Saturday, February 22, 2014

తెలుగు పిల్లల తెలుగు-చదువులు ఎంతవరకు అవసరము?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  



కాన్వెంటు చదువుల పుణ్యమాని మన పిల్ల లకి తెలుగు రాకుండా పోతోంది. పైగా ఈ రోజుల్లో తెలుగు రాదని చెప్పడం ఒక ఫాషన్‌ కూడా. తెలుగు అక్షరాలు కూడబలుక్కుని చదవడమే కష్టమైన తరుణంలో మన సంస్కృతీ సంప్రదాయాలు ఎలా తెలుస్తాయి?!

ఎంతసేపూ 'టామ్‌ అండ్‌ జెర్రీ' లాంటి కార్టూన్‌ చిత్రాలు లేదంటే 'హారీపాటర్‌' లాంటి సినిమాలే తప్పిస్తే 'కాశీమజిలీ కథలు', 'నీతిచంద్రిక' లాంటి అద్భుతమైన కథల గనులు ఉన్నాయని కూడా ఈ తరంవారికి తెలీదు. ఇక వేదాలు, పురాణ ఇతిహాసాలు, చారిత్రక అంశా ల్లాంటివేం బోధపడ్తాయి? ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌కి పెద్ద పీట వేయక తప్పదు, నిజమే. అయినా మన గురించి మనకు తెలీకపోతే ఎలా?! ఈ లోటు తీరాలంటే ఇళ్ళల్లో తల్లిదండ్రులు, స్కూళ్ళల్లో టీచర్లు శ్రద్ధ తీసుకుని పిల్లలతో కథల పుస్తకాలు చదివించాలి. అప్పుడే ఆశించిన ఫలితం వస్తుంది.

ప్రతి ఒక్క తెలుగు బిడ్డ తప్పనిసరిగా తెలుగు ప్రాథమిక స్థాయినుండే నేర్చుకోవాలి. అన్ని సబ్జెక్ట్ లూ తెలుగులోనే నేర్చుకుంటే మంచి అవగాహన , సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. అలాగని తెలుగేతర ప్రజలతో మాట్లాడాలంటే ఇండియాలో ఉన్న అన్ని భాషలూ నేర్చుకోలేము. అందరికీ కామన్‌ గా ఉన్న భాషనే నేర్చుకోవాలి ... అదే మన ఇండియన్‌ ఇంగ్లిష్ .. తప్పనిసరిగా నేర్చుకోవలసిందే.

  • ========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, February 17, 2014

Buffelo milk is whiter than cow milk Why?,ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు ?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ఫ్ర :  ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు ?
జ : పాలు అన్నీ తెల్లగానే ఉంటాయి. అందుకు కారణము కాల్సియం ఎక్కువగా ఉండడము వలన. ఇక్కడ ఆవుపాలు ... గేదె పాలు కంటే  కొద్దిగా పచ్చగా కనిపిస్తాయి. మీరు నిశితముగా గమనిస్తే కనబడుతుంది. దీనికి కారణము ఆవుపాలలో బి-కెరోటీన్‌ అధిక మోతాదులో ఉండడము వలనే.గేదె పాలలో తెల్ల రంగు కి కారణము అధికము గా కాల్సియం ఉంటుంది.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, February 16, 2014

ఋణము అంటే ఏమిటి? అవి ఎన్ని ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


ప్ర : ఋణము అంటే ఏమిటి? అవి ఎన్ని ?

జ : ఋణము అంటే మనము బాకీ పడ్డ డబ్బులు కావు . దైవకము గా ఆద్యాత్మికముగా ఋణము అంటే మనము జీవితములో బదులు చేయవల్సిన కార్యములు అని అర్ధము .అవి మూడు ...>

త్రిఋణాలు అనగా మనిషికి ఈ భూమి మీద జన్మనిచ్చిన వారికి అతను మూడు విధాలుగ ఋణపడి ఉంటాడు. ఈ ఋణములను అతను తన జీవిత కాలంలొ తీర్చుకోవలసి ఉంటుంది. అవి 1) దైవ ఋణములు, 2) పితృ ఋణములు,3) ఋషి ఋణములు.

ఆశ్రమ ధర్మాలు అనగా మనిషి జన్మ తంతు ప్రారంభమయినప్పటి నుండి పరమపదించేవరకు మనిషి వివిధ వయసులలో చెయ్యవలసిన కర్మలే.

దైవ ఋణాలు:
 మనిషి జన్మకు మూల కారణం దేవుడు కనుక మొదటగ మనిషి దేవతలకు ఋణము తేర్చుకోవాలి! యజ్ఞ యాగాదులు నిర్వహించడము దైవఋణములు తీర్చుకోవడనికి ఒక త్రోవగా చెప్పడమయినది. యజ్ఞ తంతు లో వైధిక దేవతలయిన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అస్విని దేవతలు మొదలయినవారిని పూజించడం చెయ్యవలెను. వివిధ రకాలయిన ద్రవ్యములు ప్రధానంగా ఆవు నెయ్యి యజ్ఞ కుండలిలొ అగ్నికి సమర్పించడం జరుగుతుంది.  తదుపరి భూతబలులు ఇచ్చి దేవతలకు ఆహారముగ సమర్పించడం జరుగుతుంది. అనగా యజ్ఞ  తంతు లో తోటి జనులకు విందు భోజనములు నిర్వహించాలన్నమాట.
   
పితృ ఋణములు:
భౌతికంగా మనిషి కి జన్మనిచ్చిన జనకులకు, వారికి జన్మనిచ్చిన  వారి పితృలకు...ప్రతి మనిషి ఋణపడి ఉంటాడనేది పితృ ఋణ సిద్ధాంతానికి ప్రాతిపదిక కావొచ్చు. ఈ పితృ ఋణాలు భారతీయులు చక్కగా తీర్చు కుంటారు. అది ఎలానంటె ప్రధానంగా పిల్లల్ని కనడం ద్వారా! పిల్లల్ని సాంప్రదాయబద్ధంగా పెంచడం ద్వార!మన సాంప్రదాయములలొ వివహం ప్రతి మనిషి జీవితంలొ ఒక ప్రధానమయిన తంతు గా నిర్వహించబడుతుంది. "ధర్మ ప్రజా సంపత్యర్ధం రతి సుఖ సిధ్యర్ధం స్త్రియముద్వహె"ఈ వాక్యానికి అర్ధం ఏమిటంటె ధర్మాన్ని కాపాడడానికి, పిల్లల్ని కనడానికి, రతి సుఖాన్ని పొందడానికి భార్య చేయిని పట్టవలెను."ప్రజయాహి మనుష్యా పూర్నాః" అనగా పిల్లల్ని కనడం వల్లనె మనిషి జన్మానికి పూర్ణత్వము లభిస్తుంది."ఆచార్యాయ ప్రియమ్ ధనమహ్రుత్య ప్రజాతమ్తుమ్ మవ్యవత్సెత్సిహ్" అనగా బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమంలోకి మారడానికి గురువుకు తగిన దక్షిణ సమర్పించుకొని ఆయన అనుజ్ఞ స్వీకరించి వివాహం చేసుకోవాలని చెప్పబడినది. ఇక్కడ విషేషమేమిటంటే  మనిషి తన యొక్క తన పూర్వికుల యొక్క వంశము నిర్మూలనము కాకుండా వుండడనికి తన ధర్మ నిర్వహణలో భాగంగా వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించి పిల్లల్ని పొంది వారిని పెంచి పోషించడం చెయ్యవలెను. ఈ విధంగా పితృ ఋణాన్ని తేర్చుకోవలెను.
   
ఋషి ఋణములు:
ఋషి ఋణములు అనగా సన్యాసులకు ఋణములు అని కాదు. ఋషులు అనగా మనకు జ్ఞ్నాన సంపదను అందించిన మన పూర్వ గురువులు. మనకు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వేదములు, పురాణాలు, వేదాంగాలు, ఇతిహాసాలు - రామాయణ, భారతాలు, ఉపనిషత్తులు, శిక్ష, నిరుక్తి, వ్యాకరణము, యోగ, మొదలయిన జ్ఞాన సంపదను మనకు అందించిన దైవంశ సంభూతులయిన మహా పురుషులే ఋషులు. వీరికి మనము అనగా హిందువులు ప్రత్యేకంగా ఋణపడి ఉంటారు.  పైన ఉదహరించిన శాస్త్రల్ని అభ్యసించడం ద్వారను జ్ఞ్నాన సముపార్జన చెయ్యడం ద్వారాను మరియు పర్వ దినాల్లో బ్రహ్మచర్యం , ఉపవాసము పాటించడం ద్వారాను హిందువులు ఋషులకు చెల్లించాల్సిన ఋణాల్ని తీర్చుకోవలెను. మనిషి తన ఈ జన్మ లో ఈ మూడు ఋణాల్ని తీర్చుకోవడం ప్రధానకర్తవ్యం అని  తెలుసుకోవలెను.

వేదాల్లో పుత్రుని యొక్క గొప్పతనము అనేక విధాలుగా వివరించబడింది. పుత్రుని ముఖము చూచినంతనే మానవుడు పితృ ఋణము నుండి విముక్తి పొందును. మనవడి శరీర స్పర్శ వలన పితృ ఋణము, దేవ ఋణము, ముని ఋణము... ఈ మూడు ఋణాలు వల్ల విముక్తి కలుగును. పుత్ర, పౌత్రులచే భయంకరమైన యమలోకమును దాటి స్వర్గమునకు వెళ్ళు మార్గము కనిపించును.
  • ========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, February 03, 2014

వేయించిన అప్పడాలు కొంతసేపు ఉంచితే మెత్తగా అవుతాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  



ప్రశ్న: నూనెలో వేయించిన అప్పడాలు, వడియాలు వంటివి బయట కొంతసేపు ఉంచితే మెత్తగా అవుతాయి. కానీ వాటిని గాలి చొరబడని కవర్లలో ఉంచితే రెండు మూడు రోజుల వరకు బాగానే ఉంటాయి. ఎందుకు?

జవాబు: వేగుతున్న ఉష్ణోగ్రత, నీటి భాష్పీభవన ఉష్ణోగ్రత కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత దగ్గర అప్పడాలను, వడియాలను వేయించినపుడు అందులో ఉన్న నీటి ఆవిరి పూర్తిగా ఆవిరవుతుంది. పైగా కొన్ని రసాయనిక చర్యలు జరిగి నత్రజని కర్బన ద్వి ఆమ్లజని వంటి వాయువు కూడా వెలువడి అప్పడాలను, వడియాలను కరకరలాడేలాగా చేస్తాయి. కరకరలాడే తత్వానికి ప్రధాన కారణం అవి పూర్తిగా జలరహితంగా ఉండటమే. కానీ వాటిని అలాగే కాసేపు గాలిలో ఉంచితే గాలిలోని నీటిని తిరిగి ఆ అప్పడాల, వడియాల పొరల్లోకి చేరుతుంది. కాబట్టి మెత్తగా అవుతాయి. ఎందుకంటే లోనికెళ్లిన నీటి ఆవిరి అక్కడున్న కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి పదార్థాలలో హైడ్రోజన్‌ బంధాల్ని ఏర్పర్చి వివిధ పొరల మధ్య మెత్తటి సంధానం లాగా పనిచేస్తుంది. కానీ నూనెలో తీసిన వెంటనే లేదా కొద్దిసేపటికే గాలి చొరబడని కవర్లలో దాచినట్లయితే అందులోకి నీటి ఆవిరి వెళ్లే అవకాశాలు తక్కువ ఉండటం వల్ల అవి కరకరలాడుతూ ఉంటాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

ఫంగస్‌ వృక్ష జాతికి చెందుతుందా లేదా జంతుజాతికి చెందిందా?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఫంగస్‌ వృక్ష జాతికి చెందుతుందా లేదా జంతుజాతికి చెందిందా?

జవాబు: ఫంగస్‌ పురాతనమైన రాళ్లపై చెట్ల వేళ్లపై భూభాగంపై ఏర్పడే బూజు. దీనిని 'శిలీంధ్రం' అని కూడా అంటారు. పై చెప్పిన వాటిపై మనం చూసే ఫంగస్‌ పెరుగుతున్న భాగం. అయితే పైకి మనకు కనిపించేది చాలా తక్కువ శాతం. ఎక్కువ భాగం అతి సన్నని దారాల రూపంలో భూమి ఉపరితలం కింద వ్యాపించి ఉంటుంది.

ఫంగస్‌ అటు వృక్ష జాతికిగానీ, ఇటు జంతు జాతికిగానీ చెందినదికాదు. అదో ప్రత్యేక జాతి. ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు ఒక లక్ష ఫంగస్‌ రకాలను కనిపెట్ట గలిగారు. కానీ ఫంగస్‌ జాతులు మూడు లక్షల వరకు ఉన్నాయని వారి అంచనా. ఫంగస్‌ స్థిరమైన, దృఢమైన స్థానాల్లో పెరగడం వల్ల అది జంతు జాతి కన్నా వృక్ష జాతికి చెందినదని భావించారు. కానీ మొక్కలలాగ ఫంగస్‌ కిరణజన్య సంయోగక్రియను జరుపలేవు. అంతేకాకుండా వాటి కణాల్లో మొక్కలలో ఉండని జంతువులలో మాత్రమే ఉండే 'చిటిన్‌' అనే పెంకులాంటి పదార్థం ఉంటుంది. ఇదే కాకుండా దానికున్న శారీరక, జన్యులక్షణాల ఆధారంగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఫంగస్‌ మొక్కలకన్నా జంతువుల వైపే మొగ్గు చూపుతుందని తేలింది.

- ప్రొ||ఈ. వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-