Wednesday, February 29, 2012

Why is it called Raakhi poornima ?,రాఖీ పూర్ణిమ అని పేరు ఎలా వచ్చింది?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : శ్రావణ మాసం పూర్ణిమను రాఖీ పూర్ణిమ అని ఆచారములోమి ఎలా వచ్చింది?

జ : శ్రావణ పూర్ణిమ విద్యారంభకాలమని పండితుల అభిప్రాయము . అంటే పూర్వము ఈ రోజున వేదాద్యయనము ప్రారంభించేవారు . దీనికి ముందు యజ్ఞోపవీతధారణ చేయడం మన ఆచారము . యజ్ఞోపవీతాన్నే జంధ్యం అనడం వల్ల ఈ రోజుకి జంధ్యాల పూర్ణిమ అని పేరు వచ్చింది . ఈ పండుగకు పురాణసంబంధమైన ఆచారము కనిపించదు . దీనినే రాఖీ పూర్ణిమ , నార్లీ పున్నమి అనీ అంటారు .

గుజరాత్ కు చెందిన బ్రాహ్మణులు తమ పోషకుల్ని ఈ రోజున సందర్శించి వారి ముంజేతికి రాఖీ కట్టే వారు . వారి నుండి కానుకలు పొందేవారు . రాఖీ అంటే తోరం అని అర్ధము .. . . అందుకే రాఖీ పూర్ణిమ అని పేరొచ్చినది . పట్టు లేదా నూలు దారముతో చేసిన రాఖీకి రకరకాల పూలు , డిజైన్ల బిల్లలు జతచేసి కుడి మణికట్టుకు ముడివేస్తారు .

ఇంకో కదనము ప్రకారము యుద్ధము లో జయము పొందాలని దేవగురువు సలహామేరకు ఇంద్రుని భార్య సతీదేవి భర్తకు శక్తిమయమైన రాఖీని శ్రావణపౌర్ణమి నాడు రక్షణకోసము కట్టడము జరిగినది . రాక్షసులపై ఇంద్రుని విజము పొందడముతో అదొక ఆచారముగా దేవ , దానవ , మానవులలో జరుపుతూ ఉన్నారు . కాలక్రమేణా మానములలో అన్నలు , తమ్ముళ్ళ నుంచి రక్షణ కోరుతూ తమ అనుబంధానికి గుర్తుగా అక్క చెళ్ళెల్లు కట్టే తోరణము గా మారినది . ఓ పెద్ద పండగగా వెలుగొందుతోంది . నేటి సమాజము లో స్నేహితులుగా ఉండే పేమికులలో స్త్రీలు తమవిముఖతను తెలియజేసేందుకు ప్రియునికి రాఖీ కట్టే ఒక మహత్తర మంత్రము గా మారినది .
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...