Thursday, March 22, 2012

లేజర్‌ కిరణాల మర్మమేమిటి?-What is the secrete of LASER



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: లేజర్‌ కిరణాలను ఎలా ఉత్పత్తి చేస్తారు?

జవాబు: లేజర్‌(LASER) అనేది Light Amplification by Stimulated Emission of Radiationకు సంక్షిప్త రూపం. లేజర్‌ ఒక కాంతి జనకం మాత్రమే. లేజర్‌ కిరణాలు మామూలు కాంతి కిరణాల్లాగా చెల్లాచెదురుగా, పోయే కొలదీ ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమించకుండా ప్రయాణిస్తాయి. ఇవి పొందికగా, స్థిరమైన దశలో, ఒకే రంగులో, తీవ్రమైన తీక్షణతో, నిర్దిష్టమైన దిశలో 10 మీటర్ల ఇరుకైన, సన్నని మార్గంలో ప్రయాణిస్తాయి. వైద్య శాస్త్రంలో రక్తం చిందించని శస్త్రచికిత్సలకు, అతి సున్నితమైన కంటి ఆపరేషన్లకు, వజ్రాల్లో రంధ్రాలు చేయడానికి, శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులను ఆకాశంలోనే తునాతునకలు చేయడానికి, రోదసిలోకి ప్రయోగించిన పరికరాల నుంచి సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకోడానికి ఇలా ఎన్నో రకాలుగా లేజర్లు ఉపయోగపడతాయి. లేజర్‌ పుంజంలోని ఒక కిరణం టెలివిజన్‌ ప్రసారాలను, వేల మిలియన్ల టెలిఫోన్‌ సంభాషణలను ఒకేసారి తీసుకుపోగలదు.

మొట్టమొదటి లేజర్‌ 'రూబీ' అల్యూమినియం, ఆక్సిజన్‌ మూలకాల మిశ్రమం. ఇందులో క్రోమియం అనే మూలక కణాలను ప్రవేశ పెడతారు. ఆపై క్రోమియం పరమాణువులు రూబీలోని కొన్ని అల్యూమినియం పరమాణువుల స్థానాలను ఆక్రమించేలా చేస్తారు. ఈ రూబీ స్ఫటికాన్ని ఇరువైపులా చదును చేసి ఆ తలాలపై వెండిపూత పూస్తారు. ఒకవైపు వెండిపూత రెండో వైపు కన్నా రెట్టింపు మందంగా ఉంటుంది. రూబీ స్ఫటికంలో క్రమపద్ధతిలో అమరి ఉండే పరమాణువులు, కాంతిని ప్రసరింపజేసినపుడు ఉత్తేజం పొందుతాయి. ఫలితంగా వెలువడే ఫోటాన్లు రూబీలోని అన్ని దిశలకూ వ్యాపిస్తాయి. కాంతిని ఎక్కువసేపు ప్రసరిస్తే ఫోటాన్ల సంఖ్య ఎక్కువై తక్కువ వెండిపూత ఉన్న తలం నుంచి తప్పించుకుని బయటపడతాయి. అదే లేజర్‌ కిరణం. రూబీ లేజర్‌ తర్వాత ద్రవ, వాయు పదార్థాల లేజర్లు కూడా వాడుకలోకి వచ్చాయి.


-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,--హైదరాబాద్
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

నిర్మల్‌ గ్రామ పురస్కారాలు అంటే ఏమిటి ? - What is Nirmal village awards?


  • image : courtesy with Surya Telugu daily news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


పారిశుద్ధ్యంలో నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్న అత్యుత్తమ గ్రామ పంచాయతీలను కేంద్రం జాతీయస్థాయి 'నిర్మల్‌ గ్రామ్‌ పురస్కార్‌-'లతో సత్కరింస్తుంది. . నిర్మల్ గ్రామ పురస్కారాలు స్వచ్చతకు, పరిశుభ్రతకు నిదర్శనంగా చెప్పుకుంటారు. గ్రామంలో పారిశుద్ద్యం , అభివృద్ది తదితర అంశాల పై ఎంపిక చే్స్తారు . ఈ పురస్కారాలను అందజేసే కేంద్రం కొన్ని సామాజిక అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటోంది. వాటిని మాత్రమే ఆధారం చేసుకుని పురస్కారాలకు గ్రామాలను ఎంపిక చేస్తారు. కానీ ఆ సాంకేతిక అంశాలను మినహాయిస్తే మిగిలిన పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో మాత్రం అన్ని ప్రాంతాలు దాదాపు ఒకేవిధంగా ఉన్నట్లు కన్పిస్తుంది. పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్యం విషయంలో తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నిర్మల్‌ గ్రామ పురస్కారానికి ఎంపికైన గ్రామాలకు వెయ్యి జనాభా ఉన్న గ్రామానికి రూ.50వేలు, వెయ్యి నుండి రెండు వేలు లోపు జనాభా కలిగిన గ్రామానికి లక్ష రూపాయలు, రెండు వేల నుండి నాలుగువేల జనాభా కలిగిన గ్రామాలకు రూ.2లక్షలను నగదు ప్రోత్సాహక పురస్కరంగా ప్రభుత్వం అందజేయనున్నది. భారత ప్రభుత్వం ద్వారా ఈ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఆయా గ్రామాల సర్పంచులు, ప్రతినిధులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర 442, గుజరాత్‌ 422, మేఘాలయ 365, హర్యానా 330, హిమాచల్‌ప్రదేశ్‌ 323 గ్రామ పంచాయతీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి.

గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్యం సాధించడం ద్వారా 80శాతం అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు..బహిరంగ మలవిసర్జన దురాచారాన్ని రూపుమాపి అందరికీ స్వచ్చమైన గాలి, నీరు, ఆహారం అందిస్తూ గ్రామ సీమల్లో ఆహ్లాదకరమైన పరిశుభ్ర వాతావరణాన్ని అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. గ్రామాల ఆవాసాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య విప్లవం వెల్లివిరియాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్ష. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణము . చెట్లు పెంపకము , మెరుగైన రహదారులు నిర్మించడము విషయములో సలహాలు ఈ పురష్కారాలు అమలులో ముఖ్య ఉద్దేశము .
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వెంట్రుకలు, గోళ్లను కత్తిరిస్తే నొప్పి పుట్టదేం?-No pain by cutting nails and hair Why?


  • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్రశ్న: వెంట్రుకలు, గోళ్లను కత్తిరించినప్పుడు నొప్పి రాదెందుకు?

జవాబు: నొప్పి కలగడం అంటే మన శరీరంలోని నాడీతంత్రుల (nerve endings) మీద సంకేతాలు రావడమే. మన శరీరంలోని అన్ని అవయవాలలోను, చర్మపు పొరల్లోను ఈ నాడీతంత్రులు విస్తరించి ఉంటాయి. అందువల్ల ఆయా భాగాల్లో దెబ్బ తగిలినా, పుండ్లు ఏర్పడినా, ఏదైనా స్పర్శ తగిలినా మన మెదడు గుర్తిస్తుంది. కానీ గోళ్లు, వెంట్రుకలలో నాడీ తంత్రులు ఉండవు. అందువల్ల వెంట్రుకలు, గోళ్లు కత్తిరించినా నొప్పి కలుగదు. శరీరంలో మిగిలిన భాగాల కన్నా అరికాలు, అరిచెయ్యిల్లో చర్మం మందంగా ఉంటుంది. ఇందులో నాడీ తంత్రులు, పైపొర వరకు దట్టంగా ఉండవు. అందువల్ల సున్నితమైన స్పర్శలను అరికాలు, అరిచెయ్యి గుర్తించలేవు.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

బూమరాంగ్‌ ఎలా పనిచేస్తుంది?-How Boomerang works?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: బూమరాంగ్‌ను విసిరితే తిరిగి మన దగ్గరకే వచ్చేస్తుంది కదా, అదెలా సాధ్యం?

జవాబు: బూమరాంగ్‌ అంటే ఓ కొడవలి లాంటి ఆట లేదా వేట వస్తువు. ప్రాచీన కాలంలోనే దీని వాడకం గురించిన ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఒక పద్ధతిలో విసిరినప్పుడు అది ఒక లక్ష్యాన్ని దెబ్బతీసి తిరిగి ప్రయోగించిన వ్యక్తి దగ్గరకే చేరగలదు. ఇంగ్లిషు అక్షరం V ఆకారంలో వంగిన కొడవలిలాగా ఉన్నా, బూమరాంగ్‌ పరికరం మొత్తం ఒకే సమతలం (plane)లో ఉండదు. చివర్లు రెండూ కూచి (tappered)గా ఉంటే, మధ్య భాగం మందంగా ఉంటుంది. బూమరాంగ్‌ను బల్లపై పెడితే దాని ఒక భుజం బల్ల ఉపరితలానికి ఆనుకుంటే, రెండో భుజం కొంచెం పైకి లేచినట్టు ఉంటుంది. ఈ విధమైన ఆకారం వల్ల బూమరాంగ్‌ను సరైన పద్ధతిలో విసిరినప్పుడు అది గాలిలో ఓ ప్రత్యేకమైన పీడన వ్యత్యాసాలను ఏర్పరుస్తుంది. తద్వారా అది వక్రీయ (curved) మార్గంలో పయనిస్తుంది. బూమరాంగ్‌ను లోహం లేదా కర్ర లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. దీని వాడకంలో నేర్పరితనం అవసరం.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

పాదాలకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఎందుకు?, What is cause for foot-cracks?


  • image : courtesy with Eenadu Telugu Daily.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పాదాలకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఎందుకు?

జవాబు: మనం నేల మీద నుంచోడానికి, నడవడానికి సహకరించే పాదాలు ఎప్పుడూ మన భారాన్ని మోస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా వత్తిడికి గురవుతూ ఉంటాయి. పాదాలతో పాటు అర చేతులు కూడా రకరకాల పనులలో సహకరిస్తూ ఉంటాయి. అందువల్ల పాదాల చర్మం (sole), అరచేయి చర్మం (palm) మందంగా ఉంటాయి. మందంగాను, దృఢమైన కండర పొరతోను ఉండడం వల్ల శరీర రక్త ప్రసరణ వ్యవస్థ (blood circulatory system) అరికాళ్లు, అరచేతుల్లో తుదికంటా ఉండదు. కొంత వరకు విస్తరించి తర్వాత ఆగిపోతుంది. అంటే నీటిని, పోషక విలువల్ని పంపిణీ చేసే రక్తనాళికలు అరికాలి చర్మంలో నేలను తాకే చిట్టచివరి పొర వరకు చేరవన్నమాట. నీరులేని పంట పొలాలు బీటలు వారినట్టే నీరు అంతగా లభించని అరికాలి చర్మం కూడా పగుళ్లకు లోనవుతుంది. ఈ స్థితి చలికాలంలో ఎక్కువ. ఎందుకంటే ఆ రుతువులో చర్మంలో రక్తనాళాలు మరింత లోతుల్లో ఉంటాయి. చలికాలంలో చర్మం పాలిపోయినట్టు తెల్లగా ఉండడానికి కారణం కూడా అదే. ప్రతి పూట కాసేపు అరికాళ్లను బకెట్టులోని నీటిలో నానబెట్టి కొంచెం కొబ్బరి నూనె వంటి లేపనాలు పూసుకుంటే అరికాలి పగుళ్లను చాలా మటుకు నివారించవచ్చు. అనవసరంగా సౌందర్య సాధనాలను ఉపయోగించడం డబ్బు వృథా!

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, March 21, 2012

చంద్రుడు మనతోనే వస్తున్నట్టు కనిపిస్తాడు కదా? ఎందువల్ల?


  • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: మనం నడిచేప్పుడైనా, రైలులో వెళ్లేప్పుడైనా ఆకాశంలో చంద్రుడు మనతోనే వస్తున్నట్టు కనిపిస్తాడు కదా? ఎందువల్ల?

జవాబు: ఒక వస్తువు మనకు కనిపించాలంటే దానిపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం చెంది మన కంటికి చేరాలి. ఆ వస్తువు నుంచి కాంతి కిరణాలు అన్ని వైపులకూ ప్రసరించినా, మనం చూస్తున్న దిశగా కొంత ప్రాంతానికే పరిమితమై ఉంటాయి. ఆ వస్తువు నుంచి అటూ ఇటూ పయనించే కిరణాలతో ఊహారేఖలు గీస్తే అవి ఒక శంకువు (cone) ఆకారంలో ఉంటాయి. ఆ ఊహా శంకువు శీర్షకోణం వద్ద ఆ వస్తువు ఉంటే, దాని కింద వృత్తాకారంలో ఉండే ప్రాంతం (శంకువు బేస్‌)లో ఎక్కడో ఒకచోట మనం ఉంటామన్నమాట. అపుడే ఆ వస్తువు మనకి కనిపిస్తుంది. ఆ వస్తువుకి, మనకి ఉన్న దూరాన్ని బట్టి ఊహా శంకువు పరిమాణం ధారపడి ఉంటుంది.

ఇప్పుడు మనం రైలులోనో, బస్సులోనో కిటికీ దగ్గర కూర్చుని బయటి దృశ్యాలను చూస్తున్నామనుకుందాం. ఆ దృశ్యాలకు సంబంధించి రెండు విషయాలను గమనించవచ్చు. మన వాహనానికి దగ్గరగా ఉండే వస్తువులు వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నట్లు అనిపిస్తాయి. ఎందుకంటే ఈ వస్తువుల నుంచి వచ్చే కిరణాలతో ఏర్పడే ఊహా శంకువు బేస్‌ ప్రాంతం నుంచి మనం వేగంగా ముందుకు వెళ్లిపోతాం కాబట్టి! అదే మనం ఉన్న వాహనానికి దూరంగా ఉండే కొండల్లాంటి వస్తువుల నుంచి వచ్చే కిరణాలతో ఏర్పడే ఊహా శంకువు బేస్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దగ్గరగా ఉండే వస్తువుల కన్నా, దూరంగా ఉండేవి నెమ్మదిగా వెనక్కి వెళుతున్నట్టు అనిపిస్తాయి. అదే ఆకాశంలో చంద్రుడి నుంచి వచ్చే కిరణాలతో ఏర్పడే ఊహాశంకువు బేస్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం నడుస్తున్నా, పరిగెట్టినా, మన వాహనం ఎంత వేగంగా వెళ్లినా, దాని బేస్‌ ప్రాంతంలోనే ఉంటాం. అందువల్ల చందమామ మనతోనే వస్తున్నట్టు అనిపిస్తుంది. భూమిపై ఎన్నో ప్రాంతాలలోని ప్రజలు ఒకేసారి చందమామను చూడగలగడానికి కూడా ఇదే కారణం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ==============================

Woman is the base for a Family-Why?,ఆడదే ఆదారం అంటారు ఎందుకు?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : కుటుంబానికి ఆడదే ఆదారం అంటారెందుకు?.

జ : అందమైన జీవితానికి , ఆరోగ్య్కరమైన సమాజానికి చక్కటి కుటుంబమే మూలము . మనకు , మనము ఉన్న సమాజానికి ఇంకా చెప్పాలంటే ప్రపంచానికీ కుటుంబమే పునాది. మన విజయాలకు , అపజయాలకు , ఆనందాలకు ఆధారము ఇల్లే . ... . కుటుంబమే . కుటుంబము సవ్యముగా వుంటే మన జీవితాలు ఆనందము గా ఉంటాయి. కుటుంబ వ్యవస్థ సవ్యముగా పనిచేయాలంటె ఆ ఇంటిని నడిపే భార్యాభర్తల వైవాహిక బంధము పటిస్ఠంగా ఉండాలి .

కుటుంబము పట్ల , కుటుంబసభ్యులపట్ల భార్యాభర్తలు ప్రదర్శించే బాధ్యతాయుతమైన దృక్పధము , సంసార రధము సజావుగా సాగడానికి కీలకమైన ఇరుసు అవుతుంది . భర్త కుటుంబానికి యజమాని అయితే భార్య సంసారాన్ని నేర్పుగా , ఒర్పుగా నడిపే సారధి . కుటుంబానికి ఆమె చుక్కాని. భర్త జీవతములోనే గాక ఆ కుటుంబములొనూ ఆమెదే ప్రముఖప్రాత్ర . భర్త ధర్మ కర్యాచరణకు , గౌరవమర్యాదలు పొందడానికి , వంశభివృద్ధికీ ఆమె కేంద్రబిందువు . ఇన్ని ప్రాధాన్యతల దృష్ట్యా , శాస్త్రరీత్యా భార్యనే ఇంటికి యజమానురాలని చెప్పవచ్చు.ఆదారమనీ చెప్పవచ్చు . కుటుంబ బాధ్యతల్ని , భర్త , పిల్లలు , అత్తమామలు , ఆడపడుచులు , మరుదులు, తోటికోడళ్ళు , పనివాళ్ళు వీళ్ళందరి మంచిచెడులను బాగోగులను ఆమే చూసుకోవాలి . ఇంటికి వచ్చే బంధుజనాన్ని ఆదరించాలి. భర్త సంపాదించిన సొమ్మును జాగ్రత్తచేయాలి. కుటంబసభ్యుల అవసరాలకనుగుంఅంగా ఖర్చుచేయాలి. కొంత సొమ్మును భవిష్యత్ అవసరాలకోసం జాగ్రత్త చేయాలి .

మానవ సంబంధాలలోకిల్లా ఉన్నతమైనది వైవాహిక బంధము. కడదాకా నిలిచేది ... నిలుపుకోవలసినదీ దాంపత్యబంధమే . ప్రపంచీకరణ ఫలితముగా కుటుంబ స్వరూపస్వభావాలు మారుతున్న నేపధ్యములో కూడా మిగతా దేశాలతో పోల్చితే భారతీయ దాంపత్య వ్యవస్థ ఎంతో పటిష్ఠముగా వుండి సామాజిక విలువలకు , కట్టుబాట్లకు ప్రాధాన్యతనిస్తూ తన ఉనికిని నిలుపుకుంటూ వస్తుంది. పెళ్ళితోనే భార్యాభర్తల సంసారబంధము మొదలవుతుంది. ప్రేమ , అవగాహన , నమ్మకము , స్నేహము , అనురాగము అన్నీ ఈ బంధములోనే ఉన్నాయి. దాంపత్యము అంటే పరస్పర ఆధారిత బంధము. జీవితభాగస్వామి అంటే అన్నింటా పరస్పరం పాలుపంచుమునే వారే కాని ప్రతిదీ భారంగా భావించేవారు , ఒకరి భారాన్ని మరొకరిపై మోపేవారూ కాదు . ఇద్దరు భారాన్ని సమముగా పంచుకునేవారే.

స్నేహము , సాన్నిహిత్యము , సాన్నిధ్యము , సహాయత , ప్రేమైక భావన , భద్రత , రక్షణ , పరస్పర ఆలంబన , శృంగారము కలబోసుకున్న అన్యోన్యానురాగబంధములోని ఆనందమే అర్ధనారీశ్వర తత్వము. అదే ఆలుమగలు కలసి రాసే పెళ్ళి పుస్తము లోని సారాంశము. అందుకే అన్నారు కుటుంబానికి ఆడదే ఆదారము అని .
=========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, March 20, 2012

What is Padmini Vidya?, పద్మిని విద్య అంటే ఏమిటి ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : What is Padmini Vidya?, పద్మిని విద్య అంటే ఏమిటి ?

జ : పద్మినీ అనేది విధులను సూచించే విద్య . ఆ విద్యకు అధిదేవత లక్ష్మీదేవి . ఆమె నివసించే పద్మము అధారము గా దీనికి మహపద్మ పద్మినీ విద్య అనే పేరు వచ్చింది . దీనిలోని ఎనిమిది ఉపవిభాగాలే అష్టవిధులుగా పేరు పొందాయి . అవి ...
  1. పద్మ ,
  2. మహాపద్మ ,
  3. మకర ,
  4. కచ్చన ,
  5. ముకుంద ,
  6. నందక ,
  7. నీల ,
  8. శంఖలు .
మానవులకు సంపద మూడు విధాలుగా ప్రాప్తిస్తుంది .
  • దేవతా ప్రసాదము ,
  • సాధుజన సేవ ,
  • స్వయం కృషి .
వీటిలో మొదటినానినే మనము ''అదృష్టము'' అనే పేరుతో పిలుస్తాము . రెండోది దానిని ''సుకృతం '' అని అంటాము . ఇక మూడోదాన్ని " తెలివితేటలు " అని అంటాము . అదృష్టమున్నవాడు కష్టము లేకుండా సంపదలు పోగుచేస్తాడు . సుకృతం ఉన్నవాడే సాధుజన సేవ చేయగలుగుతాడు . అలాగే తెలివితేటలు ఉన్నప్పుడే వయం కృషితో సంపదలు సిద్ధిస్తాయి.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, March 17, 2012

బై పాస్ సర్జరీ అంటే ఏమిటి?-What is bypass surgery?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q :బై పాస్ సర్జరీ అంటే ఏమిటి?-What is bypass surgery?

A :గుండె రక్తనాళాలలోని అడ్డులను తొలగించటానికి వివిధ రకాల చికిత్సలున్నాయి. వాటిలో కరోనరీ ఆర్టరీ బై పాస్ గ్రాఫ్ట్ లేదా బైపాస్ సర్జరీ ఒకటి కాగా మరొకటి యాంజియో ప్లాస్టీ స్టెంటింగ్ తో చేసేది దీనినే పెర్కుటేనియస్ ట్రాన్సులూమినల్ కరోనరీ యాంజియో ప్లాస్టీ లేదా పిసిటిఎ అని కూడా అంటారు.

బైపాస్ సర్జరీ అంటే రక్తనాళాలలోని అడ్డంకులను తప్పించి రక్తప్రసరణ పునరుద్ధరిస్తారు. ఈ సర్జరీలో వివిధ ధమనులు, కాలి సిరలు ఉపయోగిస్తారు. దీనిని నిర్వహించేందుకు కొంతమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది అవసరమవుతారు. ఈ ఆపరేషన్ చాలా చోట్ల చేస్తున్నప్పటికి అనుభవజ్ఞులైన శస్త్ర చికిత్సకులు చేస్తే రోగులకు మంచి ఫలితాలుంటాయి. ఈ ఆపరేషన్ తర్వాత రోగి కోలుకోటానికి కొంత కాలం పడుతుంది. అయినప్పటికి ఈ ఆపరేషన్ వలన వచ్చే ఫలితాలు దీర్ఘకాలం కొనసాగుతాయి.

బైపాస్ సర్జరీ అనంతరం రోగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక విశ్రాంతి, తగిన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించటం చేయాలి. వైద్య పరిశోధనలు బాగా అభివృధ్ధి చెందిన కారణంగా ఆపరేషన్ వ్యయం కూడా నేడు బాగా తగ్గుముఖం పట్టింది. ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. చాలావరకు ఆపరేషన్లు విజయవంతమవుతూనే వున్నాయి. ఆపరేషన్ తర్వాత రోగి తీసుకునే జాగ్రత్తలననుసరించి అతని మిగిలిన జీవితకాలం ఆనందంగానే వుంటుంది.
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What are the eight difficulties?-అష్ట కష్టాలంటే ఏవి ?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అష్ట కష్టాలంటే ఏవి ?

జ : కష్టము అంటే ఆరోగ్యముగా ఉండి మనషుకి , శరీరానికి.. ఏ ఒక్కదానికైనా లేదా రెండింటికీ బాధకలిగించేది ... అని అర్ధము . మన పూర్వీకులు అప్పటి పరిస్థితులను బట్టి కష్టాలను ఎనిమిదిగా బావించారు .
  1. ఇష్టములేకపోయినా తప్పనిసరిగా పనిచేయవలసి రావడము ,
  2. భయంకర దారిద్ర్యము ,
  3. భార్య ఉండీ ఉపయోగపడకపోవడము ,
  4. అడుక్కు తినే పరిస్థితి దాపురించడము ,
  5. అప్పు అడిగినా ఇచ్చేవారు లేకపోవడము ,
  6. వీసమెత్తు ఉప్పుకూడా అప్పు గా దొరక్కపోవడము ,
  7. రెండు కాళ్ళ తోనే ఎక్కడికైనా వెళ్ళాల్సి రావడము ,
  8. బిడ్డలున్నా ఒంటరి గా బ్రతకడము .
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What are the eight badlucks for human?-అష్టదరిద్రాలు అంటే ఏవి ?


  • image : courtesy with sakshi news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అష్టద్రిద్రాలు అంటారు . అవిఏవి .?

జ : దరిద్రము అంటే మంచిదికానిది , కష్టపెట్టేది , నష్టము జరిగేది అని అర్ధము . మన పురాణ పురుషులు ఆనాటి పరిష్తితులబట్టి దరిద్రాలు ...ఎనిమిదిగా చెప్పియున్నారు .
  • అవసరములో సహాయము చేసేవారు ఒకరైనా లేకపోవడము ,
  • కనీష అవసరాలకు ధనము లేకపోవడము ,
  • ఒంటి పూట బోజనమునకు కూడా విపరీతమైన శ్రమచేయాల్సి రావడము ,
  • వినే నాధులు లేకపోవడము ,
  • చినిగిన బట్టలతో ఉండడము ,
  • వెళ్ళడానికి ఏ వాహనము లేక పోవడము ,
  • ధనము ఉన్న సంతానము లేకపోవడము ,
  • పుత్రుడు ఉన్నా వదలివేయడము ,
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

స్త్రీ ధనమంటే ఏది ? - Which is women wealth?


  • image : sitara cinema magazine.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ఫ్ర : స్త్రీ ధనము అంటే ఏది ?
జ : తల్లి దండ్రుల ఆస్తులపై తమ పిల్లలు అందరికీ సమాన హక్కులు ఉండాలి . . కాని పురుషాధిక్యము ఉన్న సమాజములో అలా జరుగడములేదు . ఇప్పుడిప్పుదు కొద్దిగా మారుపు చేర్పుపులు జరుగుతున్నా పూర్వకాలములో స్త్రీలు అనగ దిక్కబడ్డారనే చెపాలి.

స్త్రీ ధనము అంటే
  • వివాహ సమయములో తల్లీ , తండ్రీ ఆమెకు ఇచ్చిన , పెట్టిన కానుకలు ,
  • భర్త సంతోషముగా ఇచ్చిన ధము ,
  • అన్నదమ్ములూ , బాబాయిలూ మొదలగు సొంతవారు ఇచ్చిన సొమ్ము ,
  • వ్రతాలు , నోమూలూ అప్పుడు పుట్టింటివారు పెట్టిన రొక్కము ,
  • తల్లి ధనము పై పుత్రికలెందరున్నా అందరికీ సమానమైన హక్కు ఉంటుంది .
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, March 09, 2012

ప్రేమ అంటే ఏమిటి?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ప్రేమ అంటే ఏమిటి?
జ : ప్రేమ అంటే ఒక తియ్యని అనుభూతి అని ప్రేమికులు చెబుతారు....
ప్రేమ అంటే ఒక మాయ, ఉచ్చు అని ప్రేమను ద్వేషించేవారు అంటుంటారు...
ప్రేమ అంటే డబ్బు లేని అమ్మాయి, డబ్బున్న అబ్బాయిని ప్రేమించడం లేదా డబ్బు లేని అబ్బాయి, డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించడం అని కొంతమంది అభిప్రాయం.
ఈ ప్రేమ అనేది యవ్వనంలో కలిగే ఆకర్షణ, మోహం అని ఎవరికి తోచినట్లు వారు అభివర్ణిస్తారు.
కాని ... ప్రేమలో ఎన్నోరకాలు ఉన్నాయి.
కామముతో కూడుకున్న ప్రేమ ,
అవసరముతో కూడుకున్న ప్రేమ ,
ఆకలి తో కూడుకున్న ప్రేమ ,
స్వార్ధముతో కూడుకున్న ప్రేమ ,
భక్తితో కూడుకున్న ప్రేమ ,

అమ్మ నాన్నలు తమ పిల్లలను ప్రేమించేదే నిస్వార్ధ ప్రేమ ...
నిస్వార్ధ ప్రేమ హృదయాంతరాళలోని చిన్న జ్యోతి ... అది ఆరిపోకుండా కాపాడుకోవడమే జీవన సార్ధకత.
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, March 06, 2012

ఓజోన్‌ ఉపయోగమేమిటి? దాన్ని కృత్రిమంగా తయారు చేయలేమా?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఓజోన్‌ ఉపయోగమేమిటి? దాన్ని కృత్రిమంగా తయారు చేయలేమా?


జవాబు: ఆక్సిజన్‌ పరమాణువులతో ఏర్పడే ఓ త్రి పరమాణుక అణువు(triatomic molecule) ఓజోన్‌.మనం ప్రతి క్షణం పీల్చే ఆక్సిజన్‌ఓద్విపరమాణుకఅణువు(diatomicmolecule). ఆక్సిజన్‌లో ఉండే రెండు పరమాణవులు రసాయనికంగా ఒకే తరహావి కాగా, ఓజోన్‌లో ఉన్న మూడు పరమాణువులు రసాయనికంగా ఒకే కోవకు, లక్షణానికి చెందినవి కావు. మధ్యలో ఉన్న పరమాణువుకు పాక్షిక ధనావేశిత లక్షణం ఉండగా, చివర్ల ఉన్న రెండు పరమాణువులకు పాక్షిక రుణావేశిత లక్షణాలున్నాయి. అందువల్ల ఓజోన్‌ అణువుకు క్రియాశీలత (reactivity)ఎక్కువ. అందుకనే లేత నీలి రంగులో ఉన్న ఓజోన్‌ వాయువును వివిధ రసాయనిక ప్రక్రియల్లో ఆక్సీకరణి (oxidising agent)గా వాడతారు. ముఖ్యంగా సేంద్రియ పదార్థాల నుంచి కార్బొనేట్‌ పదార్థాల్ని తీసుకురావడంలో దీని వినియోగం చాలా ఎక్కువ. నీటిని సూక్ష్మక్రిముల నుంచి రక్షితం చేయడంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. భూవాతావరణపు పైపొరలో కాంతి సమక్షంలో ఓజోన్‌ ఏర్పడుతూ జీవజాతుల్ని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుతూ ఉంటుందని చదువుకుని ఉంటారు. ఓజోన్‌ను కేవలం కృత్రిమ పద్ధతుల్లోనే తయారు చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో గాలిలో ఓజోన్‌ ఉండదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, March 04, 2012

ఇతర గ్రహాలపై గురుత్వాకర్షణ శక్తి ఉండదా?, Is there no gravitational force to other planets?





ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: భూమిపై ఉన్నట్టు ఇతర గ్రహాలపై గురుత్వాకర్షణ శక్తి ఉండదా?

జవాబు: ఇతర గ్రహాలపై గురుత్వాకర్షక శక్తి లేదనుకోవడం సరికాదు. గ్రహమేదైనా ఎంతో కొంత గురుత్వాకర్షణ శక్తి తప్పనిసరి. మన సౌరమండలంలోనే భూమి కన్నా తక్కువ, భూమి కన్నా ఎక్కువ గురుత్వాకర్షణ శక్తిగల గ్రహాలున్నాయి. సాధారణంగా ఓ గ్రహపు గురుత్వాకర్షణ శక్తి ఆ గ్రహపు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అనడం కన్నా గురుత్వాకర్షణ బలం అనడం మరింత శాస్త్రీయం. 205 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై ఎంత త్వరణం (acceleration)కలిగించే సత్తా ఉందో ఆ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. మన భూమికి ఇది 9.8 న్యూటన్లు కాగా, బుధగ్రహంపై ఇది కేవలం 3.8 న్యూటన్లు మాత్రమే. చంద్రునిపై ఇది సుమారు 1.4 న్యూటన్లు. అయితే మన సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి (జ్యూపిటర్‌)పై ఉండే గురుత్వాకర్షక బలం సుమారు 24.8 న్యూటన్లు. అంటే భూమిపై 100 కిలోల బరువుండే ఒక వస్తువు బృహస్పతిపై సుమారు 250 కిలోల బరువు తూగుతుంది. అదే వస్తువు చంద్రుడిపై కేవలం 15 కిలోలు మాత్రమే ఉంటుంది.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు?- How did Moon formed?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు?- How did Moon formed?


జవాబు: విశ్వంలో సూర్యుడు, గ్రహాలు ఏర్పడిన తర్వాత కొన్ని గ్రహశకలాలు (ఆస్టరాయిడ్లు) గ్రహాల ఆకర్షణకు లోనై వాటి చుట్టూ తిరిగేవని, అవే కాలక్రమేణా ఉపగ్రహాలుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతారు. కానీ భూమి చుట్టూ తిరిగే చంద్రుడి కథ వేరు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న సిద్ధాంతాల ప్రకారం సుమారు 4.5 బిలియన్‌ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిన తొలిరోజుల్లో మరో గ్రహం వచ్చి ఢీకొట్టింది. ఆ అభిఘాతానికి భూమిలోని కొంత భాగం, ఆ ఢీకొన్న గ్రహంలోని కొంత భాగం అంతరిక్షంలోకి విసిరివేయబడ్డాయి. ఈ భాగాలు ఒక చక్రంలాగా ఏర్పడి భూమి గురుత్వాకర్షణకు లోనై భూమి చుట్టూ తిరగసాగాయి. క్రమేణా ఆ భాగాలన్నీ గోళాకారంలోకి మారాయి. ఆ గోళమే చంద్రుడు. అప్పట్లో కేవలం 30 వేల కిలోమీటర్ల దూరంలోనే తిరిగే చంద్రుడు, భూమిపై తీవ్రమైన ఆటుపోట్లకు సంబంధించిన స్పర్శతరంగాలను ఉత్పన్నం చేశాడు. అందువల్ల భూమి పరిభ్రమణ వేగం తగ్గడమే కాకుండా, చంద్రుడు భూమి నుంచి మరింత దూరం జరిగిపోయాడు. ఇప్పటికీ చంద్రుడు ఏటా 3.7 సెంటీమీటర్ల వంతున దూరం జరుగుతున్నాడు. ప్రస్తుతం భూమి నుంచి చంద్రుడి సరాసరి దూరం 3,84,400 కిలోమీటర్లు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, March 03, 2012

ఒక వైరుతో విద్యుత్‌ ప్రసారం చేయలేరా?,can not transmit Electricity with single wire?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: విద్యుత్‌ పరికరాల వాడకంలో రెండు వైర్లు బదులు ఒకటే వినియోగించి విద్యుత్‌ ప్రసారం చేయలేరా?

జవాబు: ఏదైనా విద్యుత్‌ పరికరం పని చేయాలంటే అందులో కీలకమైన విద్యుత్‌ వలయం (electrical circuit)లో విద్యుత్‌ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్‌ వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి. నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ ఉన్నట్టే విద్యుత్‌ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర (terminal), ఎలక్ట్రాన్లు పోయే చివర అంటూ రెండు ధ్రువాలు ఉండాలి. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక ధ్రువాన్ని భూమికి కలిపి రెండో ధ్రువాన్ని విద్యుద్వాహినిగా చేస్తారు. భూమికి కలిపిన చివరను న్యూట్రల్‌గాను, విద్యుత్‌ ప్రవహించే తీగను ఫేజ్‌ లేదా లైన్‌ అనే పేరుతోను వ్యవహరిస్తారు. అవే రెండు తీగలు. ప్రతి సారీ మనం ఇళ్లలో గొయ్యి తవ్వి భూమికి ఒక వైరును తగిలించలేము కాబట్టి ఇళ్లకు వచ్చే సరఫరాలోనే భూమిని కలిపే సదుపాయమే న్యూట్రల్‌. ఇక బ్యాటరీల విషయానికి వస్తే విధిగా రెండు తీగలను (ధన, రుణ ధ్రువాలు) ఉండాలి. ఇక్కడ ఒక తీగ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీలోనే విద్యుత్‌ ప్రవాహం ఆరంభమవుతుంది కాబట్టి తిరిగి ఎలక్ట్రాన్లు అక్కడికే చేరాలి. లేకపోతే వలయం తెగిపోతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వేప చెట్టు రాత్రి కూడా ఆక్సిజన్‌ ఇస్తుందా?,Does neem tree give Oxygen during night?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: వేప చెట్టు రాత్రి, పగలు కూడా ప్రాణవాయువును విడుదల చేస్తుందని విన్నాను. నిజమేనా?

జవాబు: సాధారణంగా ఏ హరిత వర్ణ వృక్షజాతి (green plant) అయినా పగటిపూట గాలిలోని కార్బన్‌డయాక్సైడు, నేల నుంచి నీటిని తీసుకుని కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ (photosynthesis) జరుపుతుంది. ఆ క్రమంలో పిండి పదార్థ రూపమైన చక్కెరతో పాటు ప్రాణవాయువును కూడా విడుదల చేస్తుంది. రాత్రి వేళ చీకట్లో కాంతి ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఇందుకు వేపచెట్టు కూడా మినహాయింపు కాదు. రాత్రిళ్లు కూడా చెట్లు ఈ క్రియను జరుపుతాయనడం చాలా అరుదైన విషయం. కేవలం కొన్ని నిమ్న స్థాయి వృక్షజాతులు నక్షత్రకాంతిని, చంద్రకాంతిని కూడా గ్రహించి మంద్రస్థాయిలో కిరణజన్య సంయోగ క్రియను జరిపినా అవి విడుదల చేసే కార్బన్‌డయాక్సైడే ఎక్కువ.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలు ఎందుకు పగలవు?,Bulletproof glasses can not break Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలు ఎందుకు పగలవు?,Bulletproof glasses can not break Why?

జవాబు: మామూలు అద్దాలు రాయితో కొడితే భళ్లున పగులుతాయి. వాటి గుండా తుపాకీ గుండు సులువుగా దూసుకుపోతుంది. కానీ బులెట్‌ప్రూఫ్‌ అద్దాల విషయంలో అలా జరగదు. ఎందుకంటే ఆ అద్దాలను అత్యంత పటిష్టమైన సిలికాన్‌నైట్రైడ్‌ (silicon nitride)తో కూడిన పింగాణీ పదార్థంతోను, అతి దృఢమైన స్టీలు తోను, గరుకైన నైలాన్‌ పొరలతోను తయారు చేస్తారు. దృఢమైన పింగాణీ వేగంగా వచ్చే తుపాకి గుండును హఠాత్తుగా ఆపివేయడంతో దాని శక్తి గాజు పలకలోకి చొచ్చుకుపోకుండా, తగిలిన ప్రదేశంలోని పైపొరలోనే వివిధ దిశలకు వ్యాపిస్తుంది. అలా వేగం కోల్పోయిన తుపాకి గుండు గాజు పలక అవతలి వైపునకు పోకుండా ఆ గాజులోని నైలాన్‌ పొరలతో చేసే గజిబిజి జాలీ (వల)లో చిక్కుకుపోతుంది. అందువల్ల బులెట్‌ప్రూఫ్‌ అద్దాలు పగలవు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Are Ravanasura Lanka and present Srilanka same?,రామాయణం లో ఉన్న రావణుడి లంక ఈనాటి శ్రీలంక ఒకటేనా?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : రామాయణం లో ఉన్న రావణుడి లంక ఈనాటి శ్రీలంక ఒకటేనా?

జ : కాదనలేము , ఔననలేము ... ఎందుకంటే ఈ భూగోళము ఎప్పుడూ ఒకే రకము గా ఉండబోదు . లక్షల సంవత్సరాల క్రితము ఈ గోళము లో ఐదు ఖండాలు లేవు . అంతా ఒకే మట్టి ముద్ద . ఒకనాడు అగాధ సముద్రము వుండే చోట హిమాలయాలు మొలిచాయి అని శాస్త్రజ్ఞులు అంటున్నారు . పర్వతాలు పెరుగు తున్నాయి. నదులు గతులు మారుస్తున్నాయి. సముద్రాలు ఒక వంక మేటవేసి మరోవైపు పల్లెలు, నగరాలు మునుగుతున్నాయి . ఖండాలు అటూ ఇటూ జరుగుతున్నాయి. అందుచేత లంక , శ్రీలంక కి అటో ఇటో తప్పక ఉండవచ్చు . అదీకాక రామాయణములోనే కిషిందకాండములో భూగోళ వర్ణన వున్నది. భారతములో భీష్మపర్వములో భూగోళ విశేషాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటిలో తేడా కనిపిస్తుంది . అంటే రామాయణము నాటి భూగోళం భారతం నాటికి మారింది . అలా మారుతునే ఉంటుంది .

మూలము : ఉషశ్రీ. ->www.ushasri.org/
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, March 02, 2012

ట్యూబ్‌లైట్‌ జీవితకాలం తగ్గిపోతుంdaa?, Shorten the life of tubelight?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఇళ్లలో ఉండే ట్యూబ్‌లైట్‌ను మాటిమాటికీ వేసి, ఆర్పితే జీవితకాలం తగ్గిపోతుందంటారు. ఎందువల్ల?

జవాబు: మామూలు విద్యుత్‌ బల్బులలో ఫిలమెంట్‌ వేడెక్కడం వల్ల కాంతి ప్రసరిస్తుందనే విషయం తెలిసిందే. ట్యూబ్‌లైట్లో అలా జరగదు. పొడవైన గొట్టాల ఆకారంలో ఉండే ఈ లైట్లలో పాదరసపు వాయువు(mercury vapour) నింపుతారు. ఈ వాయు కణాలు విద్యుత్‌శక్తితో ప్రేరేపింపబడి అయనీకరం చెందుతాయి. అప్పుడు ఏర్పడిన వికిరణాల మూలంగా కాంతి ఉత్పన్నమవుతుంది. ఈ వికిరణాలు కంటికి కనిపించని అతినీలలోహిత కిరణాలు (ultra violet rays). ఈ కిరణాలు ట్యూబ్‌లైట్‌ గొట్టం లోపలి గోడలపై పూసిన ఫాస్పర్‌ పూతపై పడి కంటికి కనిపించే కాంతిగా మారి ఆ ప్రాంతమంతా ప్రసరిస్తుంది. ఇలా వాయువు అయనీకరణం చెందాలంటే అత్యధిక విద్యుత్‌ వోల్టేజి అవసరమవుతుంది. ఇది ట్యూబ్‌లైట్‌ స్టార్టర్‌, చోక్‌ల ద్వారా అందుతుంది. ఒకసారి అయనీకరణం చెందాక ఆపై తక్కువ వోల్టేజి సరిపోతుంది. అందువల్ల స్టార్టర్‌, చోక్‌ను కటాఫ్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో మాటిమాటికీ ట్యూబ్‌లైట్‌ను స్విచాన్‌, స్విచాఫ్‌ చేస్తుంటే ప్రతిసారీ అధిక వోల్టేజి అవసరమవడంతో అందులోని వాయువు అయనీకరణం చెందే ప్రక్రియకు తరచు అంతరాయం ఏర్పడుతుంది. అందువల్ల ట్యూబ్‌లైట్‌ జీవితకాలం తగ్గిపోతుంది.

-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Does human change to another ?,మనిషి మరో రకమైన జీవిగా మారతాడా?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న:కోతి నుంచి మనిషి రూపాంతరం చెందాడంటారు. మనిషి కూడా అలా మరో రకమైన జీవిగా మారతాడా?

జవాబు: గొంగళి పురుగు ప్యూపా దశలోకి వెళ్లి అందులోంచి సీతాకోక చిలుకగా మారినట్టు కోతి నుంచి మనిషి ఏర్పడలేదు. అది ఒక జీవి జీవిత చక్రంలో వివిధ దశలు కాగా, ఇది పరిణామ క్రమంలో ఒక భాగం. కోతి లాంటి జీవుల్లో కొన్ని లక్షల సంవత్సరాల విస్తారంలో మార్పులు జరిగి క్రమేపీ మనిషిలాంటి జీవులు పరిణామం (evolution) చెందాయని అంటాము. ప్రకృతిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేలా దేహంలో క్రమేపీ మార్పులు చెందేలా సంతానం తర్వాత సంతానం, తరం (generation) తర్వాత మరో తరంలో ఎంతో కొంత మార్పు జరుగుతుంది. ఏ మార్పులైతే ప్రకృతితో తలపడడానికి, మనుగడ సాగించడానికి అనువుగా ఉంటాయో అలా రూపాంతరం చెందిన జీవులే నిలుస్తాయి. అవి లేనివి అంతరిస్తాయి. దీనినే శాస్త్రవేత్త డార్విన్‌ 'ప్రకృతి వరణం ద్వారా జీవ పరిణామం, జంతువుల ఆవిర్భావం' (Origin of species by evolution and natural selection) అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషిలో కూడా మార్పులు జరిగి మరో ఆధునిక రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉంది.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

హెడ్‌సిట్‌ వాడితే ఏమైనా నష్టాలు ఉన్నాయా?,Is there any danger with headset use?


  • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న:హెడ్‌సిట్‌ వాడితే ఏమైనా నష్టాలు ఉన్నాయా?

జవాబు: సాధారణంగా సెల్‌ఫోను, టెలిఫోను, టీవీ కంప్యూటర్లలో వచ్చే శబ్దాలను వినడానికి చెవులకు అమర్చుకునే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని హెడ్‌సిట్‌ అంటారు. ఇవి వైర్ల అనుసంధానంతో ఉండే తంత్రీ, లేదా నిస్తంత్రీ (వైర్‌లెస్‌) పద్ధతుల్లో పనిచేసేలా రెండు రకాలుగా ఉంటాయి. తలమీద అటూ ఇటూ అమర్చుకునేలా ఉంటుంది కాబట్టి దీన్ని హెడ్‌సిట్‌ అంటున్నారు. తంత్రీ (కేబుల్డ్‌) పద్ధతిలో ధ్వని సంకేతాలు మోసుకొచ్చే హెడ్‌సిట్‌ పరికరాలు వాడడంలో పెద్దగా ప్రమాదాలు లేవు. ఎటొచ్చీ శబ్దపరిమాణం తగినంతగా ఉంటే చెవులకు మంచిది. ఇక నిస్తంత్రీ పద్ధతిలో వాడే పరికరాల్లో, ధ్వని స్థావరం నుంచి బలమైన రేడియో తరంగాలు లేదా మైక్రోవేవ్‌ తరంగాల రూపంలో వచ్చే సంకేతాలను గ్రహించి, వాటిని ధ్వని తరంగాలుగా మార్చే ప్రక్రియ ఉంటుంది. అంటే అక్కడ ఒక సంక్లిష్ట ఎలక్ట్రానిక్‌ తతంగం జరుగుతుందన్నమాట. తలకు అంత చేరువలో విద్యుదయస్కాంత తరంగాల ప్రక్రియ ఉండడం ఏమంత మంచి విషయం కాదు. తక్కువ సేపు అవసరానికి సరిపడా వాడితే పరవాలేదు కానీ గంటల తరబడి బ్లూటూత్‌ లేదా మైక్రోవేవ్‌ తరంగాల ప్రక్రియ సాగే పరికరాల వాడకాన్ని తగ్గించడమే మంచిది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

పెళ్ళి అంటే...నూరేళ్ళ పంట అంటారెందుకు?, Marriage is said 110 yrs crop Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

పంట అనగానే ... స్త్రీ ,పురుష బీజకణాలు సంయోగము చెంది ఒక కొత్త బీజాన్ని ఉత్పత్తి చేయడము. తమ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి జీవీ ఈ విశ్వములో ఈ పత్యుత్పత్తి కార్యక్రమము తమదైన రీతిలో చేస్తూఉంటుంది. జ్ఞానాగ్రముడైన మానవుడు ఈ తంతుని " పెళ్ళెంటే నూరేళ్ళ పంట " అనే నియమ నిబంధనలతో చేస్తూఉన్నాడు . అన్ని మతాలలో ఈ నియమావళి ఉన్నా ఇక్కడ నేను రాస్తున్నది ' హిందూ ' మతసంబంధమైనది .















-

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, March 01, 2012

లేత ఆకులు ఎరుపేల?,Tender leaves are light red color Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: సాధారణంగా మొక్కల లేత ఆకులు ఎరుపు రంగులో ఉంటాయెందుకు?

జవాబు: మనుషుల చర్మంలో గోధుమ రంగులో ఉండే వర్ణకాలు (పిగ్మెంట్స్‌) సూర్యరశ్మిలో ఉండే అతి నీల లోహిత కిరణాల (అల్ట్రావయొలెట్‌ రేస్‌) బారి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టే మొక్కలను వాటి ఆకుల్లో ఉండే ఎరుపు రంగు కాపాడుతుంది. మామూలుగా మొక్కల్లో ఉండే క్లోరోఫిల్‌ వాటిని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. అయితే మొక్కల తొలిదశలో ఈ పదార్థం అంతగా తయారు కాకపోవడంతో ఆ దశలో రక్షణ కోసం 'ఆంథోసియానిన్స్‌' (Anthocyanins)అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ వర్ణకమే లేత ఆకులకు ఎరుపు రంగును కలుగజేస్తాయి. ఇది అతినీలలోహిత కిరణాలను శోషించడమే కాకుండా మొక్కల జీవకణాల్లోని డీఎన్‌ఏను కాపాడుతుంది. మొక్కలు పెరిగేకొద్దీ క్లోరోఫిల్‌ సంశ్లేషణం (synthesis)అభివృద్ధి చెందడంతో ఆంథోసియానిన్స్‌ వర్ణకం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా అప్పటివరకు ఎరుపు రంగులో ఉండే భాగాలు క్లోరోఫిల్‌ వర్ణమైన ఆకుపచ్చ రంగుకు మారతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

శబ్దవేగం నీటిలో ఎక్కువేల?, Sound speed more in water Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: గాలిలో కన్నా శబ్దవేగం నీటిలో ఎక్కువా? గాల్లో కన్నా నీటిలో స్పష్టంగా వినడానికి కారణం ఏమిటి?

జవాబు: శబ్దం ప్రయాణించాలంటే ఒక యానకం(medium) కావాలని చదువుకుని ఉంటారు. గాలిలోనే శబ్దానికి అత్యంత తక్కువ వేగం ఉంటుంది. గంటకు సుమారు 1240 కిలోమీటర్ల వేగంతో ధ్వని గాలిలో ప్రయాణిస్తుంది. ఒక యానకంలో ఉండే పదార్థ కణాలలో ఏర్పడే సంపీడనాలు (compressions), విరళీకరణాలు (rarifications) పరంపరంగా ధ్వని ప్రయాణం సాగుతుంది. యానకాల సాంద్రత, స్థితిస్థాపకత, సంపీడన గుణకం, ఉష్ణోగ్రత లాంటి ఎన్నో ధర్మాలు ధ్వని వేగాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. గాలిలో కన్నా నీటిలో ధ్వని సుమారు నాలుగున్నర రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. లోహాలలో అయితే ఈ వేగం సుమారు 15 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ వేగం వల్లనే నీటిలోను, లోహాల్లోను ఎక్కువ దూరం వరకు ధ్వని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అందువల్లే నీటిలో ధ్వని స్పష్టత కూడా అధికంగా ఉంటుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

సబ్బు నురగ తెల్లనేల?, Soap bubuls are white-Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: సబ్బులు రకరకాల రంగుల్లో ఉన్నా, వాటి నురగ మాత్రం తెల్లగానే ఉంటుంది. ఎందుకని?

జవాబు: కాస్త నీలం రంగు సిరాను గ్లాసుడు నీళ్లలో కలిపితే నీటి రంగు మారుతుంది. ఆ రంగు నీటిని ఒక చెంచాడు తీసుకుని ఒక బకెట్‌ నీటిలో కలిపితే ఆ నీటి రంగు మారదు.
సబ్బుల తయారీ సమయంలో రసాయనాలకు రంగులు కలపడం ద్వారా రంగురంగు సబ్బుల్ని తయారు చేస్తారు. సబ్బు బిళ్ల పరిమాణం తక్కువ కాబట్టి మనకు సబ్బులో కలిపిన రంగు కనిపిస్తుంది. అదే దాన్ని రుద్దేటప్పుడు మన చేతుల్లోకి వచ్చే సబ్బు పరిమాణం తక్కువగా ఉంటుంది. సబ్బులో కొంత భాగాన్ని నీటిలో కలిపి చిలగ్గొట్టినా వచ్చే నురుగు తెల్లగానే ఉంటుంది. ఎందుకంటే సబ్బు బుడగల పొర చాలా సన్నగా ఉంటుంది. పైగా పారదర్శకం (transparent) కూడా. నురగలో సబ్బు బుడగలు ఎక్కువ సంఖ్యలో కలిసి ఉండడంతో ఒక బుడగలో ప్రవేశించిన కాంతి మరో బుడగ ఉపరితలంపై పడి పరావర్తనం (reflection) చెందుతుంది. ఇలా అనేక బుడగలపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటిలోకి ప్రవేశించడంతో ఆ నురగ మనకు తెల్లగా కనిపిస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హౖదరాబాద్
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-