Saturday, August 27, 2011

వాటికి ఆ రంగు ఎలా వచ్చింది ? , How do leaves and Fruits get their color?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.




ప్ర : పచ్చని ఆకులలో పత్ర హరితం ఉంటుంది. మరి పచ్చని రంగుల్లో ఉండే పూలల్లో కూడా పత్రహరితమే ఉంటుందా? లేదా ఇతర పదార్థాల వల్ల వీటికి పచ్చని వర్ణం వస్తుందా?

- రమ్య, పదవతరగతి,రామకృష్ణ పాఠశాల, వరంగల్‌.

జ : ఆకుల పచ్చదనానికి, పువ్వుల్లో పచ్చదనానికి, మాగని అరటి, మామిడి, జామ, నిమ్మ వంటి పళ్ళతోళ్ల (peels) లో ఉండే పచ్చదానికి ప్రధాన వర్ణద్రవ్యం (pigment) క్లోరోఫిల్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవజాతి అంతా క్లోరోఫిల్‌కు ఎంతో ఋణపడి ఉంది. దాని ద్వారానే సౌరశక్తి, కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) ద్వారా జీవులన్నింటికీ అవసరమైన ఆహారంగా తయారవుతోంది. ముఖ్యముగా క్లొరోఫిల్ లో నాలుగు / ఐదు రకాలు ఉన్నాయి . కొద్దిగా రంగులో తేడా ఉన్నా దానిలో ఉన్న ముఖ్యమైన పిగ్మెంట్ .. క్లొరోఫిల్ జాబితాలోకే వస్తుంది .



Courtesy :
prajashakti news paper / prof.A.Ramachandrayya. Editor -chekumuki janavijyaana vEdika.
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?,Apple is sweet and Neem is bitter Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ఫ్ర : ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?

జ : 'జీవం' అంటేనే రసాయనిక ధర్మాల సమాకలనమేనని, 'కణ నిర్మాణం' అంటేనే రసాయనిక పదార్థాల మధ్య ఉన్న అనుబంధమేనని, రుచులు, వాసనలన్నీ రసాయనిక పదార్థాలకు, జ్ఞానేంద్రియాలైన నాలుక, ముక్కుల్లో ఉన్న రసాయనిక గ్రాహకాల (chemoreceptors) కు మధ్య ఏర్పడే చర్యాశీలతే (reactivity) నని జీవ రసాయనిక శాస్త్రం (biochemistry) ఋజువు చేసింది. ఆపిల్‌ పండులో ప్రధానంగా ఎన్నో ఇతర రుచిలేని గుజ్జు, నీటితో పాటు అందులో కరిగిన గ్లూకోజ్‌ వంటి చక్కెరలున్నాయి. ఆపిల్‌పండును నోటికి తాకిస్తే నాలుక మీదున్న రుచిగుళికల (taste buds) మీదకు ఆయా పదార్థాలు కొద్దిగా చేరుకుంటాయి.

అక్కడ పరీక్ష చేసే డాక్టరులాగా రుచి నాడీ చివర్లు (taste nerve ends) ఉంటాయి. అక్కడ జరిగే విద్యుద్రసాయనిక చర్యల సారాంశంలో ప్రత్యేకమైన సంకేతాలు మెదడుకు చేరతాయి. ఆ సంకేతాలను మెదడు 'తీయదనం'గా భావించి ఇంకాస్త తినమని ప్రోత్సహిస్తుంది. వేపపండులో చేదుగుణాన్ని కలిగించే 'పిక్రిక్‌ ఆమ్లము' తదితర అవాంఛనీయమైన ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటికి క్రిమిసంహారక లక్షణాలు (antibiotic characters) ఉన్నాయి. కాబట్టి పొలాల్లో క్రిమి సంహారిణులుగా వాడితే మంచిది. నోట్లో వేసుకొంటే ఆ నాడీ చివర్ల జరిగే రసాయనిక సంకేతాలు 'మరోలా' ఉండడం వల్ల ఆ సంకేతాల సారాన్ని మెదడు 'చేదు' అంటూ మానెయ్యమంటుంది. తినగాతినగా వేము తియ్యగా ఎప్పుడూ మారదు.

ప్రశ్న: వేపాకు చేదుగా ఎందుకు ఉంటుంది?

జవాబు: వేప చెట్టులో దాదాపు అన్ని భాగాలు చేదుగా ఉంటాయి. ప్రత్యేకంగా వేపాకులో మరీను. కారణం వేపాకులో చెడు రుచిని కలిగించే వృక్ష సంబంధ సేంద్రియ పదార్థాలే. (Phyto organic chemical) ఉంటాయి. ఇందులో ప్రధానమైనవి నింబిన్‌(Nimbin) , నింబిడిన్‌(Nimbidin)లు.

20వ శతాబ్దపు 4వ దశకంలో సిద్ధిక్వి అనే పాకిస్తాన్‌ శాస్త్రవేత్త వేపలోని రసాయనాల మీద పరిశోధనలు చేశారు. 1995 సంవత్సరంలో ఐరోపా పేటెంటు సంస్థ అమెరికా వ్యవసాయ సంస్థ (American department of agriculture) అదే దేశానికి చెందిన wr grace and company కి వేప మీద పేటెంటు హక్కుల్ని ఇచ్చింది. కానీ 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం దాదాపు 2వేల సం||రాల తరబడి వేప వినియోగం భారత దేశంలో ఉందని వాదించగా అమెరికా వారి పేటెంటు హక్కుల్ని తీసేసి భారత దేశానికి ఇచ్చారు. కానీ 2005 సం. లో తిరిగి wr grace and company భారత్‌లో వేప వాడకం ఆచరణలో ఉన్నా ప్రచురణ (publication) లేదని వాదించి తిరిగి పేటెంటు హక్కుల్ని సాధించుకొంది.


Courtesy :
prajashakti news paper / Ramachandrayya A prof. editor -chekumuki janavijyaana vEdika.

  • ===================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మలము దుర్గంధము గా ఉండడానికి కారణమేమిటి?,Foecal mater is foul-smelling Why?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

Q : మనం రకరకాల ఆహారపదార్థాలు తీసుకుంటాము. ఎన్నో రుచికరమైన, సువాసన భరితమైన మసాలా దినుసులతో ఆహారాన్ని, పానీయాల్ని సేవిస్తాము. కానీ జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలు (మలమూత్రాలు) దుర్గంధంగా ఉండడానికి కారణమేమిటి?

A : తీసుకున్న ఆహారపదార్థాలలోని పిండిపదార్థాల్లోంచి గ్లూకోజు, ఫ్రక్టోజులు, మాంసకృత్తుల నుంచి వివిధ అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాల నుంచి కణత్వచాని (cell wall) కి ఉపయోగపడే లిపిడ్లు ఉత్పన్నమవుతాయి . అవి చిన్నప్రేవులో ఉండే విల్లై అనే కణపొర ద్వారా రక్తంలో కలుస్తాయి . ఇంతవరకు బాగానే ఉంది. అయితే నోటి నుంచి గుదము (anus) వరకు వ్యాపించిన దాదాపు 2, 3 మీటర్ల పొడవుండే జీర్ణకోశ వ్యవస్థలో పలుచోట్ల పలురకాలైన భౌతిక రసాయనిక స్థితులు ఉంటాయి. అనువైన చోట్ల మన పుట్టుక వెంటనే ఎన్నో బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో తమ స్థావరాల (colonies) ను ఏర్పరుచుకొంటాయి. ఇందులో అపాయకరమైన బాక్టీరియాలు, ఉపయోగపడే బాక్టీరియాలు రెండూ ఉంటాయి. మనకు నోటిలో పుండ్లు రావడం, విరేచనాలు రావడం, వాంతులు రావడం, అజీర్తి వంటి పలు అవాంఛనీయమైన లక్షణాలకు కారణం ప్రమాదకర బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో ఉండడమే. ఇచరేరియాకోలై (E.Coli), సాల్మొనెల్లా, జియార్డియా (giordia), క్రిప్టోస్పోరిడియం (cryptosporidum) వంటివి ప్రేగుల్లో ఉంటాయి. ఉపయోగపడే బాక్టీరియాను ప్రొబయోటిక్స్‌(probiotics) అంటారు. ఇందులో లాక్టోబాసిల్లస్‌ అసిడోఫిలస్‌ (Lactobacillus acidophilus), బైఫిడోబాక్టీరియా బైఫ్రిడమ్‌ (Bifidobacteria bifridum) వంటివి ఉదాహరణలు.

మంచి బాక్టీరియా అయినా చెడు బాక్టీరియా అయినా అవీ బతకాలి. తమ సంతానాన్ని పుంఖాను పుంఖాలుగా పెంచుకోవాలి. కాబట్టి వాటికీ ఆహారం అవసరం. కొన్ని బాక్టీరియాలు వాటి సంఖ్య మించితే మనకు వాంతులు, విరేచనాలు, కలరా, డయేరియా లాంటి వ్యాధులతో తెలిసిపోయినా వాటి సంఖ్య అదుపులో ఉన్నంతవరకు వాటిని మన తెల్లరక్తకణాలు నాశనం చేస్తుంటాయి. కాబట్టి బాక్టీరియాలు మన కణాల్ని తింటూ వాటి విసర్జక పదార్థాల్ని జీర్ణమవుతున్న మన ఆహారపదార్థాల మిశ్రమంలోనే కలుపుతాయి. అందులో చాలా దుర్గంధభరితమైన గంధకం, ఫాస్ఫరస్‌, నత్రజని సమ్మేళనాలు ఉంటాయి.

చాలాసార్లు మన ఆహారాన్నే అవీ భాగం పంచుకొని మనలాగా కాకుండా మరో విధమైన అవాయు ప్రక్రియ (anaerobic metabolism) ద్వారా ఆక్సిజన్‌ అవసరం లేకుండానే శక్తిని పొంది తమ జీవన కార్యకలాపాల్ని కొనసాగిస్తాయి. అవాయు ప్రక్రియల్లో ఎన్నో దుర్గంధభరితమైన పదార్థాలు విడుదలవుతాయి. ఉపయోగపడే బాక్టీరియాలు కూడా పెద్దప్రేవుల్లో ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థలో జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాల మీద ఆధారపడి బతుకుతుంటాయి.అవి ఒక్కోసారి దుర్గంధాన్ని తగ్గిస్తాయి. మరోసారి దుర్గంధాన్ని పెంచుతాయి. ఈ విధంగా మనం తీసుకున్న పంచభక్ష్య పరమాన్నాలు, సుగంధభరిత పానీయాలు, షడ్రుచుల ఆహారదినుసులు నోటి వరకే వాటి సౌభాగ్యం. ఆ తర్వాత అవి రకరకాల రసాయనిక ప్రక్రియల్లో, జీవ రసాయనిక ప్రక్రియల్లో, బాక్టీరియా కౌగిళ్లలో ... లోగిళ్లలో పడిపోయి వివిధ మార్పులకు లోనవుతాయి. చివరకు దుర్గంధ భరితమైన మలమూత్రాదుల రూపంలో బయటపడతాయి. ఇందులో ఉపయోగపడే బాక్టీరియాల వంతూ ఉంది కాబట్టి ఆ కంపే ఆరోగ్యానికి ఇంపు అనుకోకతప్పదు.


courtesy : prajashakti news paper / Ramachandrayya A prof. editor -chekumuki janavijyaana vEdika.
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, August 24, 2011

నాణేలు సరైనవో, నకిలీవో ఎలా తెలుస్తుంది?,How do we know the Quality of coins?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !



ప్రశ్న: నాణేలు సరైనవో, నకిలీవో ఎలా తెలుస్తుంది?

-ఎమ్‌. శిరీష, 9వ తరగతి, మెదక్‌
జవాబు: నాణేలు సరైనవో, నకిలీవో తెలుసుకోడానికి 'కాయిన్‌ టెస్టర్‌' అనే యంత్రాన్ని వాడతారు. ఇందులో ఉండే అయస్కాంత ధ్రువాల మధ్య నుంచి నాణేలు ప్రయాణించే ఏర్పాటు ఉంటుంది. ఆ ధ్రువాల మధ్య ఉండే అయస్కాంత క్షేత్రాన్ని, అయస్కాంత బలరేఖలను నాణేలు ఖండించడం వల్ల వాటిలో ఆవర్తన విద్యుత్‌ ప్రవాహాలు (Eddy currents) ఉత్పన్నమవుతాయి. వీటి కారణంగా నాణేల వేగం మారుతుంది. అలాగే నాణేలు కాంతి శక్తిని ఉద్ఘారించే డయోడ్ల (LED) గుండా కూడా ప్రయాణిస్తాయి. అక్కడ ఉండే కాంతి గ్రాహకాలు (light sensors) ఆ నాణేల వేగం, వ్యాసాలను కొలుస్తాయి. సరైన నాణేల వేగం, వ్యాసాల విలువలు ముందుగానే ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉంటాయి. నాణేలు నకిలీవైతే ఏర్పడే సున్నితమైన మార్పులను యంత్రం గుర్తించగలుగుతుంది. నకిలీ నాణేలు అదే యంత్రంలో వేరే అరలోకి చేరే ఏర్పాటు ఉంటుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ====================================
.visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, August 23, 2011

Indian Constitution was written only by Dr.Ambedkar?, భారత రాజ్యాంగము డా.అంబేత్కర్ ఒక్కరే వ్రాసారా ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

భారత రాజ్యాంగం రూపుదిద్దుకోవడానికి ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు డా. అంబేద్కర్ . కమిటీ సబ్యులు : అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు , డా.కె.ఎం.మున్షి , సయ్యద్ ఎం.జి.సాదుల్లా, మాధవరావు , టి.టి.కృష్ణమాచారి మున్నగువారు .

భారత రాజ్యాంగం (Constitution of India) ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసారు. ఈ సభలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. సభ్యుల కూర్పు ఇలా ఉన్నది:

* రాష్ట్ర శాసనసభల ద్వార ఎన్నికైన సభ్యులు: 292
* భారత్ సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు: 93
* ఛీఫ్ కమిషనర్ ప్రావిన్సుల ప్రతినిధులు: 4

ఈ విధంగా మొత్తం సభ్యుల సంఖ్య 389 అయింది. అయితే, మౌంట్‌బాటెన్ యొక్క జూన్ 1947 నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946, డిసెంబర్ 9 న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు. డా.సచ్చిదానంద సిన్‌హాను సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు ఈ సభలో సభ్యులు.

1947 ఆగష్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై, ఖచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసన సభగా అవతరించింది. రాజ్యాంగం రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు.
  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, August 22, 2011

కెమేరాపై ఆ సంఖ్యలేల?, What is Mpx numbers on cemeras?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న:మొబైల్‌, డిజిటల్‌ కెమేరాలకు పక్కన 1.3 Mpxలాంటి సంఖ్యలు ఉంటాయి. అవేంటి?

-వి. వసంత, రేపల్లె (గుంటూరు)

జవాబు: మొబైల్‌, డిజిటల్‌ కెమేరా ఎంత విశదంగా ఫొటోలు తీయగలదో సూచించే సంఖ్యలే ఇవి. వీటిలో Pxఅనేది పిక్చర్‌ ఎలిమెంట్‌(picture element)కి సంక్షిప్త రూపం. దీన్నే పిక్సెల్‌ అని కూడా అంటారు. డిజిటల్‌ కెమేరాలకు, పూర్వపు ఫిల్మ్‌ కెమేరాలకు తేడా ఉంది. ఫిల్మ్‌ కెమేరాలలో రసాయనిక రేణువుల సాంద్రత బొమ్మ స్పష్టతకు కొలమానంగా ఉండేది. డిజిటల్‌ కెమేరాల్లో ఫిల్మ్‌లు ఉండవు. కటకం (లెన్స్‌) వెనుక ఓ ఫలకం (plate)ఉంటుంది. దీనిపై సూక్ష్మమైన కాంతివిద్యుత్‌ గ్రాహకాలు(Photo electric receptors) ఉంటాయి. ఇవి ఆ ఫలకంపై అడ్డం, నిలువు వరసల్లో అనేకం ఉంటాయి. ఒక చదరపు సెంటీమీటర్‌ ప్రాంతంలో 13 లక్షల గ్రాహకాలు ఉంటే ఆ కెమేరా సామర్థ్యాన్ని 1.3 Mpxఅని సూచిస్తారు. అంటే మెగా పిక్సల్స్‌ అని అర్థం. అలాగే 32 లక్షల గ్రాహకాలు ఉంటే 3.2 మెగా పిక్సల్స్‌గా పేర్కొంటారు. వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ కెమేరాతో తీసే ఫొటోలు అంత స్పష్టంగా ఉంటాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, August 20, 2011

గాజును చేసేదెలా?, How do we make glass ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్రశ్న: ఇసుక నుంచి గాజును తయారు చేస్తారని చదివాను. ఎలా చేస్తారు?

జవాబు: గాజు తయారీలో క్వార్ట్జ్‌ ఇసుక, సోడా తగుపాళ్లలో ఒక పెద్ద పాత్రలో ఉంచి ఆ మిశ్రమాన్ని యంత్రాల సాయంతో మెత్తని పొడిగా చేస్తారు. ఈ పొడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడు నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన మెత్తని, జిగురులాంటి పదార్థంగా మారుతుంది. అంటుకుపోయే స్వభావం ఉన్న ఈ పదార్థాన్ని సుమారు 1000 డిగ్రీల సెంటిగ్రేడు వరకు చల్లారుస్తారు. ఈ దశలో మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ కలుపుతారు. దీని వల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోయి, స్వచ్ఛమైన పారదర్శకత కలిగిన గాజు పదార్థం తయారవుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని లోహపు ఆక్సైడులను కలపడం ద్వారా కావలసిన రంగులు వచ్చేలా కూడా చేయవచ్చు. చల్లార్చిన గాజు పదార్థాన్ని అచ్చుల యంత్రాల సాయంతో కావలసిన మందం కలిగిన గాజు పలకలు, దిమ్మలు, కడ్డీల రూపంలోకి మలుస్తారు. ఆ తర్వాత మెరుగు పెట్టడం, చెక్కడం అదనంగా చేస్తారు.

-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, August 06, 2011

సింగినాదం జీలకర్ర అని ఎందుకంటారు ?, Why some say singinadam jeelakarra?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

సింగినాదం జీలకర్ర - ఒకప్పుడు జీలకర్ర వర్తకులు తమ రాకకు గుర్తుగా శ్రుంగనాదం (కొమ్ము బూర) ఊదేవారు.పాతకాలములొ జీలకర్ర వర్తకులు పడవలో వేసుకుని ఆ పడవలో కాలువలో వెళుతూ,ఏదైనా ఊరు వచ్చినప్పుడు బూర ఊదేవారట. అది విని కావలిసినవారు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకొని కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు.

దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకునేవారు.ఆ విధంగా శ్రుంగనాదం-జీలకర్ర వొకటయ్యాయి. కాలక్రమాన, శ్రుంగనాదం-జీలకర్ర కాస్తా సింగినాదం జీలకర్రగా వాడుకలో మారిపొయింది. ఇలా నిజమో అబద్ధమో తెలియని మాటలను సింగినాదం జీలకర్ర అని కొట్టి పారవేస్తుంటారు.





  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

దిగుడు బావుల నగరము అంటారెందుకు ?,Steped well city Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

బావులు లేదా నూతులు (Wells) కొన్ని ప్రాంతాలలో మంచినీటి అవసరాల కోసం తయారుచేసుకున్న కట్టడాలు.

బావులలో రకాలు :
* ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.
* దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
* గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నవి. ఇవి భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.
* గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో గిలక నిర్మించబడి ఉంటుంది.

దిగుడు బావులు

ప్రజలకు నీటి వనరులు గా ఉపయోగపడుతున్న దిగుడు బావులు, చేదుడు బావులు ఇప్పుడు కాలగర్బంలో కలిసి పోతున్నాయి . దీనితో వాటి ఉనికి కే ప్రశ్నార్ధకంగా మారింది. నాడు ఏ గ్రామంలో చూసిన దిగుడు బావులు, చేదుడు బావులు అధికంగా వుండేవి. ఈ బావులను గ్రామాలలో త్రాగునీటికి , పొలాల్లో వ్యవసాయానికి ఉపయోగించే వారు. భూ గర్భ జలాలు నానాటికి అడుగంటి పోవడంతో బావులు నేడు కనుమరుగు అవుతున్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దర్శనార్ధం వచ్చే భక్తుల తాగునీటి అవసరాలు తీర్చడానికి గతంలో పలువురు దాతలు దిగుడు బావులు తవ్వించారు. వాటిలో దిగేందుకు మెట్లు ఏర్పాటు చేశారు.

దిగుడు బావుల నగరము :
బయటి ప్రపంచానికి అంతగా తెలియని ఒక విచిత్రం గుజరాత్ లో ఉన్న దిగుడుబావులు . ఒకప్పుడు మనప్రాంతం లో కూడా ఇటువంటి బావులు ఉండేవి . లోతైన బావిలొకి చక్కని మెట్ల నిర్మాణము ఆనాటి వారి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి చిహ్నము . అటువంటి దిగుడు బావులను మరింత సుందరమైన నిర్మాణాలుగా మలచటం గుజరాతీయుల ప్రత్యేకత . అక్కడి నీటి సమస్య పరిష్కారానికి నాడు కనుక్కున్న పరిష్కారమే ఈ బావులు . వీటి మధ్యలో ఉండే బావి చుట్టూ చక్కని రాతినిర్మాణము ఉంటుంది . అంచెలంచెలుగా విశాలమైన వసారాలు , గదులు కలిగిన ఆ నిర్మాణం లో స్తంభాలు , వాటిమీద లతలు , అల్లికలు , నగిషీలు చెక్కబడి దేవాలయ నిర్మాణాన్ని తలపిస్తాయి .

నాటి ప్రజలు వీటిని గంగామాతగా భావించేవారు . అందుకే ఈ జలాన్ని దేవతగా భావించి ఈ నిర్మాణం చేశారు . అష్టకోణాల నిర్మాణం ఇది . బావిలోకి ప్రవేశించేందుకు మూడువైపులనుండి ప్రవేశద్వారాలుంటాయి. వీటిలో నుండి దిగితే ఒక అంతస్తు నుండి మరో అంతస్తుకు దిగుతూ మొత్తం ఐదంతస్తుల కిందికి దిగాల్సివుంటుంది . అంత లోతునుండి నీరు పైకి చేరవేయడం చాలా శ్రమతో కూడుకున్న పనే . అందుకే ఆ శ్ర్మ తెలియకుండావుండేందుకే ఇటువంటి విశాలమైన , నెమ్మదిగా ఎక్కే మెట్లు కలిగిన సుందర నిర్మాణాలు చేపట్టారు . ఇనన్నీ 10-11 శతాబ్దాల మధ్య జరిగిన నిర్మాణాలే. ఇటువంటి సుందర దిగుడుబావులు గుజరాత, రాజస్థాన్‌ ప్రాంతాలలో చాలాచోట్ల ఉన్నప్పటికీ , అదలాజ్ వాన్‌ లో విశేషం గా ఉన్నాయి . అదలాజ్ వాన్‌ గుజరాత్ లోని ప్రధాన నగరము . ఇది అహమదాబాద్ కి 18 కి.మీ దూరం లో ఉంది .
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, August 03, 2011

వాతావరణ కాలుష్యాన్ని చెట్లు ఎలా అరికడతాయి ?,How trees control whether pollution?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

Q-వాతావరణ కాలుష్యాన్ని చెట్లు ఎలా అరికడతాయి ?

A===> స్వచ్చమైన వాతవరణంలో 78 శాతం నైట్రొజన్,్ 21 శాతం ఆక్సిజన్...కొంచెంగా అర్గాన్ ,కార్బన్ డై అక్సైడ్ వాయువులు ఉంటాయి. వీటితో పాటు అతి స్వల్పంగా నియాన్,హీలియం,నైట్రస్ అక్సైడ్ ,మీథైన్,కార్బన్ మోనాక్సైడ్ ,సల్ఫర్ డై అక్సైడ్, ఒజొన్, అమ్మోనియ మూలకాలు కుడా ఉంటాయి. శిలాజాలు ,పెట్రొ,కిరొసిన్ లాంటి ఇందనాలు మండించడం ... అడవులను నరికి రసాయన కాలుష్యాలు వెదజల్లె పరిశ్రమలు స్థాపించడం లాంటి పనుల వల్ల వాతావరణంలో ఈ వాయు అంశాల నిష్పత్తిలో రోజురోజుకి మార్పులు వస్తున్నాయి. దాని ఫలితంగానే టన్నుల కొద్ది కార్బన్ డై అక్సైడ్ ,కార్బన్ మోనాక్సైడ్ ,మీథెన్ల వంటి విష వాయువులతో వాతవరణం కలుషితమవుతుంది. దీనిని పచ్చగ ఏపుగా పెరిగిన చెట్లు అరికడతాయి .

చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకోవడంలొ ప్రదానపాత్ర పోషిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ పద్దతిలో కార్బన్ డై అక్సైడ్ ,నీరు,సూర్యరశ్మిలని మేళవించి తమ పెరుగుదలకు కావలసిన పిండి పదార్థాన్ని తయారుచేసుకుంటాయి.ఈ ప్రక్రియలో భాగంగానే చెట్లు ప్రాణులకు అవసరమైన అక్సిజన్ ని విడుదల చేస్తాయి. చెట్లు బాస్పొత్పేకం(Transpiration) )ద్వార నీటిని....అవిరి రూపంలొ వెలువరిస్తాయి. దాంతో వాతావరణం చల్లబడుతుంది. పొగ,దుమ్ము, దూళి ,రసాయనిక అణువులు చెట్ల కొమ్మలు,అకులు,కాండాలపై స్థిరంగా పరుచుకొని పోతాయి. ఆ విదంగా అవి మన ఆవాసాల్లోకి చొరబడకుండా ఒక తెరలాగ అడ్దుకుంటాయి.
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, August 02, 2011

సబ్బు నురగ నుంచి వచ్చే బుడగలను తడి చేత్తొ ముట్టుకుంటే పేలవు పొడిచెత్తొ తాకితే పేలిపొతాయి ఎందుకు?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

Q : సబ్బు నురగ నుంచి వచ్చే బుడగలను తడి చేత్తొ ముట్టుకుంటే పేలవు . పొడిచెత్తొ తాకితే పేలిపొతాయి ఎందుకు?

(A)===> నీటిలొ సబ్బును వేసినపుడు ...తలతన్యత (surface tension) తగ్గడం వల్ల బుడగలు ఎర్పడతాయి. వీటి లోపల ఉందేదంతా నీటి ఆవిరి,గాలె .

బయటి గాలి పీడనం, బుడగ లోపలి గాలి పీడనం సమానం గా ఉన్నంతసేపు బుడగ స్థిరంగానే ఉంటుంది.లోపలి పీడనం కొంచెం అదికంగా ఉండటంతో బుడగ పెద్దదై ...బయటి గాలి పీడనానికి సమానం అయ్యేంతవరకు విస్తరిస్తుంది. దీని పొర చాలా పలుచగ అంటే మిల్లిమిటరులో పది నుంచి వందవ బాగం మందం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎది తగిలిన ఇట్టె పగిలిపోతుంది. చేయి తడిగా ఉందంటె నీటిపొరతో కూడి ఉన్నట్టే కాబట్టి బుడగ తాకినా దానిపై పొరకు ఏమీ కాదు. పొడిచేత్తొ ముట్టినపుడు బుడగ పైపొరలొని నీరు చేతికి అంటుకుంటుంది. అప్పుడు బుడగ పై పొరలొని నీరు కొంత వెళ్ళిపొయినట్టే కదా . కొన్ని ఇటుకలు తీసెస్తే గోడ కూలినట్టుగానే పొడి చేయి బుడగకు తగిలినపుడు బుడగ పై పొరలొని నీటిని కోల్పొయి అది పేలిపొతుంది.
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ద్వని ఎందుకు ప్రయాణించదు?,Why cann't sound travel empty(vaccum)space



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


(Q)శూన్య ప్రదెశంలో కాంతి పయనిస్తుంది.కాని ద్వని ఎందుకు ప్రయాణించదు?,

(A)===> ద్వనిని యాంత్రికరంగం ( Mechanical wave )అనీ,కాంతిని విద్యుదయస్కంత తరంగం (Electro magnetic wave )అనీ అంటారు.యాంత్రిక తరంగాలు బౌతికంగా ఉండె ద్రవ్యకణాల ప్రకంపనాల ద్వారానే పయనిస్తాయి. ఘన, ద్రవ, వాయు పదార్థాలాలోని కణాలు కంపించడం వలనే ద్వని శక్తి ఒక కణం నుంచి మరొ కణానికి యాంత్రిక తరంగ రూపంలో పయనిస్తుంది. అందువల్ల ద్వని ప్రసరించడానికి ఒక మాద్యమం అవసరం ఎంతైనా ఉంది.
ఇక విద్యుదావేశాలు కంపనం చెందితే వాటి చుట్టూ విద్య్త్తుత్తు, అయస్కాంత క్షెత్రాలు ఉత్పన్నమవుతాయి. ఆ క్షెత్రాలు ఒకదానితో మరొకటి లంబంగా ఉండే సమతాలాల్లో డోలనాలు ( Oscillations) ) చేస్తూ ఉంటాయి. ఆ డోలనాల మూలంగా ఉత్పన్నమయ్యే కాంతిలాంటి విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరించాడానికి మాద్యమం అవసరం లేదు. కాబట్టి అవి శూన్యంలో కూడ పయనిస్తాయి. మన కంటికి కనిపించే కాంతి మాత్రమే కాకుండ ,కనిపించని పరారుణ ( Infrared ),అతి నీలలోహిత ( Ultra Violet )కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ రే కిరణాలు, గామ కిరణాలు కూడ విద్యుదయస్కాంత తరంగాలే.. వీటి పయణానికి ఏ మాద్యమం అవసరం లేదు.ఇవి శూన్యంలొ కూడ పయనిస్తాయి.


మూలము : http://hiphop-harry.blogspot.com/
  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

క్యారెటు(నాన్యత) అంటె ఎమిటి?, What is carat(purity)?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
Q) :బంగారం గురించి చెప్పెటప్పుడు 24 క్యారెట్లు అంటుంటారు.అసలు క్యారెటు అంటె ఎమిటి?, What is carat(purity)?

(A)===> అడుగు,ఫౌన్స్,ఫారన్ హీట్ వంటి ప్రమాణాలు చాలవరకు బ్రిటన్ రాచరిక వ్యవస్థ కారణంగా అచరణలోకి వచ్చాయి. 24 క్యారెట్లు కూడ ఓ మెరకు అటువటిందే ప్రాచిన బ్రిటన్ దెశంలో గ్రెయిన్,క్వార్ట్ అనే నాణెలు ఉండెవి ఒక గ్రెయిన్ కి నాలుగు క్వార్ట్ లు సమానం.నాలుగు గ్రెయిన్లు చెయాలంటే ఒక క్యారెట్ బంగారం కావలని అనుకునేవారు.అప్పట్లొ వర్తకులు,సంపన్నులు ఏటా 24 క్యారెట్ల విలువైన నాణెలను రాజుగారికి అందించడం ఒక ఆనవాయితిగా ఉండేది.దీనికి పూర్తిగా శుద్దిగా ఉండె బంగారాన్ని వాడేవారు. క్రమేపి బంగారం స్వచ్చతకు 24 క్యారెట్లు అనేది బంగారం గీటురాయిగ మారింది. ప్రస్తుతం ఒక క్యారెట్ ఒక నిష్పత్తి మాత్రమె. ఒక వస్తువులొ 100 శాతం బంగారం మూలకం ఉందనుకొండి అప్పుడది 24 క్యారెట్ల బంగారపుదని అర్థం అదే 75% మాత్రామే ఉంటె 18 క్యారెట్లదని , 50% శాతమైతే 12 క్యారెట్లదని అంటారు. అయితే 24 క్యారెట్ల బంగారం శుద్దమైనదైనా దానిని అభరణాలుగ మల్చడానికి వీలుకాదు. అందుకె అందులో కొంచెం రాగిని కలుపుతారు. దాంతొ అభరణాల క్యారెట్ విలువ 24 క్యారెట్ల కన్నా కొంచెం తక్కువగ ఉంటుంది.


మూలము : http://hiphop-harry.blogspot.com/
  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

దీపం వెలుగులొ వస్తువు పరిమాణం కన్నా దాని నీడ ఎందుకు పెద్దదిగా ఉంటుంది?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : దీపం వెలుగులొ వస్తువు పరిమాణం కన్నా దాని నీడ ఎందుకు పెద్దదిగా ఉంటుంది?

జ : ===> కాంతి జనకానికి అంటే దీపానికి దగ్గరగా ఉన్నపుడే దాని నీడ పెద్దదిగా కనిపిస్తుంది. బిందువు పరిమాణంలొ ఉండె కాంతి జనకం ( point source )నుంచి వచ్చే కిరణాలు అపసరన (Divergent ) మార్గంలొ నలుదిశలకు వ్యాపిస్తుంటాయి సరళ రెఖాల్లొ ప్రయాణించె ఈ కాంతి కిరణాలను యెదైన కాంతి నిరొదక (opaque ) వస్తువు అడ్డుకుంటె, కిరణాలు ఆ వస్తువు గుండా ప్రసరించలెవు కాబట్టి వస్తువు వెనుక చీకటి ప్రదెశం ఎర్పడుతుంది అదే వస్తువు నీడన్న మాట.

కాంతి జనకం వస్తువు నుంచి చాల దూరంలొ ఉంటె వస్తువును చేరుకునే కిరణాలు ఒక దానితొ మరొకటి సమాంతరంగా ఉంటాయి.దాంతొ ఎర్పడె నీడ,ఆ వస్తువు పరిమాణం లొనే ఉంటుంది.అదే బిందు పరిమాణం లో ఉండె కాంతి జనకం వస్తువుకు దగ్గరగా ఉందనుకొండి.కాంతి జనకాన్ని , వస్తువు చివర్లను కలిపే ఎక్కువ కోణం గల కాంతి కిరణాలు మాత్రమె వస్తువును దాటుకొని పొతాయి .కాబట్టి నీడ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. వస్తువు కాంతి జనకం దగ్గరకు వచ్చే కొద్ది నీడ పరిమాణం పెద్దదిగా అవుతూ ఉంటుంది.

Source : http://hiphop-harry.blogspot.com/
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.