్న ఇది 'ప్రపంచంలోనే అతిపెద్ద బూటుగొలుసు'గా గిన్నిస్‌లోకి ఎక్కింది.

-------------------------------
మూలము : ఈనాడు దిన పత్రిక .
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, November 29, 2010

మరి కోతులింకా ఉన్నాయేం?, Why do monkeys still existing?




ప్రశ్న: కోతి నుంచి మానవుడు ఉద్భవిస్తే, మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు అంతరించిపోలేదు?

బి. శశాంక్‌, సాయిరాజ్‌, భీమగల్‌

జవాబు: మానవుడు కోతి నుంచి పుట్టాడంటే దానర్థం, కోతుల్లాంటి జీవులు పరిమాణం(evolution) చెందగా మానవజాతి ఆవిర్భవించిందని మాత్రమే. ఇది గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడం లాంటి జీవిత చక్రం కాదు. మొక్క కాండం నుంచి కొమ్మలు వస్తాయి కానీ కాండం అంతరించిపోదు కదా? జీవన అవసరాలను అందిపుచ్చుకోవడంలో కోతులకు చెట్లు ఎక్కడం, కొమ్మల్ని పట్టుకుని వేలాడుతూ పళ్లు తినడం, కొన్ని పరికరాలను సులువుగా వాడగలగడం లాంటి నైపుణ్యాలు తరాల తరబడిన పరిణామంలో క్రమేణా అలవడ్డాయి. అవే చింపాంజీలు, ఉరాంగుటాన్లు, గొరిల్లాలు లాంటి తోకలేని కోతిగా (great apes) మారాయి. వాటి నుంచి క్రమేణా మానవజాతి పరిణామం చెందింది. మనకు తల్లిదండ్రుల పోలికలు ఉన్నా వాళ్లు కూడా మనతోనే ఉంటారు కదా. అయితే తల్లిదండ్రుల కన్నా మనం పరిమాణాత్మకంగా కొంత మెరుగ్గా ఉంటాము. ఏ జీవజాతి ప్రకృతిలోని ఒడిదుడుకుల్ని అధిగమించి నాలుగు కాలాల పాటు నిలదొక్కుకోగలదో అదే మనుగడ సాగిస్తుంది. తట్టుకోలేని జాతులు అంతరించిపోతాయి. శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌ చెప్పినట్టు ప్రకృతివరణమే(natural selection) జాతుల ఆవిర్భావానికి (origin of species)కి ఆస్కారం కలిగించింది.

ప్రొ్హ్హ ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

శ్రీకృష్ణదేవరాయల కొలువులో మహాకవులు ఎవరు?, Who were the Poets of SriKrishnadevaraya


  • SriKrishnadevarayalu with wives-తిరుమల వెంకన్న ఆలయం లో సతీసమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు
పిల్లలూ ... శ్రీ కృష్ణదేవరాయల కొలువులోని మహాకవులను అష్టదిగ్గజాలని అంటారు . అష్ట = 8.

  1. అల్లసాని పెద్దన : మనుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించాడు . ఇతనికి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఉంది .
  2. నంది తిమ్మన : ఈయనను ముక్కుతిమ్మన అని కూడా అంటారు . పారిజాతాపహరణం అనే గ్రంధాన్ని రచించాడు .
  3. పింగళి సూరన : ఇతడు రాఘవ పాండవీయము అను ద్వర్ధి(శ్లేష)కావ్యమును , కళాపూర్ణోదయము , ప్రభావతీ ప్రద్యుమ్నము అనే గ్రంధాలు రచించాడు .
  4. మాదయగారి మల్లన : ఇతడు రజశేఖర చరిత్ర అనే గ్రంధాని రచించాడు .
  5. ధూర్జటి : శ్రీకాళహస్తి మహాత్యము , శ్రీకాళహస్తీశ్వర శతకము లను రచించాడు .
  6. అయ్యలరాజ రామభద్రుడు : ఇతడు ' రామాభ్యుదయాన్ని రచించాడు ,
  7. తెనాలి రామకృష్ణుడు : వికట కవి . పాండు రంగ మహత్యం కావ్యాన్ని రచించాడు .
  8. రామరాజ భూషణుడు : భట్టుమూర్తి ఇతని నామాంతరము . వసువరిత్ర అనే శ్లేష కావ్యమును , హరిశ్చంద్రోపాఖ్యానము అనే ద్వర్ధి కావ్యము రచించాడు .
for full details -> Go to Wikipedia.org /srikrishnadevaraya
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, November 27, 2010

కళ్లకు ఆ రంగెలా వస్తుంది ?, How eyes get that color ?





ప్రశ్న: కొందరి కళ్లు నీలం రంగులో ఉంటాయి. ఎందుకు?

- ఎస్‌. సలీం, 9వ తరగతి, అనంతపురం

జవాబు: కంటి గుడ్డులోని వర్ణకాలు (Pigments) కంటి రంగును నిర్ణయిస్తాయి. మెలానిన్‌ అనే జీవ రసాయన ద్రవ పదార్థ పరిమాణాన్ని బట్టి కంటి రంగు లేత నీలం రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు ఉంటుంది. తల వెంట్రుకలు తెల్లగానో, బంగారు రంగులోనో ఉండే పాశ్చాత్యుల కళ్లు ఈ మెలానిన్‌ను తక్కువ శాతంలో ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వారి కంటి గుడ్డుపై పతనమయ్యే కాంతి నుండి నీలం రంగు ఎక్కువగా పరావర్తనం చెందుతుంది. అందువల్ల వారి కళ్లు నీలం రంగులో కనపడతాయి. మెలానిన్‌ పరిమాణం ఎక్కువయ్యే కొలదీ కంటి రంగు పరిధి ఆకుపచ్చ నుంచి గోధుమరంగు వరకు ఉంటుంది.

కంటి రంగును జన్యువులు కూడా నిర్ణయిస్తాయి. ఈ విషయమై శాస్త్రజ్ఞులు ఇంతవరకు ఒక కచ్చితమైన అభిప్రాయానికి రాకపోయినా, ప్రపంచంలో నీలం రంగు కన్నా, ఆకుపచ్చరంగు, ముదురు గోధుమ రంగు కళ్లు ఉండే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. నీలం రంగు కళ్లు కలవారు ఉత్తర ఐరోపాలో ఎక్కువగా ఉంటే, మిగతా ప్రపంచంలో గోధుమరంగు కళ్లు కలవారే ఎక్కువ. ప్రతి పదిలక్షల మందిలో ఒకరికి కుడి కన్ను ఒక రంగులో ఉంటే, ఎడమకన్ను మరో రంగులో ఉంటుంది.జన్యుపరంగా వచ్చే ఈ పరిస్థితిని 'హైడ్రో క్రోమియా' అంటారు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌


  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, November 26, 2010

గూగోప్లక్స్ అంకె రాయడానికి విశ్వం సరిపోదా?,Is the space not enough for Googoplex number ?

ఆ అంకె రాయడానికి విశ్వం సరిపోదు!
అఆలెన్నో చెప్పగలరు... ఏబీసీడీలెన్నో చెప్పగలరు...మరి అంకెలెన్నో చెప్పగలరా?మీరే కాదు ఎవ్వరూ చెప్పలేరు! మరి ఆ అనంతమైన అంకెల్లో... అతి పెద్దదేదో తెలుసా? గూగోప్లక్స్‌! దీని వివరాలేంటో చూద్దామా!


  • Courtesy with - - Eenadu Hai bujji

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

గుడ్డా - పిల్లా ఏది ముందో తెలిసేదెలా?, Egg or Chick Which is first born?




ప్రశ్న: సైన్సు విషయంలో చాలా చిక్కు ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఉదాహరణకు 'కోడి ముందా? గుడ్డు ముందా?' అన్న మీమాంసకు సమాధానం ఏమిటి? అలాగే 'విత్తు ముందా? చెట్టు ముందా?' అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి? వివరించండి.

- జె. శ్రీనివాస్‌, మిర్యాలగూడ

జవాబు: ఇలాంటి అనేక ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సవివరంగా, ససాక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు. వాటి ప్రకారం చెట్టు కన్నా విత్తే ముందు. అలాగే కోడి కన్నా గుడ్డే ముందు. ఎలాగంటే బిడ్డ పుట్టాకే గత జీవి కన్నా పరిణామంలో అగ్రగామి అనగలం. బొద్దింకలు, సీతాకోకచిలుకలు, కప్పలు, పాములు, పక్షులు గుడ్లు పెడతాయి. క్రమేపీ ఒక జీవి పరిణామ క్రమం గుడ్లలో ఫలదీకృతమవుతూ తర్వాతి తరం మెరుగ్గా ఉండాలనే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అంటే గుడ్డులో కోడి కన్నా ప్రాచీన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు సముద్రాలలోని నీరు ముందా? నదుల్లోని నీరు ముందా అంటే పారే నీరే సముద్రాలకు ఒకప్పుడు చేరిందన్న విషయం మరవకూడదు. చెట్టు ఒక తరం కాగా, దానికి మూలం విత్తనం ఏర్పడిన తొలినాటి పరిస్థితులే.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఫ్లెమింగో పక్షికి ఆ రంగులెందుకు ?, Why Flamingo gets those colors?


  • with courtesy : Eenadu News paper
ముస్తాబయ్యే ముచ్చటైన పక్షి!ఫ్లెమింగో పక్షి---అందంగా కనిపించడానికి మనం ఏం చేస్తాం? జుట్టు దువ్వుకుంటాం... ముఖానికి క్రీములు రాసుకుంటాం... ఇలాగే ఓ పక్షి కూడా చేస్తుంది! శాస్త్రవేత్తలు కనిపెట్టిన తాజా విషయం ఇది!!

ఫ్లెమింగో పక్షి గురించి తెలుసు కదా! నాజూకైన మెడతో గులాబీ రంగులో చూడ్డానికి భలే ముచ్చటగా కనిపిస్తుందిది. అది ఆ రంగులో ఉండడానికి కారణమేంటో తెలుసా? మేకప్‌ చేసుకొని ముస్తాబవుతుంది కాబట్టే! స్పెయిన్‌ శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి మరీ ఈ సంగతి కనిపెట్టారు. మనం ముస్తాబయ్యేది ఎదుటివారిని ఆకర్షించడానికే కదా? అలాగే ఇవి కూడా జతకట్టే పక్షిని ఆకర్షించడానికే ఇలా చేస్తాయని తేలింది. మనం ముఖానికి క్రీములు రాసుకున్నట్టే ఇవి గులాబీ రంగును ఒళ్లంతా చక్కగా పులుముకుని మేకప్‌ వేసుకుంటాయని గమనించారు. మరి ఆ రంగు ఎక్కడి నుంచి వస్తుంది? మనలా ఏ దుకాణానికో వెళ్లి కొనవు. వాటి తోక దగ్గరుండే ఓ గ్రంధి నుంచి ఓ రకమైన తైలం విడుదలవుతూ ఉంటుంది. అది గులాబీ రంగులో ఉంటుంది. దాన్నే ఇవి ముక్కుతో తీసుకుని ఒళ్లంతా రాసుకుంటాయి. ఆశ్చర్యకరమైన ఈ సంగతికి ముందు అసలు ఫ్లెమింగోల గురించి తెలుసుకోవాలి.

వంపు తిరిగిన ముక్కుతో, సన్నని పొడవైన మెడతో, పొడవైన కాళ్లతో ఉండే ఫ్లెమింగోలు ఎక్కువగా మంచు ప్రదేశాలు, భూమి నుంచి లావా పెల్లుబికే ప్రాంతాల్లోని సరస్సుల్లో కనిపిస్తాయి. అక్కడి జలావాసాల్లో పెరిగే ఒక రకమైన ఆల్గే, సూక్ష్మజీవులను తింటాయి. వాటి ఆహారం వల్లనే వాటికి గులాబీ రంగు ఏర్పడిందని అనుకునేవారు. అయితే ఏడాదిలో కొన్ని నెలల్లో ఎక్కువ రంగుతో, తర్వాత వెలిసిపోయినట్టు ఉండడాన్ని గమనించి పరిశోధన చేశారు.

జతకట్టడానికి ముందు ఇవి తమ గ్రంథుల నుంచి వచ్చే గులాబీరంగు తైలాన్ని పనిగట్టుకుని ఒళ్లంతా రాసుకుంటాయని తేలింది. సాధారణంగా నీటి పక్షులన్నింటికీ తైలగ్రంథులుంటాయి. అయితే ఇవి ఆ తైలం రంగు మారే విధంగా తగిన ఆహారాన్ని తీసుకుంటాయని కనుగొన్నారు. జతకట్టే ముందే ఇలా జరుగుతోందని, తర్వాత మేకప్‌పై అంత శ్రద్ధ చూపడం లేదని గమనించారు.
ఎక్కువ సంఖ్యలో గుంపుగా గడిపే పక్షులుగా ఫ్లెమింగోలకు గిన్నెస్‌ రికార్డు ఉంది. ఆఫ్రికాలో ఇవి పదిలక్షలకుపైగా ఒకే చోట చేరి కనువిందు చేస్తాయి.
ఫ్లెమింగోలు ఒకే రాత్రిలో 500 కిలోమీటర్లు ప్రయాణించగలవు. దాదాపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎగరగలవు.


  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, November 23, 2010

తారలు పుట్టిందెలా? , Stars originated -how?





ప్రశ్న: నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి?

- ఈమని నీలిమ, 10వ తరగతి, హైదరాబాద్‌

జవాబు: అతి చల్లని, భారీ హైడ్రోజన్‌ వాయువు మేఘం నక్షత్రం పుట్టుకకు నాంది పలుకుతుంది. దాని ఉష్ణోగ్రత పరమ ఉష్ణోగ్రత (-273.13 డిగ్రీల సెంటీగ్రేడ్‌) కన్నా ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువ ఉంటుందంతే. ఆ మేఘం గురుత్వాకర్షణ బలం వల్ల దానిలోకి అదే కుచించుకు పోవడం మొదలు పెడుతుంది. ఈ ప్రక్రియలో పదార్ధాల కణాలు ఉత్పన్నమయి, అవి అత్యంత వేగాన్ని సంతరించుకుని వాటిలోకి అవే చొచ్చుకుపోవడం ప్రారంభిస్తాయి. ఫలితంగా వాయువు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత అత్యధికంగా పెరిగిన తర్వాత ఆ మేఘం మెరుస్తూ, ఉష్ణ వికిరణాలను, కాంతిని వెదజల్లుతుంది. ఈ దశలో ఈ వికిరణాలను పరారుణ (Infrared) టెలిస్కోపులతో కనిపెట్టవచ్చు. క్రమేణా ఆ మేఘంలోని సాంద్రత, ఉష్ణోగ్రత ఎంతగా పెరుగుతాయంటే, అందులో కేంద్రక సంలీనం (Nuclear Fusion) సంభవిస్తుంది. ఈ క్రమంలో హైడ్రోజన్‌ వాయువు హీలియం వాయువుగా మారుతుంది. అంటే, ఒక నక్షత్రం జన్మించిందన్న మాట. ఒక హైడ్రోజన్‌ మేఘం నుంచి వివిధ పరిమాణాలున్న నక్షత్రాలు ఉద్భవిస్తాయి. కొన్ని సార్లు వేలాది, లక్షలాది నక్షత్రాల సమూహం ఒకేసారి ఏర్పడుతుంది. నక్షత్రాలుగా ఏర్పడిన తర్వాత ఆ మేఘంలో మిగిలిన భాగం వాయువు, ధూళిరూపంలో ఆ నక్షత్రాల చుట్టూ తిరగడం మొదలవుతుంది. అలా తిరుగుతూ పదార్థ రూపంలోకి మారి, ఆ పదార్థపు కణాలు ఒకదానికొకటి దగ్గరై క్రమేపీ పరిమాణం పెరుగుతూ గ్రహాలుగా ఏర్పడుతుంది. ఆపై ఆ గ్రహాలు శాశ్వతంగా ఆయా నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, November 19, 2010

గోధుమలు ఎందుకు బంగారు రంగులో ఉంటాయి?, Why do wheat appers brown?



ప్రశ్న: గోధుమలు ఎందుకు బంగారు రంగులో ఉంటాయి?

- షేక్‌ బికారి, 7వ తరగతి, కనిగిరి

జవాబు: మొక్కలు, జంతువులు బాగా పెరిగి జీవించడానికి అతిముఖ్యమైన వాయువు నైట్రోజన్‌. కాని ఈ వాయువు భూమిలో కావలసినంత ఎక్కువగా లేకపోవడంతో మొక్కలు ఈ వాయువును పునరావృతం (Recycle) చేస్తుంటాయి. మొక్కలలోని ఆకుపచ్చని రంగుకు కారణమైన క్లోరోఫిల్‌ అణువుల్లో నైట్రోజన్‌ ఉంటుంది. మొక్కలకు నైట్రోజన్‌ అవసరం లేనప్పుడు ఆ క్లోరోఫిల్‌ అణువులను బయటకు విడుదల చేస్తాయి. అందువల్లనే గోధుమపంట సమృద్ధిగా పెరిగి కోతకు వచ్చినపుడు ఇక గోధుమ మొక్కలకు క్లోరోఫిల్‌ అవసరం ఉండదు. అవి క్లోరోఫిల్‌ను గింజల ద్వారా కూడా విడుదల చేయడంతో మొక్కలతో పాటు గింజలు కూడా లేత బంగారు రంగులోకి మారతాయి. అలాగే ఏపుగా పెరిగి, కోతకొచ్చిన వడ్లు ఆకుపచ్చరంగు నుంచి లేత బంగారు రంగులోకి మారుతాయి.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌




  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, November 13, 2010

తెల్లఉసిరిని ఇంటి గుమ్మానికి కడితే నాగుపాములు పాములు రావా?, Snakes do not enter if White Amla root present at door

ప్రశ్న: తెల్లఉసిరిని ఇంటి గుమ్మానికి కడితే నాగుపాములు ఇంట్లోకి రావని కొందరి నమ్మకం. ఇది ఎంతవరకు నిజం?అలా అయితే పాములు రావా?.

- బి. రాజేశ్వర్‌, పొన్కల్‌


జవాబు: తెల్లఉసిరికి, నాగుపాముల జీవనశైలికి ఎలాంటి అవినాభావ సంబంధం లేదు. తెల్ల ఉసిరిని గుమ్మానికి కడితే నాగుపాములు గుర్తించే అవకాశమే లేదు. ఒకవేళ అనుకోకుండా అటు చూసినా, పాముల్ని నివారించే అద్భుత శక్తులు ఉసిరికి లేవు. మూఢ నమ్మకాలలో ఇది కూడా ఒకటంతే. పాములు పగపడతాయనడం, పాలు తాగుతాయనడం, నాదస్వరానికి నాట్యం చేస్తాయనడం ఎంత అబద్దమో, తెల్ల ఉసిరి గుమ్మానికి కడితే నాగుపాములు ఇంట్లోకి రావన్నది కూడా అంతే అబద్దం.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, November 10, 2010

చార్ ధామ్‌ అంటే ఏమిటి ? , What are Chardham ?

భారత (India) దేశము లో నాలుగు దిక్కులా వున్న పవిత్ర పుణ్యక్షేతాలను ' చార్ ధామ్‌' గా పిలుస్తారు . ధామము అంటే " ఆలయం " అని అర్థము .

పర్యాయ పదములు : ఇల్లు - గృహము, ధామము, ఆవాసము, ఆలయము, స్వగృహము, కొంప, భవనము.
  • ఉత్తరాన - బదరీ, ఉత్తరప్రదేశ్ లోని హరిస్వార్ వద్ద బదరీనాధ్ ధామం ఉన్నది . దీనిని బ్రహ్మ కపాలం అని కూడా అంటారు . ఇక్కడ మహావిష్ణువు పద్మాసనాసీనుడై ఉన్నట్లు దర్శనమిస్తాడు .
----------------------------------------------------------------------------------
  • దక్షినాన - రామేశ్వరము , తమిళనాడు లో అరేబియా , బంగాళాఖాతాలు కలిసేచోట సముద్రం మధ్యలో గల ద్వీపము రామేశ్వరం ... దీనిని రామేశ్వరధామం అంటారు .
--------------------------------------------------------------------------------
  • పడమరన - ద్వారక , గుజరాత్ లో అరేబియా సముద్రము తీరములో ద్వారక ఉన్నది . ఇది శ్రీక్రుష్ణు డు పరిపాలించిన ప్రదేశము . ద్వారక ఆలయములో శ్రీకృష్ణుడు , రుక్మిణి , స్వామి నారాయణస్వామి ఆలయాలు ఉన్నాయి . దీనిని ద్వారక ధామం అంటారు .
----------------------------------------------------------------------------
  • తూర్పున - పూరీ క్షేత్రాలు ఉన్నాయి . ఒరిస్సారాస్టము లో బంగాళాఖాతం తీర ప్రాంతములో పూరి ఉన్నది , దీనిని జగన్నాధపూరి అంటారు . శ్రీకృష్ణుడు , బలరాముడు , సుభద్రల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి .
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi7XyAOSYiVWToBVWWhjoJG9R4J9xwLPeVs-EXtJHQUBcy87NYvKIZIzgmTJIBtOKcyLqPhIE2ZujbTtCDbOrXy0IcmKxyrRhqFRWecNcnB68e6RhJGIg2KkUDid_C6Cu9iJtgJXxQDIFrl/s1600/Puri+jagannadha+temple.jpg

  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Why do we get Sweat ? , చెమట ఎందుకు పోస్తుంది ?


  • [sweat+on+face.gif][sweat+in+armpit.gif]

మానవ శరీరము ఒక యంత్రం వంటిది . యంత్రం పనిచేస్తుంటే వేడి ఎలా పుడుతుందో ... శరీరము లో జరిగె జీవన క్రియలకు కూడా వేడి అలానే పుడుతుంది . ఆ వేడి ని తగ్గించి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి 98.6 డిగ్రీల ఫారిన్‌ హీట్ దగ్గర స్థిరముగా ఉండేందుకు శరీరము చేపట్టే ప్రక్రియే చెమటపోయడం .

మనిషి శరీరములో సుమారు 2 నుండి 4 మిలియన్ల స్వేదగ్రంధులు ఉంటాయి .ఇవి చర్మము కింద డెర్మిస్ (Dermis)-క్రింది చర్మ పొర లో ఉంటాయి .ఈ గ్రంధులు రెండు రకాలు ...1.ఎక్రిన్(eccrine)‌,2.ఎపొక్రైన్‌(apocrine) --- సింపాథటిక్ నెర్వస్ సిస్టం అదుపులో పనిచేస్తాయి .

ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చెమట వస్తుంది. కొంతమందికి మరింత ఎక్కువగా వస్తుంది. మరికొంత మందికి చాలా తక్కువగా చెమట పడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. చెమట లేదా స్వేదం (Sweat) క్షీరదాలలోని చర్మం నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన స్రావం. ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి. ఈ చెమటతోబాటు శరీరంనుంచి అమోనియా, ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలుకూడా శరీరంలోంచి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి చెమట ఉప్పగావుంటుంది.చెమట రావడంవలన చర్మం చెమ్మగావుంటుంది. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకు చెమట వస్తుంది . . నిజానికి చెమటకి వాసన ఉండదు. శరీరంపై ఉండే బ్యాక్టీరియా దానితో చేరినపుడు విపరీతమైన వాసన పుడుతుంది.

చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది. స్వేద గ్రంధులు తక్కువగా ఉండే కుక్క వంటి కొన్ని జంతువులలో ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణ నాలుక మరియు నోటి గ్రంధుల ద్వారా జరుగుతుంది.

మానవ శరీరము ఒక యంత్రము లాంటిది . యంత్రము పనిచేస్తుంటే వేడి ఎలా పుడుతుందో ... శరీరం లో జరిగే జీవన క్రియలకు కూడా వేడి అలానే పుడుతుంది. ఆ వేడిని తగ్గించి శరీర ఉష్ణోగ్రతను క్రమబదీకరించి  98.6 ఫారన్‌హీట్ దగ్గర స్థిరం గా ఉండేందుకు శరీరము చేపట్టే ప్రక్రియే చెమట పోయడం .శరీరం మీద ఉన్న స్వేదగ్రంధులనుండి వేడిని చెమటతో బయటకు స్వేదం రూపములో పంపుతుంది. ఆ స్వేదము గాలిలోకి ఆవితవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది.

-- డా.వందన శేషగిరిరావు --- శ్రీకాకుళం
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, November 06, 2010

బాణసంచా కద ఏమిటి?, Story of Diwali fireworks?



దీపావళికి మనమందరం కాల్చుకునే టపాసుల వెనుక రెండు ఆసక్తి కరమైన కథలున్నాయి. రెండూ చైనాకి సంబంధించినవే కాబట్టి బాణసంచా పుట్టిల్లు ఆ దేశమే. సుమారు వెయ్యేళ్ల క్రితం చైనాలోని హునాన్‌ ప్రాంతంలో లీ టియస్‌ అనే సాధువు ఉండేవాడు. ఆయనే కొన్ని రసాయనాలతో విచిత్రంగా మండే టపాసుల్ని కనిపెట్టాడని చెబుతారు. ఆయనకు ఒక గుడి కూడా కట్టారు. ఏటా ఏప్రిల్‌ 18న ఆ సాధువుకు పూజలు చేసి టపాసులు కాలుస్తారు. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ బాణసంచా ఉత్పత్తి అయ్యేది ఆ సాధువు నివసించిన ప్రాంతమే కావడం విశేషం.
మరో కథ ప్రకారం సుమారు 2000 ఏళ్ల క్రితం చైనాలో ఓ వంటవాడు అనుకోకుండా వీటిని కనిపెట్టాడు. ఓరోజు అతడు మూడు రకాల పొడులను బాణలిపై వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి ఆ మిశ్రమం పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. అతడు వాడిన గంధకం, బొగ్గుపొడి, ఒకరకమైన లవణాలను ఇప్పటికీ టపాసుల తయారీలో వాడుతున్నారు. ఆపై ఆ పొడులను వెదురు బొంగుల్లో కూరి మంటల్లో పడేస్తే 'ఢాం' అని పేలేది. అదే బాంబుకి అమ్మమ్మ అన్నమాట. బాణసంచా కాలిస్తే భూతాలు, పిశాచాలు భయపడి పారిపోతాయని చైనీయులు నమ్ముతారు. మార్కోపోలో సముద్రయానం చేస్తూ వాటిని ఇంగ్లండ్‌ తీసుకెళితే అవి అక్కడ బాగా నచ్చాయి. ఎలిజెబెత్‌ రాణిగారైతే ఏటా ప్రదర్శన పెట్టి మంచి టపాసులు కాల్చిన వారికి అవార్డులు కూడా ఇచ్చేవారు. బాణాసంచాను కనువిందు కలిగించే కళగా మార్చింది మాత్రం ఇటాలియన్లే. రసాయనాలను వాడి రంగులు విరజిమ్మేలా చేశారు.

world Records:

* ఫిలిప్పీన్స్‌లో 2010లో 30 సెకన్లలో 1,25,801 తారాజువ్వల్ని వెలిగించి గిన్నెస్‌ రికార్డు నెలకొల్పారు.
* ఇంగ్లండ్‌ బోర్న్‌మోత్‌లో 2009లో 6.5 సెకన్లలో 1,10,000 రకాల బాణసంచా సరుకులు కాల్చారు.
* యూరప్‌లో జరిగే అతి పెద్ద ఫైర్‌వర్స్క్‌ పండగ 'లేక్‌ ఫెస్టివల్‌'. గత 150 ఏళ్లుగా జరిగే దీన్ని చూడ్డానికి లక్షా 50వేల మంది వస్తారు.
* ప్రపంచంలో ఎక్కువ టపాసులు కాల్చే అతి పెద్ద పండగ మన దీపావళే తెలుసా?
* జపాన్‌లో 1988లో తయారు చేసిన అతి పెద్ద చిచ్చుబుడ్డి గిన్నెస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 54.7 అంగుళాల వ్యాసం, 750 కిలోల బరువు ఉండే దీన్ని కాలిస్తే ఆ వెలుగు రవ్వలు 3,937 అడుగుల వ్యాసం వరకు విరజిమ్మాయి.

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

Wednesday, November 03, 2010

టెడ్డీ బేర్‌ బొమ్మకథేమిటి ? , Strory of Teddy bear



టెడ్డీ బేర్‌ బొమ్మ... 125 ఏళ్లమ్మ!
పిల్లలందరికీ ఇష్టమైనది... ప్రతి ఇంటా కొలువైనది... అదే అందాల టెడ్డీబేర్‌ ఆ బొమ్మ.మీ ఇంట్లో టెడ్డీ బేర్‌ బొమ్ముందిగా? మరి దాని వయసు మీ ఇంట్లో వాళ్లందరి వయసుకన్నా ఎక్కువంటే నమ్మగలరా? నిజమే. దాని వయసు 125 ఏళ్లు!


టెడ్డీబేర్‌ బొమ్మ పుట్టుకకు కారణమైన కార్టూన్‌ ఇదే

అసలు టెడ్డీబేర్‌కు ఆ పేరు, అమెరికా అధ్యక్షుని వల్ల వచ్చిందని తెలుసా? దాని వెనకాల ఓ కథ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఉన్నప్పటి కథ ఇది. ఓ రోజు ఆయన వేటకు వెళ్లారు. తుపాకితో దేన్ని కాలుద్దామా ఆని చూస్తున్నంతలో అనుచరులు ఓ ఎలుగుబంటిని చూపించారు. తీరా గురి పెట్టి చూసేసరికి అదొక పిల్ల ఎలుగు పాపం. దాన్ని చూడగానే ఆయనకి జాలేసింది. కాల్చకుండా దాన్ని వదిలేశారు. ఈ సంఘటనపై ఆ మర్నాడు ఓ దిన పత్రికలో కార్టూన్‌ వచ్చింది. అందరికీ అది తెగ నచ్చేసింది. దాంతో దాన్ని ఎన్నో పత్రికలు ప్రచురించాయి. అలా బోలెడు ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లోని ఓ బొమ్మల దుకాణం నడిపే ఒకావిడ ఆ కార్టూన్‌లో వేసిన ఎలుగుబంటిలాగానే జాలి ముఖం ఉండేలా ఓ దూది బొమ్మను తయారు చేసింది. దాన్ని అధ్యక్షుడికి పంపి, 'దీనికి మీ పేరు పెట్టుకోవచ్చా?' అని లేఖ రాసింది. దానికి ఆయన 'సరే...' అని జవాబు పంపారు. ఆయనకి టెడ్డీ అనే మరో వాడుకపేరు ఉండేది. కాబట్టి ఆవిడ తన షాపులో ఈ బొమ్మలు తయారు చేసి 'టెడ్డీబేర్‌' అని పేరు పెట్టారు. అలా టెడ్డీబేర్‌ బారసాల జరిగిందన్నమాట. ఆపై టెడ్డీ బేర్‌ బొమ్మలు విపరీతంగా అమ్ముడయ్యాయి. అప్పటినుంచి దేశదేశాల్లో పిల్లలకు ఇది ఎంతో ఇష్టమైపోయింది. టెడ్డీబేర్‌ మ్యూజియంలు కూడా ఎన్నో దేశాల్లో ఉన్నాయి.

మీకు అతి ఖరీదైన టెడ్డీ బేర్‌ గురించి తెలుసా? దాన్ని కొనాలంటే డాడీని 86 లక్షల రూపాయలు అడగండి. ఎందుకంత ధరంటే... దీంట్లో వజ్రాలు, బంగారం లాంటి విలువైన వస్తువుల్ని పొదిగారు. దీనికి మరో రికార్డు కూడా ఉంది. ఇది ప్రపంచంలోని ఏడు ఖరీదైన బొమ్మల్లో ఒకటి. జర్మనీకి చెందిన స్టీఫ్‌ కంపెనీ టెడ్డీబేర్‌ బొమ్మల్ని తయారు చేయడం మొదలెట్టి 125 ఏళ్లయిన సందర్భంగా ప్రత్యేకంగా 125 బొమ్మల్ని తయారు చేసింది.
మీకు తెలుసా?
* 2009లో దక్షిణ కొరియాలో 33 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతి పెద్ద టెడ్డీబేర్‌ను రూపొందించారు. ఇక అతి చిన్న టెడ్డీబేర్‌ కూడా కొరియా మ్యూజియంలో ఉంది. దీని పరిమాణం కేవలం 4.5 మిల్లీమీటర్లు.

* అమెరికాకు చెందిన జాకీ అనే మహిళ 5,029 రకాల టెడ్డీ బేర్‌లను సేకరించి రికార్డు సృష్టించింది.

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఈ కణాల్ని అక్కడ పెడితే ఆహారాన్ని తయారుచేసుకోగలవా? , can we kept leaf cells in Animal for photosynthesis?




ప్రశ్న: మొక్కల్లో హరిత రేణువులు ఉండడం వల్ల అవి ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతున్నాయి కదా. మరి వాటిని జంతువుల్లో ప్రవేశపెడితే వాటంతట అవి ఆహారాన్ని తయారుచేసుకోగలవా?

-ఎస్‌. క్రాంతి కుమార్‌, 10వ తరగతి, పెంట్లవెల్లి

జవాబు: మొక్కలు కిరణజన్య సంయోగక్రియ (Photosyntheses) ద్వారా కాంతి సమక్షంలో కార్బన్‌డయాక్సైడును, నీటిని పిండి పదార్థాలుగా మార్చే క్రమంలో హరితరేణువులు (chlorophil pigments) ప్రధాన పాత్ర వహిస్తాయనేది నిజమే కానీ, ఆ ప్రక్రియ మొత్తం కేవలం వాటిదే కాదు.

ఉదాహరణకు బస్సును నడపడానికి డ్రైవర్‌ అవసరమే కానీ, అదే డ్రైవర్‌ను గుర్రం ఎక్కిస్తేనో, విమానం ఇస్తేనో నడపలేడుగా? అలాగే హరిత రేణువులు మొక్కల్లో మాత్రమే తమ పాత్రను నిర్వర్తించగలవు. పైగా జంతువుల దేహ నిర్మాణం, కణ నిర్మాణం మొక్కలతో పోలిస్తే పూర్తి భిన్నమైనది. కాబట్టి హరిత రేణువులు జంతువుల్లో పనిచేయడమనే ప్రశ్నే లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, November 01, 2010

కొబ్బరి నీళ్ల రహస్యమేంటి? , Secret of Coconut water?





ప్రశ్న: కొబ్బరి నీళ్లు శరీరానికి మేలు చేస్తాయంటారు. ఎందువల్ల?

-ఎమ్‌. సీత, 10వ తరగతి, కొండపల్లి (కృష్ణా)

జవాబు: కొబ్బరి నీళ్లు నిజానికి కొబ్బరి మొలకల ఎదుగుదలకు కావలసిన ఆహారాన్ని ద్రవరూపంలో అందించడానికి ఏర్పడినవి. పారదర్శకంగా ఉండే తీయని కొబ్బరి నీళ్లలో నూనె, చక్కెర, నీరు, విటమిన్లు, పొటాషియం, భాస్వరం, సెలీనియం లాంటి పోషక పదార్థాలతో కూడిన ఖనిజ పదార్థాలుంటాయి. ఆ నీళ్లు తాగితే ఇవన్నీ శరీరానికి అందినట్టే. కొబ్బరి కాయ ముదిరే కొద్దీ లోపల ఉండే కొబ్బరి ఆ నీళ్లను పీల్చుకుంటుంది. అందువల్లనే ముదురుకాయలో కన్నా లేతకాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీరు క్రిమిరహితమైన పరిశుభ్రమైన ద్రవం కావడంతో వాటిని తాగడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. సాధారణంగా రక్తస్రావం ఎక్కువై శరీరంలోని సీరం చాలా తక్కువైన సందర్భాల్లో వైద్యులు కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తారు. మూత్రపిండ వ్యాధులున్నవారికి, వాంతులవుతున్నవారికి, రక్తపీడనం ఎక్కువగా ఉన్నవారికి, చర్మం పొడిబారిపోయి ముడతలు పడుతున్నవారికి, గ్లూకోమాలాంటి కంటి జబ్బులున్నవారికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.