Friday, September 30, 2011

క్లోనింగ్‌ అంటే ఏమిటి?,What is Cloning?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: క్లోనింగు ద్వారా జీవుల్ని పుట్టించవచ్చంటారు. ఆ ప్రక్రియ ఎలా సాధ్యం?

-ఎ. శంకర్‌, రాజంపేట (కడప)

జవాబు:
క్లోనింగ్‌ అంటే కోన్ల (Clones)ను తయారు చేయడం. క్లోన్‌ అంటే ప్రతిరూపం(duplicated copy) అని అర్థం. ఏ జీవి అయినా జీవకణాల(సెల్స్‌)తో రూపొందినదేనని తెలుసు కదా? ఈ కణాలలో ప్రధానంగా రెండు రకాలున్నాయనుకోవచ్చు. ఒకటి సోమాటిక్‌ సెల్‌ అయితే, రెండోది జెర్మ్‌ సెల్‌. జెర్మ్‌ సెల్స్‌నే పునరుత్పత్తి కణాలంటారు. ఆడ జాతిలో వీటిని అండ కణాలనీ, మగ జాతిలో వీటిని శుక్ర కణాలనీ పిలుస్తారు. ఇవి మినహా మిగతా శరీరమంతా ఉండే కణాలను సోమాటిక్‌ సెల్స్‌ అంటారు. ప్రతి కణంలోనూ కేంద్రకం (న్యూక్లియస్‌) ఉంటుందని తెలుసు కదా? అలా సోమాటిక్‌ కణాల కేంద్రకంలో క్రోమోజోములు జతలుగా ఉంటాయి. అదే జెర్మ్‌సెల్స్‌ కేంద్రకంలో ఒంటరి క్రోమోజోములు ఉంటాయి.

సహజంగా సంతానోత్పత్తి జరిగేప్పుడు ఆడ, మగ జాతుల కలయిక వల్ల అండ, శుక్ర కణాలలోని ఒంటరి క్రోమోజోములు జతగూడి పిండకణం (జైగోట్‌)గా ఏర్పడుతాయి. ఆపై అది కణ విభజన చెందుతూ శిశువుగా రూపొందుతుంది.

ఇప్పుడు కృత్రిమంగా జరిగే క్లోనింగ్‌ ప్రక్రియ దగ్గరకి వద్దాం. ఆడజాతికి చెందిన జీవి అండకణాన్ని తీసుకుని దానిలోంచి ఒంటరి క్రోమోజోములతో కూడిన కేంద్రకాన్ని తొలగించి, కేవలం అండకణ కవచాన్ని మిగులుస్తారు. ఆ తర్వాత సోమాటిక్‌ కణాన్ని తీసుకుని అందులో జంట క్రోమోజోములతో కూడిన కేంద్రకాన్ని వేరు చేసి, అండకణ కవచంలో ప్రవేశపెడతారు. ఇలా ఏర్పడిన కొత్త అండ కణంలో జంట క్రోమోజోములున్న కేంద్రకం ఉందన్నమాట. ఆపై కొన్ని రసాయనిక మార్పులు చేయడం ద్వారా ఈ అండకణం పిండకణం (జైగోట్‌)లాగా ప్రవర్తిస్తుంది. అప్పుడు దీన్ని ఆడ జీవి అండాశయంలో ఉంచుతారు. అందులో కణవిభజన జరుగుతూ శిశువుగా ఎదుగుతుంది. నిర్ణీత గర్భధారణ సమయం తర్వాత ఆ జీవి క్లోనింగ్‌ శిశవును ప్రసవిస్తుంది.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

హిందూ దేవుళ్ళ పూజలో కొబ్బరికాయకొట్టడములో ముఖ్య ఉద్దేశమేమిటి?,What is behind striking coconut before Hindu God worship?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : హిందూ పూజాకార్యాలలో ముందు కొబ్బరి కాయ ఎందుకు కొడతారు ?.

జ: మన కోర్కెలకోసం , సమస్యల నివారణకోసము గణేశుని ముందు ఒక కొబ్బరికాయ కొట్టి మన కోర్కెలను సఫలీకృతం చేయమని ప్రార్ధిస్తాము . ఇది తరతరాలుగా వస్తున్న ఆచారము . దాదాపు మన ఆచారాలు అన్నిటిలో శాస్త్రీయత దాగి ఉంది. కానీ ఒకప్పుడు ''ఈ పని చేస్తే, ఈ ప్రయోజనం కలుగుతుంది..'' అని చెప్పకుండా ''ఇలా చేయండి.. అలా చేయొద్దు'' అని మాత్రమే చెప్పేవారు. అదొక ఆచారంగా కొనసాగితేనే మంచిదని, ఉపయోగాలు ఉంటాయని చెప్తే ఎక్కువమంది బద్ధకిస్తారనేది పెద్దల ఉద్దేశం. అయితే, అలా శాసించడం వల్ల కొందరు వాటిని మూఢ నమ్మకాలు అని నిరసించడం జరుగుతోంది. ఆలోచించి చూస్తే, ప్రతి ఆచారం వెనుకా కారణం ఉంటుంది. దేవుడి పూజలో కొబ్బరికాయ కొట్టి, ఆ నీటితో దేవునికి అభిషేకం చేయడం వెనుక కూడా అర్ధం, పరమార్థం ఉన్నాయి.

దీనికో పురాణ కథ ఉన్నది . త్రినేత్రుడైన శివుడు ముగ్గురు రాక్షసుల్ని సంహరించాల్సి వచ్చింది . వారు " తామ్ర , లోహ , సువర్ణ " నగరాలలో నివసిస్తూ ప్రజల్ని పీడిస్తున్నారు . పరమేశ్వరుదు వారిని సంహరించడానికి వెళ్ళినపుడు ఆయనకు అనేక విఘ్నాలు ఎదురవుతాయి. అప్పుడు శివుడు ... విఘ్నాధిపతి అయిన తన కొడుకును ఆటంకాలనివృత్తికి తరుణోపాయము అడుగుతాడు . శివుని శిరస్సు నివేదంగా తనకు సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోతాయని వినాయకుడు సూచిస్తాడు . అప్పుడు ప్రజలు యుక్తిగా శివుని తలకి బదులుగా మూడు కళ్ళున్న కొబ్బరికాయను కొట్టి వినాయకునికి సమర్పించారు . ఈశ్వరుడు అసురుపై యుద్ధము చేసి వారిని సంహరిస్తాడు . అప్పటినుండి నారికేళానికి పూజ్యత లభించినదని అంటారు . ఏ శుభకార్యానికైనా ఆరంభములో కొబ్బరికాయ కొట్టడం ఆచారమయినది .

  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, September 29, 2011

పాము చిన్న- విషము మిన్న సంగతేమిటి ?,What about Small snake-dangerous poison?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : పాము చిన్న- విషము మిన్న సంగతేమిటి ?
జ : పాముల లోకంలో... మరో కొత్త సర్పం! అదేంటో? ఏ జాతికి చెందిందో?విశేషాలేంటో తెలుసుకుందామా!
భూమిపై దాదాపు 2,700 జాతుల పాములు తిరుగాడుతున్నాయి. ఇందులో మూడు వందలకు పైగా విషపూరితమైనవి. ఈ విషపూరితమైన పాముల జాబితాలో ఇప్పుడు మరొక కొత్త పాము కలిసింది. ఇది ఎన్నో వేల ఏళ్ల నుంచి ప్రపంచంలో బతుకుతున్నప్పటికీ శాస్త్రవేత్తల కంటపడింది మాత్రం ఈ మధ్యనే. మట్టి, బూడిద రంగులు కలిసినట్లుగా ఉండే ఈ పాము చైనా అడవుల్లో పాక్కుంటూ పోతుంటే పరిశోధకులు పట్టుకున్నారు. పరిశీలిస్తే ఇది రక్తపింజరి (పిట్‌వైపర్‌) జాతికి చెందిన కొత్తరకమని తేలింది. ఇప్పటికే ఈ జాతిలో 200 రకాల పాములున్నాయి. ఇంతకీ దీని పొడవెంతో తెలుసా? కేవలం రెండున్నర అడుగులు! అందుకే దీన్ని చిన్నపాముల జాబితాలో చేర్చారు.

రక్తపింజరి పాములు ప్రమాదకరమైనవి. కొత్త పాము చిన్నదే అయినా ఇది కరిస్తే మనిషి చనిపోతాడు. ఇది దొరికిన అడవి ప్రాంతాల్లో గిరిజనులు దీని కాటుకు బలవుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. వీటి విషం రక్తనాళాల్ని, కండరాల్ని దెబ్బతీస్తుంది.

ఈ జాతి పాములకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదేంటో తెలుసా? రాత్రయినా, పగలైనా తమ ఆహారం లేదా శత్రువులు ఎంత దూరంలో ఉన్నాయో సులువుగా తెలుసుకోగలవు. కళ్లకి, ముక్కుకి మధ్య ఉండే రెండు చిన్న రంధ్రాల్లాంటి భాగాల వల్ల దీనికి ఆ శక్తి వచ్చింది. ఆ భాగాల్నే 'పిట్‌' అంటారు. దానికి కొంచెం దూరంలో ఏ ఎలుకో ఉందనుకోండి, దాని శరీర ఉష్ణోగ్రతను పిట్‌ భాగాలు గ్రహించేస్తాయి. దాన్ని బట్టి అది ఎంత దూరంలో, ఏ దిశలో ఉందో పాముకి తెలిసిపోతుంది. అంతేకాదు పరారుణ కిరణాలను గ్రహించే శక్తి ఉన్న దీని కళ్ల వల్ల ఆ జీవి ఎక్కడ దాగి ఉన్నా ఇది పసిగట్టేస్తుంది. ఈ విద్యల వల్లనే అది శత్రువుల ఉనికిని కూడా ముందుగానే గ్రహంచి జాగ్రత్త పడిపోతుంది.

మూలము : ఈనాడు దినపత్రిక (27-09-2011).
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఉడుముకు ఆ పట్టెలా?,How does Monitor lizard has strong grip?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: నున్నటి చదునైన ప్రదేశాల్లో కూడా ఉడుము సులభంగా పరుగెత్తడమే కాకుండా గట్టిగా పట్టుకుని ఉండగలదు. ఇదెలా సాధ్యం?

-ఎమ్‌. రాజారావు, 8వ తరగతి, ఉరవకొండ

జవాబు: ఉడుములు వరానిడే కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. ఈ కుటుంబంలో ఉన్న ఒకే ప్రజాతి వరానస్.ఉడుము గాజులాంటి నున్నటి తలాలపై కూడా నిట్టనిలువుగా పరుగెత్త గలదు. పైకప్పులను గట్టిగా పట్టుకుని స్థిరంగా ఉండగలదు. వాటి పాదాల కింద ఉండే ప్రత్యేకమైన మెత్తలే (pads) ఇందుకు కారణం. వీటిపై లక్షలాది వెంట్రుకలు, వేలాది బొడిపెలు (bulges) ఉంటాయి. ఈ సూక్ష్మ వెంట్రుకల రాపిడి వల్ల దుర్బల స్థిర విద్యుత్‌ బలాలు (weak electrostatic forces) ఉత్పన్నమై అవి తలానికి అంటుకుని పోతాయి. ఒకో బొడిపె అతుక్కునే బలం (adhesive force) తక్కువే అయినా, వేలాది బొడిపెల వల్ల ఉత్పన్నమయ్యే బలం ఎక్కువవడంతో ఉడుము గట్టి పట్టును కలిగి ఉంటుంది. ఇలా దాని నాలుగు పాదాల వల్ల కలిగే బలం వల్ల దాదాపు 140 కిలోల బరువును కూడా లాగుతూ నిలువుగా ఎగబాకగలదు. అందుకే పూర్వం సైనికులు ఉడుముల నడుములకు తాళ్లను కట్టి వాటిని పట్టుకుని కోట గోడలను ఎక్కేవారు. 'ఉడుము పట్టు' వ్యవహారికంగా మారడానికి ఇదే కారణం.

-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, September 25, 2011

బట్టల బీరువాలో కలరా వుండలెందుకు ?,Why do we use Naphthalene balls in clothes shelf?


  • -



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !

ప్ర : బట్టల బీరువాలో కలరా వుండలెందుకు ?

జ : అల్మైరాలోని బట్టలు కంపుకొడుతున్నాయా? దీనికి కారణం అందులో చేరే బూజులు, పురుగులు కావచ్చు. బట్టలపై చేరే ఆ దుమ్ము, పురుగులు పోవాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. చెక్క అల్మైరాలలో వుంచే బట్టలకు బూజులు, పురుగులు పట్టకుండా వుండాలంటే కలరా వుండలు (Naphthalene ) ఉంచుతారు . కలరా వుండలు సులభముగా ఆవిరి అయ్యే గుణము ఉంది . కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులనుండి తయారుచేసే నాఫ్తలిన్‌ బాల్స్ లోని రసాయనాలు గాలిలో వ్యాప్తిచెంది కీటకాలను , బూజు క్రిములను పారద్రోలుతాయి. క్యాంఫర్ బాల్స్ వాసనకి క్రిమి , కీటకాదులు బట్టలలో చేరవు . Naphthalene consists of two benzene rings fused together. Chemical formula: C10H8.

కర్పూరం (Camphor) :ఇది ఒక వృక్షం నుండి వస్తుంది , భారీ వృక్షము ఇది . స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం .. చెట్టు కాండము , వేళ్ళు , చెక్కలు , ఆకులు , కొమ్మలు , విత్తనాలు నుండి లబిస్తుంది . దీని శాస్త్రీయ నామము " సిన్నమోమం కాంఫోరా ".
కృత్రిమం గా టర్పెంటైన్ ఆయిలు(Turpentine oil) నుండి కుడా కర్పూరం తాయారు చేస్తారు .

సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు . వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది . . . ప్రవిత్రం గా భావిస్తారు . కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి . కర్పూరం (C10H16O) ప్రగాఢమైన , తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది .
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, September 23, 2011

క్యూసెక్కు అంటే ఏంటి?,What is meaning of Cusec?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్ర్రశ్న: ప్రాజెక్టులకు సంబంధించి వచ్చే నీరు (ఇన్‌ఫ్లో), బయటకు విడుదల చేసే నీటిని (ఔట్‌ఫ్లో) క్యూసెక్కులలో కొలుస్తారు. క్యూసెక్కు అంటే ఏమిటి? దాన్ని ఎలా కొలుస్తారు?

-అయిచితుల పావని, ఎస్‌.ఆర్‌.జూనియర్‌ కళాశాల, కరీంనగర్‌

జవాబు: ద్రవాల ఘనపరిమాణానాన్ని బ్రిటిష్‌ కొలమానమైన fps (foot-pound-second) ప్రమాణాలతో ఘనపుటడుగు (cubic foot) లలో కొలుస్తారు. ఒక్క సెకను కాలంలో ఎన్ని ఘనపుటడుగులు ప్రవాహం ద్వారా ప్రయాణిస్తున్నాయో ఆ సంఖ్యను క్యూసెక్కు (cubic feet per second) అంటారు. cubic feet per లోని cu భాగాన్ని secondలోకి sec ముక్కను కలిపి కుట్టితే ఏర్పడిన సంధి పదం cusec. ఒక సెకను కాలంలో ఒక ఘనపుటడుగు చొప్పున ప్రవాహం ఉన్నట్లయితే అది ఒక క్యూసెక్కు ప్రవాహం అన్నమాట. ఇది సుమారు 28 లీటర్లకు సమానం. అంటే ఒక రంధ్రంగుండా సుమారు 28 లీటర్లు (28.316847 లీటర్లు శాస్త్రప్రకారం) ఒక్క సెకనుకు ప్రవాహం ఉంటే దాన్ని ఒక క్యూసెక్కు అంటారు.

-- source : Eenadu hai bujji article.
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మంచులో శవం పాడవదేం?,Why donot corpse spoil in ice?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: మంచుగడ్డల్లో పడ్డ మృతదేహం వందల సంవత్సరాలైనా చెడిపోదు. కానీ బతికున్న మనం మంచు గడ్డల్లో కొన్ని గంటలుంటే చనిపోతాము. ఈ వైవిధ్యం ఏమిటి?

-సి.ఎస్‌. శేఖర్‌, తిరుపతి

జవాబు: జీవకణంలో రసాయనిక, భౌతిక చర్యలు సజావుగా సాగినప్పుడే జీవం ఉంటుంది. ఆ చర్యలకు ఉష్ణోగ్రత కూడా అనువుగా ఉండాలి. ఉష్ణోగ్రత అధికంగా పెరిగినా, బాగా తగ్గిపోయినా జీవచర్యలు అదుపు తప్పుతాయి. అందువల్లనే విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు, లేదా విపరీతమైన ఎండలున్నప్పుడు మనిషి చనిపోతాడు. అలాగే మంచు గడ్డల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద కూడా మరణం ఏర్పడుతుంది. ఇక మృతదేహం చెడిపోవడమంటే, దాని మీద వాతావరణం, మట్టి, నీరు తదితర పరిసరాల్లో ఉండే సూక్ష్మజీవులు దాడి చేసి, అందులోని మాంసకృత్తుల్ని, ఇతర పదార్థాలను గ్రహించడమే. ఆ సూక్ష్మజీవులు తమ ప్రతాపం చూపాలన్నా కూడా వాటికీ అనువైన ఉష్ణోగ్రత ఉండాల్సిందే. అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవులు తమ దాడిని కొనసాగించలేవు. సంతానాన్ని వృద్ధి చేసుకోలేవు. అందువల్లనే మంచుపర్వతాల్లో మరణించినవారి శరీరాలు వేలాది ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉంటాయి. అల్ప ఉష్ణోగ్రతల వద్ద సూక్ష్మజీవులు పనిచేయలేవు కాబట్టే, ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలు చెడిపోవు.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ,జనవిజ్ఞానవేదిక





  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మందుపాతరలు తెలిసేదెలా?,How can we know explosive places?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్రశ్న: భూమి లోపల అమర్చిన లాండ్‌మైన్స్‌ ఉనికిని ఎలా కనిపెడతారు?

-ఎమ్‌. నటరాజన్‌, 10వ తరగతి, తిరుపతి

జవాబు: భూమిని తవ్వి లోపల పేలుడు పదార్థాలను అమర్చి మట్టిని కప్పేయడం వల్ల లాండ్‌మైన్స్‌ (మందుపాతరలు) ఉనికి పైకి తెలియదు. దాని మీంచి బరువైన వాహనాలు ప్రయాణించినప్పుడు ఆ ఒత్తిడికి పేలుతాయి. లేదా వాటిని అమర్చిన దుండగులు రిమోట్‌ కంట్రోలు సాయంతో దూరం నుంచి పేలుస్తుంటారు. మందుపాతరల ఉనికిని కనిపెట్టడం మెటల్‌ డిటెక్టర్ల సాయంతో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాటిలో అమర్చే పేలుడు పదార్థాలను లోహమిశ్రమాలతో కాకుండా కృత్రిమమైన సింథటిక్‌ మెటీరియల్స్‌తో చేస్తారు. అయితే కప్పెట్టిన పేలుడు పదార్థాల పరమాణువులు ఆవిరవుతూ నేలలోని పగుళ్లగుండా బయట వాతావరణంలో కలుస్తూ ఉంటాయి కాబట్టి, వాటిని కనిపెట్టగలిగే పరికరాలు ఉంటాయి. మానవ శరీరంలోని భాగాలను చిత్రాల ద్వారా తెరపై చూపించే 'న్యూక్లియర్‌ మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌' సాధనం ద్వారా మందుపాతరల ఉనికిని చూడవచ్చు. వీటి ద్వారా వెలువడే విద్యుదయస్కాంత తరంగాల సాయంతో పేలుడు పదార్థాల నుంచి వెలువడే అణువులను కనిపెట్టవచ్చు. అలాగే కొన్ని పరికరాల ద్వారా శక్తిమంతమైన శబ్దతరంగాలను భూమి లోపలికి ప్రసరించేలా చేస్తారు. అవి మందుపాతరలను స్వల్పంగా కంపింపజేస్తాయి. ఈ కంపనాలను గ్రాహకాల ద్వారా నమోదు చేసి పేలుడు పదార్థాలు ఎంత దూరంలో ఉన్నాయి, వాటి తీవ్రత ఎంత, ఏ రకానికి చెందినవి అనే విషయాలను కనిపెడతారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌




  • ===================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సముద్రం నీలమేల?,Why do Sea appears blue?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: సముద్రపు నీరు నీలం రంగులో కనిపిస్తుంది, ఎందుకు?



జవాబు: ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సూర్యుని కాంతి ప్రధానంగా ఏడు రంగుల మిశ్రమమని చదువుకుని ఉంటారు. ఈ కాంతి సముద్రంపై పడినప్పుడు నీటి అణువులు ఆ కాంతిని వెదజల్లుతాయి. దీన్నే పరిక్షేపం (స్కాటరింగ్‌) అంటారు. ఇలా వెదజల్లేప్పుడు సూర్యకాంతిలోని ఇతర రంగుల కన్నా నీలం రంగు ఎక్కువగా పరిక్షేపమవుతుందనేది స్థూలంగా చెప్పే కారణం. రసాయనిక బంధాల పరంగా చూస్తే నీరు దృశ్యకాంతిని శోషించుకోలేదు. అందుకనే సాధారణ నీరు వర్ణరహితంగా, పారదర్శకంగా (colourless, transparent) ఉంటుంది. నీటి అణువులు కాంతిని శోషించుకోలేవు కాబట్టే వెదజల్లుతాయి. ఆ ప్రక్రియలో అధికంగా నీలం రంగునే వెదజల్లుతాయి. మన కన్ను సూటిగా వెళ్లే కాంతి కన్నా అన్ని వైపులకూ వెదజల్లిన కాంతిని ఎక్కువగా గుర్తించగలుగుతుంది. అలాగే నీలంగా కనిపించే ఆకాశాన్ని నీరు ఒక అద్దంలా ప్రతిబింబించడం కూడా సముద్రపు నీలం రంగుకు ఒక కారణమని కూడా చెప్పవచ్చు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానకేంద్రము .
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, September 16, 2011

ఆపిల్ కోసిన కాసేపటికి రంగు మారుతుందెందుకు?,‌Apple changes color on cut-Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

పశ్న: ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది.ఎందుకు?,

-కె. వెంకోబరావు, 10వ తరగతి, కావలి (నెల్లూరు)

జవాబు: ఆపిల్‌ పండులో 'టానిక్‌ యాసిడ్‌' అనే రసాయనిక ద్రవం ఉంటుంది. మనం ఆపిల్‌ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆ భాగాలకు గాలి తగులుతుంది కదా? అప్పుడు వాటిలోని టానిక్‌ యాసిడ్‌కి, గాలిలోని ఆక్సిజన్‌కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఫలితంగా పాలీఫినాల్స్‌ (poly phenols) అనే పదార్థం ఏర్పడుతుంది. ఆక్సీకరణం (Oxidation) అనే ఈ చర్య వల్ల ఏర్పడే పాలీఫినాల్స్‌ బ్రౌన్‌ రంగులో ఉంటాయి. అందువల్లే ఆపిల్‌ ముక్కలు ఆ రంగులోకి మారతాయి.

అలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ ఆపిల్‌ పండులో ఉండే టానిక్‌ యాసిడ్‌పై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, September 10, 2011

మరింత ఎర్రన ఎందువలన?, More red Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్రశ్న: గోరింటాకు పెట్టుకున్నాక ఆ వేళ్లను పంచదార నీళ్లు, లేదా నిమ్మరసం పిండిన నీళ్లలో కాసేపు ఉంచితే గోరింటాకు బాగా పండుతుంది. ఎందుకని?

-కె. అభిషిక్త, తాడేపల్లిగూడెం

జవాబు: గోరింటాకులోని కొన్ని వర్ణ ద్రవ్యాలు గోళ్ల లోని కెరోటిన్‌ అనే ప్రత్యేకమైన ప్రొటీన్‌తో రసాయనికంగా బంధించుకుంటాయి. అక్కడ అణునిర్మాణంలో మార్పులు రావడం వల్ల ఆ సమ్మేళనాల కాంతి ధర్మాలు (optical properties) మారిపోయి ఎరుపు రంగును ప్రదర్శిస్తాయి. అందుకే గోరింటాకు పూసుకున్న చోట ఎర్రగా కనిపిస్తుంది. గోరింటాకు పెట్టుకున్న చేతులను చక్కెర నీళ్లలోను, నిమ్మరసం పిండిన నీళ్లలోను ఉంచినప్పుడు రెండు కారణాల వల్ల ఇది మరింతగా స్థిరపడుతుంది. చక్కెర, నిమ్మరసం నీళ్ల వల్ల చర్మపు పొరలు బాగా వదులుగా అయి, చర్మం మెత్తపడుతుంది. దాని వల్ల గోరింటాకు వర్ణద్రవ్యపు అణువులు మరింత లోతుగా చర్మంలోకి ఇంకుతాయి. అలాగే వర్ణద్రవ్యాలలోని హైడ్రోజన్‌ అయాను చలనాన్ని ఈ ద్రావణాలు ప్రభావితం చేస్తాయి. దీన్నే బఫరింగ్‌(buffering) అంటారు. అందువల్ల ఆ వర్ణద్రవ్యాలు మరింత ఎరుపు రంగును వెదజల్లే అణ్వాకృతి (molecular orientation) ను పొందుతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

సైకిల్‌ నిలబడదేం?,Why cann't cycle stand on itself ?.



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: తొక్కేప్పుడు సైకిల్‌ను బ్యాలన్స్‌ చేయగలం. కానీ అదే సైకిల్‌ను రెండు చక్రాల మీద నిలబెట్టలేం. ఎందుకని?

-కె. రాజగోపాలాచారి, తిరుపతి

జవాబు: కదలకుండా ఉండే వస్తువుపై పనిచేసేది గురుత్వాకర్షణ బలం ఒక్కటే. ఏదైనా వస్తువు స్థిరంగా ఉండాలంటే దాని గరిమనాభి (centre of Gravity)ని, భూమిని కలిపే సరళరేఖ ఆ వస్తువు ఆధారపీఠం పరిధిలోనే ఉండాలని మీరు పాఠాల్లో చదువుకుని ఉంటారు. వస్తువు ఆధార పీఠం వైశాల్యం ఎక్కువగా ఉన్న వస్తువులు స్థిరంగా నిలిచి ఉంటాయి. సైకిల్‌ విషయానికి వస్తే దాని ఆధార పీఠమంటే దాని రెండు చక్రాలే. ఆ చక్రాలను కలిపే సరళరేఖ చాలా సన్నగా ఉండడం వల్ల ఆ సైకిల్‌ గరిమనాభి స్థానం నుంచి భూమికి గీసే రేఖ ఆధారపీఠాన్ని దాటి పోతుంది. ఫలితంగా సైకిల్‌ ఒరిగి పడిపోతుంది. అయితే సైకిల్‌ను తొక్కేప్పుడు దానిపై గురుత్వాకర్షణ బలంతో పాటు మరిన్ని బలాలు పనిచేస్తాయి. తొక్కడానికి మనం ఉపయోగించే బలం దానిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం కంటే ఎక్కువగా ఉండడంతో పాటు, అది పక్కకు ఒరిగేప్పుడల్లా మనం హేండిల్‌తో చక్రాలను తిప్పుతూ బ్యాలన్స్‌ చేయగలుగుతాం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, September 09, 2011

ఆసుపత్రులలో వాడే బట్టలు ఆకుపచ్చే ఎందుకు?, Why do hospital clothes are in Green color?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: ఆసుపత్రులలో వాడే బట్టలు, తెరలు, తువ్వాళ్లు సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయెందుకు?

జవాబు: ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా ఆసుపత్రులలో రక్తపు మరకలు అంటుకునే అవకాశాలు ఎక్కువ. వేరే రంగుల దుస్తులు వాడితే ఆ ఎరుపు రంగు మరింత ప్రస్ఫుటంగా కనిపించి రోగులను, వారి బంధువులను భయాందోళనలకు గురి చేసే అవకాశం ఉంది. ఆకుపచ్చ బట్టలపై రక్తం చిందినా అది ఎర్రగా కనిపించదు. నల్లగా కనిపించడం వల్ల ఎరుపు ప్రభావం కనబడదు. ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు రంగులు పరస్పర విలోమ వర్ణాలు(mutually complementary colours). అంటే రెండూ కలిసినప్పుడు పరస్పరం శోషించుకుని నలుపు రంగులోకి మారతాయి. అందుకనే ముఖ్యంగా ఆపరేషన్‌ థియేటర్లలో వైద్యులు, నర్సులు ఆకుపచ్చ బట్టలను కట్టుకుంటారు.

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

టీవీకి స్విచాన్‌ స్విచ్చాఫ్ వెంటవెంటనే చేయకూడదేల ?,Why do TV switch on soon after switch off ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.




పశ్న: టీవీని స్విచాఫ్‌ చేసిన వెంటనే మరలా స్విచాన్‌ చేయకూడదంటారు. ఎందుకని?

-ఎమ్‌. విష్ణుమూర్తి, , కమలాపురం

జవాబు: టీవీలో ఉండే ట్రాన్స్‌ఫార్మర్‌ పనితీరులో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందువల్లనే, స్విచాఫ్‌ చేసిన వెంటనే తిరిగి స్విచాన్‌ చేయకూడదని చెబుతారు. టీవీ విద్యుదయస్కాంత ప్రభావంతో పని చేస్తుందని చదువుకుని ఉంటారు. టీవీని స్విచాఫ్‌ చేసినా ట్రాన్స్‌ఫార్మర్‌లో కొంత అయస్కాంత క్షేత్రం మిగిలి ఉంటుంది. ఈ సమయంలో వెంటనే స్విచాన్‌ చేస్తే విద్యుత్‌ ప్రసారం ఏర్పరిచే అయస్కాంత క్షేత్రం, ట్రాన్స్‌ఫార్మర్‌లో మిగిలి ఉన్న అయస్కాంత క్షేత్రంతో జోక్యం చేసుకుంటుంది. దీన్ని వ్యతికరణం అంటారు. అందువల్ల టీవీ సమర్థత, జీవితకాలం దెబ్బతినే అవకాశం ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో మిగిలి ఉండే అయస్కాంత క్షేత్రం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి నాలుగైదు నిమిషాల తర్వాత స్విచాన్‌ చేయమని సూచిస్తారు.



  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, September 04, 2011

ఎక్కువసేపు నవ్వితే చేతుల్లో నొప్పిపుడుతుందెందుకు?, Laugh for long time produce pain in shoulders-Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : ఎక్కువసేపు నవ్వితే చేతుల్లో నొప్పిపుడుతుందెందుకు?

జ : మానవ మొండెము మధ్యలో చాతి లోని గుండె , ఊపితిత్తులను ... పొట్ట భాగములోని జీర్ణాశయము , జీర్ణావయవాలను వేరుచేస్తూ " డయాప్రమ్‌ " అనే ఉదరవితానము (పొర ) ఉంటుంది . బాగా నవ్వినప్పుడు ఎక్కువగా గాలి లోపలికి ప్రవేశించి ఊపిరితిత్తులు పూర్తిగా నిండి డయాప్రమ్‌ పొరని కిందికి నెట్టుతాయి. . . అదే సమయములో ఉదర కండరములు సంకోచించడమువలన డయాప్రమ్‌ పైకి నెట్టబడుతుంది . ఇలా అనేక సార్లు నిరంతరము గా జరుగుతూ ఉంటే కండరముల ఈడ్పు (Strech) జరుగుతుంది .

ఉదర వితాతనము (డయాప్రమ్‌) తో సంబంధమున్న కండరము , భుజము (shoulder) కండరాలతో సంబంధము ఉన్నందున స్ట్రెచ్ తోపాటు ముఖ్యము గా కుడి చెయ్యికూడా నొప్పికి లోనవుతుంది . ఆనందముగా అలా నవ్వుతూ ఉంటే హార్ట్ ఎటాక్ నొప్పి ఏమోనని అనుమానము కలుగుతుంది . తక్కువగా గాలి పీల్చడమూ, నెమ్మదిగా శ్వాస క్రియ జరపడము , మరీ ఎక్కువగా తినకపోవడమూ వలన శరీరానికి మేలు జరుగుతుంది .

  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

రాత్రివేళ డ్రైవ్ చేస్తుంటే ఎదురుగా ఉన్న లైట్స్ చుట్టూ వలయాలేర్పడతాయెందుకు ? , Circles arround the lights when driving during nights-Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : రాత్రివేళ డ్రైవ్ చేస్తుంటే ఎదురుగా ఉన్న లైట్స్ చుట్టూ వలయాలేర్పడతాయెందుకు ? ,

జ : కను పాప ద్వారా కాంతికిరణాలు కంటిలో ప్రవేశిస్తాయి. పగటి వెలుతురులో కను పాప చిన్నదిగా అయి కాంతికిరణాలు లెన్స్ పై కేంద్రీకరింపజేస్తుంది . రాత్రి వెలుతురు తక్కువగా ఉండడము వలన కనుపాప మరింత పెద్దది అయి ఎక్కువ కాంతికిరణాలను లోనికి ప్రవేశ పెడుతుంది . అందువలన కంటిలోని లెన్స్ పై ఎక్కువమేర కాంతికిరణాలు పడతాయి మరియు ఒకచోట కేంద్రీకరింపబడవు . లెన్స్ గుండ్రముగా ఉండడము వలన గుండ్రని వలయాలుగా కనిపిస్తాయి.

రాత్రి , పగలు అన్నివేళలా ఇలాగే కనిపిస్తూ వుంటే క్యాటరాక్ట్ వచ్చే సూచనగా పరిగణించాలి .
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సూదులు గుచ్చినట్లు ఉంటుందెందుకు?,Why do some feel pinning with needles?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : కొంతమందికి సూదులతో గుచ్చినట్లు ఉంటుందెందుకు?

జ : దీనిని పారస్థీసియా అంటారు . ఇది ఒక అసాధారణమైన ఇంద్రియ జ్ఞానము . ఈ లక్షణము కలవారికి శరీరము పై గుండు సూదులు గుచ్చినట్లు , గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది . ఒక నాడిని అదిమి పట్ట్టడము ద్వారా లేక ఒత్తిడివల్ల దానికి రక్తప్రసరణ సరిగా జరగదు . కొంతసేపు కదలకుండా కూర్చుంటే తిమ్మిరెక్కుతుంది . . కాని పారస్తీసియాలో ఎక్కువకాలము నరాలపై ఒత్తిడి కలగడం , దెబ్బ తగలడం వల్ల ఆయా శరీర భాగాలలో వాపు కలగడం కొన్ని కారణాలుగా చెప్తారు . ఆయా శరీర భాగాలనుంది నొప్పికి సంబంధించిన జ్ఞానము మెదడుకు పంపే ప్రక్రియ లో భాగము గా సూదులు గుచ్చినట్లు అనిపిస్తుంది .

కారణాలు : ల్యూపస్ , మల్టిపుల్ స్క్లిరోసిస్ , డయబిటీస్ మున్నగునవి .
  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, September 03, 2011

కొంతమంది ఎప్పుడూ వణుకుతూ ఉంటారెందుకు?,Why do some shever always?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఫ్ర : కొంతమంది ఎప్పుడూ వణుకుతూ ఉంటారెందుకు?,Why do some shever always?

జ : మెదడులోని హైపోథాలమస్ శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తూ ఉంటుంది . వాతావరణ పరిస్థితులను బట్టి మెదడు ప్రతిస్పందిస్తుంది . ఈ పక్రియ సాఫీగా జరిగేందుకు " ఐరన్‌ " ముఖ్య పాత్రవహిస్తుంది . ఎనీమియా ఉన్నవారిలో ఐరన్‌ తక్కువగా ఉంటుంది . . . కావున వారు చలికి వణుకుతూ ఉంటారు . రక్తప్రసరణ సరిగా జరగకపోవడం , థైరాయిడ్ గ్రంధిం శరీరములో జీవపక్రియల వేగాన్ని తగ్గించడం , కొన్ని జన్యుపరమైన కారణాల వలన చలికి తట్తుకునే పరిస్థితి కుంటుపడడం చేత వీరు వణుకుతూ ఉంటారు .

సాధారణ వయస్సు మీరటం, కదలికలకు సంబంధించి కొంత తగ్గుదల లేక మార్పులు వస్తాయి. వయస్సు మీరటం వల్ల మెదడు అర్ధగోళం ఘనపరిమాణం తగ్గటం, డోపమినిక్‌ ధర్మాలు లోపించటం వల్ల నాడీ మండలంలో మార్పులు వస్తాయి. దీని వల్ల వృద్ధుల్లో అసాధారణ లక్షణాలు గోచరిస్తాయి. ప్రతీ పనికీ ఎక్కువ సమయాన్ని తీసుకోవటం, నిలువుగా వున్న చూపులో అవరోధం, కండరాలు తగ్గిపోవటం, బిగువు ఎక్కువకావటం, ప్రేరకవేగం తక్కువ కావటం, ముందు వెనుకలకు తీవ్రంగా కంపించు శక్తి పాడవటం, స్థితిలో వుండలేకపోవటం, చిన్న చిన్న అడుగులేస్తూ నడకలో వేగం లేకపోవటం కలుగుతాయి. సహజంగా వయస్సు మీరటంలో ఇటువంటి మార్పులతో వృద్ధులో 'పార్కిన్‌సన్‌ వ్యాధి' వల్ల వస్తుంది. ఈ జబ్బువల్ల వృద్ధులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ధర్మాలలో ఎక్కువ చెరుపు, సాధారణ వయస్సు మీరటంలో కలవరం. కదలికల సమస్యలు రెండు రకాలు.... కదలికలు తగ్గి చలనంలేని బిగుతుగా వుండటం వంటి సమస్యలకు అద్దంపట్టే పార్కిన్‌సన్‌ వ్యాధి. ఎక్కువ చలనాలు గల అసంకల్పిత, మితిమీరిన కదలిక గల సమస్యలు
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కొంతమంది చర్మము నల్లగా ఉంటుందెందుకు? Why some skins are black?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

మన శరీరములో చర్మము , వెంట్రుకలు మొదలైన వాటిలో ఒక నల్లటి " వర్ణకము " ఉంటుంది . దీనిని " మెలనిన్‌" అంటాము . సూర్యరశ్మి తగలడము వలన ' మెలనోసైట్స్ 'నుండి ఈ మెలనిన్‌ తయారవుతుంది . మన శరీరము సూర్యరశ్మికి , అతినీలలోహిత కిరణాలకు ఎక్ష్పోజ్ అయినపుడు మెలనోసైట్స్ ఎక్కువగా మెలనిన్‌ ని ఉత్పత్తి చేస్తాయి . ఫలితముగా చర్మాన్ని ఎండనుండి కాపాడుతుంది . ఉష్ణ దేశములో మనిషి నిరంతరమూ ఎండనుండి కాపాడేందుకు మెలనిన్‌ మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కావున ఇక్కడి ప్రజలు నల్లగాఉంటారు . శీతల ప్రదేశాలలో సూర్యరశ్మి తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి వారు తెల్లగా ఉంటారు . ఎండలో తిరిగినప్పుడు చర్మమము కమిలినట్టుగా ఉండటమనేది ' ట్యానింగ్ యొక్క తాత్కాలిక పరిస్థితి . ఎక్కువకాలము అనేక నెలలు , సంవత్సరాలు సూర్యరశ్మి కి ఎక్ష్పోజ్ అయితే శాశ్వితముగా ట్యానింగ్ జరిగి చర్మము నల్లబడుతుంది .

మన చర్మంలో ప్రధానంగా మూడు పొరలు (layers) ఉంటాయి. అన్నింటికన్నా పైన ఉన్న పొరను ఎపిడెర్మిస్‌ (epidermis) అంటారు. ఇది చాలా పలుచగా ఉంటుంది. కంటిరెప్పలపై ఉన్న చర్మంలో దీని మందం సుమారు 0.5 మి.మీ., అరిచేతి చర్మంలో సుమారు 1.5 మి.మీ. మందంలో ఉండగా, అరికాలి చర్మం శ్రామికులకు 2 మి.మీ. వరకూ ఉంటుంది. సుఖజీవులకు కొంచెం తక్కువగా ఉంటుంది. ఎపిడెర్మిస్‌ కింద ఉన్న (రెండో) పొరను డెర్మిస్‌ (dermis) అంటారు. ఇది సుమారు 3 మి.మీ. మందంతో ఉంటుంది. ఇందులోనే రోమాల కుదుళ్లు (hair follicles), చెమట గ్రంథులు (sweat glands), చర్మాన్ని సాగదీయడానికి, కుదించడానికి ఉపకరించే పలుచని సంధాన కండర కణజాలం (connective tissue) ఉంటాయి. డెర్మిస్‌లోనే అడుగుభాగాన నూలుపోగుల కన్నా సన్నని నాళాలతో రక్తనాళాలు(blood capillaries) ఉంటాయి. డెర్మిస్‌కన్నా కింద ఉన్న భాగాన్ని సబ్‌క్యుటేనియస్‌ పొర (subcutaneous layer) అంటారు. ఇందులో కొవ్వు కణాలు దండిగా ఉంటాయి. ఊబకాయం ఉన్న వాళ్లకు ఇక్కడే కొవ్వుకణాలు పేరుకుపోయి వివిధ మందాల్లో ఉంటుంది.


  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఏడుపు (కన్నీరు)వచ్చేదాకా నవ్వుతారెందుకు ? , Why do people laugh until they get tear?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ఏడుపు (కన్నీరు ) వచ్చేదాకా నవ్వుతారు ఎందుకు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ . నవ్వినా , ఏడ్చినా కన్నీరు వస్తుంది . నవ్వు ... ఏడ్పూ రెండూ కూడా సైకలాజికల్ చర్యలే . ఎమోషన్‌ కు లోనైనప్పుడే రెండూ అనుభవిస్తాము . ఆ సమయములో కార్టిసాల్ , ఎడ్రినాలిన్‌ బాగా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి . సుఖ దు:ఖాలలో అత్యున్నత స్థాయికి చేరితే కన్నీళ్ళు పర్వంతం అవుతుంది . ఈ రెండు అవస్థలలోనూ స్ట్రెస్ తగ్గుతుంది . మనసు ప్రశాంతము తయారవుతుంది . భారము తగ్గుతుంది . అందువల్ల ఈ విషయము మనిషి ఆరో్గ్యానికి మరింత అనుకూలమైనదిగా బావించవచ్చు .

కన్నీరు మూడు రకాలు అంటున్నారు - కనీసం ఏడుపు మూడు రకాలు! కన్నీరు కంటిలో వెలుపలి, పై మూలలో తయారవుతుంది. అది బయటికి రావడం మాత్రం లోపలి కింద మూలనుంచి జరుగుతుంది. అంటే కన్నీరు మొత్తం కంటిలో పరుచుకుంటుందని అర్థం. మిల్లి మీటరులో మూడవ వంతు మందం ఉండే ‘పంక్టా’ అనే గొట్టాలు నీటిని ముక్కులోకి, నోట్లో గొంతు మొదట్లోకి కూడా పంపుతాయి. అందుకే ఏడ్చిన తర్వాత నోట్లో కూడా రుచి మారిన భావం కలుగుతుంది. కనుబొమ్మలు కదిలినందుకు నీరు కన్ను అంతటా పరచుకుంటుంది. కన్ను ఆర్పడానికి 0.2 నుంచి 0.3 సెకండ్ల కాలం పడుతుంది. ప్రతి రెండు నుంచి పది సెకండ్ల కొకసారి, మనం, కళ్ళు ఆర్పుతాము. కొంతమంది ఎక్కువగానూ, ఎక్కువ సేపూ కళ్ళార్పుతుంటారు. అలాంటి వారు, జీవిత కాలంలో ఏడు సంవత్సరాలు అదనంగా (నిద్ర కాక) కళ్ళు మూసుకుని బతుకుతారని లెక్క తేలింది.
కన్నీటిలో మూడు రకాల ద్రవాలుంటాయి. అవి మూడు వేరువేరు గ్రంధులలో తయారవుతాయి. మొదటిది తెల్లగుడ్డలో పుట్టే జిగురు ద్రవం. అది కనుగుడ్డు మీద సమంగా అంతటా పరుచుకునే ద్రవం.
రెండవ పొర నీళ్లుగా ఉంటుంది. ఇది లాక్రిమల్ గ్రంధులలో తయారవుతుంది ఇందులో రకరకాల ప్రొటీన్లు, ఆంటి బయోటిక్స్, ఖనిజ లవణాలు ఉంటాయంటే ఆశ్చర్యం కదూ! ఈ కంటినీరు, కనుగుడ్లను సూక్ష్మ జీవుల నుండి కాపాడి వేడిని నియంత్రించి, ఉప్పుదనాన్ని అందించి, రకరకాలుగా సాయపడుతుంది. ఇక కనుబొమ్మల చివరన ఉండే మైలోమియన్ గ్రంధుల నుంచి కొవ్వుతో వచ్చేది మూడవ పొర. ఈ పొర లేకుంటే కన్నీరు వెంటనే కారిపోతుంది. ఆరిపోతుంది కూడా! కన్నీళ్ళకు
మూడు రకాల ద్రవాలున్నట్లే ఏడుపు కూడా మూడు రకాలు, దుమ్ముపడితే వచ్చేవి ఒక రకం. కాంతి, పొగలాంటి వాటి కారణంగా ఏడుపు మరో రకం, భావోద్వేగంతో నవ్వినా, ఏడ్చినా వచ్చేవి మూడవరకం! ఇదీ కన్నీటి గాధ!
  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, September 02, 2011

చెక్కెరలేని గమ్‌ తింటే పళ్ళలో క్యావిటీలు ఏర్పడతాయా?, Do teeth cavities develop on eatint sugarfree gum?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

సుగర్ లేని గమ్‌ తింటే పళ్ళలో కావిటీలు ఏర్పడవు . మనము ఎదైనా తిన్నప్పుడు నోటిలోని బాక్టీరియా ఆహారములోని సుగరు తో కలిసి ఒక రకమైన ఆర్గానిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి . ఈ ఆమ్ల ప్రభావము వలన దంతక్షీణత కలుగుతుంది . క్యావిటీలు ఏర్పడతాయి. సుగరు లేకపోతే ఈ పక్రియ జరుగదు .

నోటిలోని లాలాజలము ఆహారముతో కలిసి ఆ ఆమ్లాన్ని డైల్యూట్ చేస్తుంది . చప్పరిస్తున్నప్పుడు లాలాజలము ఊరుతుంది . అలాగే జున్నులోని కొవ్వులు పళ్ళపైన ఒక పొరగా ఏర్పడి పళ్ళను రక్షిస్తాయి . .దానిలోని కాల్సియం , పాస్పేట్స్ దంతక్షయాన్ని అరికడతాయి. బోజనము తరువాత సుగరు లేని గమ్‌ గాని జున్ను గాని తింటే మంచిదే .
  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఒళ్ళు గగుర్పాటు చెందితే రోమాలు లేచి నిలబడతాయి ఎందుకు ?, Why do some time hair become straight ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

చలి , భయము , అందోళన వంటివి కలిగినప్పుడు మన శరీరము పై గల రోమాలు లేచి నిలబడతాయి . అప్పుడు శరీరము గగుర్భాటు చెందుతుంది . . . శరీరము పై ఉండే ప్రతి వెంట్రుక క్రింద చిన్న కండరము ఉంటుంది . అది సంకోచించినప్పుడు ఆ వెంట్రుక లేచి నిలబడుతుంది . మన శరీరము లోని స్వతంత్ర నాడీవ్యవస్థ ప్రభావము తో రోమాలు నిక్కబొడుచుకుంటాయి . దీనిని శాస్త్రీయముగా " Pilo erection " అంటాము . ఆ సమయము లో వెంటుకల మధ్య గాలి బంధింపబడుతుంది . గాలి గదులు తయారవుతాయి . ఆ గాలి ఉష్ణబందక పదార్ధము గా ఉంటుంది . అందువల్ల శరీరము లోని వేడి బటటికి పోదు . శరీరము వెచ్చగా ఉండి చలి నుండి తట్టుకోగల శక్తి వస్తుంది .

జంతువులలో ఈ పక్రియ తమ శత్రువుల్ని బెదిరించడానికి ఉపయోగపడుతుంది . పిల్లిలో ఇలా జరిగితే లావుగా తయారై చూడడానికి భయంకరం గా ఉంటుంది . దానిని చూసి శత్రువులు పారిపోతారు . మనకి ఆ అవసరము లేకపోయినా పరిణామరీత్యా (on the way of evolution) పాత గుర్తులు ఉందిపోయాయి . ఆ శరీర ధర్మమము అలాగే ఉండిపోయింది . అది తప్పించుకోవాలంటే వేడినిచ్చే బట్టలు వేసుకోండి . భయము తగ్గిందుకోండి . కామ్‌ గా ఉండండి .
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.


కంటిరెప్పలు అదురుతాయెందుకు ?, Eye lids blinks automatically- Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

కంటిని ఆవరించుకొని ... బయట (external) , లోపల (internal) కండరాలు అమరి ఉంటాయి . లోపల కండరాలు కంటి ఫోకస్ ని , ప్యూపిల్ సైజ్ ని కంట్రోల్ చేస్తాయి . బయట కండరాలు కన్ను చూసే వస్తువుల దిశానిర్దేశాలను , వస్తువును నిత్యమూ కదెలే స్థితి ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి . కంటి నరాలలో కలిగే అసంకల్పిత ప్రతీకార చర్యవలన కనురెప్పలు అదురుతాయి . దీనిని " ఐ లిడ్ మయోకిమియా" అని అంటారు . పై రెప్పలకన్నా క్రింది రెప్పలు లోనే ఇది ఎక్కువగాజరుగుతుంది . దీని గురించి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి . మన భారతీయ సంప్రదాయాలలో కంటిరెప్పలు అదిరితే అశుభానికి , ఉపద్రవానిని సూచన గా భావిస్తారు ... ఇది ఒక నమ్మకము మాత్రమే . శుభ ... అశుభాలు మనము చేసే పని మంచి చెడుల మీద ఆదారపడి ఉంటుంది .
  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.



వయసు తో పాటే చెవులు పెరుగుతాయంటారు నిజమేనా? , Ears enlarge size acording age ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

మానవుని వయసు తో పాటు చెవులు పెరుగుతాయని శాస్తజ్ఞులు అంటున్నారు . పుట్టినప్పుడు ముఖము పై ప్రస్పుటం గా కనిపించే చెవులు పదేళ్ళ వయస్సు వచ్చే దాకా బాగా పెరుగుతాయి . తరువాత ఏడాదికి 0.22 మి.మీ చొప్పున్న మాత్రమే పెరుగుతాయి . వయసుతో పాటే చెవి డొప్పలు కూడా పెద్దవవుతాయి . ఇవి ఆడువారిలో కన్నా మగవారిలో పొడవుగా ఉంటాయి . కాని లోపల చెవి నాళము మాత్రము వయసుతో పెరగదు .
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.