Wednesday, March 27, 2013

Red eye of Weaping,ఏడిస్తే కళ్ళు ఎందుకు ఎరుపెక్కుతాయి ?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : ఏడిస్తే  కళ్ళు ఎందుకు ఎరుపెక్కుతాయి ?

జ : కంటి కుదుళ్ళ నుండి నిత్యం కన్నీరు స్రవిస్తూనే ఉంటుది . సాధారణ పరి్స్థితులలో ఈ కన్నీరు పరిమితం గా స్రవిస్తుంది . మరి ఏడవడం అంటే ఒక మానసికపరమైన (emotional) అనియంత్రితమైన (involuntary) దైహిక స్పందన . గుండె వేగము గా కొట్టుకోవడము , రక్తప్రసరణ వేగముగా ఉండడము , ఉద్వేగానికి గురికావడం , ఇతర ఆలోచనలు , తార్కిక దృష్ఠి లోపించడము ఏడుపు సమయము లో సంభవిస్తాయి. అలాగే గొంతు గాద్గదికం కావడము , ముక్కు కారడం , మాటలు తడబడడము జరుగుతాయి. ఏడ్చే టపుడు కళ్ళలో లాక్రిమల్  గ్రందులు ఎక్కువగా నీటిని స్రవించడానికి వాటిలోనూ , కంటి పొరలలోను ఎక్కువ రక్తము సరఫరా అవడానికి  రక్తకేశనాళికలు (blood capillaries) ఉబ్బుతాయి. అలా ఉబ్బినవి పారదర్శకముగా ఉండే తెల్లగుడ్దు కింద నుంచి కనిపించడం వలనే కళ్ళలో ఎరుపు , ఎర్రటి జీరలు కనిపిస్తాయి.


  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, March 26, 2013

What is Dry Ice? What happen on touch?డ్రై ఐస్ అంటే ఏమిటి? దాన్ని తాకితే ఏమవుతుంది ?

  •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర: డ్రై ఐస్ అంటే ఏమిటి? దాన్ని తాకితే ఏమవుతుంది ?

జ : డ్రై ఐస్ .. ఘనీభవించిన కార్బన్‌డైఆక్షైడ్  వాయువు, . దీనికి ఉత్పతనము (sublimation) అనే ధర్మము ఉంటుంది . . _ . . అంటే డ్రై ఐస్ కరిగిపోతున్నప్పుడు మామూలు ఐస్ లా ద్రవరూపములోకి మారకుండా నేరుగా వాయు రూపము లోకి కార్బన్‌డైఆక్షైడ్ గా మారుతుంది. డ్రై ఐస్ ఉష్ణోగ్రత అతి తక్కువ గా అంటే మైనస్ 78.5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందువల్ల దాన్ని నేరుగా తాకకూడదు . చేతులకు మందము గా ఉండే తొడుగులు (గ్లౌజ్) వేసుకొని తాకాలి . లేకపోతే అతి శీతలం గా ఉంటే దాని ఉష్ణోగ్రత వలన చేతివేళ్ళ పై ఉంటే చర్మానికి ఎంతో హాని కలుగు తుంది . డ్రై ఐస్ చర్మములోని కణాలను గడ్డకట్టిస్తుంది. దాని ఫలితము గా ఏర్పడిన గాయము నిప్పువల్ల కాలిన గాయము కంటే ఎక్కువగ భాదించడమే కాకుండా మానడము కూడా  చాలా కస్టము అవుతుంది. ఆ గాయము మానడానికి ప్రత్యేక చికిత్స అవసరము .

 ఆ కారణము గానే మామూలు ఐస్ గడ్డ లాగా డ్రై ఐస్ ను రుచిచూడడము , తినే సాహసము చేయకూడదు .అలాచేయడము భగ భగ మండే నిప్పు-కణికను మింగినట్లే నోటిలో అతిప్రమాదకరమైన బొబ్బలు ఏర్పడడమే కాకుండా గొంతు, అన్నవాహిక లోని కొన్ని భాగాలకు హాని కలుగుతుంది.
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, March 22, 2013

Vehicles of Hindu Gods,హిందూ దేవుళ్ళ వాహనాలు




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న : హిందూ దేవుళ్ళ వాహనాల గురించి తెలుపగలరు?

జ : దేవుళ్ళకు ,దేవతలకు రకరకాల వాహనాలు ఉన్నాయి. కారణాలు ఎన్నోఉన్నా పురాణాల రహస్యాలు తెలుసుకోవడము అంత శులభం కాదు. ప్రస్తుతం మనుజులు రకరకాల వాహనాలు .. అనగా సైకిళ్ళు , మోటారు సైకిళ్లు , కార్లు , బస్సులు , విమానాలు , ఓడలి ఇలా వివిధరకాలు వాడుతూ ఉన్నారు. మరి పూర్వకాలములో దేవతలకు అంతగా నవీన టెక్నాలజీ తెలిక పక్షులు , జంతువులను వాహనాలుగా వాడేవారని అనుకోవాలి.

 ఎలుక: ఎలుక గణేషుని యొక్క వాహనం అని పిల్ల పెద్దలందలందరికి తెలిసిన విషయమే. ఎలుక వినాయకుని వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.

ఎద్దు లేదా బసవన్న(నంది): శివుడి యొక్క సంరక్షకుడు మరియు వాహనంగా ప్రసిద్ది. నంది శివుని వాహనము. శివాలయము నందు మరియు ప్రతి హిందూ దేవాలయము నందు దేవునికి అభిముఖముగ వున్న ఎద్దు ఆకారమే "నంది" నంది కొమ్ముల మద్య నుండి భగవంతుడి ని చూచిన భగవంతుని కృప కలుగునని ప్రతీతి.

పులి: హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత పార్వతి దేవి. పులి దుర్గా దేవికి వాహనం. కొన్ని సందర్బాల్లో సింహంగా కూడా చూపెడుతుంటారు.
నెమలి: హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్నాన ప్రధాన దేవతలను మయూర వాహన౦గా ఆరాధిస్తారు అని తెలుస్తున్నది. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦. నెమలి యజ్నశక్తికి స౦కేత౦. యోగశాస్త్ర౦లో శ్వాసకు హ౦స అనే పేరు ఉన్నది.

గుడ్లగూబ: లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ. లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి.

హంస: బ్రహ్మ దేవుని యొక్క వాహనం హంస. ఈ పక్షికి పాలు మరియు నీరు వేరు చేయు అధికారం కలిగి ఉన్నదని ప్రసస్థి. ఈ పక్షి నిఘా మిరయు వివక్షతను సూచిస్తుంది.

గరుడ(గ్రద్ద): అన్నిపక్షులకు గరుడు అధిపతి. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడినది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. అవతారపురుషుడు, మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడభగవానుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

ఏనుగు/ఐరావత: ఏనుగు ఇంద్రుని యొక్క వాహనం. సురుల ప్రభువైన ఆ మహేంద్రుని వాహనము ఏనుగు, దాని పేరు ఐరావతము. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారం, రాయల్టీ మరియు ఫ్రైడ్ నుసూచిస్తుంది.

మొసలి: పచ్చని వర్ణంలో ఉండి, బంగారు కత్తి ధరించి పాముతో తయారయిన 'ఉచ్చు' లేదా 'పాశం' ఒక చేత పట్టుకుని, మొసలి మీద కూర్చుని స్వారీ చేస్తూ దర్శనమిస్తాడు. ఆయనే వరుణుడు. వేద కాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. సృష్టికి నాశనం చేసే అంశాల కంటె అభివృద్ధి చేసే అంశాలే వరుణుడిలో ఎక్కువ. వేదాల ప్రకారం... వరుణుడు స్వర్గాన్ని, భూమిని, గాలిని సృష్టించాడు. వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి ఈయనే కారకుడు. మొసలి గౌరవం, శక్తి, వేగం, శక్తి, జిత్తులమారి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది.

గుర్రము/అశ్వం:
గుర్రం ఆది దేవుడు లేదా సూర్య దేవుని యొక్క వాహనం. ఈ అశ్వం ఏడు ఇంద్రధనుస్సుల రంగులను సూచిస్తుంది. ఆది దేవుడు ఏడు గుర్రాల మీద స్వారి చేస్తారు.

సరస్వతి : హంస ,
మన్మధుడు : చిలుక ,
పార్వతి : సింహము ,
గంగకు : మొసలి ,
గణపతికి : ఎలుక ,
సుబ్రమణ్యేశ్వరుడు : నెమలి ,




  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, March 21, 2013

face become red on feelin tension Why?,కలవరపడినప్పుడు ముఖం ఎర్రబడుతుంది. ఎందుకు?

  •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఏదైనా విషయంలో కలవరపడినప్పుడు, విభ్రాంతికి లోనయినప్పుడు మన ముఖం ఎర్రబడుతుంది. ఎందుకు?

జవాబు: చర్మంలో రక్తనాళాలు వ్యాకోచిస్తే, మన శరీరం కొంత ఎర్రబడుతుంది. ఏదైనా శారీరక శ్రమ చేసినా, పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా ఇలా జరుగుతుంది. మనం ఉన్నట్టుండి ఉద్రేకపడినా, అయిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నా మన శరీరంలో ఒత్తిడి (stress) కలిగించే హార్మోన్లు అధిక రక్తపోటును కలిగిస్తాయి. దాంతో చర్మానికి ఎక్కువ రక్తం ప్రసరిస్తుంది. ఈ మార్పు ముఖం, మెడలపై స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే ముఖం కందిపోవడం, జేవురించడం, ఎర్రబడడం అంటారు. మొహం కందగడ్డలా మారిందనడం కూడా ఇందువల్లే. ఇలా ముఖం ఎరుపెక్కడం కొన్ని క్షణాల పాటే ఉంటుంది. కొందరిలో ఈ మార్పు కనిపించదు. కొందరిలో కొన్ని కారణాల వల్ల ముఖానికి రక్తప్రసరణ ఎక్కువ కాలం జరిగి ఎర్రబడు తుంది. ఈ ఆరోగ్య సమస్యను 'ఎరిత్రోఫోబియా' అంటారు. దీనిని సైకోథెరపీ, రిలాక్సికేషన్‌ థెరపీల ద్వారా నివారించవచ్చు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

Wednesday, March 20, 2013

Ghee burns Why?,నెయ్యి మండనేల?

  •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పాలకు, పెరుగుకు, వెన్నకు మండే స్వభావం ఉండదు. కానీ వెన్న నుంచి తీసిన నెయ్యికి మాత్రం మండే స్వభావం ఉంటుంది. ఎందుకు?

జవాబు: పాలల్లోనే పెరుగు, వెన్న, నెయ్యి దాగున్నాయి. ఒక వస్తువు మండే స్వభావాన్ని ప్రదర్శించాలంటే దాన్ని వెలిగించినా లేదా నిప్పు పెట్టిన వెంటనే మండాలి. అందుకు ముందుగా దానికి తగినంత ఉష్ణోగ్రత ఉండాలి. అంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా ఇంధనాలు (fuels) మండవు. పాలల్లో నీటి శాతం 80 శాతం కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాల మీదకు అగ్గిపుల్ల పెడితే అగ్గిపుల్ల ఆరిపోతుంది. దీనికి కారణం అగ్గిపుల్లలో ఉన్న వేడిని పాలలో ఉన్న నీరు సంగ్రహించడమే. ఎంత మంట పెట్టినా పాలలో ఉన్న నీరు కొంచెం మాత్రమే వేడెక్కుతుంది. మహా అయితే 100 డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుంది. పాలలో నీరు ఉన్నంత వరకు పాల ఉష్ణోగ్రత అంతకు మించి ఎదగదు. కాబట్టి పాలు మండలేవు. వెన్న ఓ విధమైన ఎమల్షన్‌. అంటే అది రెండు ద్రవాల మిశ్రమణం. అందులో నీరు ఎక్కువ, వెన్న శాతం తక్కువ. కాబట్టి వెన్నకు మంట పెట్టినా అందులో నీరు ఆ మంటలోని ఉష్ణాన్ని సంగ్రహించి ఆవిరవుతూ వెన్న మండడానికి కావలసిన ఉష్ణోగ్రతను చేరకుండా అడ్డుకుంటుంది. ఇక నెయ్యి అంటే నీటి శాతం దాదాపుగా ఏమీ లేని నూనె పదార్థం. ఇలాంటి నెయ్యికి నిప్పు పెట్టినా, మంట తాకినా నెయ్యి ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. నెయ్యి బాష్పీభవన ఉష్ణోగ్రత (boiling point) చాలా ఎక్కువ. అంటే అంతవరకు మంట ద్వారా ఉష్ణోగ్రతకు పెంచగలం. కానీ ఆ లోగానే అది గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి మండడానికి అవసరమైనంత ఉష్ణోగ్రత రావడం వల్ల మండుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, -వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Lightning sky produce sounds in Radio Why?మెరుపులు వల్ల రేడియోలో గరగరలేల?

  •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఆకాశంలో మెరుపులు వస్తుంటే, రేడియో గరగరమంటుందెందుకు?

జవాబు: వాతావరణ పీడనంలో తటాలున సంభవించే మార్పుల వల్ల ఆకాశంలోని మేఘాలు కదులుతాయి. అప్పుడు వాటిలోని మంచుముక్కలు, నీరు కొంత చెల్లాచెదురై వాటి మధ్య ఘర్షణ జరిగి మేఘాలకు విద్యుదావేశం కలుగుతుంది. మేఘాలపై రుణ విద్యుదావేశం (negetive electric charge) వస్తే, భూమిపై వస్తువులకు ధన విద్యుదావేశం (positive electric charge) సంక్రమిస్తుంది. వీటి మధ్య అనుసంధానం జరిగితే ఒక సారిగా తీవ్రమైన విద్యుత్‌ ఉత్సర్గం (electric discharge) వెలువడుతుంది. అదే ప్రకాశవంతమైన మెరుపు. ఈ ఎలక్ట్రిక్‌ స్పార్క్‌ వల్ల విద్యుత్‌ అయస్కాంత తరంగాలు ఏర్పడుతాయి.
రేడియో స్టేషన్‌ నుంచి మన రేడియోకి ప్రసారమయ్యేవి విద్యుదయస్కాంత తరంగాలే. మన రేడియో అందుకునే విద్యుదయస్కాంత తరంగాలు, మెరుపు వల్ల వచ్చే విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం (frequency) సమానంగా ఉంటే, మెరుపు వల్ల జనించే తరంగాలు కూడా రేడియోలో వినిపిస్తాయి. అయితే వాటి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రేడియోలో మనకు గరగరమనే శబ్దాలు కలుగుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===========
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, March 19, 2013

why do we weigh less on the moon?,భూమి మీద కంటే చంద్రునిపై తక్కువ బరువు ఉంటారెందుకు?

  •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న :  మీరు భూమి మీద కంటే చంద్రునిపై తక్కువ బరువు ఉంటారెందుకు?

సమాధానం : మీరు చంద్రునిపై తక్కువ బరువు ఉంటారు .  కారణం చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే తక్కువ ఉంటుంది. గురుత్వాకర్షణ సూత్రంగా అన్ని వస్తువులు  తమ ద్రవ్యరాశితో నిష్పత్తిలో ఒకదానికొకటి ఆకర్శించుకోంటాయి . చంద్రుని రాశి  భూమి ద్రవ్యరాశిలో 1/6 మాత్రమే , కావున గురుత్వాకర్షణ శక్తి దానికి తగ్గట్టు గా  బలహీనమవుతుంది కాబట్టి.

, మీ మాస్ మార్పు లేదు కాని బరువు  పూర్తిగా గురుత్వాకర్షణ శక్తి యొక్క  విధి కి లోబడి మాత్రమే ఉంటుంది  , అందువలన  సాధారణంగా ఓ గ్రహపు గురుత్వాకర్షణ శక్తి ఆ గ్రహపు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అనడం కన్నా గురుత్వాకర్షణ బలం అనడం మరింత శాస్త్రీయం. 205 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై ఎంత త్వరణం (acceleration)కలిగించే సత్తా ఉందో ఆ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. మన భూమికి ఇది 9.8 న్యూటన్లు కాగా, బుధగ్రహంపై ఇది కేవలం 3.8 న్యూటన్లు మాత్రమే. చంద్రునిపై ఇది సుమారు 1.4 న్యూటన్లు. అయితే మన సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి (జ్యూపిటర్‌)పై ఉండే గురుత్వాకర్షక బలం సుమారు 24.8 న్యూటన్లు. అంటే భూమిపై 100 కిలోల బరువుండే ఒక వస్తువు బృహస్పతిపై సుమారు 250 కిలోల బరువు తూగుతుంది. అదే వస్తువు చంద్రుడిపై కేవలం 15 కిలోలు మాత్రమే ఉంటుంది..

సూర్యుడు కూడా ఒక నక్షత్రమే . అది 5 బిలుయన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అంచనా. మరో 5 బిలియన్ల సంవత్సరాలు వరకు ఇదే కాంతితో నిలిచి ఉంటుందని అంచనా .. అన్నిట కంటే పెద్ద గ్రహము కాబట్టి భూమిమీద 60 కిలోల బరువు ... చంద్రుని మీద 10 కిలోలు , సూర్యుని మీద 1680 కిలోలు అవుతుంది . సూర్యుని  గురుత్వాకర్షణ బలం 156.8 న్యూటన్లు గా అంచనా.
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, March 12, 2013

Numbness to only to hands and feet Why?,మన శరీరంలో కాళ్లకు, చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఏర్పడుతాయెందుకు?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మన శరీరంలో కాళ్లకు, చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఏర్పడుతాయెందుకు?

జవాబు: మన శరీరంలో పరిసరాలతో సంధానించుకుని పనికి ఉపక్రమించేవి ప్రధానంగా కాళ్లు, చేతులే. మన ఉదరభాగం, వీపు, ముఖం, వక్షస్థలం, మెడ తదితర భాగాలు పరిసరాల ఒత్తిడి (pressure)కి కానీ, తాకిడి (impact)కి కానీ లోను కావు. కానీ మనం ప్రతి పనిలోను చేతుల్ని వాడకుండా ఉండలేము. కూర్చున్నప్పుడు, ఇతర భంగిమల్లోను కాళ్లు యాంత్రిక ఒత్తిడి (mechanical stress)కి లోనవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే రక్తనాళాలు (blood capillaries), నాడీ తంత్రులు (nerve fibres) అడకత్తెరలో పోకలాగా ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడు ఆయా కణాలకు, నాడీ తంత్రులకు సరిపడా రక్తప్రసరణ అందదు. ఫలితంగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు సంకేతాల రూపంలో చేరవేయడం వల్ల తిమ్మిర్లు (fingling and numbness) అనే భావనను మనం పొందుతాము. ఒత్తిడికి లోనవుతున్న చేతులు, కాళ్ల భాగాల్ని కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్‌ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sriking steel vessel with spoon sound comes from?,గరిటతో పెద్ద స్టీలు గిన్నెను కొడితే, శబ్దం దేని నుంచి వస్తుంది?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: గరిటతో పెద్ద స్టీలు గిన్నెను కొడితే, శబ్దం దేని నుంచి వస్తుంది?

జవాబు: శబ్దం గిన్నె నుంచే వస్తుంది. ధ్వని కంపించే వస్తువు(vibrating body) నుంచే వస్తుంది. ఉదాహరణకు వీణ తీగను మీటినా, తబలాపై సాగదీసి అమర్చిన చర్మంపై తట్టినా అవి కంపనాలు చేయడం వల్లనే ధ్వని ఉద్భవిస్తుంది. ఈ కంపనాలను 'స్వేచ్ఛా కంపనాలు' (free vibrations) అంటారు. గిన్నెను గరిటతో కొట్టినప్పుడు తన్యత (tension)తో ఉన్న గిన్న నుంచి స్వేచ్ఛాకంపనాలు పుడతాయి. వాటితో పాటు గిన్నెలో ఉన్న గాలిలో బలాత్కృత కంపనాలు(forced vibrations) ఏర్పడడంతో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

గరిటలో కూడా కొన్ని కంపనాలు కలిగినా అది మన చేతిలో ఉండడంతో వాటి వల్ల కలిగే శబ్దం చేతిలో లీనమైపోతుంది. అదే గరిటను కొంచెం ఎత్తు నుంచి కిందకు గచ్చుపైకి వదిలేస్తే ఘల్లుమనే శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం గరిట చేసే కంపనాల వల్ల వస్తుంది.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

What about Blue Grotto sea cave?,బ్లూ గ్రొట్టో గుహ సంగతేమిటి?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


    సముద్ర తీరంలో ఓ గుహ... రాత్రంతా మామూలుగానే ఉంటుంది... సూర్య కిరణాలు పడగానే అద్భుతం బయట పడుతుంది! ఏంటా అద్భుతం...

ఎక్కడుందా గుహ?

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గుహలు. ఒకో దానిలో ఒకో అందం. కానీ ఆ గుహలోకి వెళితే మాత్రం అద్భుతమనిపిస్తుంది. గుహలోపలి భాగమంతా నీలి కాంతులతో మిలమిలలాడుతూ ఉంటుంది. ఆ కాంతులు ఏ విద్యుద్దీపాలో పెడితే వచ్చినవి కావు. సహజంగా సూర్యకిరణాల వల్ల కలిగినవే. ఆ గుహలోకి వెళ్లాలంటే సముద్రం మీద చిన్న పడవ వేసుకుని మాత్రమే వెళ్లాలి. ఇంత కష్టమైనా దేశదేశాల పర్యాటకులు దీన్ని చూసి ఆనందిస్తుంటారు.

ఇటలీ దగ్గర సముద్రంలో కాప్రి అనే దీవి ఉంది. అందులో సగం సముద్రంలో మునిగి ఉంటుందీ గుహ. పేరు 'బ్లూ గ్రొట్టో'. ప్రపంచ భౌగోళిక వింతల్లో ఒకటిగా పేరుపొందిన ఇది ప్రాచీన రోమన్లకు కూడా తెలుసు. అప్పట్లో దీన్ని దెయ్యాల గుహ అనేవారు. అందులోకి నీలి కాంతి ఎలా వస్తుందో తెలియక వాళ్లు దేవతల విగ్రహాలను అక్కడ పెట్టి భయభక్తులతో పూజించేవారు.

ఇంతకీ ఈ గుహలోకి కళ్లు మిరుమిట్లు గొలిపేంత నీలిరంగు ఎలా వచ్చింది? ఇందులోకి చొచ్చుకొచ్చిన సముద్ర జలాలన్నీ నీలం రంగులో ఉంటాయి. వాటి మీద పడే సూర్యకిరణాలు పరావర్తనం చెంది మరింత నీలి రంగును వెదజల్లుతాయి. గుహ లోపలి భాగమంతా తళతళలాడే నీలి రంగు కాంతులతో నిండిపోయి వింతగొలుపుతుంది. నీలం రంగు రాళ్లు తెలుసుగా? అంత ముదురైన నీలి రంగు అక్కడ పరుచుకుంటుంది. గుహకి కేవలం రెండే రంధ్రాలు ఉన్నాయి. ఒకటి పడవలతో వచ్చే దారి. ఒకసారి ఒక పడవ మాత్రమే పడుతుంది. మరొకటి మొదటి దానికి పదిరెట్లు పెద్దగా వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ రెండు దారుల అమరిక, వాటిలోంచి వచ్చే సూర్యకిరణాల సమ్మేళనం వల్ల గుహలో అద్భుతం ఏర్పడుతుంది. లోపలి గుహ చాలా విశాలంగా, 177 అడుగుల పొడవుంటుంది. లోపల నీళ్లు ఈతకొలనులో ఉన్నంత ప్రశాంతంగా ఉండడంతో చాలా మంది ఈతలు కొడతారు.

జర్మన్‌ రచయిత ఆగస్ట్‌ కోప్షీ 1826లో దీన్ని కనుగొన్నాడు. మిత్రులతో సముద్రంలో ప్రయాణిస్తూ ఓ మత్స్యకారుడి సాయంతో ఇందులోకి వెళ్లాడు. ఆయన దీనిపై ఓ పుస్తకం రాయడంతో ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. పరిశోధనలు చేస్తే ప్రాచీన రోమన్లకు వేల ఏళ్ల క్రితమే దీని గురించి తెలుసినట్టు ఆధారాలు దొరికాయి. క్రీస్తు పూర్వం రోమ్‌ను పాలించిన టిబీరియస్‌ చక్రవర్తి దీన్ని వ్యక్తిగత ఈతకొలనులా వాడేవాడు. సామాన్యులు మాత్రం దీన్నొక
దెయ్యాల గుహనుకునే వాళ్లు. అప్పట్లో దీన్ని నిషేధిత ప్రదేశంగా ప్రకటించారు.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, March 10, 2013

Use of plastic bags are dangerous how?,ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు...ఎందుకని?

  •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q :  Use of plastic bags are dangerous how?,ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు...ఎందుకని? ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడకూడదు? వీటి వల్ల ప్రమాదం ఏంటి? .

  
A : ప్లాస్టిక్ లేదా పాలిథిన్ అనేది సహజంగా తయారైన పదార్థం కాదు. కాబట్టి అది కుళ్ళిపోయి భూమిలో కలిసిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది. అంతేగాకుండా వీటివల్ల వాతావరణంలో తీవ్రంగా కాలుష్యం ఏర్పడుతుంది. నూనె, కర్పూరం తో నైట్రోసెల్యులోజ్‌ను మెత్తగా చేస్తే ప్లాస్టిక్‌ తయారవుతుంది. వ్యాపార పరమైన ప్లాస్టిక్‌ను మొదట ఫినాల్‌ మరియు ఫార్మాల్డిహైడ్‌ నుంచి తయారు చేశారు. తర్వాత వివిధ రసాయనిక పదర్థాలతో తయారు చేసే పద్ధతులను కనిపెట్టారు.

నష్టాలు :
1.ఈ పాలిథిన్ కవర్లు భూమి నిండా పరచుకుని వర్షం నీటిని భూమిలో ఇంకనీయకుండా అడ్డుకోవడం వల్ల భూగర్భజలాలు తగ్గిపోతాయి.
2.మురుగు కాల్వల్లో ఈ కవర్లు పేరుకుపోవడం వల్ల డ్రైనైజీ సమస్యలు తలెత్తి వరదలకు కూడా కారణమవుతాయి.
3.అంతేగాకుండా పాలిథిన్ కవర్లలో ఆహార పదార్థాలను తీసుకెళ్తే... వాటిలోని రసాయనాలు ఆహారాన్ని కలుషితం చేస్తాయి.
4.వాడేసిన తరువాత పారేసిన ఈ కవర్లను పొరపాటున మింగటం వల్ల జంతువులు చనిపోయిన దాఖలాలు కూడా ఎక్కువే.
-- ఇంత ప్రమాదానికి కారణమవుతున్న ఈ కవర్లను కాల్చి పడేద్దామనుకుంటే ఇంకా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

5.అదెలాగంటే... ఈ పాలిథిన్ బ్యాగ్‌లను కాల్చుతున్నప్పుడు వీటినుండి వెలువడే డయాక్సిన్స్ అనే విషపదార్థాలు గాలిలో కలిస్తాయి. అలాంటి గాలిని పీల్చినవారు అనేక రకాల క్యాన్సర్ల బారిన పడక తప్పదు.

 ఈ కవర్లకు బదులుగా గుడ్డసంచి, జనపనార సంచులనో వాడాలి. ఇలా చేయడం వల్ల మనకు మనము మేలు చేసుకున్నవారమే కాకుండా, ఈ సమాజానికి కూడా మేలు చేసినవారమవుతాము.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How fools day formed?,ఫూల్స్ డే ఎలా ఏర్పడింది?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 Q : How fools day formed?,ఫూల్స్ డే ఎలా ఏర్పడింది?

 A : Fools_Day : ఏప్రిల్ ఒకటిన ఒకరిని ఫూల్ చేసి ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషిస్తుంటాం. మనకంటే పెద్దవాళ్లను ఫూల్ చేయడానికి పేటెంట్ ఉన్న రోజు.అందరినీ ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ఏడిపించడం, వేళాకోళం చేయడం ... నిజమని నమ్మేస్తే ఫూల్‌ అంటూ గేలిచేయడం ఏప్రిల్‌ ఫస్ట్‌ ప్రత్యేకత. ఆల్‌ ఫూల్స్‌ డే పేరుతో దీన్ని ప్రపంచ మంతటా అనేక దేశాల్లో సరదాగా జరుపుకొంటున్నారు.

పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌ లో ఏప్రిల్‌ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. నూతన సంవత్సరం ఉత్సవాలు, వసంత కాలపు సంబరాలు పదిరోజుల పాటు ప్రజలు ఆనందంగా నిర్వహించుకునేవారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఒకరికి మరోకరు బహుమతులు ఇచ్చే ఆచారాన్ని పాటించేవారు. అయితే 1582లో రాజైన చార్లెస్‌-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవా లని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్టున కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటి నుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టప డక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యధా విధిగా ఏప్రిల్‌ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపు కున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్‌ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్‌ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్‌ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటప ట్టించేవారు. అంతే కాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్‌ ఫిష్‌ అంటూ అల్లరి పెట్టేవారు.

ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్‌ ఫూల్స్‌ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమె రికా, బ్రిటన్‌, స్కాట్లండ్‌ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచ మంతా పాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్‌ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రానురాను ప్రాక్టికల్‌ జోక్స్‌ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్‌ జోక్స్‌ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రామాల్లోకి సైతం పాకిపోయింది.


  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do we feel chill(cold) with fever?,జ్వరంలోనూ వణుకు ఎందుకలా?



  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న : Why do we feel chill(cold) with fever?,జ్వరంలోనూ వణుకు ఎందుకలా?

జవాబు : సాధారణంగా జ్వరం వచ్చిన వాళ్ళకి ఒళ్లు కాలిపోతున్నప్పటికీ, విపరీతమైన చలితో వణికిపోతూ దుప్పటి కప్పుకుంటారు కదా...! అసలు అంత వేడిలోనూ, వాళ్ళకి చలి ఎందుకొస్తుంది, దీనికి కారణమేంటి?

ఒక మనిషికి చలి వేస్తుందా, ఉక్కగా ఉందా? అనే విషయాలు ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతకు, వాతావరణ ఉష్ణోగ్రతకు మధ్య ఉన్న తేడాను బట్టి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానంగా ఉంటే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. శరీర ఉష్ణోగ్రత కన్నా బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే శరీరంలోకి ఆ బయటి ఉష్ణం చేరుకుంటుంది.  ఇలాంటి అధిక వేడికి ప్రతిరూపంగా మనకు చెమట పట్టి, శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం అవుతుంది. అలాంటప్పుడే మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపిస్తుంది. శీతాకాలంలో బయటి ఉష్ణోగ్రత కన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మనం చలి అనే ఫీలింగ్ (భావన)కు లోనవుతాము.

సాధారణ పరిస్థితుల్లో వాతావరణ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటిగ్రేడు ఉంటే, ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెంటిగ్రేడు (98.7 డిగ్రీల ఫారెన్ హీట్) ఉంటుంది. కాబట్టి ఉష్ణశక్తి వినిమయం శరీరం నుంచి బయటికి కానీ, బయటి నుంచి శరీరానికి కానీ పెద్దగా ఉండదు కాబట్టి అంత ఇబ్బందిగా ఉండదు. అయితే జ్వరంతో ఉన్న వ్యక్తి శరీర ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడు (105 డిగ్రీల ఫారెన్ హీట్) వరకు ఉండవచ్చు. అంటే వాతావరణ ఉష్ణోగ్రత కన్నా 4 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి... జ్వరంతో ఉన్న మనిషి శరీరం నుంచి ఆ ఉష్ణశక్తి బయటికి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ మనిషికి చలి వేస్తుంది.

  • ==================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, March 02, 2013

What is Infomania? Is it a disease?,ఇన్‌ఫోమానియా అంటే ఏమిటి? అదేమైనాజబ్బా?

  •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న : మా అమ్మ నాన్నని ఇన్‌ఫోమానియా అని అంటుంది. ఇదేమైనాజబ్బా?,What is Infomania? Is it a disease?.

జవాబు : ఉదయమనగా ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రం  ఇంటికి చేరగానే భార్యాభర్తలిద్దరూ కొంతసేపైనా సరదాగా కలిసి గడపాలనుకుంటారు. పేరుకుపోయిన కబుర్లు విప్పి చెప్పుకోవాలనుకుంటారు. ఇద్దరూ అలాగే అనుకుంటే ... ఓ.కే. కాని ఆ ఇద్దరిలోఎవరైనా ఇంటికి వచ్చీరాగానే ట్విట్టర్ లొనో , ఫేస్ బుక్ లోనో తల దూర్చుతుంటే , చూసేవారికి కోపం కట్టలు కట్టలు గా రావడం పక్కనబెడితే ... చేసేవారికి " ఇన్‌ఫోమానియా " ఉన్నట్లు లెక్క.

అంటే స్మార్ట్ ఫోన్‌ కు ఇది అనారోగ్యకరమైన ఎడిక్షన్‌ అన్నమాట . సెల్ ఫోన్‌ కో , కంప్యూటర్ కో నిరంతం సమాచారము ... జోక్స్ , ఎస్.ఎం.ఎస్ లు , ఈమెయిల్స్ , యానిమేషన్‌ వీడియోస్ తెగవచ్చి సమాచారము ఓవర్లోడ్ అయిపోతుంది. కొత్త లో సమాచారము ఏమిటో? అని చూడ్డం మొదలు పెడతారు. అలా చూస్తూ దానికి అలవాటైపోతారు ... అది కాస్తా ఎడిక్షన్‌ గా మారిఫోతుంది. 1980 సం. తరువాత నుండి ఈ టెక్నాలజీ అభివృద్ధి అయి, యూజర్ లలో ఇది ఒక  "సైకొలాజికల్  డెబిలిటీ(psychological debility)" గా మారినది.

పడకచేరే సమయమైనా ఫోన్‌ వదలక పోతే మరీ ఎక్కువ ముప్పు తప్పదు. ఇటువంటి ధోరణి  వైవాహిక బాంధవ్యం పై తీవ్రపరిణామాలు చూపగలవు . ఇది భారీ సమస్యలకు దారి తీస్తుంది. ఏ పార్టీకో , మరే ఇతర కార్యక్రమాలకో వెళ్ళినా లేదా ఇంటిలోనైనా తనేదో పనిలో ఉన్నట్లు ఈ టెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ లో మునిగిపోతారు. మనసు అటే లాగుతుంది. ఎవరేమనుకున్నా వారిపని వారిదే. దీనివలన సంబంధబాంధవ్యాలు, సమయము కూడా కోల్పోక తప్పదు . రాను రాను మానసిక సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.


  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-