Tuesday, July 28, 2015

ఈ విశ్వంలో మనం కాక మరో నాగరికత ఉన్నట్లు ఎలా కనుగొనగలం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: ఈ విశ్వంలో మనం కాక మరో నాగరికత ఉన్నట్లు ఎలా కనుగొనగలం?

జవాబు: శాస్త్రవేత్తలు 1960 నుంచి అతి పెద్ద రేడియో ఏంటినాల సాయంతో భూమిపైనే కాకుండా ఈ విశ్వంలో మరెక్కడైనా ప్రాణులున్నాయా అని రోదసినంతా జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు వారు ఆశించిన ఫలితాలు లభించలేదు.

కాలిఫోర్నియాలో రూపొందించిన ఒక టెలిస్కోపు సముదాయం ఉంది. అది బిలియన్ల సంఖ్యలో ఉండే రేడియో ఛానల్స్‌ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఉండే నక్షత్రాల రహస్యాలను వెలువరించగలదు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమే భూమిపై కాకుండా విశ్వంలో మరేదైనా నాగరికత ఉందా అనే అన్వేషణకు అంకితమైన SETI అనే గ్రహాంతర జీవుల అన్వేషణ సంస్థ. 1960లో ఫ్రాంక్‌డ్రెక్‌ అనే నక్షత్ర శాస్త్రజ్ఞుడు విశ్వంలోని మరేదైనా ప్రాంతం నుంచి మరో నాగరికతకు సంబంధించిన ప్రాణుల నుంచి ఏవైనా సంకేతాలు వస్తున్నాయా అనే అన్వేషణలో, మన పాలపుంతలో అలాంటి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ ప్రయాసలో ఆయన ఒక సమీకరణాన్ని రూపొందించారు. ఈ సమీకరణం ద్వారా మన నక్షత్ర మండలంలో మన కన్నా సాంకేతికంగా పురోగమించిన నాగరికతల సంఖ్యను లెక్కకట్టవచ్చు. లోపమల్లా ఈ సమీకరణం ద్వారా సేకరించిన విశ్వాంతర నాగరికతల మధ్య పొంతన లేకపోవడమే.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, July 13, 2015

మిగతా జంతువులతో పోల్చితే కుక్కకు మాత్రమే విశ్వాసం అనే గుణం ఎలా వచ్చింది.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్రశ్న: మిగతా జంతువులతో పోల్చితే కుక్కకు మాత్రమే విశ్వాసం అనే గుణం ఎలా వచ్చింది.

జవాబు: కుక్కలు, పిల్లులు, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు మొదలైన క్షీరద జంతువులు మానవ సామాజిక జీవితంలో పెంపుడు జంతువులుగా ఉండనట్లయితే అవి లక్ష సంవత్సరాల క్రితమే అంతరించిపోయేవని జీవావరణ శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. ఎందుకంటే వాటికి క్రూరమృగాల నుంచి, విపరీతమైన ప్రకృతి భీభత్సాలనుంచి ఆత్మ రక్షణ చేసుకోగల సత్తాలేదు. అంతేకాదు, కోళ్లు, బాతులు కూడా మానవుడు లేకుంటే ఇంతకాలం పాటు ఉండేవి కావని తెలుస్తోంది.

ఇలా మానవుడితో ప్రత్యక్షంగా (పెంపుడు), పరోక్షంగా (వీధి) శునకాలు భాగమయ్యాయి. కుక్కకు సహజ సిద్ధంగా చాలా సునిశితమైన ఘ్రాణశక్తి ఉంది. మనిషికున్న ఘ్రాణశక్తికన్నా కుక్కలకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఘ్రాణశక్తి ఉంది. అందువల్ల మనుషుల్ని వారి నుంచి విడుదలయ్యే విశిష్టమైన వాసనల ఆధారంగా గుర్తించగలుగుతాయి. అన్నం పెట్టే వారెవరో, పెట్టని పక్కింటి వారెవరో, ఎపుడూ చూడని ఆగంతకులెవరో వాసన ద్వారా ప్రధానంగా చూపులద్వారా కుక్కలు గుర్తించగలుగుతాయి. అలా వీటికి విశ్వాస గుణం అలవడింది.
కుక్కలకు నోరెక్కువ. గట్టిగా మొరగగలవు. కాబట్టి ఆగంతకులు వస్తే అరిచిగోల చేస్తాయి. ఇంటివారికి ఆ విధంగా సహకరించగలవు. అంతేకాకుండా ఇవి కరుస్తాయి. కుక్కలున్న ఇంటికి రావాలంటే దొంగలకు భయం. అందుకే మనుషులకు కుక్కలు మంచి పెంపుడు జంతువులయ్యాయి. మిగతా జీవులను పెంచుకున్నా అవి కుక్కల్లా విశ్వాసం చూపించలేవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

 

నీటి సదుపాయం ఏ మాత్రం లేని ఎడారులలో కొన్ని మొక్కలు ఎలా పెరుగగలుగుతున్నాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్రశ్న: నీటి సదుపాయం ఏ మాత్రం లేని ఎడారులలో కొన్ని మొక్కలు ఎలా పెరుగగలుగుతున్నాయి?

జవాబు: ఎడారులలో 'వృక్ష సంపద' అంటూ ఏమీ లేకపోయినా జెముడు (కేక్టస్‌), ఔషధ సంబంధిత గడ్డి మొక్కలు, చిన్న పొదలు అక్కడ పెరుగుతాయి.xerophytese అని ప్రసిద్ధిగాంచిన ఈ మొక్కలకు అంతగా అనుకూలించని పరిసరాలలో కూడా పెరిగే సామర్థ్యంఉంటుంది. ఇవి పెరగడానికి అతి కొద్ది పాటి నీరు (తేమ) సరిపోతుంది. ఆ నీరు సంపాదించుకోవడంలో అవి వివిధ మార్గాలు అవలంబిస్తాయి. ఉదాహరణకు, జెముడు మొక్కలు ఎపుడైనా పడిన వర్షపు తుంపరల నీటిని అనేక నెలల పాటు తమలో నిల్వ ఉంచుకోగలవు. గుబురుగా పొదల రూపంలో ఉండే హెర్బాసియన్‌ మొక్కల వేర్ల వ్యవస్థలు ఎడారులలోని భూభాగం లోపల అతి లోతుగా విశాలంగా వ్యాపించి అక్కడి భూగర్భ జలాన్ని అధిక శాతంలో పీల్చుకుంటాయి. ఎడారులలో ఉండే చెట్ల వేర్లు కూడా భూమి లోతులకు చొచ్చుకొనిపోయి అక్కడి నీటిని పీల్చుకొని, వాటి ఆకులను త్వరత్వరగా రాల్చుకొంటాయి. అందువల్ల చెట్ల ఆకుల నుంచి భాష్పీభవన ప్రక్రియ ద్వారా ఆవిరయ్యే నీటి శాతం తగ్గి, చెట్లలోనే నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌


  • =====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

మనలో చాలా మందికి చదవుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: మనలో చాలా మందికి చదవుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది ఎందుకు?

జవాబు: చదివేటప్పుడు నిద్ర రావడమనేది మనం ఏ భంగిమలో ఉన్నాం, ఎంతసేపు ఉన్నాం అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. చదివేటపుడు మన శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల కండరాలకు ప్రవహించే రక్త ప్రసరణ తగ్గుతుంది. దాని వల్ల శరీరంలోని జీవకణాల్లో దహనచర్య మందగించి, లాక్టిక్‌ యాసిడ్‌ అనే ఆమ్లం తయారవుతుంది. ఈ ఆమ్లం ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అతిగా పీల్చుకొంటుంది. దాంతో శరీరంలోని రక్తానికి కావలసిన ఆక్సిజన్‌లో కొంత తగ్గుతుంది. ఆక్సిజన్‌ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా, నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు ఒకే భంగిమలో ఉండి పోకుండా అపుడపుడూ అటూ ఇటూ కదలడం, ఏకబిగిన చదవకుండా మధ్యలో కాస్త విరామం ఇవ్వడం అవసరం.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Sunday, July 12, 2015

విమానాలు ఆకాశంలో ఎగురుతున్నపుడు వాటి మీద పిడుగులు పడవా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: విమానాలు ఆకాశంలో ఎగురుతున్నపుడు వాటి మీద పిడుగులు పడవా?


జవాబు: విమానాలు గాలిలో ఎగురుతున్నపుడుగానీ నేలమీద ఉన్నపుడుగానీ వాటిని పిడుగులు సాధారణంగా ఏమీచేయలేవు.
పిడుగు అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ విషయం బోధపడుతుంది. మేఘాల రాపిడితో ఉద్భవించిన అత్యధిక స్థిర విద్యుత్తు నేలవైపునకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నేలకు, విద్యుదావేశితాలయిన మేఘాలకు మధ్య వేల వోల్టుల మోతాదులో శక్మ భేదం (Potential difference) ఉంటుంది. రెండు బిందువుల మధ్య శక్మ భేదం ఉన్నట్లయితే విద్యుదావేశం అతి తక్కువ నిరోధం ఉన్న మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఆ విద్యుద్గమనం ఉష్ణ రూపంలో బయటపడుతుంది. అదే ప్రమాదాన్ని కలిగించే సంఘటన. కానీ విమానం కిందున్నపుడు విద్యుత్ప్రవాహాన్ని నిరోధించే రబ్బరు టైర్లు ఉంటాయి. మేఘాల్లో ఉన్నపుడు దాని ద్వారా భూమిని చేరే మార్గం మేఘాల్లోని విద్యుత్తుకు లేదు. అసలు విషయం మరోటి ఉంది. విమానం పైకి లేచిన కొన్ని నిముషాల్లోనే అది మేఘాల్ని దాటి పైకి వెళ్లి ప్రయానిస్తుంది. మెరుపులు ఉరుములు, పిడుగులు తన కింద ఎక్కడో సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి పిడుగు ప్రభావం విమానం పైన ఉండదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

తుపాను వచ్చేముందు కీటకాలకు తెలిసిపోతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...









ప్రశ్న: ఉరుములతో కూడిన 'తుపాను' వచ్చే ముందు కొన్ని పురుగులు, కీటకాలు నేలకు దగ్గరగా ఎగురుతూ ఉంటాయి. ఎందుకు?

జవాబు: మామూలుగా దోమల వంటి చిన్న కీటకాలు గాలిలో ఎగురుతూ, తిరుగుతుంటాయి. వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నపుడు, గాలి బరువుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎగిరే కీటకాలకు వాతావరణంలోని పై పొరలలోకి ప్రవేశించి ఎగరగలిగే ప్రేరణ లభిస్తుంది. కానీ తుపాను రావడానికి ముందు వాతావరణ పీడనం తగ్గిపోవడంతో ఎక్కువ ఎత్తులో ఎగిరే కీటకాలు భూమికి దగ్గరగా కింది తలాలకు పడిపోతాయి. ఆ పరిస్థితుల్లో అవి తమ రెక్కల సాయంతో కాకుండా తుపాను ముందు వీచే నులివెచ్చని గాలితోపాటు ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరే కీటకాలను తుపాను పురుగులు అంటారు. ఇలా ఎగిరే కీటకాలు ప్రపంచం మొత్తం మీద 5,000 రకాలు ఉన్నాయి. నేలకు దగ్గరగా ఎగిరే ఈ కీటకాలు తుపాను రాకను ముందుగా తెలియజేసి మనకు కొంత వరకు మేలు చేస్తాయి. కానీ అవి ఏపుగా ఎదిగిన మొక్కల ఆకులకు రంధ్రాలు చేసి ఆ మొక్కల్లోని జీవరసాన్ని ఆహారంగా పీల్చి వేయడంతో పూలు, కులు త్వరగా నశిస్తాయి. అలా ఈ కీటకాలు ప్రకృతికి హాని కలగజేస్తాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

ఎర్రచందనం, గంధం ఒకటేనా? వాటి ఉపయోగాలేమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








ప్రశ్న: ఎర్రచందనం, గంధం ఒకటేనా? వాటి ఉపయోగాలేమిటి?

జవాబు: ఎర్రచందనం, గంధపు వృక్షం రెండూ సుగంధ ద్రవ్య వృక్షాలే అయినా వృక్ష శాస్త్ర పరంగా రెండూ ఒకే జాతికి చెందినవి కావు. ఎర్ర చందనానికి వాసన కన్నా రంగు ఎక్కువ. దీనిని వృక్ష శాస్త్రంలో టెరో కార్పస్‌ శాంటాలినస్‌ అంటారు. ఎర్రచందనపు వృక్షం మధ్య భాగం ఖరీదు ఘనపుటడుగు దాదాపు రూ. లక్ష వరకు ఉంటుంది. చాలా దృఢంగా, ముదురు ఎరుపు రంగులో ఉండడం వల్ల ఈ కలపను ఖరీదైన నిర్మాణాల్లోనూ, చైనా వాళ్లు తినడానికి వాడే పుల్లల తయారీలోనూ, ఎర్రని పౌడర్‌ తయారీలోనూ ఎర్రచందనాన్ని వాడుతున్నారు. ఒక్కో చెట్టు విలువ సుమారు కోట్లలో ఉండడం వల్ల ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు గురవుతున్నట్టు తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. గంధపు చెట్టును శాస్త్రీయంగా శాంటాలమ్‌ పెనిక్యూలాటం అంటారు. ఇవి ఎర్ర చందనం లాగా దృఢంగా ఉండవు. గరుగ్గా ఉన్న బండమీద నీరు పోసి రాస్తే పసుపు రంగులో ఉన్న గంధపు లేపనం లభిస్తుంది. ఈ చెట్టు నుంచి తీసిన నూనెను ప్రధానంగా సుగంధ ద్రవ్యాలలోనూ సబ్బుల తయారీలోనూ వాడతారు. గంధపు చెట్టు కలపను నిర్మాణాల్లో వాడరు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,--జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ==========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, July 11, 2015

మోటారు వాహనాలను పెట్రోల్‌కు బదులు గాలితో నడపడానికి వీలుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








ప్రశ్న: మోటారు వాహనాలను పెట్రోల్‌కు బదులు గాలితో నడపడానికి వీలుందా?

జవాబు: రోజు రోజుకూ పెట్రోల్‌ ధర పెరిగిపోతున్న కారణంగా ప్రపంచ దేశాల్లోని శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ ఇంధనాల అన్వేషణలో తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాసలోని భాగమే బాగా ఒత్తిడికి గురి చేసిన గాలి లేక ఇతర వాయువులను (వీటిని సంపీడన వాయువులు అంటారు) మోటారు వాహనాలను నడపడానికి ఉపయోగించవచ్చా అనే దిశలో ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాలు. ఒత్తిడిలో ఉన్న వాయువును వ్యాకోచింపజేస్తే ఉత్పన్నమయే బలం మోటారు వాహన ఇంజన్‌ పిస్టన్‌ను నడపడానికి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో నడిచే వాహనం శబ్ద కాలుష్యం లేకుండా నిశ్శబ్దంగా నడవడమే కాకుండా, కార్బన్‌, పొగలాంటి కాలుష్యాలు వెదజల్లదు.

గాలి (వాయువు) సాయంతో నడిచే ఈ 'ఎయిర్‌ కారు'లో అత్యధిక ఒత్తిడికి గురిచేసిన గాలితో నింపిన గాలి సీసాలు ఉంటాయి. ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో పయనించేటట్టు డిజైన్‌ చేస్తారు. ఒత్తిడిగల గాలితో టాంకులు నింపడానికి పెట్రోలు టాంకులలా కాకుండా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. పెట్రోల్‌ ప్రమేయం లేకుండా మోటారు వాహనాలను నడిపే మరో ప్రాజెక్టులో నైట్రోజన్‌ను ఇంధనంగా వాడతారు. ఈ వాయువులో 78 శాతం గాలి మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వాయురూపంలో ఉండి, వేడి చేసినపుడు 700 రెట్లు వ్యాకోచిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇంధన స్టేషన్లు దేశదేశాల్లో వెలిసే అవకాశం ఉంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Friday, July 10, 2015

చల్లదనము సృష్టించడము ఎందుకంత కష్టము ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్ర : చల్లదనము సృష్టించడము ఎందుకంత కష్టము ?

జ: చలిగా ఉంటే అరచేతులు రాచుకుని ముఖము మీద పెట్టుకుంటే వేడిగా తగులుతుంది. కాని వేసవిలో చల్లదనము సృష్టించే మార్గం మన  దగ్గరలేదు. ఫ్రిజ్, ఎయిర్ కండిషనర్ వంటి ఖరీదుతో కూడుకున్నవే చల్లదనానికి వాడేవి . వాయువులో అటు ఇటు అణువులు గందరగోళం గా తిరుగుతుంటాయి . వాటి వేగము తగ్గించి వస్తువును చల్లపరచాలంటే చాలా శక్తి అవసరము . అటువంటి శక్తిని  మనము చేతితో సృష్టించలేము.యాంత్రికము గా మాత్రమే సాధ్యము. అందుకే వస్తువులను సులభముగా వేడిచేయగలము గాని అంతే త్వరగా తక్కువ శక్తితో చల్లబరచలేము .


  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, July 04, 2015

What is Mirage-ఎండమావి అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ఎండమావి (ఎండమావులు) (ఆంగ్లం Mirage) అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక కాంతి ధర్మం. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే.
ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనం నిలబడినపుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్టు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటి మావులను ఎండమావులు అంటారు. కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. తారు రోడ్డు మీద నీరు ఉన్నట్టుగా భ్రమ పడడానికి కూడా కారణం సంపూర్ణాంతర పరావర్తనం. ఇది వాతావరనము లోని ఉష్ణోగ్రత ప్రభాన ఏర్పడతాయి. ఉష్ణోగ్రత పెరిగినపుడు భూమిని అంటిపెట్టుకుని ఉన్న గాలి వేడెక్కి పలుచబడి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కాని పైన వున్న గాలి చల్లదనము  వేడిగాలిని పైకి వెళ్ళనివ్వనందున ఈ వేడిగాలి  పక్కకు చేసే ప్రయాణం అలలా ఉండి నీటిప్రవాహాన్ని తలపిస్తుంది... అదే ఎండమావి.


Wednesday, July 01, 2015

పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్ర : పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారా? ఉంటే వారి పేర్లేమిటి?

జ : పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారు .
ధర్మరాజు కి : దేవిక , పౌరవతి.
భీమునుకి : జలంధర , కాళి , హిడింబ .
అర్జునుకి : సుభద్ర , ఉలూచి , చిత్రాంగద , పమీల .
నకులునికి : కరేణుమతి, (కరుణుక ).
సహదేవునికి : విజయ . ........................ అనే భార్యలు ఉన్నారు.

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-