Sunday, January 30, 2011

పిడుగు ప్రమాదాలు ఎలా నివావించుకోవచ్చును?, How to protect from Thunderbolt accidents


మేఘాలు ఒరిపిడివల్ల వాటిలో విద్యుదావేశం పేరుకుపోతూ ఉంటుంది. దీనివల్ల వాటిమీద విద్యుత్ పీడనం బాగా పెరిగిపోతుంది. ఇది నేలమీదకు దూకాలంటే గాలి అడ్డుగా నిలుస్తుంది. ఈ విద్యుత్ పీడనం అనేక వందల కోట్ల వోల్టులకు పెరగడంతో గాలి పరమాణువుల మీది ఎలక్ట్రానులను పీకేస్తుంది. దానితో గాలి అయాన్లు తయారై తనగుండా విద్యుత్‌ను ప్రవహించేందుకు అనుకూలతను కల్గిస్తుంది. విద్యుత్ ప్రవాహానికి గాలి సన్నని దారిని ఈ విధంగా ఏర్పరుస్తుంది. ఈ దారిగుండా విద్యుత్ అనేక లక్షల ఆంపియర్ల బలం గలది ప్రవహిస్తుంది. ఫలితంగా దారిలోని ఉష్ణోగ్రత 15వేల నుండి 20వేల డిగ్రీల సెలిసియస్‌కు పెరిగిపోతుంది. దీనివల్ల మెరుపులు వస్తాయి. ఈ వేడివల్ల గాలి వ్యాకోచించి బాంబు పేలినంత చప్పుడవుతుంది. ఈ వేడికి చెట్లు కాలిపోతాయి. ఇళ్లు కూలిపోతాయి. జంతువులు ఈ విద్యుత్ ప్రవాహపు షాకుకు చచ్చిపోతాయి. దీనినే మనం పిడుగు అని పిలుస్తాం.

శబ్దం నుండి రక్షణ :
ఉరుముల వల్ల, పిడుగుల వల్ల వచ్చే శబ్దం చాలా ఎక్కకువగా ఉంటుంది. ఆ శబ్దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారని తెలుసుగా! పిడుగులు పడ్డప్పుడు వచ్చే ధ్వని తీవ్రత కొన్ని లక్షల డెసిబెల్స్‌ వరకూ వుంటుంది. అంత పెద్ద పెద్ద శబ్దాల వల్ల శాశ్వతంగా చెముడు వచ్చే ప్రమాదముంది. ఆ శబ్దాలకు కర్ణభేరి బ్రద్దలయ్యే ప్రమాదముంది. దాని నుండి తప్పించుకోవాలంటే చెవులన్నా మూసుకో వాలి. లేదా...నోరన్నా తెరవాలి! నోరు తెరిస్తే...ఆ శబ్దం చెవి నుండి నోటి ద్వారా విస్తరించి ప్రమాదం తప్పుంది. కనుక కర్ణభేరి సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. అందుకనే పిడుగు పడినప్పుడు ''అర్జునా... ఫల్గుణా'' అని పిలిచి పిడుగుపాటు నుండి చెవిటి వాళ్లమయ్యే అవకాశం నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.

పిడుగు ఎలా ఏర్పడుతుంది ?

''నీటితో నిండిన భారమైన రెండు మేఘాల మధ్య రాపిడి వల్ల ఏర్పడిన విద్యుత్‌ ఆవేశాన్ని మెరుపు అంటాం. ఆ మెరుపు భూమిని తాకడాన్ని 'పిడుగు' అని పిలుస్తాం. పిడుగుపాటు ఎంత తీవ్రంగా ఉంటుందంటే...దాని విద్యుత్‌ తీవ్రత వల్ల గాలిలో ఏర్పడే ఉష్ణము 54,000 డిగ్రీ ఫారెన్‌ హీట్‌ ఉష్ణోగ్రత కావచ్చు. మన శరీర ఉష్ణోగ్రతను ఫారెన్‌ హీట్‌లోనే కొలుస్తారు.మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ .అంత ఉష్ణోగ్రతతో పిడుగు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి వ్యాకోచం చెందు తుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం వలన ఏర్పడే పెద్ద శబ్దమే ఉరుము. అది పిడుగుపాటును సూచి స్తుంది

1994వ సంవత్సరంలో నవంబర్‌ రెండవ తేదీన ఈజిప్ట్‌లోని డురుంకా వద్ద పెట్రోలు ఇంధనాన్ని తీసుకువెళ్తున్న రైలును పిడుగు తాకింది. రైలు పట్టాలు తప్పింది. అందులోని ఇంధనం అంటుకుని దగ్గర ఉన్న సైనిక డిపో వద్ద పేలుడు సంభవించింది. దారిలో ఉన్న ఇళ్లన్నిటినీ రెండుగా చీల్చివేసింది.''

పిడుగు పాటు షాక్ నుండి తప్పించుకునే మార్గాలేమయినా ఉన్నాయా?

పూర్వం ప్రతీ ఊరిలో ఓ దేవాలయం ఉండేది. దాని ముందు రాగి, ఇత్తడి లాంటి లోహాలతో చేసిన ధ్వజస్తంభం ఉండేది. సాధా రణంగా ఉరుములు, మెరుపులు ఏర్పడిన తరువాత ఎత్తైన ప్రదేశాలలో వున్న విద్యుత్‌ వాహనాల ద్వారా భూమిని చేరుకొని తటస్థమౌతాయి. రాగి,ఇత్తడి మొదలగు లోహాల రేకుల వల్ల ఉరుములు ఆకర్షింపబడతాయి. విద్యుదావేశం ఇళ్లపై పడకుండా ధ్వజస్తంభం ద్వారా భూమిని చేరుకుంటుంది. అందుచేతే మనకు ప్రమాదం ఉండదు కనుక ఊరిలోని ఇళ్లకు గానీ మనుషులకు గానీ ప్రమాదాలు తప్పిపోతాయి. అలాంటి ధ్వజస్తంభాలు ఊరిని పిడుగుల బారి నుండి రక్షిస్తాయి. ఇప్పుడు ఎత్తైన భవనాలలో ఇటు వంటి నిర్మాణాలే ఏర్పాటు చేస్తున్నారు. పూర్వీకులు ఏర్పాటు చేయించి ధ్వజస్తంభాలలో ఎంత మానవతా దృక్పథం వుందో మనకు తెలుస్తుంది గదూ. ఆ విధంగా పిడుగుల నుండి ఊరు రక్షింపబడు తుంది. ధ్వజస్తంభం ఉండడం నిజంగా ఊరికి మేలే!

పిడుగులు వస్తాయనే అనుమానము ఉన్నప్పుడు ఇల్లలోని కరంటు అపేయాలి . అలా చేయకపోతే ఎక్కువ ఒల్టేజ్ ఉన్న విద్యుత్ తీగల ద్వారా ప్రవహించి .ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు ఉదా: టి.వి , రేడియో,కంప్యూటర్లు , లైట్లు , ఫ్రిజ్ లు మునంగునవి కాలిపోతాయి . అందుకే ముందు జాగ్రత్త గా కరంటు డిపార్ట్ మెంట్ వారు లైన్‌ కరంటు ఆపేస్తారు .


  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...