Sunday, May 31, 2015

How dirt clears in hotwater?-వేడినీటిలో ఉతికితే మురికి ఎలా వదులుతుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్ర : వేడినీటిలో ఉతికితే మురికి ఎలా వదులుతుంది?

జ --బట్టల్కు బాగా మురికి పట్టినపుడు వాటిని వదిలించేందుకు వేడినీటిలో వేసి ఉతుకుతారు . వేడినీటికి " తలతన్యత "('surfaceTension) తగ్గించే గుణము ఉండడము వలన నీటికి చొచ్చుకుపోయే శక్తి పెరుగుతుంది. ఫలితము గా వేడినీరు సులభముగా బట్టల పోగుల లోపలకెళ్ళి మురికిని బయటకు నెడుతుంది. నీటిలో ఉడికించి , బయటకు తీసి బట్టలను బండరాయి మీద బాదగానే మురికి పదార్ధము సులభముగా బట్టను వదిలి బయటకు వెళ్ళిపోతుంది. సబ్బులు , డిటర్జెంట్స్ వాడకుండానే మురికి పోగొట్టె విధాము వేడినీటిలో ఉడకపెట్టి బట్టలను ఉతకడము .

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Friday, May 29, 2015

Sund and volume difference-సౌండ్‌కీ, వాల్యూమ్‌కీ తేడా ఏంటి?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 







ప్రశ్న: మనం సౌండ్‌ పెంచండి అనడానికి బదులు, వాల్యూమ్‌ పెంచండి అంటుంటాం. సౌండ్‌ అంటే శబ్దం, వాల్యూమ్‌ అంటే ఘన పరిమాణం. శబ్దానికీ, ఘన పరిమాణానికీ సంబంధం ఏంటి?

జవాబు: శబ్దానికీ, కాంతికీ సారూప్యత తరంగ చలనమే. రెండూ తరంగాల రూపంలోనే ప్రయాణిస్తాయి. కాంతి తిర్యక్‌ తరంగం. కానీ శబ్దం అను దైర్ఘ్య తరంగం. కాంతికి యానకం అవసరం లేదు. కాబట్టి శూన్యంలో కూడా ప్రయాణించగలదు. కానీ శబ్దానికి యానకం అవసరం. పదార్థాల్లోకి శబ్దం ప్రసరిస్తుంది. శబ్దం అనుధైర్ఘ్య తరంగాలుగా ప్రయాణిస్తుందంటే అర్థం ఏమిటంటే అది తన మార్గంలో ఉండే పదార్థంలోని కణాల్ని లేదా పరమాణువుల్ని ఒత్తుతూ, లూజు చేస్తూ ప్రయాణిస్తుంది. ఒత్తిన ప్రాంతాల్లో దట్టంగా అధిక పదార్థం ఉండటం వల్ల అధిక పీడనంలో ఉంటాయి. లూజు చేసిన ప్రాంతాల్లో తక్కువ పదార్థం ఉండటం వల్ల తక్కువ పీడనం ఉంటుంది. పీడన ప్రాంతాలు, లూజు ప్రాంతాలు నిశ్చలముగా అవే చోట్ల ఉండకుండా శబ్ద వేగంలో కదులుతూ ఉంటాయి. ఆ శబ్ద తరంగాలే మన చెవుల్ని చేరుతాయి. అయితే శబ్దం ఏ స్థాయిలో ఉందనే విషయం, శబ్దతరంగాలలో ఉన్న సంపీడన ప్రాంతాల్లో ఎంత ఘన పరిమాణం మేరకు పదార్థం (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణం ఉన్నగాలి) ఉందన్న విషయం మీద, విరళీకరణం ప్రాంతంలో ఎంత మేరకు ఘనపరిమాణం తగ్గింది (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణపు గాలి తగ్గింది) అన్న విషయం మీద ఆధారపడుతుంది. ఇలా శబ్ద తరంగాలలో పదార్థపు ఘనపరిమాణపు విలువల్లో ఎంత ఎక్కువ తేడాలు సంభవిస్తే అంత ఎక్కువ మోతాదులో శబ్దం వినిపిస్తుంది. అందువల్లే శబ్దపు తీవ్రతకు, వాల్యూమ్‌కు సరాసరి సంబంధం ఉంటుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Wednesday, May 27, 2015

Good smell to flowers during nights?, రాత్రివేళ పూల నుంచి సువాసనలేల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

జవాబు: కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.

ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.

కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.

సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Tuesday, May 26, 2015

Gray-hair in young age how?-చిన్న వయసులోనూ కొంతమందికి తెల్ల జుత్తు ఎందువల్ల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








 ప్రశ్న: చిన్న వయసులోనూ కొంతమందికి తెల్ల జుత్తు వస్తుంది. ఎందువల్ల?

జవాబు: మన తలపై ఉండే వెంట్రుకలు ఏక కాలంలో రెండు రకాలుగా ఉపయోగపడతాయి. పరిసరాల్లో ఉన్న ఉష్ణాన్ని బాగా గ్రహించి శరీరంలోకి చేరకుండా చేసే మంచి ఉష్ణ గ్రాహణి (heat absorber)గాను, శరీరంలో విడుదలయిన వేడి త్వరితంగా వాతావరణంలోకి పంపగల మంచి ఉష్ణ ఉద్గారిణి (heat emitter) గాను అవి పనిచేస్తాయి. మరి ఆ వెంట్రుకలకు నల్లని రంగు ఎలా వచ్చింది? చర్మం పైపొర కిందున్న డెర్మిస్‌ అనే పొరలో కేశ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు తెల్లగా నైలాన్‌ దారంలా ఉండే ప్రోటీను తీగల్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రోటీను తీగల తయారీ సమయంలోనే కేశ గ్రంథులకు దగ్గరే ఉన్న కణాల్లోని మెలనిన్‌ అనే నల్లని వర్ణ రేణువులు ఆ ప్రోటీను అణువుతో లంకె వేసుకుంటూ వెంట్రుకతో పాటు బయట పడతాయి. అందువల్లనే తెల్లగా ఉండవలసిన వెంట్రుక ప్రోటీను తీగ నల్లగా కనిపిస్తుంది.

ఈ మెలనిన్‌ రేణువులకు సాధారణ కాంతినే కాకుండా అరుదుగానైనా సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల్ని కూడా శోషించుకునే లక్షణం ఉంది. వెంట్రుకల ఉత్పత్తి ఆగకున్నా మెలనిన్‌ రేణువులు సరిగా ఉత్పత్తి కాకుంటే వయసు చిన్నదయినా తెల్లని వెంట్రుకలే తలపై ఉంటాయి. వృద్ధాప్యంలో ఈ మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి తక్కువ అవుతుంది కాబట్టి ముసలి వారి వెంట్రుకలు తెల్లబడతాయి. సౌర కాంతి అధికంగా లేని పశ్చిమోత్తర (northwest) ప్రజల వెంట్రుకలు కూడా తెల్లగా ఉంటాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)'

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Sunday, May 24, 2015

Satagopam in Temple,గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




Q : గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు?

Ans : శఠగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, శఠగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. శఠగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠగోప్యమును శఠగోపం అని కూడా అంటారు.

  • ==============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, May 16, 2015

How mercury produced?,పాదరసం ఎలా చేస్తారు?




  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 





ప్రశ్న: పాదరసం తయారీ ఎలా జరుగుతుంది?

జవాబు: సాధారణ పరిస్థితుల్లో ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహమూలకం (metallic elements) పాదరసమే. పాదరస పరమాణువులో ఉన్న 80 ఎలక్ట్రాన్లన్నీ జతకూడి ఉండడం వల్లనే పాదరసం ద్రవ రూపంలో ఉంటుందనీ తేలిగ్గా వాయురూపంలోకి వెళ్తుందని రసాయనిక శాస్త్రం చెబుతుంది. పాదరసాన్ని భారమితి రక్తపీడన మాపనం, ఉష్ణమాపనం (థర్మోమీటర్‌), విద్యుత్తు బల్బులు, విద్యుద్రసాయనిక పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నా ఇది కాలుష్య కారిణి. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థం. దీనికి బంగారంలాంటి లోహాలను కరిగించుకొనే లక్షణం ఉంది. పాదరసం అరుదుగా మాత్రమే దొరుకుతుంది. ప్రత్యక్షంగా లోహరూపంలో కాకుండా సిన్నబార్‌ అనే మెర్కురిక్‌ సల్ఫైడు, ఖనిజంగా పాదరసం లభిస్తోంది. ప్రధానంగా చైనా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, అమెరికా, కెనడా ప్రాంతాల్లో లభ్యమయ్యే ఈ లోహాన్ని గాలిలో వేడిచేయడం ద్వారా గంధకం భాగాన్ని తొలగించి పాదరసాన్ని వెలికితీస్తారు.
పాదరసం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి మరింతగా తెలుస్తుండడం వల్ల దాని వినియోగాన్ని చాలా దేశాలు నియంత్రిస్తున్నాయి.

  • ====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

What is geo stationary satellite?, భూస్థావర ఉపగ్రహం అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







 ప్రశ్న: భూస్థావర ఉపగ్రహం అంటే ఏమిటి?

జవాబు: ఒక గ్రహం గురుత్వాకర్షణ శక్తికి లోబడి ఒక నిర్ణీత మార్గంలో దాని చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు (satellites)అంటారు. ఈ నిర్ణీత మార్గాన్నే కక్ష్య (ఆర్బిట్‌) అంటారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు సహజ ఉపగ్రహం. అయితే శాస్త్రజ్ఞులు ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాలు భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటాయి. ఇవి భూమి చుట్టూ నిర్ణీత కక్ష్యల్లో తిరుగుతూ టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ, వాతావరణ సూచనలు, టెలివిజన్‌ కార్యక్రమాల ప్రసారాలకు, ఖనిజ సంపదలు గుర్తించడానికి తదితర అవసరాలకు ఉపయోగపడతాయి. కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహాలు ప్రయోగించిన దేశానికి ఉపయోగపడాలంటే, భూమి తిరుగుతున్నప్పటికీ అది ఆ దేశంపై స్థిరంగా ఉండాలి. ఇలా ఉండే ఉపగ్రహాన్ని భూస్థావర ఉపగ్రహం(geo stationary satellite) అంటారు. రెండు రైళ్లు ఒకే దిశలో సమాన వేగంతో వెళ్తున్నాయనుకుందాం. అప్పుడు ఒక రైలులోని వ్యక్తి మరో రైలులో ఉన్న వ్యక్తికి స్థిరంగా ఉన్నట్లు కనబడతాడు కదా. అలాగే కృత్రిమ ఉపగ్రహం భూ పరిభ్రమణ వేగంతో సమానంగా భూమి చుట్టూ తిరుగుతుంటే, అది భూమి మీద నిలకడగా ఉన్నట్లు ఒకే దగ్గర కనిపిస్తుంది. దీనిని 'పార్కింగ్‌ కక్ష్య' అంటారు. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ కక్ష్య ఉంటుంది. ఇక్కడ ఉపగ్రహ వేగం సెకనుకు 3.1 కిలోమీటర్లు. కక్ష్య వ్యాసార్థం 42,000 కిలోమీటర్లు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌


  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Thursday, May 14, 2015

How islands are forming?,ద్వీపాలు ఎలా ఏర్పడతాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్ర : ద్వీపాలు ఎలా ఏర్పడతాయి?

జ : నాలుగు దిక్కులా నీరున్న భూభాగాన్ని ద్వీపం ('Island) అంటారు. ద్వీపాలనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి. కాలక్రమములో ప్రధాన ఖండమునుండి విడిపోయిన చిన్న భూభాగము ద్వీపం గా తయారవుతుంది. లోతట్టు భూమికి మధ్యలో వున్నభాగము సముద్రమట్టం పెరిగి మునిగిపోతే ఒక ద్వీపం ఏర్పడవచ్చు. సముద్రములోని అగ్నిపర్వతాలు బద్దలైనపుడు పైకి ఎగిసిపడిన లావా నెమ్మదిగా ఒకచోట పేరుకుని ద్వీపం గా రూపు దిద్దుకుంటాయి. ప్రధాన నదులు సముద్రములోకి తెస్తున్న ఇసుక మేట వేయడం ద్వారా కూడా కొత్త ద్వీపం ఏర్పడుతుంది.

శ్రీలంక ద్వీపము కాలక్రమేనా  భారత ఖండము నుండి విడిపోయినదే .

  • ====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, May 11, 2015

What is teargas how it works?-బాష్పవాయువు అంటే ఏమిటి?ఎలా పనిచేస్తుంది?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








Q : బాష్పవాయువు అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

జవాబు: గుంపులుగా చేరి ఆందోళన చేస్తున్న జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఈ వాయువు కళ్లల్లో నీరు తెప్పిస్తుంది కాబట్టి దీనిని బాష్ప వాయువు అంటారు. బాష్పవాయువు హానికరమైనది. కొన్ని రసాయనిక పదార్థాలను తుపాకుల వంటి ఆయుధాలలో కూరి, పేల్చడం ద్వారా ఈ వాయువును ప్రయోగిస్తారు. ఈ రసాయనం ఘన, ద్రవ రూపాలలో ఉంటుంది. ఆల్ఫా క్లోరాసిటెటో ఫినోన్‌ అనే రసాయనం ఘన రూపంలోనూ, ఇథైల్‌ అయోడో ఎసిటేట్‌ ద్రవరూపంలోనూ ఉంటాయి. బాష్పవాయువు నుంచి వెలువడిన ఆవిర్లు కళ్లలోని బాష్ప గ్రంథులపై రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల కళ్లలో మంటపుట్టి కన్నీరు ఎక్కువగా వస్తుంది. కనుగుడ్లపై ఎక్కువగా నీరు చేరడంతో చూపు కూడా మందగిస్తుంది. కనురెప్పలు వాస్తాయి. బాష్ప వాయువు శరీరంలోని వాయు నాళాల ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి కడుపులో వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి. చర్మంపై బొబ్బలు వస్తాయి. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికమే. తర్వాత తగ్గి పోతుంది. బాష్ప వాయువు ప్రయోగానికి గురైన వారిని బాగా గాలి వీచే విశాలమైన ప్రదేశానికి తీసుకువెళ్లాలి. వారి కళ్లను ఉప్పు నీటితోగానీ, బోరిక్‌ యాసిడ్‌ ద్రవంతో గానీ కడగాలి. సోడియం బైకార్బోనేట్‌ ద్రవాన్ని శరీరంపై బాష్పవాయువు సోకిన భాగాలకు పూయాలి. దీని ప్రభావం ఎక్కువగా పడకూడదనుకుంటే ఒక చిన్న చిట్కా ఉంది. కోసిన ఉల్లిపాయ ముక్కలను చేతిలో పట్టుకుంటే చాలు అవి బాష్పవాయువును పీల్చుకుని మన కళ్లపై అంత ప్రభావం పడకుండా చూస్తాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, May 04, 2015

వేడి నీటితో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.ఎందుకు?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 




ప్రశ్న: వేడి నీటితో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. ఎందుకు?

జవాబు: చలిగా ఉన్నపుడు చర్మపు ఉపరితల పొరల్లో ఉండే కణాలు దగ్గరికి రావడం వల్ల కొంచెం ఇబ్బందికి లోనవుతాయి. పైగా చలి వాతావరణంలోకి శరీరపు వేడి వెళ్లిపోకుండా ఉండేందుకు రక్తనాళాలు కూడా ఉపరితల చర్మపు పొరలకు రక్తాన్ని చేరవేయవు. తద్వారా పైపొరల్లో ఉన్న కణాలు పొడిగా ఉంటాయి. అక్కడ ఉన్న నాడీ తంత్రులు కూడా మొద్దుబారి ఉంటాయి. ఇలాంటి స్థితిలో కాస్త వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే ఆ వేడికి చర్మపు పొరలు కొద్దిగా సడలడం వల్ల తాత్కాలికంగా విశ్రాంతి పొందినట్టుగా ఆహ్లాదకరమైన భావనను పొందుతాం. నాడీ తంత్రులకు అధిక ప్రేరణ రావడం వల్ల కూడా కొద్దిగా సుఖానుభూతి పొందుతాం.

ఇక ఏ సమయంలోనైనా బాగా కష్టపడి శారీరక శ్రమ చేసినపుడు కణాలు అలసిపోతాయి. కణాలు అలసి పోవడమంటే వాటిలో పోషక పదార్థాల పరిమితి బాగా పడిపోవడమని అర్థం. అలాగే వ్యాయామం చేసినపుడు అధిక మోతాదులో రక్తంలోని గ్లూకోజు ఆక్సీకరణం చెందుతుంది. ఆ క్రమంలో ఆక్సిజన్‌ సరఫరా తదనుగుణంగా లేకుంటే నిర్బాత ప్రక్రియ (anerobic oxidation) ద్వారా గ్లూకోజ్‌ పాక్షికంగా ఆక్సీకరణం చెంది శక్తినిస్తుంది. అపుడు రక్తంలోను, కణాల్లోను పైరూవిక్‌ ఆమ్లపు మోతాదు పెరుగుతుంది. ఇది అవాంఛనీయమైన రసాయనిక ధాతువు. ఇది ఎముకల కీళ్ల దగ్గర పోగయితే ఒంటి నొప్పులుగా ఇబ్బంది పడతాము. అలాంటి సమయంలో వేడి నీటి స్నానం వల్ల కణజాలాలు వ్యాకోచించి రక్తసరఫరా వేగవంతం అవుతుంది. ఆ క్రమంలో పైరూవిక్‌ ఆమ్లం త్వరితంగా కణాల నుంచి తొలగడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గినట్టు సేదగలిగిన సుఖానుభూతిని పొందుతాం.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, శాస్త్ర ప్రచార విభాగం (తెలంగాణ)


ఎలుకలకు తోకలు పొడవుగా ఉంటాయి.వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: ఎలుకలకు తోకలు పొడవుగా ఉంటాయి. వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా?

జవాబు: ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతలను కావలసినంత మేరకు సరిచేసుకోవడానికి, తమ కదలికలను నియంత్రించుకోవడానికి తోకలను బాగా ఉపయోగించుకుంటాయి. మనం మన శరీరంపై ఉండే చర్మం ద్వారా చుట్టూ ఉన్న పరిసరాల నుంచి వేడిని గ్రహించడం లేక ప్రసరింపజేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంతో ఉండేలా చూసుకుంటాం. కానీ ఎలుకలు అలా చేయలేవు. ఎందుకంటే, వాటి దేహాల మీద చాలా వెంట్రుకలు ఉంటాయి. అవి ఉష్ణ నిరోధకాలు. అందువల్ల ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతను చర్మం ద్వారా కాకుండా వెంట్రుకలు లేని తోకల ద్వారా నియంత్రించుకుంటాయి. ఎలుకలు వాటి గుండె నుంచి ప్రసరించే రక్తంలో 0.1 నుంచి 10 శాతం వరకు తోకల గుండా ప్రవహింప చేయగలవు. దాంతో శరీరంలో ఉత్పన్నమయ్యే వేడిలో 20 శాతాన్ని వాతావరణంలోకి పంపగలవు. ఆ విధంగా వేసవికాలంలో వాటి దేహంలో ఉన్న ఎక్కువ ఉష్ణాన్ని బయటకు పంపించేస్తాయి. అలాగే చలికాలంలో తోకలో ప్రవహించే రక్త ప్రసరణాన్ని తగ్గించి ఉష్ణాన్ని బయటకు పోకుండా కాపాడుకుంటాయి.

ఇక తోకల పొడవు విషయానికి వస్తే, తోకలో ఉండే కండరాన్ని ఎలుకలు అతి నైపుణ్యంగా అదుపులో ఉంచుకుంటాయి. ఇరుకైన మార్గంలో కానీ, సన్నని తీగపైన కానీ వేగంగా పరుగెడుతున్నపుడు తోకను అటూ ఇటూ కదిలించి కింద పడకుండా చూసుకుంటాయి. సర్కస్‌లో తీగపై నడిచే వ్యక్తి ఒక పొడవైన కర్రను పట్టుకుని పడిపోకుండా బ్యాలెన్స్‌ చేసుకున్నట్లుగా ఎలుకలకు కూడా వాటి తోకలు బాగా ఉపయోగపడతాయి.

-ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Sunday, May 03, 2015

who invented bacteria?-సూక్ష్మ జీవుల ఉనికిని ఎవరు కనిపెట్టారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: భూమ్మీద సూక్ష్మజీవులను మొదటి సారిగా పరిశీలించింది ఎవరు? వాటి ఉనికిని వూహించినదెవరు?

జవాబు: సూక్ష్మజీవులే ఈ భూమ్మీద ఏర్పడ్డ మొదటి జీవులు. భూమి సౌరమండలపు పళ్లెం (solar disc) నుంచి తేజోవంతమైన చిన్న పాటి నక్షత్రంగా సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం వేరుపడింది. ఆ తర్వాత సుమారు 150 కోట్ల సంవత్సరాలకు పూర్తిగా కాంతిని కోల్పోయి గ్రహం(planet)గా రూపొందింది. అపుడున్న విపరీత రసాయనిక భౌతిక పరిస్థితుల ప్రభావంతో నిర్జీవమైన పదార్థాల నుంచి తనను తాను ప్రత్యుత్పత్తి చేసుకోగల DNA అణువు ఏర్పడింది. పరిణామక్రమంలో ఇలాంటి DNA లేదా RNAలున్న కణాలు అవతరించాయి. అంటే నేటికి సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం కాలక్రమేణా ఈ భూమ్మీద సూక్ష్మజీవులు ఏర్పడ్డాయి. ఇందులో దాదాపు 99.9 శాతం వరకు ఏకకణ (mono cellular) జీవులే. అవే క్రమేణా జీవ పరిణామం ద్వారా బహుకణ జీవులుగా, జంతువులుగా, వృక్షాలుగా వివిధ జాతుల్ని ఏర్పరిచాయి. నేటికీ వాటి సంఖ్య ఇతర జంతు, వృక్ష జాతులకన్నా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు మన పెద్ద ప్రేగులోనే ఉన్న బ్యాక్టీరియాల సంఖ్య మన సొంత జీవకణాల కన్నా హెచ్చుగా ఉంటుంది.

క్రీ||పూ 600 సంవత్సరాల కిందట వీటి ఉనికిని జైనమత వ్యవస్థాపకుడు మహావీరుడు తదితరులు వూహించారు. కంటికి కనిపించని జీవులు ఉంటాయని భావించారు. కానీ శాస్త్రీయమైన రుజువులు కేవలం క్రీ||శ 17వ శతాబ్దం వరకు లభించలేదు. 1674 సంవత్సరంలో లీకెన్‌ హాక్‌ అనే జీవశాస్త్రవేత్త తొలిసారిగా తానే రూపొందించిన సూక్ష్మ దర్శిని సహాయంతో సూక్ష్మ జీవుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ తర్వాత రోబర్ట్‌ హుక్‌ దాదాపు అదే కాలంలో సూక్ష్మ దర్శిని ద్వారా వివిధ సూక్ష్మ జీవుల్ని పరిశీలించి వర్గీకరించాడు. లూయీ పాశ్చర్‌, స్పల్లంజాని, కోచ్‌ వంటి శాస్త్రవేత్తల ఎనలేని కృషివల్ల సూక్ష్మ జీవుల వల్ల కలిగే అనేక లాభనష్టాల గురించి వివరంగా తెలిసింది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, శాస్త్రప్రచార విభాగం (తెలంగాణ)

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Friday, May 01, 2015

Mountain areas and cooking food-పర్వత ప్రాంతాలలో ఆహార పదార్థాలు ఉడకవేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: పర్వత ప్రాంతాలలో ఆహార పదార్థాలు సరిగా ఉడకవు. ఎందుకని?

జవాబు: నీటిని వేడి చేసేప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే ఆ నీరు మరగడం ఆరంభిస్తుంది. దీన్ని నీటి భాష్పీభవన స్థానం (boiling point) అంటారు. ఈ ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కూడా నీటికి వేడిని అందిస్తే అది ఆవిరిగా మారుతుంది. నీటి ఉపరితలంపై వాతావరణ పీడనం ఉంటుంది. ఈ పీడనం వల్లనే నీరు 100 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి కాకుండా ఉంటుంది. వాతావరణ పీడనం తగ్గితే నీటి భాష్పీభవన స్థానం కూడా తగ్గుతుంది. భూమి నుంచి పైకి వెళ్లే కొద్దీ మనం కొన్ని వాతావరణ పొరలను దాటుకొని వెళ్తున్నట్టే కాబట్టి వాతావరణ పీడనం తగ్గుతుంది. అంటే ఎత్తయిన పర్వత ప్రాంతాలలో పీడనం తక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల ఆ ప్రాంతాలలో మనం వండే ఆహార పదార్థాలపై ఆ ప్రభావం ఉంటుంది.

ఉదాహరణకు మనం బంగాళాదుంపలను ఉడికించాలనుకోండి. గిన్నెలో నీరుపోసి అందులో దుంపలను మంటపై పెడతాం. కానీ కొండలపై వాతావరణ పీడనం తక్కువగా ఉండడంతో నీటి భాష్పీభవన స్థానం కూడా తగ్గుతుంది. అంటే 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద మరగాల్సిన నీరు ఏ 94 డిగ్రీల దగ్గరో మరిగి ఆవిరైపోతూ ఉంటుంది. అందువల్ల బంగాళదుంపలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద సరిగా ఉడకక పచ్చిగా ఉంటాయి. అందువల్ల పర్వత ప్రాంతాల్లో ప్రెషర్‌ కుక్కర్‌ ఉపయోగించి వంటచేయడమో లేదా దుంపలున్న గిన్నెలో కొంచెం ఉప్పు వేయడమో చేయాలి. ఎందుకంటే మంచి నీటి కన్నా ఉప్పునీటి భాష్పీభవన స్థానం ఎక్కువ.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Eyes burn in smoke why?-పొగకు కళ్లు మండుతాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








ప్రశ్న: పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?

జవాబు: పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది. 'నిప్పు లేనిదే పొగరాదు' అన్న సామెత సబబే అయినా నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అగత్యం లేదు. నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్‌ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు.

పచ్చిగా ఉన్న వంట చెరకు, తడిగా ఉండే బొగ్గులు, మలినగ్రస్తమైన తారు తదితర పెట్రోలియం ఇంధనాలు, ప్లాస్టిక్కులు, రబ్బరులు, కిరోసిన్‌ దీపాలు, గాలి సరిగా సరఫరా కాని కిరోసిన్‌ పొయ్యిలు, సిగరెట్లు, బీడీలు పొగల్ని బాగా ఇస్తాయి. ఆయా మండే పదార్థాల్లో ఉన్న రసాయనిక సంఘటనాన్ని బట్టి వచ్చే పొగలో ఉన్న పదార్థాల సైజు ఆధారపడుతుంది. మండే పదార్థాలు ఏమైనా వాటిలో పొగలో సాధారణంగా తేలికపాటి కర్బన రేణువులు, నత్రికామ్ల బిందువులు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్‌ సరిపడా అందకపోతే ఇంధనంలో ఉన్న కర్బన పరమాణువులన్నీ కార్బన్‌డయాక్సైడుగా మారవు.

పొగ తెల్లగా ఉండటానికి ప్రధాన కారణం కర్బనరేణువులే.కర్ర, సిగరెట్టు వంటి ఇంధనాలలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది. ఇందులో ఉన్న నత్రజని సమ్మేళనాలు మండినపుడు వెలువడే నైట్రిక్‌ ఆక్సైడ్‌, హైడ్రోజన్‌ భాగం మండగా ఏర్పడే నీటి బిందువులతో కలిసి నత్రికామ్లము, నైట్రస్‌ ఆమ్లం ఏర్పడుతాయి. కర్బన రేణువుల మీద పాక్షికంగా జతకూడని ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటికి చర్యాశీలత చాలా ఎక్కువ. ఇటువంటి చర్యాశీలత అధికంగా ఉన్న కర్బన రేణువులు, సహజంగానే అవాంఛనీయమైన ఆమ్ల బిందువులు ఉన్న పొగ మన కళ్లను చేరినపుడు కంటి పొరల్లో ఉన్న జీవ కణాల్ని వాటి కార్యకలాపాల్ని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ అవాంఛనీయమైన రసాయనిక ప్రేరణలే నొప్పిగా, మంటగా మన మెదడు భావించి వెంటనే కన్నీటి గ్రంథుల్ని ప్రేరేపించి కన్నీళ్ల ధారలో మలినాల్ని, పొగలోని రసాయనాల్ని కడిగేయడానికి ప్రయత్నించడం వల్లే మనకు ఆ సమయంలో నీళ్లు కూడా కారుతుంటాయి. అవే ముక్కు ద్వారా కూడా వస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, --శాస్త్రప్రచారవిభాగం (తెలంగాణ)


  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Branding on skin on hitting why?- కొడితే వాతలేల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: ఎవరినైనా చెంపపై 'ఛెళ్లు'మని కొడితే, వాతలు తేలుతాయి. ఎందుకు?

జవాబు: మన శరీరంలో చెంపపై ఉండే చర్మం మిగతాభాగాలపై ఉండే చర్మంకన్నా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. ఎవరినైనా చెంపపై కొడితే చర్మం కింద ఉండే జీవకణాలు తమ నిరోధక శక్తిని కోల్పోయి చిట్లి చెల్లాచెదురవుతాయి. ఆ ప్రభావాన్ని తగ్గించడానికి అక్కడ మామూలుకన్నా అధికంగా తెల్లరక్తకణాలు అవసరమవుతాయి. వాటిని సరఫరా చేసే క్రమంలో ఆ ప్రాంతానికి రక్తప్రసరణ అధికంగా జరుగుతుంది. దీనికి తోడు అక్కడ పగిలిపోయిన కణాలలోని ద్రవం కూడా ఆ రక్తంలో కలవకుండా తెల్లకణాలు నెట్టివేస్తాయి. ఈ ప్రక్రియలో చేతివేళ్లు తీవ్రంగా తాకిన చోట చెంప మీది చర్మం కమిలి వాతలు ఏర్పడతాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-