Thursday, November 07, 2013

People die of thunderbolt How?,పిడుగు పడితే మనుషులు చనిపోతుంటారు ఎలా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పిడుగు పడితే మనుషులు చనిపోతుంటారు ఎలా ?

జవాబు: పిడుగు పాటుకు మనుషులు చనిపోవడాన్ని, భవనాలు, చెట్లు కూలడాన్ని ఈ మధ్య మనం వార్తల్లో తరచూ వింటున్నాం. అందుకు కారణం పిడుగు పాటులో ఉన్న అత్యధిక విద్యుత్తు పొటెన్షియల్‌ మాత్రమే. పిడుగు అంటే రూపురేఖలున్న వస్తువు కాదు. నిజానికి పిడుగుపాటుకు మరణించేది ఉరుముల సమయంలో కాదు. ఆ పాటికి పూర్తయిన మెరుపుల సమయంలోనే. పిడుగుపాటు అంటే మెరుపులో ఉన్న అత్యధిక విద్యుత్తు ప్రవాహం మనిషి శరీరంగుండా, లేదా భవనాల తడి గోడల గుండా, చెట్లగుండా భూమిని చేరడమే. తద్వారా కలిగే షాక్‌వల్ల మనుషులు మరణిస్తారు. విడుదలయ్యే అధిక వేడివల్ల భవనాలు, చెట్లు కూలిపోతాయిభ్

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...